English | Telugu

సెప్టెంబర్ 11 నుంచి మామగారు కొత్త సీరియల్


బుల్లితెర సీరియల్స్ చూసేవాళ్లకు ఇక పండగే పండగ. ఒక పక్కన బిగ్ బాస్ మరో వైపు మామగారు కొత్త సీరియల్ ఎంట్రీ.. ఇక వీక్ మొత్తం సందడే సందడి. 'స్టార్ మా' లో ఇప్పుడు మరో ధారావాహిక 'మామగారు' రాబోతోంది . దేవత సీరియల్ ఫేమ్ సుహాసిని ఇందులో లీడ్ రోల్ చేస్తోంది. 'దేవత' సీరియల్ లో సుహాసిని పండించిన ఎమోషన్ సీన్స్ అప్పట్లో పెద్ద హిట్. ఇప్పుడు ఈ సీరియల్ తో ఫ్యామిలీ ఆడియన్స్‌ను పలకరించబోతోంది.

ఈ సీరియల్ సెప్టెంబర్ 11 నుంచి సాయంత్రం 6 .30 కి ప్రసారం కాబోతోంది. ఇంట్లో ఆడవాళ్లు , ఇంటికొచ్చే కోడళ్ళు ఇంటి పనులే చేయాలి కానీ ఉద్యోగాలు చేయడానికి వీల్లేదంటూ మామగారు కండిషన్స్ పెడతారు. అలాంటి మావయ్యను కొత్త కోడలు సుహాసిని ఎలా మారుస్తుంది అనేదే ఈ సీరియల్ కథ. చూడబోతే ఈ సీరియల్ కూడా 'దేవత'సీరియల్ లానే ఫుల్ ఎమోషన్స్, సెంటిమెంటుతో నిండినట్టు కనిపిస్తుంది. సుహాసిని లక్ష్మీ కళ్యాణం, అడ్డా, దోస్త్ వంటి 30 మూవీస్ లో నటించింది. ఈమె తమిళం, కన్నడంలోనూ నటించింది. చంటిగాడు మూవీ ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది సుహాసిని. జెమినీ టీవీలో వచ్చిన అపరంజి సీరియల్ తో బుల్లితెర మీదకు వచ్చింది. తర్వాత వరసగా సీరియల్స్ చేసుకుంటూ వెళ్ళింది. అనుబంధాలు, అష్టాచమ్మా, గిరిజా కళ్యాణం, ఇద్దరు అమ్మాయిలు సీరియల్స్ లో నటించింది. అలాంటి సుహాసిని ఈ సీరియల్ లో కూడా విపరీతంగా ఎమోషన్ పండించేస్తుందా లేదా కొంచెం కామెడీ యాంగిల్ లో ఎమన్నా ట్రై చేసిందా అనేది చూడాలి.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.