రైల్వే ఉద్యోగులకు దీపావళి బోనస్....ఎంతో తెలుసా?
posted on Sep 24, 2025 4:04PM

రైల్వే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. దసరా, దీపావళి పండుగ సందర్బంగా గ్రూప్ C, గ్రూప్ D ఉద్యోగులకు 78 రోజుల బోనస్ను ప్రకటించింది. ఈ బోనస్ పథకానికి కేంద్ర ప్రభుత్వం రూ.1,866 కోట్లను కేటాయించింది. గ్రూప్ D (లెవెల్ 1 స్టాఫ్) ఉద్యోగులకు ఈ బోనస్ వర్తించనుంది.
అలాగే, రైల్వే ప్రొడక్షన్ యూనిట్లు, రైల్వే వర్క్షాపులు, ఇతర సహాయ విభాగాలలో పనిచేసే ఉద్యోగులు కూడా ఈ బోనస్ అందనుంది. ప్రతి సంవత్సరంలా, ఈసారి కూడా కేంద్ర ప్రభుత్వం రైల్వే ఉద్యోగుల కోసం పండుగ బోనస్ను ప్రకటించడంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో10.91 లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది.