తెలంగాణ గవర్నర్ అధికార నివాసానికి కొత్త పేరు

 

 

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ అధికారిక నివాసమైన రాజ్‌భవన్‌ కు పేరు మారింది. తెలంగాణ గవర్నర్ అధికారిక నివాసమైన “రాజ్ భవన్, తెలంగాణ” కు ఇకపై “లోక్ భవన్, తెలంగాణ” అనే కొత్త పేరును ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వచ్చింది. లోక్ భవన్ పేరును అమల్లోకి తేవడం ద్వారా, దేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్న సమయంలో ప్రజాస్వామ్య విలువల బలాన్ని, ప్రజల ప్రాధాన్యతను మరింత స్పష్టం చేయాలని  ప్రభుత్వం  భావించింది. 

సమాజంలో ప్రజాస్వామ్య విలువల పటిమను, జీవాంతకత్వాన్ని ప్రతిబింబించేందుకు ఈ మార్పు చేపట్టినట్లు అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు.వికసిత భారత్ వైపు ధైర్యంగా అడుగులు వేస్తున్న ఈ సమయంలో ప్రజలే కేంద్రబిందువని గుర్తుచేయడం ఈ నామకరణం వెనుక ప్రధాన ఉద్దేశ్యంగా తెలుపబడింది.కొత్త పేరు “లోక్ భవన్, తెలంగాణ” ఇకపై అన్ని అధికారిక పత్రాలు, సూచనలు, రికార్డులు మరియు ప్రభుత్వ కమ్యూనికేషన్లలోనే ఉపయోగించబడుతుంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu