Read more!

English | Telugu

1995 లో మోహన్ లాల్ గారితో కలిసి స్టేజి మీద చేశా..మళ్ళీ ఇప్పుడు అన్న ఖుష్బూ

జబర్దస్త్ మొదలై 11 ఏళ్ళు ఐపోయింది. ఈ షో వస్తోంది అంటే చాలు ఆడియన్స్ టీవీలో కూర్చుండిపోయేవారు. ఆ షో మొత్తం చూసి బాగా నవ్వుకునేవారు. ఈ షో సక్సెస్ అయ్యేసరికి కొంత కాలం తర్వాత ఎక్స్ట్రా జబర్దస్త్ పేరుతో మరో షో కూడా పెట్టారు మేకర్స్. అలా ఈ షో ఇప్పటికి 450 వ ఎపిసోడ్ కి వచ్చేసింది. ఈ స్పెషల్ ఎపిసోడ్ లో  ఒక్కో స్కిట్ ఒక్కోలా ఎంటర్టైన్ చేసింది. ఇందులో ఫస్ట్ స్కిట్ ని రాకింగ్ రాకేష్-జోర్దార్ సుజాత చేశారు. సుజాతకు తల్లిగా, రాకేష్ కి అత్తగారి రోల్ లో జడ్జ్ ఖుష్బూ చేశారు. ఈ స్కిట్ లో మొత్తం ఖుష్బూ అల్లుడిని ఇబ్బంది పెడుతూ కూతురి ఇంట్లో ఉండిపోవడానికి ప్లాన్ చేస్తూ ఉంటుంది. ఈ స్కిట్ మొత్తం కూడా చాలా ఫన్నీగా సాగింది. ఇక స్కిట్ అయ్యాక రష్మీ ఖుష్బూకి విషెస్ చెప్పింది.

"1995 లో నేను లాస్ట్ స్టేజి షో చేశాను మోహన్ లాల్ గారితో కలిసి. మళ్ళీ ఇప్పుడు 28 ఏళ్ళ తర్వాత  లైవ్ గా స్కిట్ చేసాను" అని చెప్పారు ఖుష్బు.. "సినిమాల్లో బాగా చేశారు అలాగే స్టేజి మీద కూడా ఇంకా బాగా చేశారు. డైలాగ్స్ ని గుర్తుపెట్టుకుని చెప్పడం అంటే మామూలు విషయం కాదు. స్కిట్ లోకి ఖుష్భు గారు వచ్చిన దగ్గర నుంచి ఆమెనే చూస్తూ ఉన్నాను| అన్నారు మరో జడ్జ్ కృష్ణ భగవాన్.  రాకేష్ చెప్పు ఎలా అనిపించింది అని రష్మీ అడిగింది " ఈ స్టేజి అందరికీ ఎన్నో అద్భుతాలను ఇచ్చింది నాకు కూడా ఒక మిరాకిల్ ని పరిచయం చేసింది" అంటూ వెళ్లి సుజాతను ముద్దు పెట్టుకున్నాడు. "నీకు నీ ఎక్స్ప్రెషన్ ని ఫీలింగ్ బయట పెట్టడానికి మొహమాట పడతావ్ కానీ నేను అలా కాదు" అంటూ సుజాత కూడా వెళ్లి రాకేష్ ని హగ్ చేసుకుని ముద్దు పెట్టేసింది.