ముసలి దర్శకుడికి డేటింగ్ పండగ!

      మనదేశంలో దసరా ఎంత సరదాగా జరుగుతుందో, అమెరికాలో డేటింగ్ అంత సరదాగా జరుగుతుంది. ఇండియాలో ఎవరైనా ముసలాయన ఆ విషయంలో ఓవర్ యాక్షన్ చేస్తుంటే ‘ముసలోడికి దసరాపండగ’ అంటాం. అదే అమెరికా ముసలాయన డేటింగ్ విషయంలో ఫాస్ట్.గా వుంటే ‘ముసలోడికి డేటింగ్ పండగ అనొచ్చేమో’. హాలీవుడ్‌లో ఓ ముసలి దర్శకుడు 84 ఏళ్ళ వయసులో డేటింగ్ చేస్తూ వుండటం అక్కడ హాట్ టాపిక్‌గా మారింది. ఆ ముసలి దర్శకుడు వేరెవరో కాదు.. క్లింట్ ఈస్ట్ వుడ్! ఈయనగారు కాల్నిఫోర్నియాలోని ఓ హోటల్ ఉద్యోగితో డేటింగ్ చేస్తున్నట్టు ఆంగ్ల ప్రతికలు, వెబ్ సైట్లు కోడై కూస్తున్నాయి. హాలీవుడ్ దర్శకుడు క్లింట్ ఈస్ట్ ఉడ్, హోటల్ ఉద్యోగి సాండెరా ఇద్దరు కలిసి అన్యోన్యంగా సూపర్ మార్కెట్ లో షాపింగ్ చేస్తూ, ముద్దులు పెట్టుకుంటూ మీడియా కంటపడ్డారు. పెద్దాయన ఈ డేటింగ్ వ్యవహారం గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగిస్తున్నాడట. ఈ ముసలాయన వరస చూసి హాలీవుడ్‌లో అందరూ నోళ్లు నొక్కుకుంటున్నారు. ఇవేమీ పట్టించుకోకుండా క్లింట్ ఈస్ట్ వుడ్ తన గర్ల్ ఫ్రెండ్‌తో షికార్లు కొడుతున్నాడు. గర్ల్ ఫ్రెండ్‌ సాండెరాని పెళ్ళి చేసుకోవడానికి వీలుగా తన భార్యకి విడాకులు ఇచ్చే ఆలోచనలో కూడా ఈస్ట్ వుడ్ వున్నట్టు సమాచారం.

‘జంప్ జిలానీ’ షార్ట్ అండ్ స్వీట్ రివ్యూ

  నటీనటులు: అల్లరి నరేష్ (ద్విపాత్రాభినయం), ఇషా చావ్లా, స్వాతి దీక్షిత్, కోట శ్రీనివాసరావు, పోసాని కృష్ణ మురళి, వేణుమాధవ్, రఘుబాబు, రావు రమేష్, హేమ. సంగీతం: విజయ్, నిర్మాత: అంబికా రాజు, దర్శకత్వం: సత్తిబాబు. టాలీవుడ్ కామెడీ స్టార్ అల్లరి నరేష్ నటించిన ‘జంప్ జిలానీ’ బుధవారం విడుదలైంది. అల్లరి నరేష్ తండ్రి ఇ.వి.వి. సత్యనారాయణ దర్శకత్వం వహించిన ‘హలో బ్రదర్’ సినిమా ఈ సినిమాకి స్ఫూర్తి అనే డౌట్ వచ్చినప్పటికీ ఇది తమిళంలో రూపొందిన ఒక సినిమాకి రీమేక్.   ‘సత్యనారాయణ విలాస్’ అనే హోటల్ యజమానికి కవల కొడుకులైన సత్తిబాబు, రాంబాబుల కామెడీ కథ ఈ సినిమా. పాతతరం హోటల్‌ని నేటి పోటీ ప్రపంచంలో ఎలా డెవలప్ చేయాలా అని ఆలోచిస్తూ వుండే వ్యక్తి సత్తిబాబు అయితే, పరమ గాలిబ్యాచ్ రాంబాబు. సినిమా కథ హోటల్ కామెడీలోంచి ప్రేమలోకి మారి, ఆ ప్రేమను సక్సెస్ చేసుకునే ప్రయత్నంలో రాయలసీమ ఫ్యాక్షనిస్టుల మధ్యకి మళ్ళుతుంది. ఫ్యాక్షనిస్టులు సత్తిబాబును వెంటపడి తరుముతూ వుంటారు. వారి నుంచి సత్తిబాబు, రాంబాబు ఎలా తప్పించుకున్నారు. తమ ప్రేమను ఎలా సక్సెస్ చేసుకున్నారు? తమ హోటల్‌ని ఎలా డెవలప్ చేసుకున్నారన్నది ఈ సినిమా కథాంశం.   కామెడీ పాత్రలను ధరించడంలో బాగా ముదిరిపోయిన అల్లరి నరేష్ ఈ సినిమాలో కూడా ప్రేక్షకులను నవ్వించే ప్రయత్నం చేశాడు. రాయలసీమ ఫ్యాక్షన్ లీడర్‌గా పోసాని కృష్ణమురళి తనదైన శైలిలో ఇరగదీశాడు. హీరోయిన్లు ఇద్దరూ అందాల ప్రదర్శనలో ఒకరితో ఒకరు పోటీపడ్డారు. రావు రమేష్ కామెడీతోపాటు విలనీని కూడా ప్రదర్శించే ప్రయత్నించారు. రఘుబాబు, వేణుమాధవ్ పాత్రలకు పెద్దగా సీన్ లేకపోయినా వాళ్ళు కూడా ప్రేక్షకులను నవ్వించే ప్రయత్నం చేశారు.   అలరి నరేష్ సినిమాలకు ప్రేక్షకులు వినోదం కోసం వెళ్తారు తప్పితే విజ్ఞానం కోసం కాదు. లాజిక్కులు వెతికేవారు ఎంజాయ్ చేయలేరేమోగానీ, హాయిగా నవ్వుకుందామని వెళ్ళిన ప్రేక్షకులు మాత్రం తమకు కావలసిన వినోదాన్ని ఈ సినిమా ద్వారా తప్పకుండా పొందుతారు.

రజనీకాంత్ కూతురు నోటి దురద!

      రజనీకాంత్ కూతురు సౌందర్యకి నోటి దురద కాస్త ఎక్కువలా వుంది. అలాగే దారిన పోయే తద్దినాలని నెత్తినపెట్టుకునే రకంలా కూడా కనిపిస్తోంది. కాస్త పైత్యం లక్షణాలు కూడా ఆమెలో కనిపిస్తున్నాయి. లేకపోతే ఏంటండీ? పెట్టుకోక పెట్టుకోక శింబుతోనే గొడవ పెట్టుకుంది. అవనసరంగా లేనిపోని కామెంట్స్ చేసింది. ఆ ఇష్యూ ఇంటర్నెట్‌లో పెద్దదయ్యేసరికి నాలుక్కరుచుకుని ఏదో సరదాగా కామెంట్‌ చేశానని సర్దిచెబుతోంది.   అసలింతకీ ఏంజరిగిందంటే, సౌందర్య దర్శకత్వం వహించగా రూపొందిన ‘కొచ్చాడియాన్’ చిత్రం మొన్నీమధ్య విడుదలైన విషయం తెలిసిందే. ఆ సినిమా చూసిన శింబు సోషల్ నెట్‌వర్క్‌లో సినిమా చాలా బాగుందని, దర్శకురాలు సౌందర్య రజనీకాంత్ అశ్విన్‌కు అభినందనలు.  చిత్రంలోని గ్రాఫిక్స్ సన్నివేశాలు హాలీవుడ్ చిత్రాలకు దీటుగా లేకపోయినా ఆమె ప్రయత్నం భేష్ అని కామెంట్ పెట్టాడు. సాధారణంగా ఈ కామెంట్‌కి ఎలా స్పందిస్తారు? ‘‘థాంక్యూ శింబూ’’ అని స్పందిస్తారు. అయితే సౌందర్య మాత్రం శింబుకి థాంక్స్ చెబుతూనే, ఈ ఇష్యూతో అసలు సంబంధం లేని కామెంట్ చేశారు. తానేగనుక ఒక పత్రికా విలేకరినయితే శింబు ఇకపై పాడటాన్ని నిలిపి వేయాలని చెబుతానని సౌందర్య సోషల్ మీడియాలో కామెంట్ చేశారు. ఇది చూసి జనం ఇదేంట్రా దేవుడా అనుకున్నారు. శింబు ఫ్యాన్స్ అయితే సౌందర్య మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. నెట్‌లో కామెంట్ల మీద కామెంట్లు చేసి ఇష్యూని హాట్ హాట్ చేసేశారు. దీంతోపాటు శింబు, సౌందర్య మధ్య ఇంటర్నెట్ వేదిక మీద మాటల యుద్ధం కూడా జరిగింది. చివరికి సౌందర్య తన తప్పు తెలుసుకుందో, రజనీకాంత్ ఏంటీ న్యూసెన్స్ అని వార్నింగ్ ఇచ్చాడోగానీ శింబుకి ఇంటర్నెట్‌లోనే సారీ చెప్పింది.  శింబుపై సరదాగానే కామెంట్ చేశానని, శింబు తన చిన్నప్పటి ఫ్రెండ్ కావడంతో సరదాగా కామెంట్లు పోస్టు చేశానని, దీన్ని సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పింది. దానికి శింబు నెట్‌లోనే ప్రతిస్పందిస్తూ,  విమర్శించే హక్కు, భావ స్వేచ్ఛ ప్రతి ఒక్కరికీ ఉంటుందని ఆమె తన స్నేహితురాలేనని, తమ మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవని స్పష్టం చేశాడు. దీంతో ఈ గొడవ సర్దుమణిగింది.

డోకొచ్చేట్టున్న రాఖీ సావంత్!

      బాలీవుడ్ నటి, టీవీ ప్రెజెంటర్ రాఖీ సావంత్‌ని, ఆమె వ్యవహారశైలిని చూసి చాలామంది ముఖాలు చిట్లిస్తారు. ఆమె నోరు తెరిచి మాట్లాడిందంటే చాలు.. ఎలాంటి వారైనా వినలేక చెవులు మూసుకుంటారు. జనంలో అంత మంచి ఇమేజ్ సంపాదించుకున్న రాఖీ సావంత్ ఈమధ్య జనాన్ని భయపట్టడం మాత్రమే కాకుండా ఏకంగా డోకు తెప్పించేంత పని చేసింది. ఓ మరాఠీ చిత్రాన్ని నిర్మిస్తూ, నటిస్తున్న రాఖీ సావంత్‌ ఆ సినిమాకి సంబంధించిన మీడియా మీట్‌కి ఘోరంగా మేకప్ చేయించుకుని వచ్చింది. రాఖీ సావంత్‌ని ఆమేకప్‌లో చూసిన వాళ్ళందరూ కడుపులో తిప్పినంత పనయి డోక్కోబోయి తమాయించుకున్నారట. ఇంతకీ రాఖీసావంత్‌ని సదరు మేకప్‌లో చూస్తే డోకు వస్తుందో లేదో స్వయంగా తెలుసుకోవాలంటే ఈ ఫొటోని ఒక్కసారి పరీక్షగా చూడాలిమరి.

‘అభినందన’ దర్శకుడి ఆరోగ్యం సీరియస్!

    ‘అభినందన’, ‘నీరాజనం’ చిత్రాలకు దర్శకత్వం వహించిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ అశోక్‌కుమార్ తీవ్ర అస్వస్థతతో చెనై్నలోని ఎస్.ఆర్.ఎం. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం విషమించినట్టు తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న అశోక్ కుమార్ ను చికిత్స కోసం చెన్నైలోని ఎస్ఆర్ఎమ్ ఆస్పత్రిలో చేర్పించినట్టు ఆయన కుమారుడు అకాశ్ అశోక్ కుమార్ తెలిపారు. అశోక్ కుమార్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. పలు భాషల్లో 100 పైగా చిత్రాలకు అశోక్ కుమార్ సినిమాటోగ్రఫీని అందించారు. 'నెంజాతాయ్ కిల్లతే' చిత్రానికి 1980లో అశోక్ కుమార్‌కు ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌గా జాతీయ అవార్డు లభించింది. హిందీలో సచ్చాప్యార్, బ్యాక్ వాటర్ అనే ఆంగ్ల చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు. అశోక్ కుమార్ దర్శకత్వం వహించిన అభినందన (తెలుగు), ఆంద్రూ పీతా మజాయిల్ (తమిళ), కామాగ్ని (హిందీ) మంచి పేరును తెచ్చిపెట్టడమే కాకుండా అవార్డులను సంపాదించిపెట్టాయి.

కరిష్మా కపూర్‌కి మళ్ళీ పెళ్ళి?

