బీసీ రిజర్వేషన్లపై రేవంత్ సర్కార్ కు సుప్రీంలో చుక్కెదురు
posted on Oct 16, 2025 1:31PM

సుప్రీం కోర్టులో రేవంత్ సర్కార్ కు చుక్కెదురైంది. తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల వ్యవహారంలో హైకోర్ట్ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను దేశ సర్వోన్నత న్యాయస్థానం డిస్మిస్ చేసింది. జీవో నంబర్.9పై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన స్టేను సవాలు చేస్తూ రేవంత్ సర్కార్ సుప్రీంకోర్టు ను ఆశ్రయించన సంగతి విదితమే. ఈ పిటిషన్ ను జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం గురువారం (అక్టోబర్ 16) విచారించింది.
తెలంగాణ సర్కార్ పిటిషన్ ను డిస్మిస్ చేసిన సుప్రీం పాత రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లాలని ఆదేశించింది. దీంతో రేవంత్ సర్కార్ ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అశంపై ఉత్కంఠ నెలకొంది. సుప్రీంకోర్టు తాజా నిర్ణయం నేపథ్యంలో మధ్యాహ్నం 3 గంటలకు బీసీ సంఘాలతో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ భేటీ కానుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.