సంధ్య థియేటర్ తొక్కిసలాటపై మరోసారి పోలీసులకు నోటీసులు
posted on May 23, 2025 3:52PM

హైదరాబాద్లోని సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ తెలంగాణ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై ఆరు వారాల్లో సమగ్ర నివేదిక అందించాలని హైదరాబాద్ సీపీ ఆనంద్కు నోటీసులు జారీ చేసింది. ఈ ఘటనపై ఇప్పటికే పోలీసులు ఇచ్చిన నివేదికలో సరైన వివరాలు లేవని కమీషన్ పేర్కొంది. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా తొక్కిసలాటలో రేవతి మరణించగా ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఇటీవల శ్రీతేజ్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన సంగతి విధితమే. స్పెషల్ షో అల్లు అర్జున్ వచ్చేందుకు పర్మిషన్ ఇవ్వలేదని పోలీసులు ఎన్హెచ్ఆర్సీకి తెలపాగా.. పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలో ఉన్న థియేటర్ దగ్గర డీజేలు పెట్టి, హంగామా చేస్తుంటే పోలీసులు ఎందుకు పట్టించుకోలేదని హ్యూమన్ రైట్స్ కమిషన్ ప్రశ్నించింది.