Read more!

English | Telugu

ఏంటి బావా నీకు అందరూ మరదళ్లేనా..రఘు కుంచెని ఆటపట్టించిన అశ్విన్ బాబు


ఆదివారం విత్ స్టార్ మా పరివారం ఈ ఆదివారం ప్రసారం కాబోయే ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షో బోనాల స్పెషల్ గా రూపొందించారు. ఇందులో హోస్ట్ శ్రీముఖి ఫుల్ ట్రెడిషనల్ గా వచ్చేసింది. ఇందులో ఎంటర్టైన్మెంట్ మాములుగా లేదు. ఇక ఈ షోకి హిడింబా టీం నుంచి అశ్విన్ బాబు, రఘుకుంచె డైరెక్టర్ అనిల్ కృష్ణ  కూడా వచ్చారు. "హిడింబా అనగానే మీరు అశ్విన్ గారినే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు" అని డైరెక్టర్ ని అడిగేసరికి "కటౌట్ చూడలేదా" అన్నారు. రఘుకుంచే చాలా సైలెంట్ గా ఉండేసరికి "ఈ యాక్టింగ్ ఏంటబ్బా" అని ఆటపట్టించింది శ్రీముఖి. "ఏదోలేబ్బా..జీవితంలో చిన్న మార్పు ఉండాలి కదా అప్పుడప్పుడు" అన్నాడు. తర్వాత ఇమేజెస్ చూపించి పాట పాడే గేమ్ లో సిరి హన్మంత్ కరెక్ట్ గా పాడి వినిపించింది.

ఇక సీనియర్ యాక్టర్స్ వైపు రఘు కుంచె ఉండగా. జూనియర్ యాక్టర్స్ వైపు  అశ్విన్ ఉన్నాడు. "బావ వాళ్ళతో మాట్లాడ్డం మానేసి ఆట కూడా ఆడు బావా" అంటూ సరదాగా శ్రీముఖి ఆటపట్టించింది. "ఏంటి బావా నీకు అందరూ మరదళ్లేనా" అంటూ అశ్విన్ కొంటె కౌంటర్ ఒక వేసాడు. ఇక ఫైనల్ గా అశ్విన్ వెళ్లి కాష్ బాక్స్ తెచ్చేసరికి "అశ్విన్ బాబు నువ్వంటే నాకు చాలా ఇష్టం" అని చెప్పింది. "నువ్వంటే కూడా ఇష్టం" అన్నాడు. "నాకు ఓంకార్ బావ అన్నా కూడా ఇష్టం" అంది శ్రీముఖి. "నేను చిన బావని" అన్నాడు అశ్విన్. అలా అశ్విన్ తో, ఫైమాతో సిక్స్త్ సెన్స్ గేమ్ ఆడించింది ఫన్నీగా శ్రీముఖి.