రోడ్డు ప్రమాదం లో ముగ్గురు మృతి

రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మరణించారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఒక వైపు ఎడతెరిపి లేని వర్షం కురుస్తుండగా మితిమీరిన వేగంతో వాహనం నడపడమే ఈ ప్రమాదానికి కారణమైంది. గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఎక్కడికక్కడ రోడ్లు జలమయమయ్యాయి.

అయినా ఓ ఆటో డ్రైవర్ అతి వేగంగా ఆటో నడుపుతూ  కందుకూరు మండలంలోని పవర్ గ్రిడ్ వద్ద నియంత్రణ కోల్పోయి ఎదురుగా ఉన్న డీసీఎం వాహనాన్ని ఢీ కొన్నాడు. ఈ ప్రమాదంలో ముగ్గురు సంఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.  క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతులను యాచారం మండలం కురుమిద్దకు చెందినసత్తెమ్మ(50), శ్రీనివాస్(35), శ్రీధర్(25)గా గుర్తించారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu