English | Telugu

'సీతే రాముడి కట్నం' న్యూ సీరియల్ త్వరలో జీ తెలుగులో

జీ తెలుగులో మరో కొత్త సీరియల్ త్వరలో ఆడియన్స్ ముందుకు రాబోతోంది. "సీతే రాముడి కట్నం" అనే పేరుతో ఈ రీమేక్ సీరియల్ వస్తోంది. తమిళ్ సీరియల్ "సీతా రామన్" ని తెలుగులో డబ్ చేస్తున్నారు. ఈ సీరియల్ లో సమీర్ హీరోగా నటిస్తున్నాడు. తమిళ్ యాక్టర్ ఐన సమీర్ ఫస్ట్ టైం తెలుగు బుల్లితెర మీద ఈ సీరియల్ ద్వారా కనిపించబోతున్నాడు. తమిళ్ లో "సిల్లును ఒరు కాదల్" అనే సీరియల్ లో నటించాడు. ఇక "సీతే రాముడి కట్నం" అనే సీరియల్ లో వైష్ణవి నటిస్తోంది. ఈమె కన్నడ నటి. "మిధున రాశి" అనే కన్నడ సీరియల్ ద్వారా డెబ్యూ చేశారు. ప్రస్తుతం "ఉప్పెన" సీరియల్ మలయాళ వెర్షన్ లో జనని అనే పాత్రలో నటిస్తోంది.

ఇంకా ఈ సీరియల్ లో డాక్టర్ బాబు రియల్ వైఫ్ మంజుల పరిటాల లీడ్ రోల్ లో కనిపించబోతోంది. ఈమె తెలుగులో ఎన్నో సీరియల్స్ లో నటించారు. ప్రస్తుతం ఆమె "ఒంటరి గులాబీ" అనే సీరియల్ లో నటిస్తున్నారు. ఇక ఈ సీరియల్ లో వైష్ణవికి అత్తగారి రోల్ లో మంచి రెబెల్ గా నటించింది. కొత్తగా వచ్చిన పెళ్లికూతురిని గుమ్మంలోంచి బయటికి పంపించేసి ఒక సీరియస్ రోల్ లో మంజుల నటన చాలా బాగుంది. ఇంకా ఈ సీరియల్ లో వాసు ఇంటూరి వైష్ణవికి తండ్రి పాత్రలో కనిపించబోతున్నారు. ఈయన "అమృతం , ఆ ఒక్కటి అడక్కు" వంటి కామెడీ సీరియల్స్ లో నటించారు. ఇందులో వాసుకి భార్యగా వైష్ణవికి తల్లిగా శిరీషా కనిపిస్తున్నారు. "పద్మవ్యూహం, ఎండమావులు, నాతి చరామి , మౌనరాగం, మౌన పోరాటం" వంటి సీరియల్స్ లో నటించారు. అలాగే ఉప్పెన, హిట్లర్ గారి పెళ్ళాం వంటి సీరియల్స్ లో నటించిన మధు కృష్ణ కూడా ఈ సీరియల్ లో కనిపిస్తున్నారు. అలాగే రితిక, చిదం శ్రీనివాస్, బొడ్డు ప్రభాకర్ నటిస్తున్నారు. ఇక ఒంటరి గులాబీలో నటించిన పూజ ఈ సీరియల్ లో వైష్ణవికి అక్క రోల్ లో కనిపించబోతోంది.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.