మునిసిపాలిటీల విలీన ప్రతిపాదనకు జీహెచ్ఎంసీ కౌన్సిల్ ఏకగ్రీవ ఆమోదం

అవుటర్ రింగ్ రోడ్  పరిధిలో లేదా దానికి ఆనుకుని ఉన్న 27 మునిసిపాలిటీలు గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)లో విలీనం  కానున్నాయి.  ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు జీహెచ్ఎంసీ కౌన్సిల్ ఆమోదం తెలిపింది.   మంగళవారం (నవంబర్ 25) జరిగిన జీహెచ్ఎంసీ జనరల్ బాడీ సమావేశంలో కీలక అంశంగా నిలిచింది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనను సమావేశంలో టేబుల్ ఐటమ్‌గా ప్రవేశపెట్టగా, కౌన్సిల్ దానిని పరిశీలించి అ  ఆమోదించింది.   వేగవంతమైన పట్టణీకరణ, అభివృద్ధి, సేవల పరంగా పెరుగుతున్న ఒత్తిడిని దృష్టిలో ఉంచుకొని ఈ విలీనం అవసరమని ప్రభుత్వం పేర్కొంది. విలీనం ద్వారా ఏకీకృత నగర ప్రణాళిక, మెరుగైన పౌర సేవలు, సమగ్ర మెట్రో పాలిటన్ అభివృద్ధి సాధ్యమవుతాయని వివరించింది.


పెద్ద అంబర్‌పేట్, జల్పల్లి, శంషాబాద్, తుర్కయంజల్, మణికొండ, నార్సింగి, ఆదిబట్ల, తుక్కుగూడ, మేడ్చల్, దమ్మాయిగూడ, నాగారం, పోచారం, ఘట్‌కేసర్, గుండ్లపోచంపల్లి, తూంకుంట, కొంపల్లి, దుండిగల్, బొల్లారం, బోడుప్పల్, పీర్జాదిగూడ, జవహర్‌నగర్, నిజాంపేట్ తదితరులు మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేయడానికి జీహెచ్ఎంసీ చట్టం, 1955 నిబంధనల ప్రకారం, విలీనం ప్రతిపాదనపై పరిశీలన చేసి, అవసరమైన అధ్యయనాలు నిర్వహించి అభిప్రాయాలు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్‌ను ఆదేశించింది.

దానికి అనుగుణంగా, నవంబర్ 21, 2025న జారీ చేసిన ప్రభుత్వ మెమోను   సమావేశంలో టేబుల్ ఐటమ్ నంబర్ 2గా జిహెచ్ఎంసి జనరల్ బాడీ ముందు ఉంచగా, జీహెచ్ఎంసీ కౌన్సిల్ ఈ ప్రతిపాదనను ఏకగ్రీవంగా ఆమోదించింది. కాగా మంగళవారం (నవంబర్ 25) ముఖ్యమంత్రి రేవంత్ అధ్యక్షతన జరిగిన తెలంగాణ కేబినెట్ సమావేశం కూడా ఈ 27 మునిసిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేయడానికి ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu