కోబలి పరిశోధనలో మాటల మాంత్రికుడు

  "అత్తారింటికి దారేది" వంటి ఇండస్ట్రీ రికార్డ్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన త్రివిక్రమ్ శ్రీనివాస్ మాత్రం చాలా సాదాసీదాగా తన పనేదో తను చేసుకుంటూ వెళ్తున్నాడు. అయితే త్రివిక్రమ్ మళ్ళీ త్వరలోనే పవన్ కళ్యాణ్ తో కలిసి "కోబలి" చిత్రాన్ని నిర్మించనున్నాడు. ఈ చిత్ర విశేషాల గురించి త్రివిక్రమ్ మాట్లాడుతూ....“కోబలి అనేది రాయలసీమ ప్రాంతంలో ఎక్కువగా వినిపించే పదం. అమ్మవారికి బలి ఇవ్వడాన్ని కోబలి అంటారు. ఈ కథపై పరిశోధన జరుగుతోంది. కొంచం కష్టంతో కూడిన కథ ఇది. అంటే రిస్క్ వుంది. అందుకే ఆ రిస్కేదో మేమిద్దరమే చేయాలనుకున్నాం. వీలైనంత త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రారంభిస్తాం” అని చెప్పారు. అయితే ఈ చిత్రం ఎప్పుడు ప్రారంభం అవుతుందో తెలియట్లేదు. ఎందుకంటే పవన్ ప్రస్తుతం "గబ్బర్ సింగ్ -2" సినిమా కోసం బిజీగా ఉన్నాడు. మరి ఈ చిత్రం ఎప్పుడు సెట్స్ పైకి వెళ్ళేవరకు వేచి చూడాల్సిందే.

ఆ ప్రకటన వెనుక ఉన్నది అతడేనా..?

  "అత్తారింటికి దారేది" చిత్ర సక్సెస్ థ్యాంక్స్ వేడుకలో పవన్ మాట్లాడిన మాటలకు, త్వరలోనే పవన్ రాజకీయాల్లోకి రాబోతున్నాడని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలన్నిటికీ సమాధానంగా మెగాబ్రదర్ నాగబాబు ఓ పత్రిక ప్రకటనను విడుదల చేసారు. అయితే ఈ ప్రకటన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పవన్, నాగబాబు టీడీపీలో చేరుతున్నారని వార్తలు రావడంతో.. వీటిపై చిరు స్పందించి తమ్ముళ్ళ చేత ఈ పని చేయించినట్లుగా చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్ లో ఇప్పుడిప్పుడే ఒక స్థానంలో ఉన్న చిరుకి.. ఇలా తమ్ముళ్ళు వేరే పార్టీలో చేరుతారనే విషయం తన పార్టీ సన్నిహితులు చిరుని అడగడం వల్లనే.. చిరు కావాలని నాగబాబు చేత ఈ ప్రకటన చేయించాడని వార్తలు వస్తున్నాయి.మరి వీటి వెనుక అసలు విషయం ఏమిటో మరి కొద్ది రోజుల్లో తెలియనుంది.

'ప్రభాస్' మెరుపులా మెరిశాడు

      టాలీవుడ్ క్రేజియస్ట్ కాంబినేషన్ లలో ఒకటి రాజమౌళి, ప్రభాస్ లది. ‘ఛత్రపతి’లో ప్రభాస్‌ని రాజమౌళి ప్రెజెంట్‌ చేసిన తీరును ఎవరూ మర్చిపోరూ. ఇప్పుడు ‘బాహుబలి’ సినిమా కోసం రాజమౌళి.. ప్రభాస్‌ మళ్ళీ కలిశారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ సినిమాలో ప్రభాస్‌ గెటప్‌ ఎలా వుంటుంది.? ఎలా చూపించబోతున్నాడు? అని అనుకుంటున్న అభిమానులకి, ‘బాహుబలి’ మేకింగ్‌ టీజర్‌తో మంచి ట్రీట్‌ ఇచ్చాడు రాజమౌళి.   ఈ వీడియో లో జస్ట్‌ అలా చిన్న మెరుపులా మెరిశాడు ప్రభాస్..అయితేనె౦..ఆ గెటప్ లో రాజసం ఉట్టిపడేలా..కోరలు తిరిగే మీసం తో శత్రువుల్ని చండాడే యోధుడిలా వున్నాడు. మొదటిసారిగా ప్రభాస్ ని అలా రాజు గెటప్ లో చూస్తుంటే అభిమానులకు పండగే. ప్రభాస్ చిన్న గెటప్ ఇలా వుంటే, అసలు సినిమా ఇంకే రేంజ్‌లో వుండబోతోందో.!  

త్వరలోనే ఆ హీరోయిన్ తో విశాల్ పెళ్లి..!

  హీరో శరత్ కుమార్ కూతురు, కోలీవుడ్‌ హీరోయిన్ వరలక్ష్మి త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనుంది. అయితే ఈ అమ్మడు గతకొద్ది రోజులుగా హీరో విశాల తో ప్రేమాయణం సాగిస్తుంది. అయితే ఇదే విషయంపై కోలీవుడ్ లో పలు పుకార్లు షికారు చేసి, చివరకు వీరి పెద్దల వరకు చేరింది. ఐతే వీరి ప్రేమకు మొదటగా శరత్ కుమార్ ఒప్పుకోకపోవడంతో శరత్‌కుమార్ భార్య రాధిక దగ్గరుండి మరీ ఈ పెళ్లికి మధ్యవర్తిత్వం వహించినట్లు తెలిసింది. ఇటీవలే విశాల్ కూడా త్వరలోనే తాను ఓ హీరోయిన్ ను పెళ్లి చేసుకోబోతున్నట్లుగా ఒక సందర్భంలో వెల్లడించాడు. దీనిని బట్టి వరలక్ష్మిని విశాల్ త్వరలోనే పెళ్లి చేసుకోవడం ఖాయమని తెలుస్తుంది.

సెల్‌ఫోన్లు వాడితే నరికేస్తారంటా...!

  ఈ మధ్య కాలంలో పైరసీ ఎక్కువగా జరుగుతున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఇటీవలే పవన్ నటించిన "అత్తారింటికి దారేది" చిత్రం విడుదలకు ముందే పైరసీ అవడంతో సినీ పరిశ్రమ అంతా తమ సినిమాల కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. అయితే ప్రస్తుతం మోహన్ బాబు ప్రధాన పాత్రలో ఓ చిత్రం తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో విష్ణు, మనోజ్, తనీష్, వరుణ్ సందేశ్ లు కలిసి నటిస్తున్నారు. అయితే తమ చిత్రం కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ పైరసీ కాకూడదని ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. మోహన్ బాబు. అక్కడ ఒక హెచ్చరిక నోటిస్ కూడా పెట్టారంట. ఈ చిత్ర షూటింగ్ సమయంలో ప్రొడ్యూసర్లు, మేనేజర్లు తప్ప,యూనిట్ సభ్యులెవరూ సెల్‌ఫోన్స్ వాడరాదని గట్టి హెచ్చరిక జారీ చేశాడట."సెల్‌ఫోన్లు వాడిన వారిని నరకబడును" అని ఆ నోటీసులో ఉందట! శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రణీత, హన్సిక హీరోయిన్లు గా నటిస్తున్నారు.

