ఎయిర్ షోలో కుప్పకూలిన తేజస్ విమానం

దుబాయ్‌ వేదికగా జరుగుతోన్న ఎయిర్‌షోలో  భారత్ కు చెందిన తేజస్ యుద్ధ విమానం కూలిపోయింది. ఈ దుర్ఘటనలో పైలట్ అక్కడికక్కడే ప్రణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని భారత వాయుసేన అధికారికంగా ధృవీకరించింది. ఈ మేరకు సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ ద్వారా..  దుబాయ్‌ ఎయిర్‌షోలో తేజస్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో పైలట్‌కు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందడం దిగ్భ్రాంతికరం. మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని పేర్కొంది.

మృతుడి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని పేర్కొన్న వాయుసేన తేజస్ విమానం కూలిపోవడానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టనున్నట్లు పేర్కొంది.  ఇలా ఉండగా ఎయిర్ షోలో తేజస్ విమానం కూలిపోయి మంటలు చేలరేగుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu