English | Telugu

బిగ్ బాస్ హౌస్ లో ఎమోషన్స్ లోడింగ్.. ఆ సర్ ప్రైజ్ ఎవరికంటే!


బిగ్ బాస్ ప్రతీ సీజన్ లో ఫ్యామిలీ వీక్ ఉంటుంది. దానిలో కంటెస్టెంట్స్ ఫ్యామిలీ నుండి ఎవరో ఒకరు రావడం.. వాళ్ళని చూసి కంటెస్టెంట్స్ కంటతడి పెట్టుకోవడం కామన్. సాధారణంగా ఇది బిగ్ బాస్ ముగిసే ముందు ఉంటుంది. కానీ ఇప్పుడు కాస్త తొందరగా మొదలెట్టేసాడు బిగ్ బాస్.

తాజాగా విడుదలైన ప్రోమోలో(Biggboss 8 Telugu) ఏం ఉందంటే.. మీకు ఇష్టమైన వారిని మీరు మిస్ అవుతున్నారని బిగ్‌బాస్‌కి తెలుసు.. అందుకే ఐదుగురు సభ్యులకి వాళ్ల ఇంటి నుంచి వచ్చిన గిఫ్ట్స్ పొందే అవకాశం ఉందని బిగ్‌బాస్ చెప్పాడు. ఇలా చెప్పగానే నిఖిల్, ఆదిత్య, నైనిక, సీత, అభయ్ ఇంటి నుంచి వచ్చిన బహుమతులను గార్డెన్ ఏరియాలో డిస్‌ప్లే చేశాడు బిగ్‌బాస్. అయితే బహుమతులు అందుకునే ఆ ఐదుగురు ఎవరో డిసైడ్ చేసే పని మిగిలిన ఇంటిసభ్యుల బాధ్యతే అంటు బిగ్‌బాస్ చెప్పాడు.

ఇక ఒక్కొక్కరు ఆ గిఫ్ట్ లతో వారి ఎటాచ్మెంట్ ని చెప్పుకొచ్చారు. ముందుగా నిఖిల్‌ తనకి వచ్చిన గిఫ్ట్ గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యాడు. "అది మా నాన్న షర్ట్.. నార్మల్‌గా అబ్బాయిలకి నాన్నకి హగ్గు ఇవ్వాలనే ఇది ఉండదు కాబట్టి.. ఆయనకి తెలీకుండా షర్ట్ దొంగతనం చేశా" అంటూ నిఖిల్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. అలానే అభయ్ వాళ్ల నాన్నకి గిఫ్ట్ ఇచ్చిన వాచ్ గురించి చెప్తూ కన్నీళ్ళు పెట్టుకున్నాడు. నేను సినిమాల్లోకి వచ్చిన కొత్తలో నాకు వచ్చిన ఫస్ట్ శాలరీతో మా నాన్నకి కొనిచ్చిన వాచ్ అది.. బతికున్నంత కాలం నాన్న అదే వాచ్ పెట్టుకున్నారంటూ అభయ్ ఎమోషనల్ అవడంతో సోనియా దగ్గరికి తీసుకొని ఓదార్చింది. ఇక ఐదేళ్లు రిలేషన్‌షిప్‌లో ఉన్న అబ్బాయి నన్న వదిలి వెళ్లిపోయిన తర్వాత నాకు ఓ ఫ్రెండ్ దొరికాడు.. ఐ మిస్ యూ కుమార్ అంటూ గిఫ్ట్ ని చూస్తు సీత కన్నీళ్లు పెట్టుకుంది. నైనిక తనకొచ్చిన గిఫ్ట్ ని చూస్తూ.. చాలా బాధపెట్టిన ఓ రిలేషన్‌షిప్ నుంచి నేను కోలుకున్నానంటే అది తనవల్లే అంటు నైనిక బాధపడింది. ఇక ఆ పర్సన్ ఇది చూసి నీతో లైఫ్ లాంగ్ ఉండాలనుకుంటున్నానంటు తన అవకాశాన్ని త్యాగం చేసి సీతకి ఇచ్చేశాడు అభయ్. అలానే నైనిక కోసం నిఖిల్ త్యాగం చేశాడు. ఇలా ప్రోమో అంతా ఎమోషన్స్‌తో సాగింది. తాజాగా వచ్చిన ఈ ప్రోమో(Biggboss 8 Telugu promo) మీరు ఓసారి చూసేయ్యండి.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.