English | Telugu

బిగ్ బాస్-7 లేటెస్ట్ ప్రోమో అదిరింది.. సమంత గురించి అడిగిన నాగార్జున!

బిగ్ బాస్ సీజన్-7 గురించి రోజు రోజుకి ఉత్కంఠపెరిగిపోతుంది. మరి ఆ ఉత్కంఠతకి తెరతీస్తూ బిగ్ బాస్ కొత్త ప్రోమో రిలీజైంది. నాగార్జున హోస్ట్ గా చేస్తున్న ఈ సీజన్ లో ఇప్పటికే చాలా మంది కంటెస్టెంట్స్ లిస్ట్ కూడా బయటకు వచ్చేసింది.

కొత్త కంటెస్టెంట్స్ తో ఊహించని ట్విస్ట్ లతో వస్తుంది బిగ్ బాస్ సీజన్ -7. అయితే ప్రతీ సీజన్ ప్రైజ్ మనీ చివరలో అనౌన్స్ చేసి చివరగా మిగిలిన ఇద్దరిలో ప్రైజ్ మనీ తీసుకోమని వెళ్ళిపోమంటారు. అయితే ఈ సారి హౌస్ లోకి వెళ్ళిన వెంటనే తీసుకొని వెళ్ళిపోమన్నాడు నాగార్జున. ఇక డబ్బులున్న ఆ సూట్ కేస్ కోసం హౌస్ లోకి వెళ్లిన కంటెస్టెంట్స్ మధ్య తోపులాట కూడా జరిగినట్లు ఈ ప్రోమోలో చూపించారు. ఈ సీజన్ అంత ఈజీ కాదని నాగార్జున అన్నాడు.

అయితే ప్రోమోలో ప్రియాంక జైన్ వాయిస్ కూడా స్పష్టంగా తెలిసిపోతుంది. ఆమెని హార్ట్ బ్రేకింగ్ నుండి బయటకు రా అని నాగార్జున అనగా తను నవ్వేసింది. మరొకరొని ఏం చేయలానుకుంటున్నావని నాగార్జున అడుగగా.. బిగ్ బాస్ టైటిల్ తోనే బయటకు వస్తానని ఒక కంటెస్టెంట్ అంది. దానికి నాగార్జున.. ఈ సీజన్ అన్ని సీజన్లలా కాదని అన్నాడు. మరి నాగార్జునతో మాట్లాడిన ఆ కంటెస్టెంట్ ప్రియాంక జైనా లేక మరొకరా తెలియాల్సి ఉంది. కాగా హౌస్ లోని రూమ్స్ ఎలా ఉంటాయో చూపించారు మేకర్స్. ఇక ఖుషీ మూవీ ప్రమోషన్ లో భాగంగా విజయ్ దేవరకొండ స్టేజ్ మీదకి వచ్చాడు. వచ్చీ రాగానే 'ఎక్కడ మీ హీరోయిన్ సమంత' అంటూ నాగార్జున అనగానే.. వదిలేయండి అన్నట్టుగా విజయ్ దేవరకొండ స్కిప్ చేశాడు. ఇక ఈ రోజు రాత్రి 7 గంటలకి గ్రాంఢ్ లాంచ్ అవుతున్న అతిపెద్ద షో బిగ్ బాస్ కి రంగం సిద్ధం అయింది. ఉల్టా పల్టా ట్యాగ్ తో వస్తున్న ఈ సీజన్ ఎలా ఉంటుందో చూడాలి మరి!

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.