English | Telugu

యావర్ తో నా బంధం ఎప్పటికీ అపురూపమే....

రీసెంట్ బుల్లితెర నటీనటులకు పద్మ మోహన అవార్డ్స్ లభించిన విషయం తెలిసిందే. అలా అవార్డ్స్ దక్కిన అందరూ ఆ పిక్స్ ని తమ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసుకున్నారు. అలాగే బ్రహ్మముడి విలన్ గర్ల్ హమీద అలియాస్ స్వప్న కూడా ఆ అవార్డు ని అందుకున్న ఒక పిక్ ని కూడా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసింది. దాంతో పాటు బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్ యావర్ తో దిగిన ఫోటోని షేర్ చేసింది. ఆ పిక్స్ మీద బ్రదర్ అండ్ సిస్టర్ లవ్ అంటూ రాసుకుంది.  " నా సోదరుడు ప్రిన్స్ యావర్‌తో ఉన్న బంధం ఎంతో అపురూపమైనది. బిగ్‌బాస్ 7 నుంచి పద్మమోహన అవార్డ్స్ వరకూ యావర్‌తో గడిపిన క్షణాలను సెలబ్రేట్ చేసుకున్నాను.

Guppedantha Manasu:భద్రని పట్టించాను.. ఇక మిగిలింది నువ్వే!

స్టార్ మా టీవీలో ప్రసరమావుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -989 లో.. కాలేజీలో జరిగిన దాని గురించి అనుపమ, మహేంద్ర, వసుధార ఇద్దరు మాట్లాడుకుంటారు. ఒకసారి నువ్వు ఎండీగా కరెక్ట్ అంటారు. ఒక్కసారి కాదని అంటారు. ఏంటి వాళ్ళని మహేంద్ర అనగానే.. వాళ్ళని శైలేంద్ర అలా మాట్లాడిస్తున్నాడని  వసుధార అంటుంది. వాడు మాట్లాడిస్తే మాట్లాడతారా.. నీ గురించి వాళ్లకి తెలియదా అని మహేంద్ర అంటాడు. నా గురించి తెలిసిన వాళ్ళు అలాగే మాట్లాడుతున్నారంటే వాళ్ళ మైండ్ శైలేంద్ర ఎంత పొల్యూట్ చేశాడో అర్థం అవుతుందని వసుధార అంటుంది.

బిగ్ బాస్ అంటే వంటల షోనా..అక్కడికి వెళ్లి వంటలు చేయాలా

సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా స్ట్రీట్ ఫుడ్ కుమార్ ఆంటీ గురించిన టాకే నడుస్తోంది. రీసెంట్ గా ఆమె పుట్టిన ఊరు గుడివాడలో జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన ఇల్లు తప్ప తనకు ఎలాంటి ఆస్తి లేదని చెప్పిన కామెంట్స్ వలన తన ఫుడ్ బిజినెస్ పై వేటు పడిందంటూ సోషల్ మీడియా కోడై కూసింది. దాంతో ట్రాఫిక్ కి ఇబ్బంది కలిగిస్తున్నారన్న నెపంతో పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఐతే ఇదంతా సోషల్ మీడియాలో రావడం నెటిజన్స్ అంతా కూడా కుమార్ ఆంటీకి సపోర్ట్ గా వీడియోస్, పిక్స్, కంటెంట్ పోస్ట్ చేస్తూ సపోర్ట్ చేయడాన్ని  రేవంత్ సర్కార్ గమనించింది. దాంతి ఆమె బిజినెస్ కి ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా ఆమె మీద కేసు అదీ ఏమీ పెట్టొద్దంటూ త్వరలో తానూ కుమారి ఆంటీ ఫుడ్ కోర్ట్ ని విజిట్ చేస్తానంటూ ట్వీట్ చేశారు. ఇక ఈమె ఆనందం మాములుగా లేదు.  

సూపర్ జోడి షో పెట్టింది మా కోసం కాదు రఘు మాస్టర్  కోసం

సూపర్ జోడి నెక్స్ట్ వీక్ లాంఛ్ 2 ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇక ఈ లాంఛ్ ఎపిసోడ్ కి సందీప్ కిషన్ ఎంట్రీ ఇచ్చారు. ఇక సందీప్ కిషన్ రావడంతోనే తన చిన్నప్పటి క్రష్ మీనా అని చెప్పాడు. తర్వాత దిలీప్-యాష్మి జోడి మంచి హాట్ పెర్ఫార్మెన్స్ తో డాన్స్ చేశారు అది కూడా ముత్తు మూవీ నుంచి థిలాన థిలాన సాంగ్ కి డాన్స్ చేసేసరికి మీనా ఫిదా ఐపోయింది. ఇక దిలీప్ తన హార్ట్ మీద మీనా అని రాసుకుని ఆమెను ఇంప్రెస్ చేసాడు.  తర్వాత రిచర్డ్-పల్లవి- నిసర్గ డాన్స్ పెర్ఫార్మ్ చేశారు. రిచర్డ్ కి అసలు జోడీని నేనంటే నేను అంటూ ఇద్దరమ్మాయిలు  కొట్టుకునేసరికి మీనాకు అల్లరి మొగుడు మూవీ డేస్ గుర్తొచ్చాయని చెప్పి నవ్వేసింది.  

సింగర్ గీతా మాధురి సీమంతం...వైరల్ అవుతున్న పిక్స్

టాలీవుడ్‌ స్టార్‌ సింగర్‌, బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ గీతామాధురి మరో సారి అమ్మ కాబోతోంది. త్వరలో మరో బిడ్డకు జన్మనివ్వబోతోంది. ఆల్రెడీ గీతా-నందు జంటకు దాక్షాయనిప్రకృతి అనే కూతురు ఉంది. ఫిబ్రవరిలో దాక్షాయనికి తోడుగా ఓ బుజ్జాయి రాబోతోందని  డిసెంబర్‌లో చెప్పింది గీతా మాధురి. తాజాగా ఆమెకు సీమంతం జరిగింది. కుటుంబ సభ్యులు, గీత ఫ్రెండ్స్, వెల్ విషర్స్ మధ్య ఈ ఫంక్షన్ గ్రాండ్ గా జరిగింది. అందమైన పట్టు చీరలో మెరిసిపోయింది గీతా మాధురి. సీమంతం చేసే వేదికను కూడా అందంగా ముస్తాబు చేసారు. ప్రస్తుతం  ఈ పిక్స్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బిగ్ బాస్ సెకండ్ సీజన్‌లో గీతా మాధురి రన్నర్ గా నిలిచిన విషయం తెలిసిందే.

సపోర్ట్ చేయకపోతే ఎంతో మంది ఇళయరాజాలు ఇళ్లల్లోనే ఉండిపోతారు

స్టార్ మాలో  ప్రసారమవుతున్న సూపర్ సింగర్ షో ప్రతీ వారం ఒక్కో కాన్సెప్ట్ తో అలరిస్తూ వస్తోంది. ఇక రాబోయే వారం కాన్సెప్ట్ గా ‘లెజెండ్స్ ఆఫ్ మ్యూజిక్" అనే రౌండ్ ని అనౌన్స్ చేశారు. దీంతో కంటెస్టెంట్ సింగర్స్ అంతా తమ సాంగ్స్ తో అదరగొట్టారు. ఈ వారం ప్రోమో చూస్తే మంచి కలర్ ఫుల్ లుక్ లో అదిరిపోయింది. స్టార్టింగ్ లో  ‘పరువం వానగా’ అంటూ జడ్జ్, సింగర్ శ్వేతా మోహన్ పాడి వినిపించి స్టేజి మీద ఉన్న అందరినీ మరో లోకంలోకి తీసుకెళ్లిపోయారు. తర్వాత కంటెస్టెంట్ ప్రవస్తి "ఆడ జన్మకు ఎన్ని శోకాలో" అంటూ అద్భుతంగా పాడింది.  ఆ సాంగ్ సెలెక్ట్ చేసుకున్నందుకు శ్వేతా స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చింది. ఈ సాంగ్ పాడడం వెనక ఒక కారణం ఉంది అని శ్రీముఖి చెప్పేసరికి ప్రవస్తి ఏడ్చేసింది. " నాలుగైదేళ్ల ముందు వరకు నా జీవితం చాలా బాగుంది తర్వాత మా నాన్న జాబ్ వదిలేశారు.

Eto Vellipoindhi Manasu:కలెక్టర్ చదవాలనుకున్న రామలక్ష్మి కల.. ఆ అజ్ఞాతవాసి వల్లే సాధ్యమా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -10 లో.. రామలక్ష్మి దగ్గరికి వాళ్ళ మేడమ్ వచ్చి జాబ్ నోటిఫికేషన్ వచ్చింది చూసావా అని అడుగుతుంది. చూసానని రామలక్ష్మి చెప్పగానే.. ఇకనుండి ఇలా రెండు గంటలు మాత్రమే చదివితే కుదరదు. టైమ్ ఎక్కువ లేదు. రోజుకి 18 గంటలు చదవా‌లి. ఇక క్యాబ్ మానెయ్ అని మేడమ్ చెప్తుంది. లేదు మేడమ్ ఫ్యామిలీ ని నేనే పోషించలని రామలక్ష్మి చెప్తుంది. అలా అయితే ఎలా నీ గోల్ ని నువ్వు చేరుకోవాలి సక్సెస్ కావాలంటే కంప్రమైజ్ కావద్దని మేడమ్ చెప్తుంది. కాలేజీలో ఫీజు కట్టాలని రామలక్ష్మికి మేడమ్ చెప్తుంది.