హోదాపై మాట్లాడేందుకు... రోజా హోదా ఏంటి?
Publish Date:Sep 7, 2016
Advertisement
రోజా... వైసీపీ వారి ఫ్రైర్ బ్రాండ్. ఆ పార్టీ ఎవర్ని తిట్టాలనుకున్నా ఈ రోజాస్త్రాన్నే ప్రయోగిస్తుంది. ఇక ఆమె మైకు పట్టుకుని మైకంలోకి వచ్చేసిందంటే తిట్లతో ఊగిపోతుంది! అఖరుకి తొలిసారి చట్ట సభలో కాలుపెట్టిన ఆమె స్పీకర్ సాక్షిగానే ముఖ్యమంత్రిని నానా బూతులు తిట్టి సంవత్సరం పాటూ అసెంబ్లోకి వెళ్లకుండా చేసుకుంది. అయితే, అందుకు రోజా సారీ చెప్పింది. కాకపోతే, ఎప్పుడు ప్రెస్ మీట్లలో ప్రత్యర్థుల్ని దారుణంగా తిడుతూ చెలరేగే రోజా తాజాగా స్పెషల్ స్టేటస్ పై మాట్లాడింది! రోజా ఎప్పటిలాగే చేసిన హాట్ హాట్ , మాస్ మసాలా విమర్శల్ని పక్కనపెడితే ... వైసీపీ మొత్తంలో ఆమె ఒక్కతే ప్రత్యేక హోదా గురించి మాట్లాడటం ఏంటి? ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు కూడా ఆశ్చర్యపోతున్న పరిణామం ఇదే! జగన్ క్యాంప్ లో ఎందరో సీనియర్స్, మేధావులు వుండగా సినీ నేపథ్యం నుంచి వచ్చిన ఫస్ట్ టైం ఎమ్మేల్యే రోజా స్పెషల్ స్టేటస్ పై స్పెషల్ ప్రెస్ మీట్ పెట్టటం ఏంటని వారు ముక్కున వేలేసుకుంటున్నారు!
వైసీపీలో ప్రత్యేక హోదా లాంటి గంభీరమైన విషయం మాట్లాడటానికి సీనియారిటీ, సిన్సియారిటీ, సెన్సిబిలిటి వున్న ఎందరో నేతలున్నారు. మరీ ముఖ్యంగా, జగన్ కు ఎంతో సన్నిహితుడైన విజయసాయి రెడ్డి ప్రత్యేకంగా ఆర్దిక శాస్త్రం చదువుకున్న ఛార్టెడ్ అకౌంటెంటే! అలాంటి వారందర్నీ వదిలిపెట్టి రోజా చేత ప్రత్యేక హోదా గురించి మాట్లాడటం ఏమిటి? మొదటి సారి ఎమ్మేల్యే అయిన ఆమెకు కనీసం రాజకీయ అనుభవం వుందని కూడా సరిపెట్టుకోలేని పరిస్థితి!
గబ్బర్ సింగ్ కి రైమింగ్ వచ్చేలా రబ్బర్ సింగ్ అంటూ పవన్ టార్గెట్ చేసిన రోజా మరోసారి ఆయన్నే టార్గెట్ చేసింది. షూటింగ్ లు లేనప్పుడు పవన్ కళ్యాణ్ హోదా కోసం ఉద్యమిస్తాడని వెటకారంగా వ్యాఖ్యానించింది. అసలు ప్రజాప్రతినిధిగా వుంటూ జబర్డస్త్ జడ్జీగా కనిపించటాన్ని రోజా ఎలా సమర్థించుకుంటుంది. తాజాగా రోజా మరో ఛానల్లో మరో పంచాయితీలు తీర్చే షో కూడా ప్రారంభించింది. ఇలాంటి టీవీ షూటింగ్ ల నడుమ అప్పుడప్పుడూ తానొచ్చి ప్రెస్ మీట్లు పెట్టి అందర్నీ తిట్టిపోతే లేని తప్పు... పవన్ హోదా కోసం ఉద్యమిస్తే వచ్చిందా? రోజాకే తెలియాలి!
http://www.teluguone.com/news/content/-roja-45-66179.html
బీహార్లో ఏదన్నా జరిగితే అక్కడ జంగిల్ రాజ్ నడుస్తోందని అంతా విమర్శించడం సహజం. కానీ ఇప్పుడు దిల్లీలో ఉన్న అస్థిర పరిస్థితులు చూసిన తరువాత బీహార్ ముఖ్యమంత్రికి సమయం వచ్చినట్లుంది. ‘బీహార్లో ఏ చిన్న
ఉత్తర్ప్రదేశ్లో సాగుతున్న దారుణాలకి అంతులేకుండా పోతోంది. అందుకు తాజా ఉదాహరణగా ఇద్దరు అక్కాచెల్లెల్ల మీద నడిరోడ్డు మీద కాల్పులు జరిపారు దుండగులు. స్థానికుల కథనం ప్రకారం ప్రింకీ అనే 15 ఏళ్ల అమ్మాయిని రోజూ ఇద్దరు కుర్రవాళ్లు వేధిస్తూ ఉండేవారు
తన రాజకీయ శత్రువు చంద్రబాబు నాయుడుని ఏదోవిధంగా దెబ్బతీయాలని పరితపించిపోతున్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మైసూరా రెడ్డి భుజం మీద తుపాకి పెట్టి ఆయనకు గురిపెట్టవచ్చును. కానీ మున్ముందు ఉద్యమాలు ఊపందుకొన్నట్లయితే అప్పుడు వాటికి వైకాపా మద్దతు ఈయలేదు అలాగని వ్యతిరేకించలేదు కూడా. ఒకవేళ రాయలసీమ ఉద్యమాలకి మద్దతు ఇవ్వాలనుకొంటే అప్పుడు ఉత్తరాంధ్రా, కోస్తా జిల్లాల ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదు. అలాగని ఉద్యమాలకి మద్దతు ఈయకపోయినట్లయితే ఇంతకు ముందు తెలంగాణాలో తుడిచిపెట్టుకొని పోయినట్లే, సీమలోను వైకాపా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉంది. అదే పరిస్థితి తేదేపాకు ఎదురవవచ్చును.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను అల్లుడు ఫోబియా తెగ భయపెడుతోందట. ఎన్టీఆర్ కి జరిగినట్లుగా తనకూ జరుగుతుందేమోనని అనుమానిస్తున్నారట.ఎన్టీఆర్ నుంచి పదవి లాగేసుకున్నట్లుగా... తన ఫ్యామిలీ నుంచి కూడా ఎవరైనా అలా చేస్తారనే భయంతో కేసీఆర్ వణికిపోతున్నారట.
ఏడు నెలలు గడిచిపోయినా ఇంతవరకు జి.హెచ్.యం.సి. ఎన్నికలు నిర్వహించబడలేదు. కనీసం ఈ ఏడాదిలోగా నిర్వహిస్తారో లేదో తెలియని పరిస్థితి నెలకొని ఉంది. కారణం పెరిగిన జనాభాకి అనుగుణంగా జి.హెచ్.యం.సి. పరిధిలో వార్డుల పునర్విభజన ప్రక్రియా పూర్తి కాకపోవడమేనని ప్రభుత్వ వాదన. ప్రస్తుతం 150 వార్డులుండగా వాటిని 200కి పెంచాలని తెలంగాణా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. కానీ జనాభా ప్రాతిపదికన విభజించడానికయితే అంత సమయం అవసరం లేదని ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్ సభ్యుల వాదన.
ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీకి చేరుకున్నారు. ఆర్థిక శిఖరాగ్ర సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. అలాగే సీఐఐ సభ్యులతో భేటీ కానున్నారు. అనంతరం ప్రధానమంత్రి సహా పలువురు కేంద్రమంత్రులను బాబు కలిసే అవకాశముంది.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో గెలిచినట్లయితే ప్రధానమంత్రి కుర్చీలో కాలు మీద కాలేసుకొని దేశాన్ని పాలించేద్దామని కలలుగన్న రాహుల్ గాంధీ, ప్రస్తుతం చేసేందుకు పనేమీలేక పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నపుడు వెనుక బెంచీలలో చిన్న కునుకుతీస్తూ, సమావేశాలు జరగనప్పుడు తన అమేధీ నియోజక వర్గానికి ఓ రౌండేసి వస్తూ కాలక్షేపం చేసేస్తున్నారు.
Onions used to bring tears in common man's eyes!! Now it’s the turn of tomatoes though it is not an essential vegetable like onion.Common people were not worried about jarring words like inflation
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆమె కుమారుడు రాహుల్ గాంధీలకు నేషనల్ హెరాల్డ్ ఆస్తుల దుర్వినియోగం కేసులో ఆదాయపు శాఖ నోటీసులు జారీచేసింది. సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా పేరు కూడా అనేక భూ కుంభకోణాలలో వినిపించింది. అయితే ఇంతవరకు కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉండటం వలన ఈ కేసులేవీ వారిని ఏమీ చేయలేకపోయాయి. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ అవినీతిపై ఉక్కుపాదం మోపేందుకు సిద్దమవడంతో అవినీతిపరులకు గుండెల్లో గుబులు మొదలయింది.