political-news-img

హైదరాబాద్ మెట్రో స్వాధీనం చేసుకోవాలని కేబినెట్ నిర్ణయం

తెలంగాణ మంత్రి వర్గం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ మెట్రోను ఎల్&టీ నుంచి పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. మెట్రో రైలు స్వాధీనంపై ఇదివరకే ప్రభుత్వం ప్రకటన చేసింది. స్వాధీనం చేసుకునే ప్రక్రియను పర్యవేక్షించడానికి మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్, జూపల్లి కృష్ణారావులతో ఈ ఉపసంఘాన్ని నియమించింది. ప్రస్తుతం హైదరాబాద్ మెట్రోని నిర్వహిస్తున్న ఎల్అండ్‌టీ నుంచి పూర్తిగా ప్రభుత్వాధీనంలోకి తీసుకునేందుకు క్యాబినెట్ గ్రీన్ సిగ్రల్ ఇచ్చింది. ఈ నిర్ణయం ప్రకారం మార్చి 31వ తేదీలోపు మెట్రోను పూర్తిగా స్వాధీనం చేసుకునేలా ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. ఈ టేకోవర్ మొత్తం విలువ సుమారు రూ.15,000 కోట్లుగా అంచనా వేసింది. ఇందులో మెట్రోపై ఉన్న అప్పులు రూ.13,000 కోట్లు కాగా, ఎల్ అండ్‌టీ సంస్థ ఈక్విటీ వాటా రూ.2,000 కోట్లుగా ఉంది. రెండో దశ మెట్రో విస్తరణకు కేంద్రం నుంచి నిధులు రాబట్టేందుకు చర్యలు చేపట్టనుంది.

Publish Date: Feb 23, 2026 9:02PM

political-news-img

వైద్య విధాన పరిషత్ పేరు మారుస్తూ కేబినెట్ నిర్ణయం

సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయలు తీసుకున్నారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్ మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్‌గా పేరు మారుస్తు డెసిషన్ తీసుకున్నారు. దీంతో ఇక నుంచి టీవీవీపీ ఉద్యోగులంతా ప్రభుత్వ పరిధిలోకి రాబోతున్నారు. హైదరాబాద్ మెట్రోను ఎల్ & టీ నుంచి స్వాధీనం చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఖమ్మం అర్బన్ లో టీటీడీకి 20 ఎకరాల భూమి కేటాయించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలకు ప్రతి జిల్లాల్లో భూ కేటాయింపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నియోపోలీస్ లో నీటి సరఫరాకు HMWS బడ్జెట్ కేటాయింపు..JNTU కాలేజి నిర్మాణానికి మహబూబాబాద్ జిల్లా గుమ్మడూరులో 70 ఎకరాల కేటాయింపుకు పచ్చజెండా ఊపారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన జనగణన 2027ను చేపట్టేందుకు రాష్ట్రంలో ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లపై మంత్రివర్గం చర్చించింది. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం తొలి విడత జరిగే ఇండ్ల గణన (హౌజ్ లిస్టింగ్ ఆపరేషన్) రాష్ట్రంలో మే 11వ తేదీన ప్రారంభించి జూన్ 9 వరకు చేపట్టేందుకు ఏర్పాట్లు చేసినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు తెలిపారు.

Publish Date: Feb 23, 2026 8:40PM

political-news-img

అసెంబ్లీకి రమ్మని బొట్టు పెట్టి పిలవరు... లోకేష్ చురకలు

అసెంబ్లీకి రమ్మని ఎవ్వరూ బొట్టు పెట్టి పిలవరని ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్ వైసీపీ ఎమ్మెల్యేలకు చురకలంటించారు. వైసీపీ నేతలు దేవుణ్నే రోడ్డు మీదకు తీసుకురావడం బాధాకరమన్నారు. తిరుమలో కొలువుదీరిన దేవదేవుడికి జరిగిన మహాపచారం అసెంబ్లీ వేదికగా బయటపెడతామని లోకేశ్ వెల్లడించారు. శ్రీవారి లడ్డూ కల్తీకి సంబంధించిన వాస్తవాలన్నీ మంగళవారం (24-2-26న)అసెంబ్లీలో పెడతామని తెలిపారు. సోమవారం 8వ రోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అసెంబ్లీ లాబీలో నిర్వహించిన ఇష్టాగోష్ఠిలో మంత్రి లోకేశ్ మాట్లాడారు. సభకు రావడం సభ్యులుగా వారి బాధ్యత అంటూ వైసీపీ ఎమ్మెల్యేలకు ఆయన సూచించారు. దేవుడి ఫొటోలతో చట్టసభల్లో ర్యాలీలు చేయడం అభ్యంతరకరమని లోకేశ్ వ్యాఖ్యానించారు.

Publish Date: Feb 23, 2026 7:21PM

political-news-img

డ్రగ్స్ డాన్ ఎల్ మెంచో చరిత్ర సమాప్తం

ప్రపంచ దేశాలను వణికించిన మోస్ట్ వాంటెడ్ డ్రగ్ మాఫియా డాన్, జాలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్ అధినేత నెమెసియో ఒసెగుయెరా అలియాస్ ఎల్ మెంచో కథ ముగిసింది. ఆదివారం మెక్సికో సైన్యం నిర్వహించిన ఒక రహస్య ఆపరేషన్‌లో అతడిని మట్టుబెట్టారు. ఈ వార్త తెలియగానే మెక్సికో వ్యాప్తంగా మాఫియా ముఠాలు విధ్వంసానికి దిగడంతో ఆ దేశం అల్లర్లతో అట్టుడుకుతోంది. ఈక్రంమలోనే భారత విదేశాంగ శాఖ.. అక్కడి భారత పౌరులకు కీలక అడ్వైజరీ జారీ చేసింది. 59 ఏళ్ల ఎల్ మెంచో ఆచూకీపై అమెరికా నిఘా సంస్థల నుంచి అందిన పక్కా సమాచారంతో మెక్సికో సైన్యం జాలిస్కో రాష్ట్రంలోని తపాల్ప పట్టణాన్ని చుట్టుముట్టింది. అతడు నక్కిన స్థావరాన్ని సైనికులు ముట్టడించగా.. మెంచో అనుచరులు యధేచ్ఛగా కాల్పులకు దిగారు. సైన్యం జరిపిన ఎదురు కాల్పుల్లో మెంచో తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని బంధించి చికిత్స కోసం తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఆపరేషన్‌లో మెంచోతో పాటు మరో ఆరుగురు కీలక గ్యాంగ్‌స్టర్లు కూడా హత మయ్యారు. 2009లో జాలిస్కో న్యూజనరేషన్ కార్టెల్‌ను ప్రారంభించిన ఎల్ మెంచో.. కేవలం దశాబ్ద కాలంలోనే దానిని మెక్సికోలో అత్యంత శక్తివంతమైన నేర సిండికేట్‌గా తీర్చిదిద్దాడు. అమెరికాకు పెద్ద ఎత్తున డ్రగ్స్ సరఫరా చేస్తూ.. అగ్రరాజ్యానికి ప్రధాన ముప్పుగా మారాడు. అందుకే అమెరికా ప్రభుత్వం ఇతడి ముఠాను ఉగ్రవాద సంస్థగా గుర్తించి, అతడిని పట్టించిన వారికి 15 మిలియన్ డాలర్లు.. అంటే భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.125 కోట్ల రివార్డు ప్రకటించింది. మెక్సికోలో మాఫియా ముఠాల అల్లర్ల దృష్ట్యా అక్కడ నివసిస్తున్న భారత పౌరులకు కేంద్ర ప్రభుత్వం అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది. భారత పౌరులంతా ప్రస్తుత పరిస్థితుల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. ముఖ్యంగా తదుపరి నోటీసు ఇచ్చే వరకు ఇళ్ల నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావొద్దని, సురక్షిత ప్రాంతాలకే పరిమితం కావాలని సూచించింది. ఏదైనా సమస్య తలెత్తితే మెక్సికోలోని భారత రాయబార కార్యాలయాన్ని వెంటనే సంప్రదించాలని ఆదేశించింది. ప్రస్తుతం మెక్సికోలోని పలు రాష్ట్రాల్లో ఆర్మీ మోహరించింది. మాఫియా డాన్ మృతితో మరిన్ని ప్రతీకార దాడులు జరిగే అవకాశం ఉందని అంతర్జాతీయ నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి.

Publish Date: Feb 23, 2026 7:12PM

political-news-img

ట్రంప్ పెంచిన టారిఫ్‌లు రేపటి నుంచి బంద్

ప్రపంచ దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎడాపెడా విధించిన టారిఫ్‌లు చెల్లవని అక్కడి సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన నేపధ్యంలో మంగళవారం (24-2-26) నుంచి వాటి వసూళ్లు నిలిపివేయనున్నారు. ఈ మేరకు పెంచిన సుంకాలు వసూలు చేయబోమని యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ విభాగం ప్రకటించింది. ట్రంప్ విధించిన టారిఫ్‌ల వసూళ్లను అమెరికా కాలమానం ప్రకారం ఫిబ్రవరి 24 నుంచి నిలిపివేయనున్నట్లు పేర్కొంది. అయితే ఇప్పటివరకు దిగుమతిదారులు చెల్లించిన టారిఫ్‌లను రిఫండ్ చేస్తారా? లేదా? అన్నదానిపై క్లారిటీ ఇవ్వలేదు. ట్రంప్ టారిఫ్‌లు చెల్లవంటూ అమెరికా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన 3 రోజుల తర్వాత ప్రభుత్వం నిలిపివేతపై ప్రచటన చేయడం గమనార్హం. తీర్పు వచ్చాక కూడా ట్రంప్ దూకుడు ప్రదర్శించారు. ప్రపంచదేశాలపై శాతం సుంకాలు విధిస్తున్నట్లు మళ్లీ ప్రకటన చేశారు. అవి ఈ నెల 24 నుంచే అమల్లోకి వస్తాయని ప్రకటించినప్పటికీ.. అందుకు సంబంధించి ఎగ్జిక్యూటివ్ ఆదేశాలు ఇంకా జారీ కాలేదు. మొత్తమ్మీద ఈ పరిణామాలతో భారత్‌పై సుంకాలు 50 నుంచి 15 శాతానికి దిగివచ్చాయి.

Publish Date: Feb 23, 2026 7:02PM

political-news-img

మూడో ప్రపంచ యుద్ధం మొదలైందా?

ప్రపంచం మరో పెను ప్రమాదం ముంగిట ఉందా? రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కేవలం రెండు దేశాల సరిహద్దు పోరాటం కాదా? అనే ప్రశ్నలకు ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ అవుననే సమాధానమే చెబుతున్నారు. పుతిన్ ఇప్పటికే మూడో ప్రపంచ యుద్ధానికి తెరలేపారని, ఆయన సామ్రాజ్య కాంక్షకు అడ్డుకట్ట వేయకపోతే మానవాళి మనుగడకే ముప్పు వాటిల్లుతుందని సంచలన హెచ్చరికలు జారీ చేశారు. శాంతి కోసం ఉక్రెయిన్ తన ఆత్మగౌరవాన్ని, భూభాగాలను తాకట్టు పెట్టదని స్పష్టం చేస్తూనే.. ప్రపంచ దేశాలన్నీ జోక్యం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఆ క్రమంలో ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం మరో కీలక మలుపు తిరిగినట్లైంది. కీవ్‌లోని ప్రభుత్వ ప్రధాన కార్యాలయంలో జరిగిన తాజా ఇంటర్వ్యూలో జెలెన్‌స్కీ మాట్లాడుతూ.. పుతిన్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. రష్యా ఆక్రమించిన ప్రాంతాలతో పాటు ప్రస్తుతం ఉక్రెయిన్ ఆధీనంలో ఉన్న డోనెట్స్క్, ఖేర్సన్, జపోరిజ్జియాలోని మరికొన్ని వ్యూహాత్మక ప్రాంతాలను వదులుకోవాలనే పుతిన్ డిమాండ్‌ను జెలెన్‌స్కీ తప్పుబట్టారు. ఆ ప్రాంతాల నుంచి దళాలను ఉపసంహరించుకోవడం అంటే తమ రక్షణ వ్యవస్థను బలహీన పరుచుకోవడమేనని, అక్కడ నివసిస్తున్న లక్షలాది మంది తమ పౌరులను శత్రువుల పాలు చేసి.. వారిని వదిలేయడమే అవుతుంని జెలెన్‌స్కీ ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవేళ భూభాగాలను వదులుకుంటే పుతిన్ సంతృప్తి చెందుతారా? అన్న ప్రశ్నకు జెలెన్‌స్కీ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. పుతిన్ ఇప్పుడు కాల్పుల విరమణ కోరుకుంటున్నది కేవలం తన దళాలు తిరిగి పుంజుకోవడానికి మాత్రమేనని జెలెన్‌స్కీ విశ్లేషించారు. ఐరోపా భాగస్వాములు పుతిన్ కోలుకోవడానికి 3 నుంచి 5 ఏళ్లు పడుతుందని భావిస్తున్నప్పటికీ.. ఆయన కేవలం రెండేళ్లలోనే మళ్లీ సిద్ధమవుతారని హెచ్చరించారు. ఆ తర్వాత ఆయన తదుపరి లక్ష్యం ఏ దేశం అవుతుందో ఎవరికీ తెలియదని.. కానీ యుద్ధాన్ని కొనసాగించడమే పుతిన్ నైజమని స్పష్టం చేశారు.

Publish Date: Feb 23, 2026 6:25PM

MOVIE NEWS

movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img