ఆడియో వేడుకలో ఒకరి మృతి

  సునీల్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'భీమవరం బుల్లోడు". ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం ఆదివారం భీమవరంలో జరిగింది. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో సురేష్ బాబు నిర్మించిన ఏ చిత్రానికి ఉదయ్ శంకర్ దర్శకత్వం వహించాడు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ.. "సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ 50వ వార్షికోత్సవ వేడుకను భీమవరంలో జరపడం చాలా ఆనందంగా ఉంది. ఈ చిత్రం మంచి ఘనవిజయం సాధించాలని కోరుకుంటున్నాను" అని అన్నారు. అనంతరం కేక్ కట్ చేసి, ఆడియో విడుదల చేసారు. అయితే ఈ వేడుకలో ఒక అపశ్రుతి దొర్లింది. సంగినీడి సురేష్ (25) అనే వ్యక్తి, ఈ వేడుకను చూడటానికి వచ్చి, ఆ తొక్కిసలాటలో గాయపడి, మృతి చెందాడు. ఫిట్స్ వచ్చి చనిపోయాడని భావిస్తున్నాం. కానీ మాకు ఇంతవరకు ఏ ఫిర్యాదు అందలేదన్నారు పోలీసులు. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు.

బాహుబలిలో ప్రభాస్ కి రెండో జోడీగా తమన్నా

  రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా, అనుష్క నటిస్తున్నబాహుబలి సినిమాను ఇప్పుడప్పుడే చూసేందుకు వీలుకుదరదు గనుక, అంతవరకు ఆ సినిమా షూటింగ్ కబుర్లతోనే సరిపెట్టుకోకతప్పదు. ఇక తాజా సమాచారం ఏమిటంటే, బాహుబలిలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. అందులో బాహుబలితో అనుష్క జతకట్టబోతున్నట్లు ఇదివరకే మన అందరికీ తెలుసు. ప్రభాస్ చేస్తున్న రెండో పాత్ర శివుడుతో అందాల తమన్నాజతకట్టనుంది. ఆరడుగుల ఆజానుభాహువయిన ప్రభాస్ పక్కన ఐదున్నర అడుగులపైన ఎత్తున్న అనుష్క బాగానే సరిపోతుంది. కానీ ఈ సినిమాలో పెద్ద గెడ్డం, జుట్టుతో కండలు తిరిగిన శరీరంతో ప్రభాస్ కొంచెం మొరటుగా కనిపిస్తున్నాడు. మరి అతని పక్కన మల్లెమొగ్గ వంటి తమన్నాను రాజమౌళి ఎంచుకోవడం కొంచెం ఆశ్చర్యంగానే ఉంటుంది. కానీ, మిస్టర్ పెర్ఫెక్షనిస్ట్ అని పేరుపొందిన మన జక్కన ఏది చేసినా చాలా ఆలోచించే చేస్తాడు గనుక, తమన్నాని ఎంచుకోవడం వెనుక బలమయిన కారణమే ఉండవచ్చు. ఈసినిమాలో అనుష్క దేవసేనగా నటిస్తుంటే, తమన్నాఅవంతిక పాత్ర పోషిస్తునట్లు సమాచారం. బాహుబలి సినిమాలో అత్యంత కీలకమయిన యుద్ద సన్నివేశాలు ఈనెల 23నుండి మార్చి5వరకు ఏకధాటిగా రామోజీ ఫిలిం సిటీలో చిత్రీకరించబడతాయి.

అందరికి షాకిచ్చిన బాహుబలి

  రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం "బాహుబలి". ఈ చిత్రంలోని పాత్ర కోసం రాజమౌళి ఆజ్ఞ మేరకు ప్రభాస్ చాలా బరువు పెరిగాడు. జుట్టు కూడా బాగా పెంచేసాడు. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఇటీవలే "బాహుబలి" ప్రభాస్ ఫస్ట్ లుక్ ను విడుదల చేసాడు రాజమౌళి. ఇందులో ప్రభాస్ దేహం భారీగా కనిపించకపోయినా కూడా, జుట్టు మాత్రం చాలా పొడవుగా కనిపించింది.   అయితే ఇటీవలే నిర్మాత దిల్ రాజు కూతురు ఎంగేజ్ మెంట్ వేడుకకు ప్రభాస్ హాజరయ్యి, అక్కడి వారందరిని ఆశ్చర్యపరిచాడు. ఎందుకంటే "బాహుబలి" సినిమాలో లాగా కండలు తిరిగిన దేహంతో, పొడవైన జుట్టుతో ఉంటాడని అనుకున్న వారందరికి కూడా ప్రభాస్ షాక్ ఇచ్చాడు. ఎందుకంటే ఈ వేడుకకు ప్రభాస్ స్లిమ్ గా, స్టైలిష్ హెయిర్ స్టైల్ తో వచ్చాడు. హెయిర్ స్టైల్ "బాహుబలి" రేంజ్ లో లేకుండా కాస్త తక్కువగా, సింపుల్ గా ఉండటం, భారీ బరువుతో కాకుండా కాస్త స్లిమ్ గా కనిపించడంతో అందరి దృష్టి ప్రభాస్ పైనే పడింది.   "బాహుబలి" చిత్రం మరో రెండు సంవత్సరాల వరకు విడుదల కాదు కాబట్టి... ఈ మధ్యలోనే వేరే సినిమా చేయడానికి ప్రభాస్ సన్నాహాలు చేస్తున్నాడేమో అని టాక్ నడుస్తుంది. మరి ప్రభాస్ ఈ కొత్త లుక్ "బాహుబలి" కోసమో లేక ఇంకా కొత్త సినిమా కోసమో అనే విషయం త్వరలోనే తెలియనున్నది.

‘1 నేనొక్కడినే’ మహేష్ స్పీచ్ అదిరింది

      టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు నటించిన ‘1 నేనొక్కడినే’ ఆడియో ఫంక్షన్ శిల్పా కళా వేదికలో సినిమా యూనిట్, అభిమానుల మధ్య పండగలాగ జరిగింది. సాధారణంగా మహేష్ ఏ ఫంక్షన్ లలోనైనా నాలుగు ముక్కలు కంటే ఎక్కువగా మాట్లాడారు. కాని ‘1 నేనొక్కడినే’ ఆడియో వేడుకలో మాత్రం మహేష్ ఇచ్చిన స్పీచ్ హైలైట్ గా నిలిచింది.   ''దేవితో సినిమా చేయాలని చాలాసార్లు అనుకున్నాం. కొన్ని కారణాల వల్ల వీలు కాలేదు. ఈసారి సుకుమార్ గారి కాంబినేషన్లో దేవితో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా ద్వారా మా అబ్బాయి గౌతమ్ నటుడిగా పరిచయమవుతున్నాడు. ఇది నాకెంతో ఆనందాన్ని కలిగిస్తున్న అంశం. నా కంటే తానే బాగా చేశానని వాడి ఫీలింగ్. ఏదిఏమైనా ఆ అనుభూతి మాటల్లో చెప్పలేనిది. నా సినిమాల్లోకెల్లా ఇది గొప్ప చిత్రం. నా ప్రయత్నాలను ఆదరిస్తున్న అభిమానుల రుణం ఏమిచ్చినా తీర్చుకోలేను. చేతులెత్తి నమస్కరించడం తప్ప” అని ప్రిన్స్ మహేష్ బాబు అన్నారు.   

భీమవరంలో బుల్లోడి పాటల విడుదల

  సునీల్ హీరోగా ఉదయ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం "భీమవరం బుల్లోడు". సురేష్ ప్రొడక్షన్స్ ప్రై.లిమిటెడ్ బ్యానర్లో డి.సురేష్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ పూర్తీ చేసుకుంది. అనూప్ అందించిన పాటలను ఈనెల 22న భీమవరంలో విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సభ్యులు మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. హీరో సునీల్ మాట్లాడుతూ.. "సినిమా మొదలు నుండి చివరి వరకు పొట్ట చెక్కలయ్యే కామెడి ఉంటుంది. అలాగే ఇందులో యాక్షన్, ఎమోషన్స్ ఉన్నాయి. ఈ చిత్రం నా కెరీర్ లో ఓ మైలురాయిలా నిలిచిపోతుంది" అని అన్నారు. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

మహేష్ బాబు ‘1 నేనొక్కడినే’ ఆడియో విశేషాలు

      తెలుగు సినీ ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ‘1 నేనొక్కడినే’ ఆడియో ఫంక్షన్ శిల్పా కళా వేదికలో అభిమానుల మధ్య కోలాహలంగా జరుగుతుంది. సూపర్ కృష్ణ ఈ ఆడియో వేడుకకు స్పెషల్ గెస్ట్ గా వచ్చారు. ప్రిన్స్ మహేష్ బాబు తన సతీమణి నమ్రతా, కుమారుడు గౌతమ్ తో కలిసి ఆడియోకి వచ్చారు. సూపర్ స్టార్ కృష్ణ మాట్లాడుతూ...1 నేనొక్కడినే’ విడుదలకి ముందే మంచి హైప్ వచ్చింది. అలాగే మంచి బిజినెస్ కూడా చేసిందని అంటున్నారు. ఈ సినిమా మా మహేష్ కేరియార్ లోనే పెద్ద హిట్ గా నిలుస్తుంది. సుకుమార్‌ డైరెక్ట్‌ చేసిన అన్ని సినిమాలకీ సాంగ్స్‌ కంపోజ్‌ చేసిన దేవిశ్రీప్రసాద్‌ ‘1 నేనొక్కడినే’కి కూడా సూపర్‌హిట్‌ మ్యూజిక్‌ అందించాడు. అన్ని పాటల వన్‌ మినిట్‌ ప్రోమోస్‌ని బట్టి మ్యూజికల్‌ హిట్‌ ఖాయమని తేలింది. దేవిశ్రీప్రసాద్‌ రొటీన్‌కి భిన్నమైన సాంగ్స్‌ అందించే ప్రయత్నం చేశాడు.ఆడియో రిలీజ్‌ అయిన దగ్గర్నుంచి కొంత కాలం పాటు 1 పాటలే అంతటా మార్మోగడం ఖాయం చేసుకోవచ్చు.  

అడ్డంగా దొరికిన కూడా సపోర్ట్ ఇస్తున్నారట

  ఇటీవలే వ్యభిచారం కేసులో అడ్డంగా దొరికిపోయిన శ్వేతాబసుప్రసాద్ కు అభిమానులు బాసటగా నిలుస్తున్నారట. ఈ విషయంపై శ్వేత ఓ మీడియాతో మాట్లాడుతూ... "ఈ వివాదం నన్నేమీ.. లేదా నా ప్రతిష్టనేమీ దిగజార్చలేదు. ఇదెలా ఉందంటే.. కంటికి కనబడని దయ్యాన్ని చూపించినట్టుగా ఉంది. అందువల్లే ఈ స్టింగ్ ఆపరేషన్ పై ఇన్నాళ్ళు నేను పెదవి విప్పకుండా మౌనంగా ఉన్నాను" అని అన్నది. అదే విధంగా తనకి సపోర్ట్‌గా ఆన్ లైన్‌లో అనేకమంది నిలిచినందుకు ఈమె సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఏది ముఖ్యమో, ఏది కాదో ప్రజలు ఇప్పుడు బాగా తెలుసుకుంటున్నారని అంటూ శ్వేతాబసు తన సపోర్టర్లకి థ్యాంక్స్ చెప్పింది. నిజమే మరి! బడా రాజకీయ నాయకులను, సినీ తారల చీకటి వ్యాపారాలను బయటపెట్టడానికి ఎలాంటి సాహసం చేయని టీవి చానెల్స్.. ఇలాంటి చిన్న చిన్న చేపలను మాత్రం ధైర్యంగా చూపించేస్తున్నారు.

మహేష్ ను పడేసిన దోపిడీ నిర్మాతలు

  "డి ఫర్ దోపిడి" చిత్రం ద్వారా నిర్మాతలుగా పరిచయమవుతున్న రాజ్ అండ్ డి.కె.లకు మరో అద్భుత అవకాశం దక్కినట్లు తెలిసింది. వీళ్ళు నిర్మించిన "డి ఫర్ దోపిడి" చిత్రంఈనెల 25న విడుదల కానున్నది. అయితే వీరు ప్రిన్స్ మహేష్ బాబుకు ఒక కథ వినిపించారట. ఆ కథ నచ్చి వెంటనే మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. ఈ చిత్రాన్ని వీరిద్దరూ కలిసి డైరెక్ట్ చేయబోతున్నారట. స్క్రిప్ట్ రెడీగా ఉండడం వలన ఏప్రిల్ నుండి సెట్స్ పైకి వెళ్లనుందని తెలిసింది. అశ్వినీదత్ నిర్మించనున్నారు. మరి ఇప్పటికే మహేష్ తో సినిమా చేయడానికి పలువురు దర్శక నిర్మాతలు క్యూలో ఉన్నారు. మరి ఈ దోపిడీ నిర్మాతలకు ఎప్పుడు అవకాశం వస్తుందో చూడాలి.

శృతి మించిన రజనీ అభిమానులు

  సూపర్ స్టార్ రజినీకాంత్ అంటే అందరికి అభిమానమే. ఇటీవలే రజినీకాంత్ పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా జరుపుకున్నారు అభిమానులు. తమిళనాడు, చెన్నయ్ లలోమరింత సందడిగా జరిగాయి. కానీ ఒకే ఒక పోస్టర్ వివాదానికి దారి తీసింది. ఈ పోస్టర్ లో రజినీకాంత్ ఓటు వేయడానికి క్యూలో నిలబడిన పోస్టర్ అది. అంతే కాకుండా ఈ పోస్టర్ లో రజనీ వెనకాల వినాయకుడు, విష్ణుమూర్తి నిలబడినట్లుగా ముద్రించారు. పైగా "తలైవా..! నువ్వు కనుక రాజకీయాల్లోకి వస్తే దేవుళ్ళు కూడా ఓటేస్తారు" అంటూ రాశారు. దీంతో విశ్వ హిందూ పరిషత్ వారికీ ఆగ్రహాన్ని కలిగించింది. హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ పోస్టర్ ఉందని వారు మండిపడుతున్నారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి జయలలిత దృష్టికి కూడా తీసుకెళ్ళే ప్రయత్నంలో ఉన్నారట. పాపం రజనికాంత్.. అభిమానం మరీ ఈ రేంజ్ లో ఉంటే, ఆయన మాత్రం ఏం చేయగలడు చెప్పండి.

కాజల్ ఇంట్లో పెళ్లి సందడి

  కాజల్ అగర్వాల్ చెల్లెలు నిషా అగర్వాల్ ఇటీవలే ప్రేమలో పడి, నిశ్చితార్థం కూడా చేసుకున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఈనెల 28న నిషా అగర్వాల్ పెళ్లి కరణ్ పలేచాతో జరగబోతోంది. ఈ సందర్భంగా కాజల్ పెళ్లి భాధ్యతలను దగ్గరుండి మరీ చూసుకుంటుంది. " నా కళ్ల ముందే పెరిగిన నా చిన్నారి చెల్లెలు తన జీవిత భాగస్వామిని ఎన్నుకునేంత ఎత్తుకు ఎదిగినందుకు సంతోషంగా ఉంది. తన సంతోషమే మా సంతోషం. ఈ 28న ముంబయ్‌లో వివాహ వేడుక జరగనుంది. మాకో "ఎమోషనల్ డే" అది. మా ఇంటికి పెళ్లి కళ వచ్చేసింది. పెళ్లి పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. చెల్లెలి పెళ్లికి సంబంధించిన పనులను దగ్గరుండి చేయడం ఓ కొత్త అనుభూతినిస్తోంది. ఉత్తరాది నుంచి దక్షిణాదికి వచ్చి నేనూ నా చెల్లెలు సినిమాలు చేస్తున్నాం. ఇక్కడివాళ్లు మమ్మల్ని ఎంతగానో ఆదరించారు. అలాగే, నా చెల్లెలి జీవితం బాగుండాలని అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నా" అని చాలా ఎమోషనల్ అంటుంది.

మహేష్ 1 పాటల లిస్ట్

  మహేష్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న "1" చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు పెరిగిపోయాయి. అయితే ఈ అంచనాలను మరింతగా పెంచే విధంగా ఇటీవలే విడుదలైన ఆడియో టీజర్ బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. మహేష్ తో కలిసి పనిచేయడం ఇదే మొదటిసారి అవడంతో సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ అదిరిపోయే పాటలను అందించాడు. ఇప్పటికే విడుదలైన రెండు బిట్ సాంగ్స్ టీజర్స్ అదిరిపోయే రేంజులో సినిమా సత్తాను చూపెడుతుంది. ఈనెల 19వ తేదిన ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమాన్ని భారీగా నిర్వహించడానికి అన్ని సిద్ధమయ్యాయి. 14రీల్స్ బ్యానర్లో అనిల్ సుంకర, గోపి ఆచంట, రామ్ ఆచంట కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో మహేష్ సరసన కృతిసనన్ హీరోయిన్ గా నటిస్తుంది. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలోని పాటల ట్రాక్ లిస్ట్ ప్రత్యేకంగా మీకోసం. 1. Who R U 2. You’re My Love 3. O Sayonara Sayonara 4. Aww TuzoMogh Kortha 5. London Babu

ఓరి నాయనో...7నిముషాలకు 6 కోట్లంట

  "ఏ దిక్కులేని వాళ్ళకు దేవుడే దిక్కు" అన్నట్లుగా... సినిమా ఛాన్సులు రాని హీరోయిన్లకు స్టేజ్ షో డాన్సులే దిక్కయ్యాయి. ప్రస్తుతం సినిమా అవకాశాల కోసం ఎదురుచూస్తున్న హీరోయిన్ల దృష్టి మొత్తం కూడా డిసెంబర్ 31 నైట్ పైనే ఉంది. ఎందుకంటే సినిమా ఛాన్సులు ఎప్పుడస్తాయో తెలియట్లేదు అందుకే అలాంటి వారికీ ఇదొక బంపర్ ఆఫర్ లా దొరికింది. దీంతో తమకు కాస్త డబ్బులు కూడా వస్తాయని ఆశిస్తున్న ఈ హీరోయిన్ల ఆశలపై స్టార్ హీరోయిన్లు నీళ్ళు చల్లుతున్నారు.   ప్రస్తుతం టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా ఈ స్టార్ హీరోయిన్లు డిసెంబర్ 31 నైట్ కు సిద్ధం అవుతున్నారు. అందులో భాగంగానే ప్రస్తుతం టాప్ హీరోయిన్లలో ఒకరైన ప్రియాంక చోప్రా తన రేటుని ఫిక్స్ చేసేసింది. డిసెంబర్ 31 రోజున కేవలం 7నిముషాలు మాత్రమే పాల్గొనడానికి అక్షరాల 6కోట్ల రూపాయలను డిమాండ్ చేసింది. ఈ అమ్మడు అడిగినంత పారితోషకాన్ని కూడా ఇవ్వడానికి నిర్వాహకులు సిద్ధంగా ఉన్నారు.   మరి ఇలా నిమిషాలకే కోట్ల రూపాయలను మింగేస్తుంటే... వీరు సినిమాలు చేయడం మానేసి, ఇలాంటివే ఒక పది రోజులకు ఒప్పుకుంటే... ఈ హీరోయిన్లే ప్రపంచంలోని అత్యంత ధనవంతులుగా మారిపోయిన ఆశ్చర్యపోనవసరం లేదు. పాపం వీళ్ళ తాకిడికి చిన్న హీరోయిన్లు ఎలా తట్టుకుంటారో ఏమో.

దొంగతనం కేసులో రచయిత కులశేఖర్

  ఒకప్పుడు సంగీత దర్శకుడు ఆర్.పి.పట్నాయక్ చిత్రాలన్నింటికీ చక్కని పాటలు అందించిన పాటల రచయిత కులశేఖర్ అందరికి సుపరిచితుడే. అయితే ఈ సుపరిచితుడిలో మరో అపరిచితుడు కూడా ఉన్నాడని ఇటీవలే తెలిసింది. కులశేఖర్ తూర్పు గోదావరి జిల్లా కాకినాడ త్రిపురసుందరి ఆలయంలోని ఆంజనేయస్వామి విగ్రహానికి ఉన్న 350 గ్రాముల వెండి కిరీటాన్ని దొంగిలించాడు. ఈ విచారణలో నిందితుడిపై నేరం రుజువు కావడంతో, న్యాయమూర్తి అతనికి ఆరు నెలల జైలు శిక్షను ఖరారు చేస్తూ తీర్పునిచ్చారు. అందమైన పాటలను రాసే ఈ రచయితలో మరో అపరిచితుడు కూడా ఉన్నాడని తెలిసి, సినీపరిశ్రమ షాక్ కు గురైంది.

హార్ట్ ఎటాక్ అప్పుడే ప్లాన్ చేసాడు

  పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్నతాజా చిత్రం "హార్ట్ ఎటాక్". నితిన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని అనుకున్నారు. కాని సంక్రాంతి బరిలో మహేష్ "1", చరణ్ "ఎవడు" వంటి చిత్రాలు విడుదలవుతున్నాయి. కాబట్టి ఈ సినిమాల తాకిడి "హార్ట్ ఎటాక్"కు ఉండకూడదని, దర్శకుడు ఈ సినిమాను సంక్రాంతి బరిలో నుంచి తీసేసారు. ఈ చిత్రం ప్రేమకు సంబంధించిన కథ కాబట్టి... ఫిబ్రవరి 14 ప్రేమికులరోజు సందర్భంగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ కు మంచి స్పందన వస్తుంది. అనూప్ అందించిన ఆడియో త్వరలోనే విడుదల కానుంది. అసలే రెండు హిట్ చిత్రాలతో సంతోషంగా ఉన్న నితిన్ కు ఈ సినిమా ఎలాంటి విజయం అందజేస్తుందో త్వరలోనే తెలియనున్నది.