రాబర్ట్ వాద్రాకు కూడా కష్టకాలం మొదలయినట్లేనా?
Publish Date:Jul 15, 2014
Advertisement
రాబర్ట్ వాద్రాకు కూడా కష్టకాలం మొదలయినట్లేనా? కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆమె కుమారుడు రాహుల్ గాంధీలకు నేషనల్ హెరాల్డ్ ఆస్తుల దుర్వినియోగం కేసులో ఆదాయపు శాఖ నోటీసులు జారీచేసింది. సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా పేరు కూడా అనేక భూ కుంభకోణాలలో వినిపించింది. అయితే ఇంతవరకు కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉండటం వలన ఈ కేసులేవీ వారిని ఏమీ చేయలేకపోయాయి. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ అవినీతిపై ఉక్కుపాదం మోపేందుకు సిద్దమవడంతో అవినీతిపరులకు గుండెల్లో గుబులు మొదలయింది. కేంద్రంలో యూపీయే, హర్యానా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలోనే అశోక్ ఖిమ్కా అనే ఐఏయస్ అధికారి రాబర్ట్ వాద్రాకు చెందిన స్కై లైట్ హాస్పిటాలిటి మరియు డీయల్.యఫ్. సంస్థల మధ్య రూ.58కోట్లు విలువ చేసే భూమార్పిడి వ్యవహారంలో అక్రమాలు జరిగినట్లు గుర్తించి దానిని రద్దు చేయడమే కాక దర్యాప్తుకు కూడా ఆదేశించారు. దానితో ఆగ్రహం చెందిన హర్యానా ముఖ్యమంత్రి భూపేంద్ర హుడా ఆయనను బదిలీ చేయడమే కాకుండా ముగ్గురు ఐఏయస్ అధికారులతో కూడిన ఒక కమిటినీ కూడా వేసి క్రమశిక్షణ ఉల్లంఘించారంటూ ఆయనపై చర్యలకు సిద్దమయింది. అయితే నిజాయితీపరుడైన తన 22సం.లలో 44సార్లు బదిలీలు అయ్యారు. కనుక హర్యాన ప్రభుత్వ బెదిరింపులకి భయపడకుండా, హర్యానాలో జరిగిన, జరుగుతున్న అనేక కుంభకోణాలను పేర్కొంటూ ప్రభుత్వానికి 105 పేజీలతో కూడిన ఒక లేఖ వ్రాసారు. ఆ తరువాత ఆయన తనను కేంద్రానికి బదిలీ చేయవలసిందిగా ఏప్రిల్ నెలలో దరఖాస్తు చేసుకొన్నారు. కానీ అప్పటికి కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నందున ఆయనను కేంద్రానికి రప్పిస్తే పక్కలో పామును పెట్టుకోన్నట్లే అవుతుందని ఆయన విన్నపాన్ని పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు కేంద్రంలో ప్రభుత్వాలు మారి నరేంద్ర మోడీ ప్రధానిగా బాధ్యతలు చెప్పట్టడంతో, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండి సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు వ్యతిరేఖంగా పోరాడిన అశోక్ ఖిమ్కాను త్వరలోనే కేంద్ర సర్వీసులకు బదిలీ చేసేందుకు మోడీ అంగీకరించినట్లు ఉన్నతాధికారులు చెపుతున్నారు. బహుశః మరొకటి రెండు వారాల్లో అశోక్ ఖిమ్కా కేంద్రానికి బదిలీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే రాబర్ట్ వాద్రాకు కూడా కష్టకాలం మొదలయినట్లే భావించవచ్చును. హర్యాన ముఖ్యమంత్రి నిజాయితీపరుడైన అశోక్ ఖిమ్కాను వేదించి శిక్షించబోతే, ఆయనకు మోడీ ప్రభుత్వం పదోన్నతి కల్పించి గౌరవించడం చాలా హర్షణీయం.
http://www.teluguone.com/news/content/robert-wadra-45-35945.html
బీహార్లో ఏదన్నా జరిగితే అక్కడ జంగిల్ రాజ్ నడుస్తోందని అంతా విమర్శించడం సహజం. కానీ ఇప్పుడు దిల్లీలో ఉన్న అస్థిర పరిస్థితులు చూసిన తరువాత బీహార్ ముఖ్యమంత్రికి సమయం వచ్చినట్లుంది. ‘బీహార్లో ఏ చిన్న
ఉత్తర్ప్రదేశ్లో సాగుతున్న దారుణాలకి అంతులేకుండా పోతోంది. అందుకు తాజా ఉదాహరణగా ఇద్దరు అక్కాచెల్లెల్ల మీద నడిరోడ్డు మీద కాల్పులు జరిపారు దుండగులు. స్థానికుల కథనం ప్రకారం ప్రింకీ అనే 15 ఏళ్ల అమ్మాయిని రోజూ ఇద్దరు కుర్రవాళ్లు వేధిస్తూ ఉండేవారు
తన రాజకీయ శత్రువు చంద్రబాబు నాయుడుని ఏదోవిధంగా దెబ్బతీయాలని పరితపించిపోతున్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మైసూరా రెడ్డి భుజం మీద తుపాకి పెట్టి ఆయనకు గురిపెట్టవచ్చును. కానీ మున్ముందు ఉద్యమాలు ఊపందుకొన్నట్లయితే అప్పుడు వాటికి వైకాపా మద్దతు ఈయలేదు అలాగని వ్యతిరేకించలేదు కూడా. ఒకవేళ రాయలసీమ ఉద్యమాలకి మద్దతు ఇవ్వాలనుకొంటే అప్పుడు ఉత్తరాంధ్రా, కోస్తా జిల్లాల ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదు. అలాగని ఉద్యమాలకి మద్దతు ఈయకపోయినట్లయితే ఇంతకు ముందు తెలంగాణాలో తుడిచిపెట్టుకొని పోయినట్లే, సీమలోను వైకాపా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉంది. అదే పరిస్థితి తేదేపాకు ఎదురవవచ్చును.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను అల్లుడు ఫోబియా తెగ భయపెడుతోందట. ఎన్టీఆర్ కి జరిగినట్లుగా తనకూ జరుగుతుందేమోనని అనుమానిస్తున్నారట.ఎన్టీఆర్ నుంచి పదవి లాగేసుకున్నట్లుగా... తన ఫ్యామిలీ నుంచి కూడా ఎవరైనా అలా చేస్తారనే భయంతో కేసీఆర్ వణికిపోతున్నారట.
ఏడు నెలలు గడిచిపోయినా ఇంతవరకు జి.హెచ్.యం.సి. ఎన్నికలు నిర్వహించబడలేదు. కనీసం ఈ ఏడాదిలోగా నిర్వహిస్తారో లేదో తెలియని పరిస్థితి నెలకొని ఉంది. కారణం పెరిగిన జనాభాకి అనుగుణంగా జి.హెచ్.యం.సి. పరిధిలో వార్డుల పునర్విభజన ప్రక్రియా పూర్తి కాకపోవడమేనని ప్రభుత్వ వాదన. ప్రస్తుతం 150 వార్డులుండగా వాటిని 200కి పెంచాలని తెలంగాణా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. కానీ జనాభా ప్రాతిపదికన విభజించడానికయితే అంత సమయం అవసరం లేదని ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్ సభ్యుల వాదన.
ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీకి చేరుకున్నారు. ఆర్థిక శిఖరాగ్ర సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. అలాగే సీఐఐ సభ్యులతో భేటీ కానున్నారు. అనంతరం ప్రధానమంత్రి సహా పలువురు కేంద్రమంత్రులను బాబు కలిసే అవకాశముంది.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో గెలిచినట్లయితే ప్రధానమంత్రి కుర్చీలో కాలు మీద కాలేసుకొని దేశాన్ని పాలించేద్దామని కలలుగన్న రాహుల్ గాంధీ, ప్రస్తుతం చేసేందుకు పనేమీలేక పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నపుడు వెనుక బెంచీలలో చిన్న కునుకుతీస్తూ, సమావేశాలు జరగనప్పుడు తన అమేధీ నియోజక వర్గానికి ఓ రౌండేసి వస్తూ కాలక్షేపం చేసేస్తున్నారు.
Onions used to bring tears in common man's eyes!! Now it’s the turn of tomatoes though it is not an essential vegetable like onion.Common people were not worried about jarring words like inflation