Read more!

English | Telugu

మురారిని జాబ్ రిజైన్ చేయమని చెప్పిన కృష్ణ!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి '. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -210 లో.. కమీషనర్ కి భవాని ఫోన్ చేసి మురారిపై ఎటాక్ ఎవరు చేశారో ఎంక్వైరీ చేయమని చెప్తుంది. మురారిపై ఎటాక్ చేసింది ఎవరని ఇంట్లో అందరు ఆలోచిస్తుంటారు.

మురారిపై అలా ఎటాక్ చెయ్యడంతో కృష్ణ బాధపడుతుంది. మురారి అలా అయితే నాకు ఏదోలా ఉంది. నాకు ఈ ఇంట్లో ఏడ్చే స్వేచ్చ కూడా లేదు. నా బాధ ఎవరికి చెప్పుకోవాలని ముకుంద అనుకుంటుంది. ముకుంద తన గదిలోకి వెళ్లి బాధపడుతుంటే.. అలేఖ్య ముకుంద దగ్గరికి వెళ్లి.. ఏంటి ఈ మధ్య డల్ గా ఉంటున్నావ్? దేని గురించో బాధపడుతున్నావని అడుగుతుంది. ఆదర్శ్ గురించి ఆలోచిస్తున్నట్లు అలేఖ్య ముందు ముకుంద యాక్ట్ చేస్తుంది. నువ్వు మురారి గురించి బాధపడుతున్నావో ఆదర్శ్ గురించి బాధపడుతున్నావో తెలుసుకోలేనా అని అలేఖ్య తన మనసులో అనుకుంటుంది. మరొకవైపు మురారికి అలా జరగడంతో కృష్ణ బాధపడుతుంటుంది. అప్పుడే మురారి తన దగ్గరికి వస్తాడు. కృష్ణ ఎమోషనల్ అవుతూ.. మురారిని హగ్ చేసుకుంటుంది. మీరు నాకు ఒక మాట ఇవ్వండని మురారితో కృష్ణ అంటుంది. సరే ఏంటో చెప్పమని మురారి అడుగుతాడు. మీరు మీ జాబ్ కి రిజైన్ చెయ్యాలి.. మీరు మాట ఇచ్చారని కృష్ణ అంటుంది. సరే పెద్దమ్మని అడిగి చెప్తానని మురారి అంటాడు. మీకు ఏమైనా అయితే నేను తట్టుకోలేను ఏసీపీ సర్.. అందుకే ఈ మాట తీసుకున్నాను. మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని కృష్ణ అనుకుంటుంది.

ఆ తర్వాత భవాని దగ్గరికి కృష్ణ వెళ్తుంది. పెద్ద అత్తయ్య మీకో విషయం చెప్పాలని అంటుంది. ఏంటో చెప్పమని భవాని అంటుంది. భవానికి కృష్ణ భయపడుతూ.. చెప్పాలా వద్దా అని కంగారుపడుతుంటుంది. ఏంటో చెప్పమని భవాని గట్టిగా అడుగుతుంది. ఏసీపీ సర్ ని జాబ్ రిజైన్ చెయ్యమని చెప్పాను.‌ మిమ్మల్ని అడుగుతానని చెప్పాడని కృష్ణ అనగానే.. భవాని షాక్ అవుతుంది. ఏంటి ఎందుకు అలా చెప్పావ్. నీ ప్రేమ, భయం అర్థం అయ్యాయి కానీ నువ్వు దైర్యం చెప్పాలి కానీ నువ్వే అలా మాట్లాడకూడదంటూ, డ్యూటీ అన్నాక అలాగే ఉంటుందని కృష్ణకి భవాని దైర్యం చెప్తుంది. థాంక్స్ అత్తయ్య నా కళ్ళు తెరిపించారని కృష్ణ అంటుంది. మరొకవైపు భవానితో కృష్ణ ఏం మాట్లాడిందోనని మురారి టెన్షన్ పడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.