English | Telugu
స్టార్ మా టీవీ లో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -14 లో.. రింగ్ ఎక్కడ పోయిందని సీతాకాంత్ ఆలోచనలో పడతాడు. ఆ తర్వాత తన క్యాబ్ లో రామలక్ష్మికి రింగ్ కనిపిస్తుంది. అది పట్టుకొని ఇంట్లో వచ్చి ఈ రింగ్ ఎవరిదని ఆలోచిస్తుంది. ఆ రింగ్ చూసి రామలక్ష్మి వాళ్ళ అమ్మ బంగారo ఉంగరమా అని అడుగుతుంది. లేదు రోల్డ్ గోల్డ్ లాగా ఉందని అని ధన అంటాడు.
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -386 లో.. పూజారిని కృష్ణ కలిసి జరిగింది చెప్తుంది. నువ్వు కర్పూరం దేవుడి ముందు వెలిగించని పూజారి చెప్పగానే కృష్ణ అలాగే చేస్తుంది. ఆ తర్వాత కృష్ణ వెలిగించిన కర్పూరం ఆరిపోతుంది. మళ్ళీ ఏంటి ఇలా జరిగిందని కృష్ణ టెన్షన్ పడుతు పూజారిని అడుగుతుంది. ఏం లేదంటు తన భయాన్ని పొగుడుతాడు. ఆ తర్వాత కృష్ణ వెళ్ళిపోయాక.. ఇలా జరగకూడదు కానీ ఆ అమ్మాయి బయపడుతుందని ఏం కాదని చెప్పాను.. ఆ అమ్మాయికి ఏదో సమస్య రాబోతుందని పూజారి అనుకుంటాడు.
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -992 లో.. మహేంద్ర ఐడెంటిఫికేషన్ కోసం హాస్పిటల్ కి వెళ్ళాడని తెలిసి ఫణీంద్ర బాధపడుతుంటాడు. వాళ్ళింటికి వెళదాం అని ఫణీంద్ర అనగానే.. వాళ్ళే కాల్ చేస్తారులే అని దేవయాని అంటుంది. అలా అనగానే ఫణీంద్ర తనపై కోప్పడతాడు. కాసేపటికి అందరు మహేంద్ర ఇంటికి వెళ్తారు. ఆ తర్వాత మహేంద్ర కి ఫోన్ చేసి.. అక్కడ ఏం అన్నారో కనుక్కోమని చక్రపాణి అనగానే.. ఏం అంటారు అది రిషి సర్ బాడీ కాదు అని చెప్తారు. లాస్ట్ టైమ్ కూడ ఇలాగే జరిగిందని అనువసు అంటుంది.
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -325 లో.. మనల్ని కావ్య ఇలా తప్పుగా అర్థం చేసుకోవడం నాకు ఇష్టం లేదని శ్వేత అనగానే.. నువ్వు తన గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నావని రాజ్ అంటాడు. అసలు నువ్వు ఆలోచిస్తున్నావా?నా లాగా కావ్య జీవితం అవ్వకూడదు.. నీకు నా భర్తకి ఏం తేడా లేదు.. వాడు తెలిసేలా, నువ్వు తెలియకుండా కాపురాలు చెడగొట్టుకుంటున్నారని రాజ్ తో శ్వేత అంటుంది.
బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో పూజామూర్తి, షకీలా, రతికరోజ్, శుభశ్రీ రాయగురు, అశ్వినిశ్రీ, టేస్టీ తేజ, గౌతమ్ కృష్ణ, ఆట సందీప్, అమర్ దీప్ చౌదరి అంతా ఓ చోట కలిసారు. ఇంకేం ఉంటాయి.
అసలేం జరుగుతుంది.. ఓ సీరియల్ కోసం ఇంతమంది ఎదురుచూస్తున్నారా.. ఇంత ఫ్యాన్ బేస్ ఉందా.. ఇన్ స్టాగ్రామ్ లో ఎక్కడ చూసిన రిషి ఎక్కడా? వస్తాడా లేదా అనే క్లారిటీ కోసం కొన్ని వేలమంది ఎదురు చూస్తున్నారు. అదేంటి ఎవరు రిషి? ఏంటా కథ ఓసారి చూసేద్దాం.
