English | Telugu

ఆర్య త‌మ వెంట‌ప‌డుతున్న వారిని క‌నిపెట్టాడా?

బుల్లితెరపై ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `ప్రేమ ఎంత మ‌ధురం`. గ‌త కొన్ని వారాలుగా జీ తెలుగులో విజ‌య‌వంతంగా ప్ర‌సారం అవుతూ మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ గా రూపొందిన ఈ సీరియ‌ల్ ట్విస్ట్ లు, మ‌లుపుల‌తో ర‌స‌వ‌త్త‌రంగా సాగుతూ ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఇందులో ప్ర‌ధాన జంట‌గా శ్రీ‌రామ్ వెంక‌ట్‌, వ‌ర్ష హెచ్ కె న‌టించారు. ఇత‌ర పాత్ర‌ల్లో బెంగ‌ళూరు ప‌ద్మ‌, జ‌య‌ల‌లిత‌, జ్యోతిరెడ్డి, విశ్వ‌మోహ‌న్‌, రాధాకృష్ణ‌, రామ్ జ‌గ‌న్‌, క‌ర‌ణ్‌, అనుషా సంతోష్‌, సందీప్‌, మ‌ధుశ్రీ న‌టించారు.

జెండే ఫ్లైట్ టికెట్స్ తీసుకురావ‌డంతో ఆర్య - అను హ‌నీమూన్ కోసం మ‌లేసియా బ‌య‌లుదేర‌తారు. ఫ్లైట్ ఎక్కాక సాంకేతిక కార‌ణాల వ‌ల్ల అది రాజ‌మండ్రిలోని మ‌ధుర‌పూడి ఏయిర్ పోర్ట్‌లో ఎమ‌ర్జెన్సీ గా ల్యాండ్ అవుతుంది. రేపు ఫ్లైట్ మ‌లేసియా బ‌య‌లుదేరుతుంది అని చెప్ప‌డంతో ద‌గ్గ‌ర‌లో వున్న క‌పోతేశ్వ‌రాల‌యం టెంపుల్ కు వెళ్లాల‌నుకుంటారు. జెండే ఏర్పాటు చేసిన మ‌నుషుల స‌హాయంతో ఫ్రెష్ అయిన అను - ఆర్య వెహికిల్స్ లో క‌పోతేశ్వ‌రాల‌యానికి వెళుతుంటారు. ఏయిర్ పోర్ట్ నుంచి వెంబ‌డిస్తున్న బ్యాచ్ కూడా వారిని అనుస‌రిస్తుంది.

ఆర్య - అను ఆల‌య ప్రాంగ‌ణంలోకి ఎంట్రీ అవుతారు.. వారి వెంటే కొంత మంది గ‌న్స్ ప‌ట్టుకుని వెంబ‌డిస్తారు. అత‌ను చూసి దాడికి పూనుకోవాల‌ని రెడీ అవుతుంటారు. అనుతో వెళుతున్న ఆర్య ఆ గ్యాంగ్ ని ప‌సిగ‌డ‌తాడు. ఆ త‌రువాత ఏం జ‌రిగింది?.. ఆర్య వారిని ప‌ట్టుకున్నాడా? .. ఇంత‌కీ ఆ గ్యాంగ్ ని పంపించింది ఎవ‌రు? .. ఆర్య - అనుల‌పై దాడికి పూనుకుంది ఎవ‌రు? అన్న‌ది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

Brahmamudi: రాహుల్ మనిషిని పట్టుకున్న రాజ్, కావ్య.. ఇక దేత్తడి!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -905 లో....అప్పు పాప కేసు ఫైల్ చూస్తుంటే ఆఫీసర్ వస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను వద్దని అయినా అలాగే చేస్తున్నావని కోప్పడతాడు. లేదు సర్ పాప చనిపోలేదు.. చనిపోయిన పాప వేరు.. ఆ పాప DNA తో మ్యాచ్ అవ్వడం లేదని రిపోర్ట్స్ చూపించగానే అవునా కేసులో ఒక కొత్త మలుపు తీసుకొని వచ్చావ్ గుడ్ కేరియాన్ అని ఆఫీసర్ అంటాడు. కాసేపటికి రేపు పాప వాళ్ళ ఫాదర్ ని స్టేషన్ కి రప్పించండి అని కానిస్టేబుల్ తో అప్పు చెప్తుంది. మరొకవైపు రాహుల్ అవార్డు ఫంక్షన్ కి రాజ్, కావ్య వెళ్తారు. అక్కడ రాహుల్ డిజైన్స్ చూసి రాజ్, కావ్య షాక్ అవుతారు.

Karthika Deepam2: జ్యోత్స్న చేసిన ఫ్రాడ్ చూసి కార్తీక్, శ్రీధర్ షాక్.. ఇంటి వారసురాలు కాదేమో!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -542 లో..... కార్తీక్, శ్రీధర్ జ్యోత్స్న రెస్టారెంట్ ఫుడ్ ట్రక్స్ బాగా పాపులర్ అయ్యాయని హ్యాపీగా ఉంటారు. ఇద్దరు బయట టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటారు. జ్యోత్స్న చాలా తప్పు డు లెక్కలు చూపించిందని శ్రీధర్ అనగానే ఎంత మొన్న కొన్న ల్యాండ్ గురించా అని  కార్తీక్ అడుగుతాడు. లేదు అది జస్ట్ శాంపిల్ మాత్రమే.... ఎంత అంటే అది చెప్తే శివన్నారాయణ గుండె పట్టుకొని పడిపోయేంత డబ్బులు ఫ్రాడ్ చేసిందని శ్రీధర్ అనగానే కార్తీక్ షాక్ అవుతాడు.