English | Telugu

'సీతే రాముడి కట్నం' న్యూ సీరియల్ త్వరలో జీ తెలుగులో

జీ తెలుగులో మరో కొత్త సీరియల్ త్వరలో ఆడియన్స్ ముందుకు రాబోతోంది. "సీతే రాముడి కట్నం" అనే పేరుతో ఈ రీమేక్ సీరియల్ వస్తోంది. తమిళ్ సీరియల్ "సీతా రామన్" ని తెలుగులో డబ్ చేస్తున్నారు. ఈ సీరియల్ లో సమీర్ హీరోగా నటిస్తున్నాడు. తమిళ్ యాక్టర్ ఐన సమీర్ ఫస్ట్ టైం తెలుగు బుల్లితెర మీద ఈ సీరియల్ ద్వారా కనిపించబోతున్నాడు. తమిళ్ లో "సిల్లును ఒరు కాదల్" అనే సీరియల్ లో నటించాడు. ఇక "సీతే రాముడి కట్నం"  అనే సీరియల్ లో వైష్ణవి నటిస్తోంది. ఈమె కన్నడ నటి. "మిధున రాశి" అనే కన్నడ సీరియల్ ద్వారా డెబ్యూ చేశారు. ప్రస్తుతం "ఉప్పెన" సీరియల్ మలయాళ వెర్షన్ లో జనని అనే పాత్రలో నటిస్తోంది. 

ముద్దిస్తే చెప్తానంటున్న ఆది..ఛీ అన్న దీపికా పిల్లి

ఢీ షోలో మంచి డాన్సస్ తో పాటు మంచి స్కిట్స్ కూడా ఉంటాయి. ఇక ఇప్పుడు టీచర్స్ డే వస్తున్న సందర్భంగా ఆ టాపిక్ మీద ఈ వారం డాన్సర్స్ తమ పెర్ఫార్మెన్సెస్ చేసి చూపించారు.  ఆ స్కిట్స్ వేయడానికి ఆది, దీపికా పిల్లి ఆల్రెడీ ఉన్నారు. దీపికా వాళ్ళ చుట్టాలు పేరుతో ప్రతీవారం ఒక్కో గెస్ట్ ని పిలుస్తూ ఉంటుంది. ఇక ఈ వారం హైపర్ ఆది తనలోని టాలెంట్ మొత్తాన్ని చూపించడానికి  డైరెక్టర్ గెటప్ లో వచ్చాడు. "ఎంఎం సినిమాలు చేసావ్" అని దీపికా ఆదిని కొట్టి మరీ అడిగింది. "ముద్దిస్తే చెప్తా" అని ఆన్సర్ ఇచ్చాడు. వెంటనే "ఛీ" అంది దీపికా. "ఎహె సినిమా పేరే ముద్దిస్తే చెప్తా" అని చెప్పేసరికి "బాగా ఆడిందా" అని ప్రదీప్ అడిగాడు..