మారిపోతాం..లొంగిపోతాం.. ముందు కూంబింగ్ ఆపండి.. మావోయిస్టుల లేఖ
posted on Nov 24, 2025 11:22AM

మావోయిస్టులు ఆయుధాలు విసర్జించి లొంగిపోయేందుకు రెడీ అయ్యారు. ఈ విషయంపై మావోయిస్టు పార్టీ మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, ఛత్తీస్ గఢ్ సీఎంలకు ఒక బహిరంగ లేఖను విడుదల చేసింది. మహారాష్ట్ర సీఎం దేవేంద్రఫడ్నవీస్, మధ్యప్రదేశ్ సీఎం విశ్వభూషణ్ సాహు, ఛత్తీస్ గడ్ సీఎం విష్ణుదేవ్ సాయిలకు రాసిన ఆ లేఖలో మావోయిస్టులు లొంగిపోతాం, మారిపోతాం.. ముందు మావోయిస్టుల ఏరివేతకు చేపట్టిన కూంబింగ్ ను నిలిపివేయండి అంటూ విజ్ణప్తి చేశారు. లొంగుబాటుపై ఇప్పటికే పార్టీ ఒక నిర్ణయం తీసుకుందని ఆ లేఖలో పేర్కొంది. ముఖ్యంగా ఇటీవల పార్టీ సెంట్రల్ కమిటీ పొలిట్ బ్యూరో సభ్యుడు బసవరాజ్ ఎన్ కౌంటర్ తరువాత పార్టీ పార్టీ పునర్నిర్మాణం, వ్యూహాత్మక మార్పులు అవసరమని గుర్తించామని పేర్కొంది.
కూంబింగ్ ఆపివేతస్తే ఆయధ విరమణపై ఒక స్పష్టమైన తేదీని ప్రకటిస్తామని మావోయిస్టు పార్టీ ఆ లేఖలో పేర్కొంది. ఇప్పటికే ఈ విషయమై పార్టీ జోనల్ కమిటీలకు సమాచారం ఇచ్చినట్టు తెలిపింది. ఆపరేషన్ కగార్ లో భాగంగా జరుగుతున్న కూంబింగ్ లో భాగంగా జరుగుతున్న ఎన్ కౌంటర్లలో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు మరణిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మావోయిస్టు పార్టీ మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూంబింగ్ ఆపివేస్తే లొంగిపోతాం, ఆయుధాలను వదిలేస్తామంటూ లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది.