ENGLISH | TELUGU  
Home  » TV News

రథం ముగ్గేస్తే అది కాస్తా మణికొండ వరకు వెళ్లిందట...

on May 23, 2025

 

కిర్రాక్ బాయ్స్ అండ్ ఖిలాడీ గర్ల్స్ ఈ వారం ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో ముందుగా శ్రీముఖి ముంజెకాయల్ని ఇచ్చింది. కిర్రాక్ బాయ్స్ అంతా కూడా వాటిని తిన్నారు. "మీరందరూ తింటుంటే ఎంత అందంగా ఉంది ఒక్కడు తింటుంటే మాత్రం అచ్చం పండు కోతిలెక్క ఉన్నావ్రా " అంటూ శ్రీముఖి, రోహిణి కలిసి ఇమ్మానుయేల్ ని కామెంట్ చేశారు. ఈ ఎపిసోడ్ ని విలేజ్ థీమ్ తో డిజైన్ చేసారు. చిన్నప్పుడు పల్లెటూరిలో అందరూ చేసిన అల్లరిని సెట్ లో బుల్లితెర నటులంతా కలిసి చేశారన్నమాట. ఐతే అబ్బాయిలకు ఒక టాస్క్ ఇచ్చింది శ్రీముఖి. ఇక్కడ ఎవరికీ ముగ్గులు వేయడం వచ్చో జెన్యూన్ గా వచ్చో చేతులెత్తండి అనేసరికి అమరదీప్ చెయ్యెత్తాడు. "తేజు చెప్పింది నీ ముగ్గుల గురించి..మొన్న రథం ముగ్గు వేసావంట...అది కూడా మణికొండ వరకు వెళ్లిందట.." అనేసరికి అమరదీప్ తో పాటు అందరూ నవ్వేశారు.

తర్వాత అమ్మాయిలకు అబ్బాయిలకు ముగ్గుల పోటీ పెట్టింది. బాయ్స్ అండ్ గర్ల్స్ వేసిన రెండు ముగ్గులు చూసిన జడ్జ్ అనసూయ ఐతే కళ్లద్దాలు పెట్టుకున్నాక ఈ ముగ్గులా ఉంది కళ్లద్దాలు తీసేసాక ఆ ముగ్గులా ఉంది అంటూ సెటైర్ వేసింది. తర్వాత ఒక టబ్ లో కొన్ని చేపల్ని తెప్పించింది శ్రీముఖి. "మీకు తెలిసిన కొన్ని చేపల రకాలు చెప్పండి" అంటూ ఖిలాడీ గర్ల్స్ ని అడిగింది. "పిత్తబరిగె, శీలావతి " అని డెబ్జానీ చెప్పింది. తర్వాత ఇంద్రావతి అని రోహిణి చెప్పేసరికి..అదేం చేప అంటూ శ్రీముఖి ఆశ్చర్యపోయింది. తర్వాత ఇమ్మానుయేల్ ఒక టబ్బులో నాట్లు వేసే టాస్క్ చేసాడు. అలాగే ప్రియాంక జైన్ - అమరదీప్ కలిసి ఏడు పెంకులాట టాస్క్ ఆడారు. ఐతే అందులో బాల్ తేవడానికి మెట్ల వంటి సెటప్ చేశారు. ఐతే అందులో అమరదీప్ కాలు ఇరుక్కుపోయింది. దాంతో అనసూయ అందరూ "ఓ మై గాడ్" అంటూ షాక్ అయ్యారు. మరి ఇంతకు ఏమయ్యిందో షోలో చూడాలి.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.