కుప్పంలో డ్వాక్రా మహిళల ఛాయ్ రాస్తా అవుట్ లెట్.. ప్రారంభించిన నారా భువనేశ్వరి

ప్రతి కుటుంబం నుంచి ఒక వ్యాపార వేత్త రావాలని, అందులోనూ మహిళలు ఎంటర్ పెన్యూర్ లుగా ఎదగాలన్న చంద్రబాబు సంకల్పం సాకారం అయ్యే దిశగా కుప్పంలో అడుగుపడింది.  కుప్పంలో డ్రాక్రా మహిళల నెలకొల్పిన చాయ్‌ రాస్తా అవుట్‌లెట్‌ శనివారం ఆరంభమైంది. ఈ రాస్తా చాయ్ ఔట్ లెట్ ను చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ప్రారంభించారు.

 .ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ కుప్పం మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలనే ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పంలో భాగంగా చాయ్‌ రాస్తా  రూపొందిందన్నారు. మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదిగేందుకు కావాల్సిన సహకారాన్ని ప్రభుత్వం అందిస్తోందనీ,  దీనిని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.   కుప్పం డెవలప్‌మెంట్ ఆధారిటీ (కడా) మద్దతుతో   కుప్పంలో ఈ ఛాయ్ రాస్తా అవుట్ లెట్ ప్రారంభం కావడం శుభపరిణామంగా అభివర్ణించిన భువనేశ్వరి, మహిళలు స్వశక్తితో ఎదిగేందుకు ఇటువంటి అధునాతన వ్యాపారాలు ఎంతో దోహపదపడతాయన్నారు.

రుచి, శుచి, నాణ్యత ప్రధానంగా కార్పొరేట్ తరహాలో ఏర్పాటైన ఈ ఛాయ్ రాస్తా అవుట్ లెట్‌ను ప్రారంభించిన భువనేశ్వరి మొదటి ఛాయ్‌ని కోనుగోలు చేసి తాగారు.  చాయ్ రాస్తా అవుట్‌లెట్‌లో రుచి, శుచి చక్కగా ఉన్నాయని  ప్రశంసించారు.  ఐఐఎం, ఐఐటి గ్రాడ్యుయేట్ల భాగస్వామ్యంతో రూపొందిం చిన చాయ్ రాస్తా  చాలా సరికొత్తగా ఉందని  ఆమె అభినందించారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu