శ్రీకాంత్ క్షత్రియ పాటలు విడుదల

  శ్రీకాంత్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం "క్షత్రియ". కె.ఉదయచందు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మహేందర్, జయేందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. విశ్వ సంగీతం అందించిన ఈ సినిమా పాటలు ఇటివలే హైదరాబాద్ లో విడుదలయ్యాయి. ఈ కార్యక్రమానికి డి.రామానాయుడు, తమ్మారెడ్డి భరద్వాజ లు ముఖ్య అతిధులుగా విచ్చేసారు. "శ్రీకాంత్ కోసమే నేను ఈ కార్యక్రమానికి వచ్చాను. దర్శక నిర్మాతలు నాకు బాగా తెలుసు. ఈ సినిమా తప్పకుండా విజయం సాధించాలని కోరుకుంటున్నాను" అని డి.రామానాయుడు అన్నారు. భరద్వాజ మాట్లాడుతూ... శ్రీకాంత్ ఎన్ని సినిమాలు చేసిన కూడా ప్రతి సినిమాను మొదటి సినిమా చేస్తున్నట్లుగానే చేస్తాడు. అదే అతడి ఉన్నతికి కారణం" అని అన్నారు. శ్రీకాంత్ మాట్లాడుతూ.. కథ చాలా నచ్చింది. థ్రిల్లర్ తరహాలో సాగే సినిమా ఇది. విశ్వ చక్కటి సంగీతం అందించాడు." అని అన్నారు.

పిల్లల కోసమే వచ్చాను: పవన్

    గత వారం రోజులుగా హైదరాబాద్ లో జరిగిన 18వ అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవ ముగింపు కార్యక్రమం బుధవారం జరిగింది. ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ ప్రత్యేక అతిధిగా విచ్చేసారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ... మూడు రోజుల క్రితం ఎఫ్డీసి చైర్మన్ దానకిషోర్ నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. పిల్లల కోసమే నేను ఈ కార్యక్రమానికి వచ్చాను. పిల్లల మీద ఉన్న ప్రేమే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది. అందరికి ఆనందాన్నిచ్చిన ఈ కార్యక్రమంలో నేను కూడా ఓ భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది" అని అన్నారు. ఈ కార్యక్రమంలో బాలదర్శకులు, లైవ్ యాక్షన్ విభాగాల విజేతలకు గవర్నర్ నరసింహన్ జ్ఞాపికల్ని, ధ్రువపత్రాలను అందజేశారు. లఘు చిత్రాల విజేతలకు మంత్రి డి.కె.అరుణ జ్ఞాపికల్ని అందజేసారు. యానిమేషన్ విభాగ విజేతలకు పవన్ జ్ఞాపికల్ని అందజేశారు.

నా కొంప ముంచేలా ఉందిరోయ్..

  శింబు నయనతారల ప్రేమాయణం గురించి అందరికి తెలిసిందే. రెండేళ్ళ క్రితం వీరి ప్రేమకు సంబంధించిన ముద్దుల ఫోటోలు హాట్ టాపిక్ గా మారాయి. అయితే అప్పుడు విడిపోయిన వీరిద్దరూ కూడా త్వరలోనే కలవబోతున్నారని గతకొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలకు ప్రాణం పోసినట్లుగా చేసాడు తమిళ దర్శకుడు పాండీరాజ్.   శింబు హీరోగా పాండీరాజ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించమని దర్శకుడు నయనతారను కోరడంతో.. నయన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. ఈ విషయం తెలిసినప్పటి నుండి హీరోయిన్ హన్సిక గరం గరం అవుతుందట. ఎందుకంటే.. శింబు నయన్ తో విడిపోయాక, హన్సికతో ప్రేమలో పడి పెళ్లి చేసుకునే వరకు వచ్చాడు. కానీ హన్సిక తన పెళ్ళికి మరో 5 సంవత్సరాల సమయం పడుతుందని చెప్పి తప్పు చేసింది. ఇపుడు నయన్,శింబులు తిరిగి కలవబోతున్నారని తెలిసి బోరుమని ఏడుస్తుందట. బయటకు చెప్పట్లేదు కానీ.. "నా కొంప ముంచేలా ఉందిరోయ్.. నన్ను మోసం చేశాడురోయ్..." అనే విధంగా హన్సిక తన సన్నిహితుల వద్ద భాధపడుతుందని తెలిసింది. శింబుకు గంటకొకసారి ఫోన్ చేస్తూ అన్ని విషయాలు అడిగి తెలుసుకుంటుందట. ఇపుడు హన్సిక పరిస్థితి.. అయ్యో పాపం..అయ్యో అయ్యో పాపం..

ఈరోజు పవర్ స్టార్ ఎంట్రీ

  హైదరాబాద్ లో నవంబర్ 14న ప్రారంభమైన చిల్డ్రెన్ ఫెస్టివల్ ఈరోజు(నవంబర్20)న ముగియనున్నాయి. ఈ ముగింపు ఉత్సవాలను ఘనంగా జరుపేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ లో జరగనున్న ఈ కార్యక్రమానికి టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను ముఖ్య అతిధిగా రావాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానం పంపినట్లు తెలిసింది. పవన్ కు అసలే చిన్న పిల్లలు అంటే చాలా ఇష్టం కాబట్టి, అదే విధంగా పవన్ కూడా ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉండడం వలన ఈ వేడుకకు పవన్ ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉందని తెలిసింది. అయితే ఇందుకోసం ఈ కార్యక్రమం జరిగే చోట భారీ బందోస్తును ఏర్పాటు చేసారు. మరి పవర్ స్టార్ ఎంట్రీ ఇస్తాడా లేదా అనేది మరికొద్ది గంటల్లో తెలియనున్నది.

ఆడవాళ్ళని అవమానించిన వర్మ

  నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో...అనే విధంగా ఉంటాడు దర్శకుడు రాంగోపాల్ వర్మ. ఎదో ఒక రకంగా ఎప్పడు వార్తల్లో హాట్ టాపిక్ గా మారుతాడు వర్మ. అయితే వర్మకు అమ్మాయిల పట్ల ఎలాంటి అభిప్రాయం ఉందో అనే విషయం ఇపుడు హాట్ టాపిక్ అయ్యింది.   ఇటీవలే ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు శేఖర్ కపూర్ మాజీ భార్య సింగర్ నటి సుచిత్రా కృష్ణ మూర్తి తన జీవితంలో జరిగిన విషయాలను వెల్లడిస్తూ ‘డ్రామా క్వీన్' అనే పుస్తకం విడుదల చేసింది. ఇందులో ఆమె వర్మ గురించి రాసిన మాటలు సంచలనాలకు దారితీస్తున్నాయి. ఇంతకి వర్మ గురించి తెలిసిన ఆ మాటలు ఏమిటని అనుకుంటున్నారా...?   అయితే ఇంతకు ముందు ఒకసారి వర్మ దగ్గరకు సుచిత్ర వెళ్ళి తనను పెళ్ళిచేసుకోమంటూ పెళ్లి కోరిందట. దానికి సమాధానంగా వర్మ..."సుచిత్రా.. నీవు నన్ను తప్పుగా అర్ధం చేసుకున్నావు. మన ఆలోచనలు,ఆశయాలు వేరు.నీకోసం నా అభిప్రాయాలను మార్చుకోలేను. అంతేకాదు నాకు వివాహ వ్యవస్థ పై నమ్మకం లేదు. నేను మహిళలను కేవలం సెక్స్ కు పనికి వచ్చే పరికరాలుగా మాత్రమే చూస్తాను" అని నేరుగా సుచిత్ర మోహం మీదే చెప్పేయడంతో...ఏమి అనాలో తెలియక సుచిత్ర అక్కడ నుండి వెళ్ళిపోయిందని, తను రాసిన "డ్రామా క్వీన్" పుస్తకంలో తెలిపింది.   మరి ఈ వర్మ డైలాగులు మహిళా సంఘాల చెవిలో పడితే... ఎలా ఉంటది? ఎలా ఉంటది? ఒక్కసారి ఊహించుకోండి...!

మాస్టర్ కి డాక్టరేట్ వచ్చేసింది...!

    తెలుగు, తమిళ,మలయాళం, కన్నడ అనే భాషాభేదం లేకుండా దాదాపు పది భాషల చిత్రాలకు, దాదాపు నలభై సంవత్సరాలుగా తన కొరియోగ్రఫీతో అదరగొడుతున్న శివశంకర్ మాస్టర్ కు బెంగుళూరు ఇంటర్నేషనల్ గ్లోబల్ ట్రస్ట్ పీస్ అనే ప్రసిద్ధ సంస్థ వారు గౌరవ డాక్టరేట్ ను బహుకరించారు. ఈ సందర్భంగా శివశంకర్ మాట్లాడుతూ... "నృత్య దర్శకులు డాక్టరేట్ అందుకోవడం చాలా అరుదు. అలాంటి అరుదైన డాక్టరేట్ నన్ను వరించడం చాలా ఆనందంగా ఉంది. ఈ డాక్టరేట్ నాకే ఎందుకు ఇస్తున్నారని వారిని అడిగితే.."మీ డాన్స్ లో పవిత్రత ఉంటది. మీరు నృత్యం చేసేటపుడు మీ హావభావాలు అమోఘం" అని అన్నారు. నా కన్న తల్లిదండ్రులు, నా శ్రేయోభిలాషులు, నా దర్శక నిర్మాతలు, నటీనటుల ప్రోత్సాహం, దీవెనల వల్లే నేను ఈ స్థాయికి రాగలిగాను. "మగధీర" చిత్రానికి జాతీయ పురస్కారం అందుకున్నాను. నటుడిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ఉంది. నాకు ఈ డాక్టరేట్ ఇచ్చిన గ్లోబల్ ట్రస్ట్ వారికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను" అని అన్నారు.

