తిరుమలలో సదుపాయాలు చాలా మెరుగుపడ్డాయి : రాఘవేంద్రరావు

 

తిరుమలలో సదుపాయాలు చాలా మెరుగు పడ్డాయిని ప్రముఖ దర్మకుడు రాఘవేంద్రరావు అన్నారు. టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడిని శుక్రవారం ఉదయం పలువురు ప్రముఖులు కలిశారు. సినీ దర్శకుడు రాఘవేంద్రరావు, నిర్మాత, నటుడు బండ్ల గణేశ్‌, మాజీ తానా అధ్యక్షుడు వేమన సతీశ్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. భక్తులు సంతోషంగా ఉన్నారని రాఘవేంద్రరావు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం చేపట్టిన కార్యక్రమాల గురించి ఛైర్మన్‌ వారికి వివరించారు. తుడా ఛైర్మన్‌ దివాకర్‌ రెడ్డి సైతం టీటీడీ ఛైర్మన్‌ను కలిశారు. బోర్డు ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ఆలయంలో ప్రమాణం చేసిన అనంతరం బీఆర్‌ నాయుడిని కలిసి సన్మానించారు. తుడాకు మంచి పేరు తీసుకువచ్చే విధంగా పనిచేయాలని దివాకర్‌రెడ్డికి సూచించారు.