ఎబ్బే... తమన్నాకి ఇది కూడా రాదంట...!

  మాములుగా ప్రతీ హీరోయిన్ కూడా ముందు మోడల్ రంగం నుంచే హీరోయిన్ అవకాశాలను దక్కించుకుంటారు. మోడలింగ్ ద్వారా సినిమా అవకాశాలను పొందిన వారు చాలా మంది ఉన్నారు. కానీ కొంతమంది మాత్రమే మోడలింగ్ కూడా చేయకుండా హీరోయిన్లుగా మారినవాళ్లు ఉన్నారు. అయితే మోడల్ అయిన, హీరోయిన్ అయినా కూడా వారికీ అందంతో పాటు, అందమైన పిల్లి నడక కూడా తెలిసి ఉండాలి. అదేనండి క్యాట్ వాక్. ర్యాంప్ పై ఒయ్యారాలు పోతూ.. అలా అలా నడుస్తూ, చూసేవారి కళ్ళను ఆకర్షించాలి. అయితే ఇలాంటి క్యాట్ వాక్ హీరోయిన్ తమన్నాకు బొత్తిగా తెలియదు.   అయితే ఈ అమ్మడు ఉత్తరాదికి చెందిన ఓ వస్త్ర దుకాణానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటుంది. ఈ కంపెనీ పబ్లిసిటీలో భాగంగా యాడ్ ఫిలింలో తమన్నాను నటింపజేయాలనుకున్నారు సదరు షోరూమ్ యాజమాన్యం.ఈ యాడ్‌ఫిలింలో కంపెనీకి సంబంధించిన చీరలను ధరించి ర్యాంప్‌పై అందంగా తమన్నా క్యాట్‌వాక్ చేయాలి. కానీ తమన్నా మాత్రం ర్యాంప్‌పై క్యాట్ వాక్ కూడా చేయడం రాకపోవడంతో సదరు కంపెనీ వారు ఆశ్చర్యపోయారు.   తమన్నాకు క్యాట్‌వాక్ చేయడం చేతకాదని నిర్ధారించుకున్న ఆ యాజమాన్యం...క్యాట్ వాక్ ఎలా నడవాలో తమన్నాకి తెలియజేయడానికి ఓ ట్రయల్‌ వాక్‌ని కూడా ఏర్పాటు చేశారు. కానీ ఎంత చేసిన కూడా మాములుగా నడుస్తుంది కాని, వాళ్ళు కోరుకున్న విధంగా క్యాట్ వాక్ లో నడవలేకపోయింది. దాంతో ఎదో ఒక విధంగా ఆ యాడ్ షూటింగ్ ను పూర్తి చేసేసారు.   కానీ ఈ విషయంపై తమన్నానే నోరు పారేసుకుందట. "నేనేమైనా మోడల్‌ని అనుకుంటున్నారా? నేను హీరోయిన్‌ని. ఇలాంటి చెత్త నడకలు నడవడం నాకు చేతకాదు. నేను ఇలాంటివి చేయను" అంటూ వాళ్లపై ఫైర్ అయ్యింది. దాంతో అక్కడున్నవారు ఏం చెయ్యాలో తెలియక ఎలాగోలా ఆ తతంగాన్ని ముగించేసారంట.

గుర్రపు పందాలు కాదు

  "అతనొక్కడే", "కిక్", "ఊసరవెల్లి" వంటి హిట్ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు సురేందర్ రెడ్డి పుట్టినరోజు నేడు. ప్రస్తుతం ఈయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం "రేసుగుర్రం". ఈ సినిమా విశేషాల గురించి దర్శకుడు మాట్లాడుతూ... ఈ కథకు "రేసుగుర్రం" అనే టైటిల్ వందశాతం కరెక్ట్. అలాగని ఇది గుర్రపు పందాల నేపధ్యంలోసాగే కాదు. ఇందులో బన్నీ పాత్ర ఫుల్ ఎనర్జిటిక్ గా ఉంటుంది. ఒక్కసారి లక్ష్యాన్ని ఫిక్స్ అయితే ఇక తగ్గే సమస్యే ఉండని పాత్ర తనది. అందుకే ఆ టైటిల్ పెట్టాం. రెండు పాటలు మినహా దాదాపుగా షూటింగ్ పూర్తయినట్టే. పోస్ట్ ప్రొడక్షన్ కూడా జరుగుతుంది. విడుదల ఎప్పుడనేది నిర్మాతలు బుజ్జి, వెంకటేశ్వరరావులు చెబుతారు అని అన్నారు.

వెండితెరపై వెన్నెల సంతకం సావిత్రి

      ఆమె ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయిన ఒకానొక వెండితెర అద్బుతం, అందానికి ఆమె పరియాయ పదం.. అభినయానకి ఆమె మరో పేరు… ఆమె మహానటి సావిత్రి. ఈరోజు వెండితెర మహరాణి సావిత్రి జయంతి. ఈ సందర్బంగా ఆ మహానటి సినీ ప్రరయాణంలో తాను వదిలి వెల్లిన వెండితెర ఙ్ఞాపకాల్ని ఒకసారి స్మరించుకుందాం….   తెలుగు సినీ  ప్రపంచానికి ఒకే ఒక మహానటి కొమ్మారెడ్డి సావిత్రి. దక్షిణాది భాషలలో వెండితెరపై వెన్నెలను కురిపించి, అభినయంలో తనకు సాటి మరొకరు లేరని, అశేష ప్రజల హృదయాల్లో అభినేత్రి గా నిలిచిపోయారు సావిత్రి. మహా నటి సావిత్రి 1937 డిశంబర్ 6న జన్మించారు. 12 ఏటనే సంసారం సినిమాతో మొదటి సారి తెరపై కన్పించారు. 1949లో అగ్ని పరీక్షలో అవకాశం వచ్చినా అప్పటికి ఆమె చిన్న పిల్లని, మెచ్యూరిటీ లేక ఆపాత్రకి సరిపోదని ఆ సినిమాలో ఆమెను ఎంపిక చేయలేదు. తర్వాత పాతాళభైరవి చిత్రంలో నృత్యపాత్రలో కనిపించారు. అలా చిన్న చిన్న పాత్రలతో ప్రారంభమైంది సావిత్రి సినీ ప్రస్థానం. పెళ్ళిచేసిచూడు ఆమె సినీ జీవితంలో ఒక మలుపు. కాని అందులో ఆమె రెండో కథానాయిక పాత్రకే పరిమితం కావలసి వచ్చింది. కాని సావిత్రిలోని అసామాన్యనటిని తెలుగుతెరకు పరిచయం చేసిన సినిమా మాత్రం దేవదాసు. అపురూపమైన ఆ దృశ్యకావ్యంలో దేవదాసుగా అక్కినేని... పార్వతిగా సావిత్రిల నటన అజరామరంగా నిలిచిపోయింది. మనసును వెంటాడే పార్వతి పాత్రలో సావిత్రి నటన అపూర్వం... అద్బుతం అనే చెప్పాలి. అమాయకమైన ప్రేయసిగా సావిత్రి అభినయం. నటనా కౌశలం వర్ణించాలంటే మాటలే సరిపోవు. ఆ తరువాత వరుసగా ఇవి సావిత్రి మాత్రమే చేయగలదు అనే పాత్రలు ఎన్నో చేసింది ఆ మహానటి.  మిస్సమ్మ, మధురవాణి,శశిరేఖ ఇలా తన నటనతో ఆమె జీవం పోసిన పాత్రలు ఎన్నో ఉన్నాయి. తెలుగు చలన చిత్ర చరిత్ర గురించి  ప్రస్తావిస్తే అందులో మాయబజార్‌ గురించి చెప్పకుండా వుండలేం. అలాంటి అద్బుతమైన చిత్రంలో కథ మొత్తం సావిత్రి పాత్ర చుట్టే తిరుగుతుంది. ముఖ్యంగా పెళ్లి సమయంలో శశిరేఖగా వచ్చిన ఘటోత్కచుని చూపించే సమయంలో ఒకేసారి తనలోని లావణ్యంతో పాటు ఎస్వీఆర్‌ లాంటి నటుని గాంభీర్యాన్ని కూడా తన ఆహార్యంలో పలికించి వహ్వా అనిపించింది సావిత్రి. దక్షిణాది భాషలలో వెండితెరపై వెన్నెలలు కురిపించి, అభినయంలో తనకు సాటి మరొకరు లేరని అశేష ప్రజల హృదయాలలో అభినేత్రిగా నిలిచిపోయారు మహానటి సావిత్రి. నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా... సావిత్రి ఒక అధ్యాయాన్ని సృష్టించి వెళ్లిపోయారు. 1968లో చిన్నారిపాపలు అనే సినిమాకు దర్శకత్వం వహించింది. దక్షణ భారత దేశంలోనే తొలిసారిగా మహిళలచే నిర్మించబడిన చిత్రంగా గిన్నిస్ బుక్ ఆఫ్ ది రికార్డ్స్ లో స్థానం దక్కించుకుంది ఈ మూవీ. ఆ తరువాత చిరంజీవి, మాతృదేవత, వింత సంసారం చిత్రాలకు కూడా దర్శకత్వం వహించారు సావిత్రి. అయితే చంద్రునిపై కూడా మచ్చలు ఉన్నట్టుగా సావిత్రి జీవితంలోనూ చీకటి కోణాలు ఉన్నాయి. తెరపైన, తెర వెనుక కూడా అనేక పాత్రలతో అశేష ప్రజానీకాన్ని అలరించిన సావిత్రి నిజ జీవితంలో ఘోరంగా విఫలమైయ్యరు. ఆస్తిపాస్తులు కోల్పోయి… తాగుడుకు…  మత్తుమందు లకు… నిద్రమాత్రలకు బానిసై ఆ దుర్భర జీవితంలోనే ఆమె తన 44ఏటనే  ఈ లోకాన్ని వదిలేసి వెళ్లారు. నటనలో సావిత్రి చూపించిన ప్రమాణాలు నేటికి ఆదర్శనీయంగా మిగిలాయి… ప్రతి యువనటి తాను కూడా సావిత్రి అంత నటి కావాలని ఉవ్వీళ్లూరుదుంటంది. అందుకే సావిత్రి తెలుగు సినిమా ఉద్యాన వనంలో ఎప్పుడు వాడిపోని ఓ సెల్యులాయిడ్ సుగంద పుష్పం.

రేపే రేసు గుర్రం విడుదల

  "ఇద్దరమ్మాయిలతో" వంటి ఫ్లాప్ చిత్రం తర్వాత కసిగా ఉన్న అల్లు అర్జున్ తన తరువాతి చిత్రంపై బాగా నమ్మకంతో ఉన్నాడు. అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం "రేసు గుర్రం". ఈ సినిమాలో బన్నీ కొత్తగా కనిపించబోతున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వలో తెరకెక్కుతున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను రేపే(డిసెంబర్ 7) విడుదల చేయబోతున్నారు. సురేందర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను రేపు విడుదల చేస్తున్నారు. శృతిహాసన్, సలోని హీరోయిన్లుగా నటిస్తున్నారు. యాక్షన్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని నల్లమలుపు బుజ్జి నిర్మిస్తున్నాడు. మొదటిసారిగా బన్నీ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే ఆడియోను కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

కెమెరామాన్ ను పడేసిన సుందరి..!

  సినిమాటోగ్రాఫర్ పి.సి.శ్రీరామ్ అంటే తెలియనివారుండరు. తను చేసిన సినిమాలు ఒక అద్భుతం. దానికి "నాయకుడు", "గీతాంజలి", "సఖి", "ఖుషి", "ఇష్క్" వంటి సినిమాలే నిదర్శనం. అయితే పి.సి.శ్రీరామ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న "మనోహరుడు" చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. ఈ షూటింగ్ సమయంలో హీరోయిన్ అమీజాక్సన్ ను చూసిన శ్రీరామ్ కు తెగ నచ్చేసిందట. దాంతో ఆమె ఫోటోను పోస్ట్ చేస్తూ "అందానికి అత్యున్నత స్థానం" అని అంటూ అమీజాక్సన్ ను పొగిడేశాడు. ఈ సినిమా తన కెరీర్ లో పెద్ద హిట్టవుతుందని అమీ చాలా నమ్మకంగా ఉంది. ఈ సినిమా 2014లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

అమరగాయకుడు

      ఆయన స్వరం షడ్జమం, ఆ రాగం రిషభం,ఆ సుమధుర గానం.. గాంధారం, ఆ గాన మాధుర్యం మధ్యమం, ఆయన పాట పంచమం, ఆయన కంఠం పలికించే ధ్వని దైవతం, ఆయన స్వరంలో ప్రతిఫలించే నాదం నిషాదం, ఇలా సప్తస్వరాలను తన గాన మాధుర్యంలో కట్టిపడేసిన అమరగాయకుడు ఘంటసాల..   ఆయన పాడని పాట లేదు.. ఆయన పాడలేని పాటా లేదు.. అందుకే ఆయన తెలుగుతెరను ఏళిన గాయకుడు, తెలుగు సంగీతానికి దిశా నిర్ధేశం చేసిన అమరుడు. భక్తి గీతమైన విరహగీతమైన, అల్లరి పాటైనా, ఆర్థతతో పాడే పాట అయిన ఆయన గొంతులో  ఆ భావం ప్రస్పుటంగా కనిపిస్తుంది. అందుకే ఆయన తెలుగు సినిమా సంగీత ప్రపంచంలో మరే గాయకుడు అందుకోలేని అత్యున్నత శిఖరాలను అధిరోహించాడు. ఘంటసాలగా ప్రఖ్యాతి గాంచిన ఘంటసాల వెంకటేశ్వరరావు 1922 డిసెంబర్‌ 4న గుడివాడ సమీపంలోని చౌటుపల్లి గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి మృదంగం వాయిస్తూ భజనలు చేసేవారు. అలా తండ్రి నుంచి సంక్రమించిన సంగీత జ్ఞానానికి ఆయన మరింత పదును పెట్టారు. తండ్రి మరణిస్తూ తనను గొప్ప సంగీత విధ్వాంసుడు కావాలని కోరటంతో అదే తన జీవిత ఆశయంగా ఆయన సంగీత సాగరానికి మధించి అమృతగానం పలికించారు. 1944లొ తన మేనకొడలైన సావిత్రిని వివాహం చేసుకున్నారు ఘంటసాల.. ఆమెరాకతొనే ఘంటసాల జీవితంలోకి అదృష్టం కూడా కలిసి వచ్చింది. తన పెళ్లిలో  తానే కచేరి చేసి అందరిని ఆశ్చర్యపరిచిన ఘంటసాల ఆ పెళ్లి వచ్చిన సముద్రాల రాఘవాచార్యుల దృష్టిలో పడ్డారు. అదే ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. సముద్రాల ప్రొత్సాహంతో సినీగాయకునిగా మారారు ఘంటసాల. తరువాత ఎన్నో సినిమాల్లో పాటలు పాడారు ఘంటసాల, కాని ఆయనకంటూ ప్రత్యేక గుర్తింపు లేదు. కానీ తెలుగు పాటకు మకుటంలా భాసిల్లాల్సిన ఆయనన్ను కాలం అలా ఆగిపోనివ్వలేదు. 1955లో పాతాలభైరవి సినిమా విడుదలైంది. ఈ ఒక్క సినిమాతోనే ఘంటసాల పేరు ఆంద్ర దేశమంతా మారు మ్రోగిపోయింది. తరువాత వరుసగా మల్లీశ్వరీ, దేవదాసు, మాయాబజార్‌, శ్రీవెంకటేశ్వర మహత్యం లాంటి సినిమాతో ఆయన కీర్తి హిమశిఖరాలను తాకింది. అప్పటి నుంచి దాదాపు 30 ఏళ్ల పాటు వెండితెర మీద ఘంటసాల శకం నడిచింది. భక్తి రస చిత్రమయినా, యాక్షన్‌ సినిమా అయినా, ఫ్యామిలీ డ్రామా అయినా ఎలాంటి సినిమా అయినా గాయకుడు మాత్రం ఘంటసాలే.. అలా తెలుగు పాటకు పర్యాయపదంగా మారారు ఘంటసాల. అయితే 1969లో మాత్రం ఆ గాత్రం అలసిపోయింది. అప్పటి నుంచి ఆయన తరుచూ అనారోగ్యానికి గురవుతుండటంతో పాటలు పాడటం తగ్గించారు. అదే సమయంలో విదేశాల్లో ప్రదర్శనలు కూడా ఇవ్వడంతో శారీరకంగా చాలా అలసిపోయారు. అంత అలసి పోయాక కూడా ఆయన భగవద్గీత గానం చేసి తెలుగు జాతికి తరగని స్వర సంపవను అందించారు. కాని ఎంతటి పవిత్ర ప్రవాహమైనా ఎక్కడో ఒక చోట ఆగిపోవాల్సిందే. అందుకే వెండితెర అమృతదారలను సృష్టించిన ఘంటసాల స్వరప్రవాహం 1974 ఫిబ్రవరి 11న ఆగిపోయింది. ఎన్నాళ్లకు తరగని అపార గాన మాధుర్యాన్ని మనకందించి ఆయన మాత్రం  తిరిగిరాని లోకాలకు తరలిపోయారు. తెలుగు జాతికి తెలుగు పాటు జాతీయ స్థాయిలో సమున్నత స్థానం కల్పించిన అమరగాయకుడు ఘంటసాల గారిని ఈ అక్షరనివాళిని అర్పిస్తుంది తెలుగువన్‌.. 

తమిళంలో డిజిటలైజ్ శంకరాభరణం...!

  "శంకరా... నాద శరీరాపర... "అనే ఈ పాట ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా అలరిస్తూనే ఉంది. కె.విశ్వనాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ "శంకరాభరణం" చిత్రం త్వరలోనే తమిళంలోకి డబ్బింగ్ అవబోతుంది. ఏడిద నాగేశ్వరరావు నిర్మించిన ఈ చిత్రం విడుదలై 34 సంవత్సరాలు అవుతుంది. ఈ చిత్రాన్ని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో డిజిటలైజ్ చేసి, 5.1 సౌండ్ సిస్టం హంగులతో, సినిమా స్కోప్ లోకి మర్చి, తమిళంలో విడుదల చేయబోతున్నారు. అయితే ఈ చిత్రం తెలుగు వర్షన్ తమిళనాట విడుదలై అప్పట్లోనే సిల్వర్ జూబ్లీ ఆడింది. మరి ఈసారి ఏకంగా తమిళ వర్షన్ లోనే విడుదల కాబోతుంది. మరి ఇపుడు ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.

నయన్ వద్దు...కొత్తమ్మాయే ముద్దు...!

  మారుతి దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా "రాధ" అనే చిత్రం తెరకెక్కనుంది. అయితే ఈ చిత్రంలో వెంకీ సరసన నయనతార హీరోయిన్ గా నటించబోతుందని గతకొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఇదే విషయం గురించి దర్శకుడు మారుతి మాట్లాడుతూ... "రాధ"కోసం నయనతారను అసలు కలవలేదు మేము. మేము ఒక కొత్త హీరోయిన్ కోసం చూస్తున్నాం. వెంకటేష్-నయన్ ల కాంబినేషన్ మనం ఇదివరకే రెండు సినిమాలలో చూసేసాం కదా! అందుకే ఈసారి ఒక కొత్త అమ్మాయి కోసం చూస్తున్నాం. ఈ ప్రాజెక్ట్ ఫిబ్రవరి 2014లో మొదలు పెడతాము అని అన్నారు. మారుతి ప్రస్తుతం "కొత్తజంట" షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నాడు.

హైదరాబాద్ లో మహేష్ ఆగడు

  "దూకుడు" చిత్రం తర్వాత మహేష్, శ్రీనువైట్ల కాంబినేషన్ లో "ఆగడు" చిత్రం తెరకెక్కుతుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది. 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో రామ్ ఆచంట, గోపీ ఆచంట, అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మహేష్ సరసన తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది. ఇందులో మహేష్ మాస్ పాత్రలో అలరించానున్నాడని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను విడుదల చేయడానికి నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు. అదే విధంగా మహేష్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన"1" చిత్రం విడుదలకు సిద్ధమవుతుంది. ఈ నెల 19న పాటలను విడుదల చేసి, వచ్చే నెల 10న సినిమాను విడుదల చేయబోతున్నారు.

ముంబాయి భామతో చైతు చిందులు

  నాగచైతన్య, సమంత జంటగా నటిస్తున్న చిత్రం "ఆటోనగర్ సూర్య". దేవకట్టా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలోని ఓ డాన్సింగ్ సాంగ్ ను చైతు, ముంబాయి భామ కిమాయాలపై ఇటీవలే చిత్రీకరించారు. ఈ పాటకు రాజుసుందరం కొరియోగ్రఫీ చేసారు. దీంతో షూటింగ్ మొత్తం పూర్తయ్యింది.త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ప్రారంభించనున్నారు. ఈ చిత్రంలో రాకూల్ ప్రీత్ సింగ్ ఓ ముఖ్యపాత్రలో నటించింది. కె.అచ్చిరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనూప్ సంగీతాన్ని అందిస్తున్నాడు. త్వరలోనే ఆడియో విడుదల చేసి, సినిమాను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

శ్రియను వాళ్ళు ఆదుకున్నారు...!

  ఒకప్పుడు టాలీవుడ్ టాప్ హీరోలందరి సరసన నటించిన హీరోయిన్ శ్రియకు ప్రస్తుతం తెలుగులో అవకాశాలు రావడమే మానేసాయి. ఇపుడు తెలుగులో అక్కినేని ఫ్యామిలీ కలిసి నటిస్తున్న "మనం" చిత్రంలో నాగార్జున సరసన నటిస్తుంది. అయితే తెలుగులో అవకాశాలేమి రాకపోవడంతో వేరే భాషలపై దృష్టి పెట్టింది. ప్రస్తుతం ఈ అమ్మడు బాలీవుడ్ లో "వాల్మీకీ కీ బందూక్" అనే చిత్రంలో నటించే అవకాశం దక్కించుకుంది. అదే విధంగా మలయాళంలో "ప్రకాశం పారత్తున పెన్ కుట్టి" అనే సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఇందులో శ్రియతో‌పాటు ఆండ్రియా కూడా నటించనుంది. మరి ఈ చిత్రంతో అయిన శ్రియకు మరిన్ని సినీ అవకాశాలు వస్తాయో లేదో చూడాలి.