అక్కినేనికి ఆపరేషను

  తెలుగు చిత్ర పరిశ్రమలో కురువృద్దుడని పేరొందిన దాదాఫాల్కే అవార్డు గ్రహీత డా.అక్కినేని నాగేశ్వరరావు ఇటీవలే తన తొంబైలలో అడుగుపెట్టారు. అయినప్పటికీ తానూ ఎవ్వర్ గ్రీన్ అంటూ కొడుకు, మనమడితో కలిసి ‘మనం’ అనే సినిమాలో నటిస్తున్నారు. అచంచలమయిన ఆత్మవిశ్వాసం, పరిపూర్ణమయిన జీవితం స్వంతం చేసుకొన్నందునే ఆయన ఇంత ఆరోగ్యంగా ఉన్నారు. ఇంత వయసు మీదపడినా కూడా అది తన శరీరానికే తప్ప మనసుకి కాదని చెపుతూ నేటికీ చురుకుగా తన సినీ ప్రస్తానం కొనసాగించ గలుగుతున్నారు. అయితే, మూడు నాలుగు రోజుల క్రితమే తనకు క్యాన్సర్ వ్యాధి సోకిందని అయితే అది ఇంకా ప్రాధమిక స్థాయిలోనే ఉందని, దానిని కూడా దైర్యంగా ఎదుర్కొని సెంచరీ పూర్తి చేస్తానని, ఆయన పూర్తి ఆత్మవిశ్వాసంతో మీడియాను పిలిచి మరీ చెప్పారు.   అయితే మొన్న శనివారంనాడు ఆయన ఆహారం తీసుకోవడంలో కొంచెం ఇబ్బంది కలుగుతోందని చెప్పగానే కుటుంబసభ్యులు ఆయనను వెంటనే కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఆయనను పరీక్షించిన వైద్యులు క్యాన్సర్ సోకిన ఆయన చిన్న ప్రేగులలో ఏర్పడిన చిన్నకణితి వంటి పదార్ధాన్నిఅదేరోజు ఆపరేషన్ చేసి తొలగించివేసారు. ఆయన ఆరోగ్యంగా ఉన్నారని కంగారు పడవలసిందేమీ లేదని కిమ్స్ యండీ. డా. డీ.భాస్కర్ రావు తెలియజేసారు. త్వరలో ల్యాబ్ రిపోర్ట్ రాగానే ఆయనకు ఎటువంటి వైద్యం అందించాలో చెప్పగలమని ఆయన అన్నారు.   ఏమయినప్పటికీ, నాగేశ్వరరావుగారి ఆత్మవిశ్వాసం ముందు క్యాన్సర్ కూడా ఓడిపోక తప్పదని ఆయన త్వరలోనే ఋజువు చేయడం ఖాయం. ఆయన త్వరగా కోలుకొని మళ్ళీ సినిమాలలో నటించాలని కోరుకొందాము.

నిషాకి తొందరెక్కువ..!

      ‘ఏమైంది ఈవేళ ’ అంటూ తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నిషా ‘సోలో ’, ‘సుకుమారుడు , ‘సరాదాగా అమ్మాయితో ’ లాంటి సినిమాల్లో చేసిన వీటికంటే ఎక్కువ ఎఫైర్లు నడిపిందనే వార్తలతో హైలెట్ అయ్యింది.  తాజాగా ఈ అమ్మడు ముంబై బిజినెస్‌మెన్ ని పెళ్ళి చేసుకోబోతున్నట్లు సమాచారం.     ముంబై బిజినెస్‌మెన్ కరణ్‌..నిషా అగర్వాల్ చాలా కాలంగా ప్రేమాయణం నడుపుతున్నారు..ఈ యేడాది చివర్లో ఇద్దరికీ పెళ్లిచేయాలని ఇరు కుటుంబాలూ నిర్ణయించుకొన్నాయట. ఈలోగా ప్రస్తుతం కమిట్ అయిన సినిమాలు పూర్తి చేసుకునే విధంగా నిషా షెడ్యూల్ ప్లాన్ చేసుకుంటోందట. అక్క స్టార్ హీరోయిన్ ఆమె ఇప్పట్లో పెళ్ళి చేసుకునే ఆలోచనలో కూడా లేదు. అలాంటప్పుడు నేను ఎన్ని రోజులు ఇలా కంట్రోల్ చేసుకోవాలనుకుందో ఏమో గానీ అతనితో పెళ్ళికి సిద్ధమైందట.

రామయ్యా..కలెక్షన్స్ రాబట్టాడు

      యంగ్ టైగర్ ఎన్టీఆర్..హరీష్ శంకర్ కాంబినేషన్లో దసరా కానుకగా వచ్చిన 'రామయ్యా వస్తావయ్యా' అభిమానుల అంచనాలను అందుకోలేకపోయాడు. ఈ చిత్రం మొదటి ఆట నుంచే నెగటివ్ టాక్ రావడంతో..సినిమాకి లాస్ వస్తుందని విశ్లేషకులు భావించారు. కాని దసరా ప౦డగా రామయ్యాకు కలిసివొచ్చింది. మొదటి వారం వసూళ్ళను చూస్తే ప్రొడ్యూసర్ కష్టాల నుంచి బయపడినట్లే కనిపిస్తోంది. ఏపీలో మొదటివారం దాదాపు 26కోట్లు వసూళ్ళు చేసింది. 'రామయ్యా వస్తావయ్యా' వరల్డ్ వైడ్ కలెక్షన్స్ మొత్తం కలిపి 32కోట్లు రాబట్టింది.   The area wise break up of Ramayya Vastavayya First Week collections are here: Nizam -9.59 Cr   Vizag -2.59 Cr East -1.41 Cr West -1.40 Cr Nellore -1.36 Cr Guntur- 2.67 Cr Krishna- 1.46 Cr Ceeded- 5.35 Cr Ramayya Vastavayya First Week Total Collections in AP  -25.83 Cr Karnataka- 3.65* Cr ROI -0.87 Cr Overseas -2.22 Cr Ramayya Vastavayya World Wide Collections- 32.57 Cr

శ్రీహరి పాత్రలో సాయి కుమార్

  మహేష్ బాబు, శ్రీను వైట్ల కాంబినేషన్‌లో తెరకెక్కనున్న చిత్రం"ఆగడు". ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ నవంబర్ నెలలో ప్రారంభం కానుంది. ఇప్పటికే పక్కాగా స్ర్కిప్ట్ వర్క్ పూర్తి చేసిన శ్రీను వైట్ల త్వరలోనే ఈ ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకెళ్ళడానికి భారీ ప్రయత్నాలే చేస్తున్నాడు. అయితే ఈ చిత్రంలోని ఓ ప్రధాన పాత్రలో నటుడు శ్రీహరి ని తీసుకోవాలని అనుకున్నాడు దర్శకుడు శ్రీనువైట్ల. కానీ శ్రీహరి అకాల మరణం చెందటంతో ఆ పాత్రలో సాయి కుమార్ ను తీసుకున్నట్లు తెలిసింది. ఈ చిత్రానికి సంబంధించిన పాటల కంపోసింగ్ ను సంగీత దర్శకుడు థమన్ ఇప్పటికే మొదలుపెట్టేశాడు. ఎలాగైనా ఈ చిత్రాన్ని "దూకుడు" కంటే మరింత బ్లాక్ బస్టర్ హిట్టయ్యే సాంగ్స్ ఇవ్వాలని థమన్ ఆశిస్తున్నాడు.

పవర్ స్టార్ ''1'' వన్ స్టార్

      ‘అత్తారింటికి దారేది’ సినిమాతో సంచనాలు సృష్టిస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టాలీవుడ్లో నెంబర్ వన్ పొజిషన్ దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. గబ్బర్‌సింగ్‌ తో కేవలం ఆంధ్రప్రదేశ్‌లోనే యాభై కోట్లకి పైగా షేర్‌ సాధించిన పవన్‌కళ్యాణ్‌కి ఈ ఏడాది కూడా ఆ ఘనత దక్కింది. కేవలం మన రాష్ట్రంలోనే యాభై కోట్లకి పైగా షేర్‌ సాధించిన ‘అత్తారింటికి దారేది’ ఇప్పటికీ సూపర్‌ స్ట్రాంగ్‌గా రన్‌ అవుతోంది. ఈ చిత్రానికి మొదటి వారం వచ్చిన వసూళ్ళు చూసి ‘మగధీర’ రికార్డుని బద్దలు కొట్టడం ఖాయమని అనుకున్నారు సినీ విశ్లేషకులు. కాని ఆ తరువాత సీమాంధ్రలో జరిగిన బంద్‌ సినిమా కలెక్షన్లపై ప్రభావం చూపింది. దానికి తోడూ రెండో వారంలో జూనియర్ ఎన్టీఆర్ ''రామయ్యా వస్తావయ్యా'' రిలీజ్ కావడంతో టాప్‌ 2తో సరిపెట్టుకుంటుందని అనుకున్నారు. కాని ఇప్పుడు అందరి అంచనాలు తారుమారయ్యాయి. ‘రామయ్య’ మెప్పించకపోవడంతో...పండుగ వేళ ‘అత్తారింటికి దారేది’ వసూళ్లు ఒక్కసారిగా మళ్ళీ పికప్ అయ్యాయి. దీంతో ఈ వారాంతానికి డెబ్భెయ్‌ కోట్ల మార్కుని చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. కలెక్షన్స్‌ డ్రాప్‌ అవకుండా స్టడీగా షేర్లు రాబట్టినట్టయితే అబ్బాయ్‌ రికార్డుని బాబాయ్‌ బద్దలు కొట్టడం ఖాయం.

షూటింగ్ రోజే రికార్డు బ్రేక్

  "నాయక్" చిత్రం విడుదలయ్యి దాదాపు సంవత్సరం అవుతున్నప్పటికీ దర్శకుడు వినాయక్ మాత్రం మరో ప్రాజెక్టు సెట్స్ పైకి తీసుకురాలేదు. అయితే నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు సాయి శ్రీనివాస్ ను హీరోగా పరిచయం చేస్తూ ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ చిత్రానికి సరైన కథ దొరకక ఇప్పటివరకు ఏం చేయలేరు. తాజాగా ఈ చిత్ర షూటింగ్ దసరా రోజున నిరాడంబరంగా ప్రారంభం అయ్యింది. ఈ చిత్రాన్ని త్వరగా పూర్తి చేసి, వచ్చే సంవత్సరం వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం అయిన వెంటనే ఓ రికార్డును క్రియేట్ చేసింది. ఈ చిత్రం 4.5 కోట్లకు శాటిలైట్ రైట్స్ కు అమ్ముడు పోయిందని తెలిసింది. ఇదంతా కేవలం వినాయక్ మీద ఉన్న నమ్మకంతోనే అని తెలుస్తుంది.బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సాయి సరసన సమంత హీరోయిన్ గా నటిస్తుంది.

పవన్ కళ్యాణ్ 'పవర్' వార్నింగ్

    Video Courtesy TV9     పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' ఇప్పుడు ఇదే టాలీవుడ్ పవర్ టాపిక్. ఎప్పుడు ఆడియో ఫంక్షన్ లలో మాత్రమే కనిపించే పవన్..ఆ తరువాత తన తదుపరి సినిమా ఆడియో వరకూ ఎవరికి కనిపించరు. సినిమా హిట్టైన..ఫ్లాప్ అయిన అసలు పట్టించుకోరు. ఆయన సినిమాకు సక్సెస్ మీట్స్ అస్సలుండవ్. కాని ‘అత్తారింటికి దారేది’ సినిమా కి మాత్రం ఆయన సక్సెస్ మీట్ పెట్టారు!   సక్సెస్ మీట్ మీట్ లో అదిరిపోయే స్పీచ్ తో పాటు...పవర్ ఫుల్ వార్నింగ్ కూడా ఇచ్చారు. ‘అత్తారింటికి దారేది’ విడుదలకు ఒక్క రోజు ముందుగా బయటకి లీక్ అయిన విషయం తెలిసిందే. ఈ లీకేజీ పై పవర్ స్టార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “అత్తారింటికి దారేది సినిమా పైరసీకి గురికాలేదు..దాని మీద కుట్ర జరిగింది. ఆ కుట్ర వెనుక ఎవరెవరు ఉన్నారు నాకు తెలుసు..అనగానే అభిమానులు వారెవరో చెప్పాలని ప్రశ్నించారు. చెప్తాను..ఇది ఇప్పటితో అయిపోలేదు...కుట్ర దారులకు ఇదే హెచ్చరిక.. భరిస్తాం..భరిస్తాం.. చివరకు తాట తీస్తాం. సమయం దొరికినప్పుడు వారికి తగిన న్యాయం చేస్తా. అందర్నీ గుర్తు పెట్టుకుంటా” అని చెప్పడంతో ఇది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే పవన్ కళ్యాణ్ కెరీర్ మీద దెబ్బకొట్టేందుకే ఈ ప్రయత్నాలు చేశారని, పోలీసు విచారణలో పలు పేర్లు వెల్లడయినట్లు తెలుస్తోంది.  మరి పవన్ మీద అంత పగ పెంచుకున్న వాళ్లు ఎవరా? అన్నది బయటికి వచ్చె వరకు వేచి చూడాలి.