English | Telugu

Krishna Mukunda Murari:అమెరికా వెళ్ళిన భవాని.. ఆ గిఫ్ట్ లో ఏం ఉందంటే!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -394 లో.. కృష్ణ, మురారీల స్క్రిప్ట్ అయిపోగానే ఇక పెద్దమ్మని అడిగి ఎవరు బెస్ట్ ఇచ్చారో కనుకుందామని మధు అంటాడు. అందరు భవాని వంక చూసేసరికి భవాని అక్కడ కనిపించదు అందరు ఆశ్చర్యంగా చూస్తారు. అప్పుడే ఒక గిఫ్ట్ తో భవాని వస్తుంది. రండి పెద్దమ్మ.. ఆ గిఫ్ట్ ఎవరికి ఇస్తారోనన్న ఎక్సయిట్ మెంట్ ఉందని మధు అంటాడు.

ఆ తర్వాత భవాని రెండు జంటలు బాగా చేశారు అంటుంది. నీలో మళ్ళీ పాత ఆదర్శ్ ను చూస్తున్నాను.. చాలా హ్యాపీగా ఉంది ఇలాగే ఉండు అని భవాని ఆదర్శ్ కి చెప్తుంది. గిఫ్ట్ మాత్రం కృష్ణ మురారీలకి ఇస్తు బాగా చేశారు.. ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండండి అని చెప్తుంది. అందరు ముకుంద ఆదర్శ్ లకి ఇస్తారని అనుకుంటారు. కానీ వాళ్ళకి కాకుండా వీళ్ళకి ఇచ్చేసరికి అందరు ఆశ్చర్యంగా చూస్తారు. నాకు తెలుసు అంతత్వరగా నాపై అత్తయ్యకి నమ్మకం రాదని ముకుంద తన మనసులో అనుకుంటుంది. ఆ తర్వాత మీ అందరితో ఒక సీరియస్ విషయం మాట్లాడాలని‌‌ భవాని హాల్లోకీ తీసుకొని వెళ్తుంది. నేను ఒక నెల రోజులు అమెరికా వెళ్తున్నాను.. మా ఫ్రెండ్ కి ఏదో ప్రాబ్లమ్ అంట అందుకే వెళ్తున్నానని చెప్తుంది. ఎప్పుడు వెళ్తున్నారని కృష్ణ అడుగుతుంది. రేపే వెళ్తున్నాను.. ఇప్పుడు బయలుదేరాలని భవాని చెప్తుంది. ఇక ఎందరికి ఒక్కొక్కరిగా జాగ్రత్తలు చెప్తుంది భవాని.

అ తర్వాత అందరికి చెప్పి నాకు చెప్పట్లేదని ముకుంద అడుగుతుంది. నీకు చెప్పేది ఏం ఉంది.. మారింది నిజమే కదా హ్యాపీగా ఉండండి అని భవాని చెప్పి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత వాళ్ళు బానే చేశారు కదా వాళ్ళకి కాకుండా మాకు గిఫ్ట్ ఇచ్చారని కృష్ణ అనుకుంటుంది. మురారి కూడా అలాగే అనుకుంటాడు. అప్పుడే రేవతి వస్తుంది. రేవతిని అదే డౌట్ అడుగుతారు. భర్త తాగి వస్తే లోపలికి పిలిచి ఇంకా తాగండి అంటు మందు పోస్తే.. ఆ భర్త ఆరోగ్యం పాడవుతుంది. ఎలా మంచి భార్య అవుతుంది. నువ్వు నీ భర్త తాగి వస్తే కఠినంగా ఉన్నావ్.‌ నువ్వు మంచి భార్యవి. అందుకే మీకు గిఫ్ట్ ఇచ్చిందని రేవతి చెప్తుంది. ఆ తర్వాత నీ చేతితో మందు ఇస్తే తాగాలని ఉందని ఆదర్శ్ అనగానే ఆదర్శ్ కి ముకుంద మందు ఇస్తుంది. తరువాయి భాగంలో అందరిని కృష్ణ పిలుస్తుంది. భవాని ఇచ్చిన గిఫ్ట్ ఓపెన్ చేసి చూడగా అందులో ఒక చిన్న పాప బొమ్మ ఉంటుంది. అందులో ఒక లెటర్ కూడా ఉంటుంది. తింగరి నీలో ఒక అమ్మ ఉంది. నువ్వు అమ్మవి అవుతే చూడాలని ఉందని భవాని రాసినట్టుగా ఉంటుంది. అది చూసి కృష్ణ ఎమోషనల్ అవుతుంది. ఇది నాకు మాత్రమే కాదు ముకుందకి కూడా అని కృష్ణ అనగానే.. ముకుంద షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.