సదా తన యూట్యూబ్ ఛానెల్ లోని ఓ వ్లాగ్ లో కొన్ని టిప్స్ ఇచ్చింది. పిల్లలు పుట్టాక ఒకవేళ భార్య,భర్తలు విడిపోతే వారి పరిస్థితి ఏంటి? అందుకే ఓ మెచురిటీతో ఉండాలి. విడిపోవాలనుకునేవారు పెళ్ళి ఎందుకు చేసుకోవడం. భారంగా ఉంటే పిల్లల్ని ఎందుకు కనడం అంటూ సదా చెప్పిన ఈ మాటలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -13 లో.. సండే రోజు ఎందుకు వచ్చిందో ఏంటో ధనని మిస్ అవుతున్న అనే ఫీలింగ్ లో సిరి ఉంటుంది. దాంతో ధనతో మాట్లాడాలని సిరి మిస్డ్ కాల్ ఇస్తుంది. ధన కాల్ చేస్తాడు. సిరి మాట్లాడుతుంటుంది. సిరిని చూసిన పనిమనిషి.. ఇలా గంటలు గంటలు ఒక అమ్మాయి ఫోన్ మాట్లాడుతుందంటే కచ్చితంగా బాయ్ ఫ్రెండ్ తోనే అని శ్రీవల్లికి చెప్తుంది. అలా వాళ్ళు సిరి గురించి మాట్లాడుకోవడం సిరి వాళ్ళ అమ్మ వింటుంది.
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -385 లో.. కృష్ణ, మురారి ఇద్దరు బయటకు వస్తుంటే.. ఒక పిల్లాడు బండికి ఎదరుగా వచ్చి పడిపోతాడు. అతని వెంబడి ఇంకొకతను వచ్చి.. దుప్పటి దొంగతనం చేసి పారిపోతున్నాడని కిందపడిపోయిన పిల్లాడిని కొడుతాడు. అతడిని మురారి, కృష్ణ ఇద్దరు ఆపి. ఎందుకు కొడుతున్నావని అడుగుతాడు. దొంగతనం చేసి పారిపోతున్నాడని అతను అంటాడు. ఆ తర్వాత పిల్లాడు మా అమ్మకి జ్వరం వచ్చింది. చలితో వణికిపోతుందని చెప్పగానే.. కృష్ణ, మురారి ఇద్దరు పాపమని పిల్లాడిని తన తల్లి దగ్గరికి తీసుకొని వెళ్లి దుప్పటి టాబ్లెట్స్ ఇస్తారు. మీకు ఏం అవసరం ఉన్నా ఈ నెంబర్ కి కాల్ చెయ్యండని కృష్ణ మురారి ఇద్దరు చెప్తారు.
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -991 లో.. భద్రని కస్టడీ నుండి తప్పించాననే ఆనందాన్ని దేవయానితో శైలేంద్ర షేర్ చేసుకుంటాడు. ఇప్పుడు తప్పించావ్ ఒకే గాని మళ్ళీ దొరికితే మాత్రం మన గురించి చెప్పేస్తాడు కదా అని దేవయాని అంటుంది. లేదు వాడు ఉంటేనే కదా అని శైలేంద్ర అనగానే.. అంటే చంపేసావా అని దేవయాని అడుగుతుంది. లేదు జెస్ట్ కస్టడీ నుండి తప్పించాను.. వాడు ఇక ఎటు వెళ్తే మనకేంటని శైలేంద్ర అంటాడు.
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -324 లో.. పాపని కిడ్నాప్ చేసిన రౌడీల దగ్గరికి పాప అమ్మ మరియు అప్పు ఇద్దరు బయలుదేరి వెళ్తారు. రౌడీలు చూడకుండా పాప దగ్గరికి ఇద్దరు వెళ్లి పాపని తీసుకొని బయటకు వస్తుంటే రౌడీలు అడ్డుపడతారు.. నీకు డబ్బులు తీసుకొని రమ్మని చెప్పాను కదా.. ఎవరినో తీసుకొని వచ్చావని పాప అమ్మని రౌడీలు బెదిరిస్తుంటారు. అప్పుడే పోలీసులు వస్తారు. మీ సంగతి తెలిసే మీరు ఇక్కడ ఉన్నారని తెలిసినప్పుడే పోలీసులకి చెప్పానని అప్పు అంటుంది. ఆ తర్వాత చాలా థాంక్స్ అంటు అప్పుకి పాప వాళ్ళ అమ్మ చెప్తుంది.. పోలీసులు కూడా అప్పుని అభినందిస్తారు.
శ్రీదేవి డ్రామా కంపెనీ నెక్స్ట్ వీక్ ప్రోమో మంచి కలర్ ఫుల్ గా రిలీజ్ అయ్యింది. ఇక ఈ కలర్ ఫుల్ నెస్ కి కారణం 150 వ ఎపిసోడ్ లు పూర్తి చేసుకుని శ్రీదేవి డ్రామా కంపెనీ. ఇందులోని కమెడియన్స్ అంతా సెలెబ్రేషన్స్ తో ధూమ్ ధామ్ గా పార్టీ చేసుకున్నారు. ఇక ఈ షోకి అలనాటి సీనియర్ యాక్టర్స్ మురళి మోహన్, జయసుధను ఇన్వైట్ చేశారు. రావడంతోనే మురళి మోహన్ రష్మీని పొగిడేశారు. "ఒక హిందీ యాక్టర్ ని చూసినట్టు ఉంటుంది మిమ్మల్ని చూస్తుంటే" అనేసరికి రష్మీ ఫిదా ఐపోయింది.
బుల్లితెర నటి శ్రీవాణి ఎప్పుడూ ఏదో ఒక సెన్సేషన్ న్యూస్ తోనే తన యూట్యూబ్ లోకి వస్తూ ఉంటుంది. ఇప్పుడు అలాంటి ఒక వీడియోని రిలీజ్ చేసింది. తన టీమ్ మొత్తం కలిసి బ్యాంకాక్ వెళ్ళినప్పుడు అక్కడ సెల్ ఫోన్ పోగొట్టుకున్నట్లు చెప్పి బాధపడింది. "బ్యాంకాక్ కి వెళ్ళినప్పుడు నా హడావిడి వలన సెల్ ఫోన్ పోగొట్టుకోవాల్సి వచ్చింది. సెల్ ఫోన్ కే అంత బాధ పడుతుండడానికి కారణం ఏంటంటే మా ఏడు రోజుల ట్రిప్ లో ఎన్నో వీడియోస్ కాప్చర్ చేసుకున్నాం.
జీవితంలో ప్రతీ ఒక్కరికి అమ్మనాన్న ఇద్దరు చాలా ముఖ్యమైన వాళ్ళు. ఎందుకంటే వారిని చూస్తూనే మనం పెరుగుతాం.. నాన్నే మన సూపర్ హీరో.. అలాంటి నాన్నకి ఏదైన ఆరోగ్య సమస్య ఉంటే ఎంత బాధగా ఉంటుంది. గీతు రాయల్ వాళ్ళ నాన్నకి ఆరోగ్య సమస్య ఉందని గతంలో చెప్పింది.
ఈవారం శ్రీదేవి డ్రామా కంపెనీ మంచి ఫన్నీ సాంగ్స్ , డాన్సస్ పంచ్ డైలాగ్స్ తో ఫుల్ ఎంటర్టైన్ చేసింది. ఇందులో అభి మాష్టర్ అటు చంద్రముఖిని, ఇటు కాంచనని కలిపేసి రోహిణి, సత్యతో కలిసి రొమాంటిక్ డాన్సస్ చేసాడు. ఇక అభి మాస్టర్ ఐడియాకి అందరూ ఫిదా ఐపోయి ప్రశంసల జల్లు కురిపించారు. తర్వాత వాళ్ళ డాన్స్ టీమ్ లో ఉన్న రమేష్ గురించి ప్రత్యేకంగా చెప్పుకొచ్చాడు. తమ కామెడీ టైమింగ్ ఏ పాటిదో చూడాలంటూ ఆదిని కూడా రిక్వెస్ట్ చేసాడు అభి మాస్టర్. ఇక మైక్ తీసుకుని తన పేరు రమేష్ అని చెప్పేసరికి ఆది పంచ్ వేసేశాడు. "తమ్ముడు నీ పేరు రమేషా.. పొరపాటున నువ్వు సెలెక్ట్ ఐతే తాగుబోతు రమేష్ కి స్కిట్లు ఇవ్వడం కష్టమవుతుంది" అనేసరికి "ఆయనకు కాదన్న మీకే కష్టం..ఎందుకంటే జనరల్ గా మీరే అందరి మీద నాన్స్టాప్ గా పంచులు వేస్తారు కదా. ఐనా ఇప్పటి వరకు ఆది అన్న చాలా పంచులు వేసాడు.