రష్మీ డాన్స్ కోసమే జబర్దస్త్ చూస్తాను...
త్వరలో వినాయక చవితి పర్వదినం రాబోతోంది. ఈ నేపథ్యంలో వినాయక చవితి స్పెషల్ గా శనివారం నాడు జై జై గణేష్ పేరుతో ఒక ఈటీవీలో ఒక ఈవెంట్ రాబోతోంది. దీని న్యూ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోకి ఇంద్రజ, ఖుష్బూ ఇద్దరూ వచ్చారు. ఇక స్పెషల్ అప్పియరెన్స్ గా శివాజీ కూడా వచ్చాడు. రావడమే చీరా సారెతో ఆడపడుచులు ఇంద్రజ, ఖుష్బూకి ఇచ్చాడు. దాంతో రష్మీ అలక ప్రదర్శించింది. "మరి నాకు లేవా పట్టు బట్టలు" అని అడిగింది. "నువ్వు ముందు పెళ్లి చేసికో నీకు పట్టు చీరల షోరూమే కొనిస్తాను. అప్పటివరకు పొట్టి బట్టలే నీకు" అనేసరికి అందరూ నవ్వేశారు.