Read more!

English | Telugu

కృష్ణ ముకుంద మురారి, మల్లి సీరియల్స్ ల మహా సంగమంలో మరో ట్విస్ట్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్‌- 209 లో.. అరవింద్, మల్లి కలిసి భోనం చెల్లిస్తారు. ఆ తర్వాత నువ్వు బెదిరించావ్ కాబట్టే అరవింద్ బాబు గారితో కలిసి భోనం చెల్లించాను కానీ మాలిని అక్కే బాబు గారి భార్య అని మల్లి చెప్పేసి వెళ్ళిపోతుంది. మరొకవైపు మురారి ఫోన్ లో మాట్లాడుతుంటాడు. 

మాలిని, మల్లిని చూస్తుంది. మళ్ళీ ఎందుకొచ్చావని మాలిని అడుగుతుంది. మిగిలినవాళ్ళంతా ఎలా మాట్లాడినా నేను పట్టించుకోను కానీ నేను ఇంత త్యాగం చేసిన నువ్వు నమ్మట్లేదు చూడు అదే బాధ అవుతుందని మల్లి అనగానే‌‌.. త్యాగం అనేది నీ మాటల్లో కనిపిస్తుంది కానీ చేతల్లో కన్పించట్లేదని అంటుంది.  అరవింద్ ని నువ్వు చేసే కంపెనీ నుండి జాబ్ మానిపించేలా చేయు, అలాగైనా మీరిద్దరూ రోజు కలవకుండా ఉంటారని మాలిని అనగా.. "అంత చనువు నాకు ఎక్కడుంది‌. అతని జీవితం నుండి  తప్పుకున్నాను" అని మల్లి అంటుంది. మరొకవైపు ముకుందకి గీతిక కాల్ చేస్తుంది‌. కాసేపు మాట్లాడుతుంది. అయితే కృష్ణ తన చీరకొంగులో కట్టిన ముడుపిని పెద్దమ్మకి సమర్పించి.. నా జీవితాంతం ఏసీపీ సర్ తో కలిసి ఉండేలా చేయమని కోరుకుంటుంది.  అయితే కృష్ణ చీరకొంగు నుండి ఆ లెటర్ ని మెల్లిగా తనకి తెలియకుండా తీసుకుంటుంది‌ ముకుంద. దూరంగా వెళ్ళి ఆ లెటర్ చదువుతుంది.  ఆ తర్వాత పోలీస్ జీప్ లో కానిస్టేబుల్స్ వస్తారు. క్రిమనల్ ని అరెస్ట్ చేయాలని మురారి వాళ్ళతో చెప్తాడు.

మురారి, గౌతమ్ ఇద్దరు కలుసుకుంటారు.  గౌతమ్ తన ప్రేమకథ ముగిసిందని చెప్పగా.. నా ప్రేమకథ కూడా పెళ్ళి ముందు ముగిసింది కానీ అసలు ప్రేమ కథ పెళ్ళి తర్వాతే‌ మొదలైందని గౌతమ్ తో మురారి చెప్తాడు. ఆ తర్వాత అరవింద్ ని వెతికి చెప్తానని గౌతమ్ వెళ్తాడు. మరొకవైపు ముకుంద పడేసిన ఉత్తరం మల్లికి దొరుకుతుంది. అయితే మల్లి చేతిలో ఉత్తరం చూసిన మాలిని.. ఆ ఉత్తరం తీసుకొని చదువుతుంది. అరవింద్ కోసం మల్లి ఉత్తరం రాసిందేమోనని మాలిని అనుకుంటుంది‌. మరి మురారి కోసం కృష్ణ రాసిన ఆ ఉత్తరం తనకి చేరిందా? అరవింద్ కోసం మల్లి ఆ ఉత్తరం రాయలేదనే నిజం తెలిసిందా? లేదా తెలియాలంటే 'కృష్ణ ముకుంద మురారి', 'మల్లి' సీరియల్స్ ల మహా సంగమం తర్వాతి ఎపిసోడ్ చూడాల్సిందే.