విశాఖ పర్యాటకానికి కొత్త శోభ.. దేశంలోనే పొడవైన గ్లాస్ బ్రిడ్జి!

విశాఖపట్నం కైలాసగిరిలో దేశంలోనే అతి పొడవైన గ్లాస్ బ్రిడ్జ్ సోమవారం (డిసెంబర్ 1) ప్రారంభమైంది. ఏడు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ గ్లాస్ బ్రిడ్జిని ఎంపీ భరత్, మేయర్   పీలా శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు , వీఎంఆర్డీఏ ఛైర్మన్‌ ప్రణవ్‌గోపాల్‌ తదితరులు పాల్గొన్నారు. కాగా, తుఫాన్‌లు, గంటకు 250 కిలోమీటర్ల వేగంతో వచ్చే గాలులను తట్టుకునేలా 40 ఎంఎం మందం గల జర్మన్ గ్లాస్‌తో నిర్మించిన  ఈ గాజు వంతెన దాదాపు 500 టన్నుల బరువును ఈజీగా మోయగలదు.

ఈ గ్లాస్ బ్రిడ్జ్‌ పైనుంచి గాల్లో తేలియాడుతున్న అనుభూతితో ప్రకృతి అందాలను వీక్షించవచ్చు. అదలా ఉంచితే.. దేశంలో ఇప్పటి వరకూ కేరళలో నిర్మించిన 40 మీటర్ల పొడవైన గ్లాస్ బ్రిడ్జే దేశంలో అత్యంత పొడవైన గాజు వంతెనగా రికార్డుల్లో ఉంది. ఇప్పుడు విశాఖలో నిర్మించి, ప్రారంభించిన ఈ గాజు వంతెన ఆ రికార్డును బ్రేక్ చేసింది. ఈ బ్రిడ్జి పొడవు 50 మీటర్లు.  వీఎంఆర్‌డీఏ, ఆర్‌జే అడ్వెంచర్స్‌ సంస్థ సంయుక్తంగా  నిర్మించిన ఈ గ్లాస్ బ్రిడ్జి విశాఖ పర్యాటకానికి కొత్త శోభను తీసుకువస్తుందనడంలో సందేహం లేదు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu