political-news-img

కేసీఆర్ కు మంత్రి సీతక్క లీగల్ నోటీసు.. ఎందుకంటే?

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు మంత్రి సీతక్క లీగల్ నోటీసు పంపించారు. మంత్రి సీతక్క కేసీఆర్ కు లీగల్ నోటీసు పంపించడం రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. అంగన్ వాడీలకు మొబైల్ ఫోన్ ల కొనుగోలు వ్యవహారంలో తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ మంత్రి సీతక్క కేసీఆర్ కు నోటీసులు పంపారు. బీఆర్ఎస్ అఫీషియల్ సోషల్ మీడాయా ఖాతాలలో అంగన్ వాడీలకు సెల్ ఫోన్ల వ్యవహారంలో భారీగా అవినీతి జరిగిందంటూ వచ్చిన వరుస పోస్టులు తన వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగించాయని సీతక్క ఆ నోటీసులో పేర్కొన్నారు. బీఆర్ఎస్ అఫీషియల్ సోషల్ మీడియా కార్యకలాపాలకు ఆ పార్టీ అధినేతగా కేసీఆర్ బాధ్యత వహించాలని పేర్కొన్న సీతక్క, ఆ పోస్టులన్నిటినీ వెంటనే తొలగించి.. 48 గంటలలోగా తనకు కేసీఆర్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలన్ని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. తాను విధించిన నిర్ణీత గడువులోగా కేసీఆర్ స్పందించకుండా ఆయనపై సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. సీతక్క కేసీఆర్ కు లీగల్ నోటీసు పంపించిన వ్యవహారం ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది.

Publish Date: Apr 13, 2026 2:07PM

political-news-img

టీవీకే ప్రచారంలో ఏఐ!

భారత ఎన్నికల ప్రచారంలో గతంలో ఎన్నడూ చూడని విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగ ప్రవేశం చేసింది. రాజకీయ ప్రచారాల్లో సాధారణంగా నాయకులు ప్రత్యక్షంగా ర్యాలీలు నిర్వహిస్తారు. అలాగే సామాజిక మాధ్యమ వేదిక ద్వారా సందేశాలు పంపిస్తారు. అయితే ఈ సారి తమిళనాట సాంకేతిక విప్లవాన్ని కూడా ప్రచారంలో జోడించారు. తమిళరాజకీయాలలోకొ కొత్తగా ప్రవేశించిన నటుడు విజయన్.. తన ప్రచార సరళిని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. ప్రముఖ నటుడు, తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత దళపతి విజయ్ తన పార్టీ అభ్యర్థుల కోసం ప్రచారం చేయడానికి ఏఐని వినియోగించుకుంటున్నారు. తమిళనాడులో ఆదివారం (ఏప్రిల్ 12) జరిగిన ఒక రోడ్‌షోలో హలోగ్రాఫిక్ ఏఐ టెక్నాలజీని ఉపయోగించారు. విజయ్ స్వయంగా అక్కడ ప్రచారంలో పాల్గొన లేదు. కానీ ఏఐ ద్వారా విజయ్ రూపం, గొంతుఓటర్ల ముందుకు తీసుకువచ్చారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ప్రజలు తమ అభిమాన నాయకుడు సాక్షాత్తు తమ మధ్యే నిలబడి మాట్లాడుతున్నట్లు భావించేలా ఆ ప్రచారం సాగింది. ఈ ప్రచారంలో దృశ్య రూపంతో పాటు విజయ్ గొంతును కూడా ఏఐ ద్వారా రీ-క్రియేట్ చేసి ప్రసంగాలను వినిపించారు. క్షేత్రస్థాయిలో నేత అందుబాటులో లేని సమయంలో ఏఐ ఆడియో, వీడియో అద్భుతంగా పనిచేస్తోందని అంటున్నారు. భారతదేశంలో ఎన్నికల ప్రచారంలో ఏఐని ఉపయోగించడం ఇదే మొదటి సారి. గత కొద్ది రోజులుగా టీవీకే తన ప్రచార జోరును పెంచిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా టీవీకే అధినేత విజయ్ కటౌట్లు, పోస్టర్లతో పార్టీ శ్రేణులు హోరెత్తిస్తున్నారు. ఇప్పుడు ఏఐ ప్రచారం మొదలు కావడం ఆ పార్టీలో జోష్ ను పెంచింది. వినూత్న ఆలోచన కేవలం తమిళనాడులోనే కాకుండా, రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా ఇతర రాజకీయ పార్టీలకు కూడా మార్గదర్శకం కానుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. విజయ్ పార్టీ ఈ సృజనాత్మకత డిజిటల్ యుగంలో రాజకీయ ప్రచారం ఎలా ఉండబోతోందో కళ్లకు కట్టిందంటున్నారు.

Publish Date: Apr 13, 2026 1:52PM

political-news-img

భధ్రతా సమీకరణాలను ప్రభావితం చేస్తున్న మిడిల్ ఈస్ట్ టెన్షన్స్

కంఠంనేని సీతారాం మధ్యప్రాచ్య ప్రాంతంలో మారుతున్న తాజా భౌగోళిక రాజకీయ పరిణామాలు గ్లోబల్ భద్రతా సమీకరణాలను వేగంగా ప్రభావితం చేస్తున్నాయి. గత కొన్ని దశాబ్దాలుగా నెలకొన్న అస్థిరత ఇప్పుడు కొత్త దశకు చేరుకుంది. అమెరికా విమాన వాహక నౌకను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ చేసిన దాడుల వెనుక చైనా ఆయుధ సంపత్తి, పాకిస్తాన్ రవాణా పాత్రఉందన్న అనుమానాలు, ఆరోపణలు వెల్లువె త్తుతున్నాయి. ఇవి అంతర్జాతీయ స్థాయిలో పెను సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ పరిణామాలు కేవలం ప్రాంతీయ ఘర్షణలుగా మిగిలిపోకుండా, దేశాల మధ్య పరోక్ష యుద్ధానికి దారితీసే సూచనలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. అమెరికా మాజీ భద్రతా సలహాదారు మైక్ ఫ్లిన్ చేసిన వ్యాఖ్యలు ఈ పరిస్థితికి అద్దంపడుతున్నాయి. పాకిస్తాన్ ద్వారా చైనా క్షిపణులను ఉపయోగించి అమెరికా నౌక యూఎస్ఎస్ అబ్రహం లింకన్ ను లక్ష్యంగా చేసుకోవడం యుద్ధ చర్యేనన్నారాయన. ఇరాన్ తన క్షిపణి వ్యవస్థలను పునర్నిర్మించుకోవడానికి చైనా ఇప్పటికే అవసరమైన ఇంధన తయారీ ముడి పదార్థాలను పలుమార్లు సరఫరా చేసినట్లు పశ్చిమ దేశాల నిఘా వర్గాలు ధృవీకరిస్తున్నాయి. ఫిబ్రవరిలో ప్రారంభమైన యుద్ధం తర్వాత అమెరికా, ఇజ్రాయెల్ దాడుల వల్ల దెబ్బతిన్న తన సైనిక సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ఇరాన్ శ్రమిస్తోంది. ఈ వ్యూహాత్మక సరఫరా గొలుసులో పాకిస్తాన్ పాత్ర అత్యంత వివాదాస్పదంగా మారింది. చైనా నుంచి ఇరాన్‌కు అందుతున్న క్షిపణి సాంకేతికత, ఆయుధ సంపత్తికి పాకిస్తాన్ ఒక ట్రాన్సిట్ పాయింట్‌ అంటే రవాణా మార్గంగా వ్యవహరించిందన్న ఆరోపణలున్నాయి. రానున్న రోజుల్లో ఇరాన్‌కు కొత్త వాయు రక్షణ వ్యవస్థలను పంపేందుకు బీజింగ్ సిద్ధమవుతోందనీ, ఈ రవాణాపై ప్రపంచం దృష్టి పడకుండా ఉండేందుకు మూడవ దేశాల మార్గాలను, సరిహద్దులను చైనా వాడుకుంటోందనీ సమాచారం. చైనా, పాకిస్థాన్, ఇరాన్ ల యాక్సిస్ అమెరికా ప్రాబల్యాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. మరోవైపు.. పెంటగాన్ మాజీ సలహాదారు, రిటైర్డ్ కల్నల్ డగ్లస్ మాక్‌గ్రెగర్ ఇరాన్ వ్యూహాత్మక ఆధిక్యాన్ని ధృవీకరించారు. ఇరాన్ ప్రస్తుతం ఒక బలమైన స్థితిలో ఉందన్న ఆయన ఇరాన్ పై పై చేయి సాధించడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ మార్గాలు తగ్గిపోతున్నాయని విశ్లేషించారు. ఒకవేళ ట్రంప్ తన వద్ద ఉన్న పూర్తి స్థాయి సైనిక శక్తిని ఉపయోగించినప్పటికీ, విజయం లభిస్తుందనే గ్యారెంటీ లేదని ఆయన కుండబద్దలు కొట్టేశారు. యుద్ధం వల్ల కలిగే పరాభవాన్ని తప్పించుకోవడానికి భారీ సైనిక మోహరింపు అవసరమవుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన ఆయన.. అదే సమయంలో పాకిస్తాన్ విశ్వసనీయతపై ప్రశ్నలు లేవనెత్తారు. తీవ్రమైన అంతర్గత ఆర్థిక సంక్షోభం, నిరంతర రాజకీయ అస్థిరతతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్.. అమెరికా, ఇరాన్ మధ్య నిష్పాక్షిక మధ్యవర్తిగా వ్యవహరించగలదా అన్న సందేహాన్ని మాక్‌గ్రెగర్ వ్యక్తం చేశారు. చైనా ఆయుధాల పంపిణీలో భాగస్వామిగా ఉన్న దేశం శాంతి చర్చలకు వేదిక కావడం పలు అనుమానాలకు తీవిస్తోందన్నారు. చర్చల వైఫల్యానికి పాకిస్థాన్ పై విశ్వాసలోపం ప్రధాన కారణమన్నారు. అసలు ఈ చర్చలకు భారత్ వేదిక అయితే అవి సక్సెస్ అయి ఉండేవని డగ్లస్ మాక్‌గ్రెగర్ అభిప్రాయపడ్డారు. ఎందుకంటే భారతదేశం మధ్యవర్తిత్వానికి అత్యంత అనుకూలమైన స్థితిలో ఉందనీ, ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలతో భారత్ కు బలమైన స్నేహపూర్వక సంబధాలు ఉన్నాయనీ అన్న ఆయన భారత విదేశాంగ విధానం కూడా సమతుల్యంగా ఉందనీ, అంతర్జాతీయ శక్తులతో సంభాషించగల సామర్థ్యం భారత్‌కు అతిపెద్ద బలమనీ ఆయన పేర్కొన్నారు. మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత ముదరకుండా ఉండాలంటే.. ప్రధాని నరేంద్ర మోదీ నేరుగా డొనాల్డ్ ట్రంప్‌తో చర్చలు జరిపి, ఈ సంక్షోభ పరిష్కారానికి చొరవ తీసుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక పోతే అమెరికా అంతర్గత భద్రతపై కూడా ఆందోళనలు పెరుగుతున్నాయి. విదేశీ ముప్పు.. ముఖ్యంగా ఇరాన్ నుంచి వచ్చే ముప్పు చాలా వాస్తవమైనదని, అని భద్రతా సంస్థలు అప్రమత్తంగా ఉండాలని మైక్ ఫ్లిన్ హెచ్చరించారు. అమెరికా, ఇరాన్ దేశాలు రెండు వారాల తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటించినప్పటికీ, క్షేత్రస్థాయిలో ఉద్రిక్తతలు తగ్గకపోవడాన్ని ఆయన ఈ సందర్భంగా ఎత్తి చేపారు. ఇరాన్ మీడియా ప్రచురించిన వీడియోల ప్రకారం, అమెరికా నౌకలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం ద్వారా పైచేయిని నిరూపించుకోవాలని ఇరాన్ చూస్తున్నదన్నారు. ప్రపంచం ప్రస్తుతం ఒక సున్నితమైన, అత్యంత ప్రమాదకరమైన దశలో ఉంది. ఇది కేవలం రెండు దేశాల మధ్య ఘర్షణ కాదు, బహుళ శక్తుల మధ్య జరుగుతున్న పరోక్ష యుద్ధంగా పరిణమించింది. ఆధునిక యుద్ధ తంత్రాలు కేవలం సరిహద్దులకే పరిమితం కాకుండా, సాంకేతికత, క్షిపణి, గూఢచారి సంస్థల ద్వారా సాగుతున్నాయి. గ్లోబల్ పవర్ బ్యాలెన్స్ మారుతున్న వేళ.. అమెరికా తన ఆధిపత్యాన్ని నిలుపుకోవడానికి, అదే సమయంలో చైనా తన ప్రభావాన్ని పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ ప్రయత్నాలే రాబోయే రోజుల్లో ప్రపంచ గమనాన్ని శాసించనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సంక్షోభం నుండి బయటపడటం అంత సులభ సాధ్యం కాదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

Publish Date: Apr 13, 2026 11:48AM

political-news-img

మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు ముదురుతున్నాయా?

సంకలనం, సేకరణ: సీతారాం కంఠంనేని మధ్యప్రాచ్య ప్రాంతంలో జరుగుతున్న తాజా పరిణామాలు గ్లోబల్ భద్రతా సమీకరణాలను ప్రభావితం చేసే దిశగా సాగుతున్నాయి. అమెరికా మాజీ జాతీయ భద్రతా సలహాదారు మైఖేల్ ఫ్లిన్ చేసిన వ్యాఖ్యలు ఈ పరిస్థితిని మరింత తీవ్రంగా మార్చాయి. పాకిస్తాన్ ద్వారా చైనా క్షిపణులు ఉపయోగించి అమెరికా నౌకను లక్ష్యంగా చేసుకోవడం యుద్ధ చర్యగా పరిగణించవచ్చు కీలక ఆరోపణలు అమెరికా నిఘా వర్గాలు మరియు విశ్లేషణ సంస్థల ప్రకారం.. చైనా ఇరాన్ కు సైనిక సహాయం అందించడానికి సిద్ధమవుతోంది క్షిపణి వ్యవస్థలకు అవసరమైన పదార్థాల సరఫరా ఇప్పటికే జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. - కొత్త వాయు రక్షణ వ్యవస్థలు పంపే అవకాశం - ఈ రవాణాను దాచిపెట్టడానికి మూడవ దేశాల వినియోగం -ఈ మొత్తం వ్యవస్థలో పాకిస్థాన్ ఒక ట్రాన్సిట్ పాత్ర పోషించిందని ఆరోపణలు ఉన్నాయి అమెరికా నౌకపై దాడి వివాదం ఇటీవల ఇరాన్ అమెరికా విమాన వాహక నౌకను లక్ష్యంగా చేసుకున్నట్లు ప్రకటించింది యూఎస్ఎస్ ఇబ్రహింలింకన్ నౌక లక్ష్యంగా జరిగిన ఈ దాడిలో ఉపయోగించిన క్షిపణులు సరఫరా చేసినవి..వాటిని పాకిస్థాన్ ద్వారా అందించిందన్న రోపణలు వెలువడ్డాయి వ్యూహాత్మక విశ్లేషణ 1. పరోక్ష యుద్ధం మోడల్ ఈ సంఘటనలు సూచిస్తున్నది దేశాలు ప్రత్యక్షంగా యుద్ధంలో పాల్గొనకుండా మూడవ దేశాల ద్వారా దాడులు చేయడం దీనినే ప్రోక్సీవార్ ఫేర్.. పరోక్ష యుద్ధంగా పిలుస్తారు 2. చైనా పాత్ర చైనా పై ఉన్న అనుమానాలు: ఇరాన్ కు సాంకేతిక, సైనిక మద్దతు గ్లోబల్ ప్రభావాన్ని పెంచుకోవాలనే వ్యూహం ఇది అమెరికా–చైనా పోటీని కొత్త దశలోకి తీసుకెళ్తుంది పాకిస్తాన్ పై ప్రశ్నలు అమెరికా విశ్లేషకులు, ముఖ్యంగా డగ్లస్ మెక్‌గ్రెగర్ పాకిస్తాన్ సామర్థ్యంపై సందేహం వ్యక్తం చేశారు. ఆర్థిక సంక్షోభం రాజకీయ అస్థిరత నిష్పాక్షికతపై సందేహాలు ఈ నేపథ్యంలో.. ఇరాన్, అమెరికా చర్చలకు పాకిస్తాన్ సరైన మధ్యవర్తా కాదా? అనే ప్రశ్న తలెత్తుతోంది. భారతదేశం – ఒక ప్రత్యామ్నాయం? డగ్లస్ మాక్గ్రెగర్ అభిప్రాయం ప్రకారం, భారత్ మధ్యవర్తిత్వానికి మరింత అనుకూల స్థితిలో ఉంది కారణాలు.. బలమైన అంతర్జాతీయ సంబంధాలు సమతుల్య విదేశాంగ విధానం పలు శక్తులతో సంభాషణ సామర్థ్యం ప్రధాని మోదీ – ట్రంప్ చర్చలు జరపాలన్నది డగ్లస్ మాక్గ్రెగర్ సూచన ఇరాన్ ఆధిక్యం? డగ్లస్ మాక్గ్రెగర్ విశ్లేషణ ప్రకారం ప్రస్తుతం ఇరాన్ వ్యూహాత్మకంగా బలంగా ఉంది అమెరికా ఎంపికలు తగ్గుతున్నాయి ట్రంప్ తన వద్ద ఉన్న సైనిక శక్తిని పూర్తిగా వినియోగించాల్సి రావచ్చు… కానీ విజయం గ్యారంటీ లేదు. గ్లోబల్ భద్రతా ప్రభావం బహుళ శక్తుల మధ్య ప్రత్యక్ష–పరోక్ష ఘర్షణలు సైనిక టెక్నాలజీ ట్రాన్స్ఫర్ పెరుగుదల గ్లోబల్ పవర్ బ్యాలెన్స్ మార్పు పరిశోధనా సంస్థల హెచ్చరిక యుద్ధ అధ్యయన సంస్థ (ఐఎస్ డబ్ల్యు) నివేదిక ప్రకారం చైనా, ఇరాన్ కు సైనిక సహాయం అందిస్తున్నట్లు సంకేతాలు ఉన్నాయి అమెరికా అంతర్గత భద్రతపై ఆందోళనలు మైక్ ఫ్లిన్ ప్రకారం.. అమెరికాకు విదేశీ ముప్పు చాలా వాస్తవమైనది. భద్రతా సంస్థలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. శాంతి చర్చలు – ఆశా కిరణమా? ఈ ఉద్రిక్తతల మధ్య.. అమెరికా, ఇరాన్ ఇస్లామాబాద్లో చర్చలకు సిద్ధమవుతున్నాయి అయితే.. మధ్యవర్తి నిష్పాక్షికత, విశ్వాస లోపం ఈ చర్చల విజయాన్ని ప్రభావితం చేయవచ్చు ప్రస్తుతం ప్రపంచం ఒక సున్నితమైన దశలో ఉంది. ప్రత్యక్ష యుద్ధం కాదు.. కానీ పరోక్ష శక్తుల పోరు ఈ సంక్షోభం మనకు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుచేస్తోంది. ఆధునిక యుద్ధాలు కేవలం యుద్ధభూముల్లోనే జరగవు. అవి వ్యూహాలు, కూటములు, సాంకేతిక మార్గాల్లో కూడా జరుగుతాయి. ప్రపంచ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. అందులో ప్రతి దేశం తన స్థానం కోసం పోరాడుతోంది. పాకిస్తాన్ ద్వారా చైనా క్షిపణులను ఉపయోగించి అమెరికా నౌకను లక్ష్యంగా చేసుకోవడం యుద్ధ చర్యే అని ట్రంప్ మాజీ ఎన్ఎస్ఏ సలహాదారు చెప్పారు. ఇరాన్ కు ఆయుధాల రవాణాకు చైనా సిద్ధమవుతోందని అమెరికా నిఘా వర్గాలు సూచిస్తున్నాయి. రాబోయే వారాల్లో ఇరాకు కొత్త వాయు రక్షణ వ్యవస్థలను పంపడానికి చైనా సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ రవాణాను దాచిపెట్టడానికి బీజింగ్ మూడవ దేశాలను ఉపయోగించుకోవచ్చని నిఘా వర్గాలు సూచిస్తున్నాయి. తమ మధ్య కొనసాగుతున్న సంఘర్షణను ముగించేందుకు పాకిస్తాన్ లోని ఇస్లామాబాద్ లోఅమెరికా, ఇరాన్ ఉన్నత స్థాయి చర్చలు జరిపిన తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్ ఆధిక్యంలో ఉంది, తనకున్నదంతా ప్రయోగించడమే ట్రంప్ కు ఉన్న ఏకైక మార్గమని డగ్లస్ మాక్గ్రెగర్ అన్నారు. పాకిస్తాన్ ఎదుర్కొంటున్న తీవ్రమైన అంతర్గత ఆర్థిక, రాజకీయ సవాళ్లను ఉటంకిస్తూ, పశ్చిమ ఆసియా సంక్షోభంలో మధ్యవర్తిగా దాని విశ్వసనీయతను అమెరికా మాజీ ఆర్మీ కల్నల్ డగ్లస్ మాక్గ్రెగర్ ప్రశ్నించారు. బలమైన ప్రపంచ సంబంధాలున్న భారతదేశం మధ్యవర్తిత్వ పాత్రకు మెరుగైన స్థితిలో ఉందని ఆయన సూచించారు. మాజీ అధ్యక్షుడు ట్రంప్ చర్చలు జరపాలని ప్రధాని మోదీని ఆయన కోరారు. డగ్లస్ మాక్గ్రెగర్ ప్రకారం.. ఇరాన్ దే పైచేయి. ప్రపంచవ్యాప్తంగా, దేశీయంగా ఎదురయ్యే అవమానాన్ని తప్పించుకోవడానికి డొనాల్డ్ ట్రంప్ భారీ సంప్రదాయ సైనిక శక్తిపై ఆధారపడాల్సి వస్తోందనీ, అయినప్పటికీ విజయం అనుమానమేనని పేర్కొన్నారు. పెంటగాన్ మాజీ సలహాదారు, అమెరికా మాజీ రక్షణ మంత్రి, రిటైర్డ్ కల్నల్ డగ్లస్ మాక్గ్రెగర్.. మధ్యప్రాచ్య సంఘర్షణ గమనంపై తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం ఇరాన్ వ్యూహాత్మక ఆధిక్యాన్ని కలిగి ఉందని, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఆచరణీయమైన మార్గాలు తగ్గిపోతున్నాయనీ, ఇక ట్రంప్ ఆయన తన వద్ద సాయుధ సంపత్తి మొత్తం ఇరాన్ పై ప్రయోగించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇరాన్ కు చైనా సరఫరా చేసిన క్షిపణులను అందించడంలో ఇస్లామాబాద్ పాత్ర ఉందన్న ఆరోపణల నేపథ్యంలో, ఇరాన్-అమెరికా మధ్య శాంతి చర్చలకు "నిష్పాక్షిక మధ్యవర్తి"గా వ్యవహరించగల పాకిస్తాన్ సామర్థ్యంపై అమెరికా మాజీ జాతీయ భద్రతా సలహాదారు జనరల్ మైక్ ఫ్లిన్ అనుమానాలు వ్యక్తం చేశారు. జనరల్ ఫ్లిన్, డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా తన మొదటి పదవీకాలంలో ఆయనకు జాతీయ భద్రతా సలహాదారుగా పనిచేశారు. అమెరికా విమాన వాహక నౌకను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ ఉపయోగించిన క్షిపణులను చైనా కమ్యూనిస్ట్ పార్టీ (సీసీపీ) సరఫరా చేసిందని, వాటిని పాకిస్తాన్ పంపిందని ఫ్లిన్ ఆరోపించారు. అమెరికా, ఇరాన్లు ప్రకటించిన రెండు వారాల కాల్పుల విరమణ నేపథ్యంలో జనరల్ ఫ్లిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. అన్ని పక్షాలకూ తమ వైఖరిపై స్పష్టత వచ్చేవరకు ఈ పరిస్థితి నుండి బయటపడటం సాధ్యం కాదని ఆయన పేర్కొన్నారు. ఈ వారం ప్రారంభంలో, ప్రముఖ అమెరికా సైనిక పరిశోధనా సంస్థ 'ఇన్స్టిట్యూట్ ఫర్ ది స్టడీ ఆఫ్ వార్' (ఐఎస్ డబ్ల్యు), సంక్షోభంలో ఉన్న ఇరాన్ ప్రభుత్వానికి కమ్యూనిస్ట్ చైనా సైనిక సహాయం అందిస్తోందని పేర్కొంది. అమెరికా మాజీ జాతీయ భద్రతా సలహాదారు ఫ్లిన్, అమెరికా అంతర్గత భద్రతపై దృష్టి సారించారు. ఇరాన్ నుండి అమెరికాకు ఉన్న విదేశీ ముప్పు చాలా వాస్తవమైనది అని, ఈ విషయంలో అధికారులు చురుకుగా నిమగ్నమై ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి చైనా, ఇరాన్కు క్షిపణి ఇంధన తయారీకి వాడే ముడి పదార్థాన్ని పలుమార్లు పంపిందని పాశ్చాత్య మీడియా నివేదించింది. ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి అమెరికా, ఇజ్రాయెల్ వైమానిక దాడుల తర్వాత, ఇరాన్ సైనిక దళాలు తమ క్షిపణి వ్యవస్థను పునర్నిర్మించుకోవడానికి కృషి చేస్తున్నాయని సమాచారం. గత నెలలో, యూఎస్ఎస్ అబ్రహం లింకన్ విమాన వాహక నౌకను తీరప్రాంత క్రూయిజ్ క్షిపణులతో లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్ సైన్యం ప్రకటించింది. అమెరికా విమాన వాహక నౌకపై సాయుధ దళాలు క్షిపణులను ప్రయోగించాయని పేర్కొంటూ ఇరాన్ మీడియా ప్రెస్ టీవీ ఒక వీడియోను ప్రచురించగా, ప్రభుత్వ ఆధీనంలోని ఐఆర్ఎన్ఏ వార్తా సంస్థ, ఈ ఆపరేషన్ను నావికాదళ అధికారులు వివరించినట్లు పేర్కొంది.

Publish Date: Apr 13, 2026 11:26AM

political-news-img

యూటర్నా.. వెనకడుగా.. 24 గంటల్లో మారిన విజయసాయి వైఖరి

రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి తాను సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించి, ఇక మీడియా సంస్థ ద్వారా ప్రజాసేవ చేస్తానని చెప్పుకున్నారు. ఏ రాజకీయ పార్టీకి కొమ్ముకాయకుండా, పూర్తి తటస్థంగా వార్తలను అందిస్తామని హామీ ఇచ్చారు.అయితే ఆయన మీడియా సంస్థ ప్రకటన చేసి, తాను తటస్ఠంగా ప్రజా పక్షాన గొంతెత్తుతానని ప్రకటించిన 24 గంటల వ్యవధిలోనే ఆయన వైఖరి మారింది. తటస్థం అన్నది ఒక ముసుగే అని అవగతమయ్యేలా ఆయన సోషల్ మీడియా పోస్టులు ఉంటున్నాయి. డిజిటల్ మీడియా, ఆ తరువాత త్వరలోనే పూర్తి స్థాయి శాటిలైట్ చానల్ అని ప్రకటిస్తూ విజయ సాయి రెడ్డి.. ఆ ప్రకటన చేసిన గంటల వ్యవధిలోనే.. తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అయితే అలా విమర్శించి ఊరుకోకుండా అమరావతిలో సామాజిక న్యాయం, సామాజిక సమానత్వం అంటే దీక్ష చేస్తున్న రామచంద్రయాదవ్ కు మద్దతు ప్రకటించారు. తద్వారా తాను పాత విజయసాయిరెడ్డినేనని పరోక్షంగా, అన్యాపదేశంగా చాటుకున్నారు. అమరావతి రాజధాని విషయంలో విజయసాయి గంతంలో అంటే వైసీపీలో ఉన్న సమయంలో ఏ వైఖరినైతే అవలంబించారో.. ఆ వైఖరికి అనుగుణంగానే ఆయన తాజా వ్యాఖ్యలు కూడా ఉన్నాయి. అంతెందుకు ఆయన మీడియా సంస్థ ప్రారంభిస్తున్నానన్న ప్రకటనకు ముందు అమరావతికి చట్టబద్ధత బిల్లు పార్లమెంటు ఉభయ సభల్లోనూ ఆమోదం పొందగానే ఆయన కమ్మరావతి వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తటస్థ మీడియా సంస్థ ప్రారంభిస్తున్నానని చెప్పిన 24 గంటల వ్యవధిలోనే విజయ సాయి తన జగన్ అనుకూల వైఖరిని వెల్లడించుకుంటూ, రామచంద్రయాదవ్ కు మద్దతు పలుకుతూ చేసిన ట్వీట్లు ఆయన తటస్థతపై అనుమానాలు వ్యక్తం అయ్యేలా ఉన్నాయి. తన మీడియా సంస్థ కార్యకలాపాలు ప్రారంభం కాకముందే ఆయన అనుసరిస్తున్న ఈ వైఖరి.. రానున్న రోజులలో ఆయన మీడియా ఎవరి కోసమే చెప్పకనే చెబుతున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

Publish Date: Apr 13, 2026 10:57AM

political-news-img

అమరావతికి చట్టబద్ధత.. ఢిల్లీలో చక్రం తిప్పిన నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతిని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా గుర్తించి, గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడం రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త ఉత్సాహానికి కారణమైంది. ముఖ్యంగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి కేంద్రం నిర్ణయం వేయి ఏనుగుల బలాన్నిచ్చింది. ఇక అమరావతి అభివృద్ధి వాయువేగంతో సాగుతుందన్న నమ్మకాన్ని ప్రజలకు ఇచ్చింది. అయితే కేంద్రం ఇంత వేగంగా ఈ నిర్ణయం తీసుకోవడం, పార్లమెంటు ఉభయ సభల్లోనూ ఇందుకు సంబంధిచిన బిల్లు ఆమోదం పొందడం, ఆ వెంటనే రాష్ట్రపతి సంతకం, గెజిట్ నోటిఫికేషన్ విడుదల ఎలాంటి జాప్యం లేకుండా సాగిపోవడం వెనుక ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేష్ కీలక పాత్ర పోషించారు. ఆ విషయంలో ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో కీలక చర్చ జరుుగుతోంది. గతంలో ఢిల్లీ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు చక్రం తిప్పేవారు. ఇప్పుడు ఆ కీలక భూమిక లోకేష్ పోషిస్తున్నారన్నది రాజకీయవర్గాలలో టాక్. అమరావతికి సంబంధించిన కీలక అనుమతులు సాధించడంలో లోకేష్ కీలక పాత్ర పోషించారనీ, ఢిల్లీ వేదికగా ఎన్డీయే కూటమిలోని కీలక నేతలను, ఎంపీలను సమన్వయం చేస్తూ అమరావతి ఆవశ్యకతను వివరించడంలో లోకేష్ సక్సెస్ అయ్యారనీ అంటున్నారు. పార్లమెంటు సమావేశాల సమయంలోనూ అక్కడే ఉండి ఎప్పటికప్పుడు పరిణామాలను గమనిస్తూ అమరావతికి రాష్ట్ర ఏకైక రాజధానిగా చట్టబద్ధ గుర్తింపు లభించేలా చేశారనని చెబుతున్నారు. అమరావతికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ వెలువడిన అనంతరం, లోకేష్ మరోసారి ఢిల్లీకి చేరుకున్నారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ పర్యటన లోకేష్ రాజకీయ పరిణతికి అద్దం పడుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. చంద్రబాబు నాయుడు పరిపాలనపై దృష్టి సారిస్తుండగా, జాతీయ స్థాయిలో పార్టీ గళాన్ని వినిపించడం, రాష్ట్రప్రయోజనాల సాధనకు కృషి చేయడం వంటి బాధ్యతను లోకేష్ భుజాన వేసుకున్నారని అంటున్నారు. రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధుల సమీకరణతో పాటు, కేంద్రం నుంచి రావాల్సిన సహాయ సహకారాల విషయంలోనూ లోకేష్ వరుసగా జాతీయ నాయకులను కలుస్తున్నారు. తండ్రి నారా చంద్రబాబు రాజకీయ వారసత్వాని అందిపుచ్చుకుంటూనే.. అదే సమయంలో రాష్ట్ర, జాతీయ రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సాధిస్తున్నారని చెబుతున్నారు. లోకేష్ చొరవతో అమరావతికి మార్గం సుగమం కావడమే కాకుండా, భవిష్యత్తులో రాష్ట్ర అభివృద్ధికి మరిన్ని పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని ఎన్డీయే వర్గాలే అంటున్నాయి.

Publish Date: Apr 13, 2026 10:14AM

MOVIE NEWS

movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img