రేసుగుర్రం విడుదల తేది కన్ఫర్మ్

  అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం "రేసుగుర్రం". సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు సందర్భంగా విడుదల చేస్తున్నారు. ఇక్కడ కొన్నియాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. నల్లమలపు బుజ్జి నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో బన్నీ బైక్ రేసర్ గా కనిపించనున్నాడు. సంక్రాంతికి ఈ చిత్ర ఆడియో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఆమెను చూస్తే ఈమెకు ముచ్చటేస్తుందట...!

  ఒకప్పుడు హీరోయిన్ ల నటన అంటే సావిత్రి గారు గుర్తొచ్చేవారు. అంతటి పేరు తెచ్చుకున్నారు సావిత్రి గారు. ఆ తర్వాత జేనేరేషణ్ లో సౌందర్య మరో సావిత్రిగా మారింది. తన నటనలో, అందంలో అన్నింటా మంచి పేరును సంపాదించుకున్నారు ఆవిడ. అయితే ఈ కాలానికి నిత్యామీనన్ మరో సౌందర్య గా నిలుస్తుందని ఈ మధ్య వార్తలు వస్తున్నాయి. అయితే ఇదే విషయాన్ని లేడి దర్శకురాలు విజయనిర్మల కూడా అన్నారు.   నిత్యామీనన్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం"మాలిని22". ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం ఇటీవలే హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి కృష్ణ-విజయనిర్మల,జయసుద ముఖ్య అతిధులుగా విచ్చేసారు. ఈ సందర్భంగా విజయ నిర్మల మాట్లాడుతూ..."తెలుగులో లేడి డైరెక్టర్లు చాలా తక్కువ. ఇప్పుడిప్పుడే లేడి డైరెక్టర్ల సంఖ్య పెరుగుతోంది. శ్రీ ప్రియ తెలుగు సినిమాకు దర్శకత్వం వహించడం చాలా ఆనందంగా ఉంది. నిత్యామీనన్ యాక్టింగ్ చూస్తే చాలా ముచ్చటేస్తుంది. ఆమె తెలుగు తెరకు పరిచయం కావడం మన అదృష్టం. నిత్య తెలుగు సినిమాకు దొరికిన మరో సౌందర్యగా చెప్పుకోవచ్చు" అని అన్నారు.

మోహన్ బాబు తమ్ముడు పోలీస్

  శ్రీవాస్ దర్శకత్వంలో మంచు కుటుంబం మొత్తం కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం "పాండవులు పాండవులు తుమ్మెదా". ఇందులో మోహన్ బాబు, మనోజ్, విష్ణు, వరుణ్ సందేశ్, తనీష్ లు అన్నదమ్ములుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో మనోజ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. మనోజ్ ఈ చిత్రంలో కనిపించబోయే పోలీస్ గెటప్ ఇదే. రవీనా టాండన్, ప్రణీత, హన్సికలు కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ లలో మంచు విష్ణు, మనోజ్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

వాళ్ళన్నిఅలా చూడాలనుందట...!

  అమీర్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం "ధూమ్3". ఈ చిత్ర టైటిల్ సాంగ్ విడుదల కార్యక్రమంలో అమీర్, హీరోయిన్ కత్రినా కైఫ్ లు పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమంలో అమీర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. "సల్మాన్-కత్రినాలు నిజజీవితంలో ఒక్కటైతే చూడాలని కోరుకుంటున్నానని, కానీ నా ఆలోచనలు కష్టమే" అని అమీర్ అన్నాడు. ఆ సమయంలో కత్రినాకైఫ్ పక్కనే వుంది కానీ, ఆమె నుంచి ఎలాంటి స్పందన రాలేదు.   అసలే "సత్యమేవ జయతే" అంటూ ప్రజల యొక్క భాధలను తెలుసుకొని, వాటి పరిష్కారం గురించి ప్రయత్నాలు చేసిన అమీర్... తన హీరోయిన్ సమస్యను పరిష్కరించడానికే ఇలా మాట్లాడాడేమోనని అందరు అనుకుంటున్నారు. చూద్దాం.. ఈ విషయం ఎంతవరకి వెళ్తుందో. మరి దీనికి సల్మాన్ ఎలా స్పందిస్తాడో చూడాలి.