English | Telugu

బిగ్ బాస్ ఓటింగ్ పోల్స్ లో విష్ణుప్రియ టాప్.. ఈ వారం ఎలిమినేషన్ ఎవరంటే!

బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ సెకెండ్ వీక్ టాస్క్ లతో ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే వీరిలో నామినేషన్ లో ఉంది ఎనిమిది మంది. ఇక ఇప్పటి వరకు వీరిలో ఎవరికి ఎక్కువ ఓటింగ్ పడింది.. ఎవరు లీస్ట్ లో ఉన్నారో ఓసారి చూసేద్దాం...

గత రెండు రోజుల నుండి సాగుతున్న ఓటింగ్ ప్రకారం.. విష్ణు ప్రియ 26 శాతం ఓటింగ్‌తో టాప్‌లో ఉంటే.. నిఖిల్ 24 శాతం ఓటింగ్‌తో రెండో స్థానంలో ఉన్నాడు. అయితే గత వారం టాప్‌లో నిలిచిన మణికంఠ అనూహ్యంగా 15 శాతం ఓట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. అయితే రెండో వారంలో మణికంఠ నామినేషన్స్‌లో ఉండగా.. అతను శేఖర్ బాషా, నైనిక, పృథ్వీ, ఆదిత్య ఓం వీళ్లందరికంటే ఎక్కువ ఓట్లు సంపాదించగా ఇప్పుడు మణికంఠ 15 శాతం ఓట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. నైనిక 10 శాతం ఓట్లతో నాలుగో స్థానంలో నిలిచింది.

బాటమ్ లో ఎవరున్నారంటే.. పృథ్వీ, కిర్రాక్ సీత ఇద్దరు స్వల్ప తేడాతో ఉన్నారు. నువ్వు వెళ్తావా.. లేదంటే నన్ను వెళ్లమంటావా.. అన్నట్టుగా 6 శాతం ఓట్లతో సీత, పృథ్వీ పోటీపడుతున్నారు. అయితే పర్ఫామెన్స్ పరంగా చూస్తే.. రెండో వారంలో పృథ్వీ కంటే సీత చాలా బెటర్. అటు గేమ్‌ , ఇటు మాటకి మాట చెప్తూ కంటెంట్ ఇస్తూ తనేంటో ప్రూవ్ చేసుకుంటుంది. దీంతో పృథ్వీ కంటే ఎక్కువ ఓట్లు సీతకే పడే అవకాశం ఉంది. మరి బిగ్ బాస్ కూడా హౌస్ లో గర్ల్ వర్సెస్ బాయ్స్ సమానంగా ఉండేలా ప్లాన్ చేస్తే లీస్ట్ లో సీత ఉన్నా.. కూడా పృథ్వీనే బయటకు వచ్చే అవకాశం ఉంది. ఈ లెక్క ప్రకారం చూస్తే పృథ్వీ ఈ వీక్ ఎలిమినేషన్ ఖాయమనిపిస్తోంది. మరి మీకేనపిస్తోందో కామెంట్ చేయండి.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.