      తెలుగులో హిట్టయిన ‘ప్రేమఖైదీ’ హిందీ సినిమా ద్వారా హీరోయిన్‌గా బాలీవుడ్ తెరమీద మెరిసిన కరిష్మా కపూర్ రాజ్ కపూర్ మనవరాలిగా, రణధీర్ కపూర్ కూతురిగా, కరీనా కపూర్ అక్కగా అందరికీ తెలిసిన అందగత్తే! చాలాకాలం హీరోయిన్‌గా వెలిగిన కరిష్మా ఆ తర్వాత సంజయ్ కపూర్ని పెళ్ళి చేసుకుంది. చాలామంది హీరోయిన్ల తరహాలోనే ఆమెకి కూడా భర్తతో విభేదాలు వచ్చి విడాకులు తీసుకుంది. విడాకులు తీసుకున్న తర్వాత చాలాకాలానికి కరిష్మాకి ఇప్పుడు మళ్ళీ పెళ్ళి మీద గాలి మళ్ళినట్టు తెలుస్తోంది. సంజయ్ కపూర్‌ నుంచి విడాకులు రావడానికి సహకరించిన సందీప్ తోష్నివాల్ అనే హాండ్సమ్‌ గైతో కరీనా ప్రేమలో పడిపోయింది. కొంతకాలంగా వారి ప్రేమాయణం సాగుతోంది. ఇప్పుడు వీరిద్దరూ పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం.   సందీప్ తోష్నీవాల్ ముంబైలోని ఓ హెల్త్ కంపెనీకి సీఈవో. వీళ్ళ పెళ్ళికి ఇద్దరి వైపునుంచి పెద్దలు ఓకే అనేశారని తెలుస్తోంది. త్వరలో వీరిద్దరూ ఎంచక్కా పెళ్లిచేసుకోబోతున్నారు. కరిష్మాకి ఇది రెండో పెళ్ళి. అలాగేని సందీప్ తోష్నివాల్ బాలాకుమారుడని అనుకోకండి. ఈయనగారు కూడా గతంలో తన మొదటి భార్యకు విడాకులిచ్చేశాడు.  అన్నట్టుకు కరిష్మాకి ఇద్దరు పిల్లలున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటో!? ఓకే.. ఏది ఏమైనా వీళ్ళిద్దరి మొదటి పెళ్ళి ఫట్టయింది.. రెండో పెళ్ళయినా హిట్టవ్వాలని ఆశీర్వదిద్దాం. కరీనా పిల్లలకి సందీప్ తోష్నివాల్ నుంచి తండ్రిప్రేమ దొరుకుతుందని ఆశిద్దాం.

మహేష్ వివరణ: ‘ఆగడు’ టీజర్‌ని ఆపుతారా?

  మహేష్‌బాబు కథానాయకుడిగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆగడు’ సినిమా టీజర్ ఈమధ్య విడుదలైంది. విడుదలైన మొదటి నిమిషం నుంచే ఈ ట్రైలర్ సంచలనం సృష్టించింది. ఈ టీజర్‌లో మహేష్‌బాబు చెప్పిన డైలాగ్స్ పవన్ కళ్యాణ్‌ని ఉద్దేశించి వున్నాయన్న విమర్శలు వెల్లువెత్తాయి. పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్స్‌కి కౌంటర్‌గా ‘ఆగడు’లో మహేష్ చెప్పిన డైలాగ్స్ వున్నాయి. 'ప్రతివోడు పులులు, సింహాలు, ఏనుగులు, ఎలకలతో ఎదవ కంపారిజన్స్..ఎలపనం వచ్చేస్తుంది' అంటూ 'ఆగడు'లో ప్రిన్స్ మహేష్ బాబు చెప్పిన డైలాగులపై పవర్ స్టార్ అభిమానులు సోషల్ మీడియాపై ఘాటుగా స్సందించారు. తమ హీరోపై సెటైర్లు వేస్తారా అంటూ నిష్టూరమాడారు. ఈ వివాదం, విమర్శలు బాగా పెరిగిపోతూ వుండటంతో మహేష్ బాబు వివరణ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి ఈ డైలాగులు చెప్పలేదని స్పష్టం చేశారు. అసలు ఎవరినీ ఉద్దేశించి ఈ డైలాగులు రాయలేదని చెప్పారు. పాత్ర స్వభావానికి అనుగుణంగా డైలాగులున్నాయని వివరించారు. అయితే మహేష్ వివరణ మీద కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు స్పందిస్తున్నారు. పవన్ కళ్యాణ్‌ని ఉద్దేశించి డైలాగ్స్ చెప్పలేదని అనడంతో సరిపోదని, ‘ఆగడు’ టీజర్‌ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

యోయో హనీ సింగ్‌ బతికే వున్నాడు..!

      ప్రస్తుతం సోషల్ మీడియా హవా నడుస్తోంది. సోషల్ మీడియాలో ఎవరైనా ఏదైనా వార్త పోస్ట్ చేశారంటే ఆ వార్త క్షణాల్లో ప్రపంచాన్ని చుట్టేస్తుంది. తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త గుప్పుమంది. అదేంటంటే, ప్రముఖ సింగర్ యోయో సింగ్ యాక్సిడెంట్‌కి గురయ్యాడని, ఆ ప్రమాదంలో యోయో సింగ్ తీవ్రంగా గాయపడి చనిపోయాడు. ఈ వార్తతోపాటు హాస్పిటల్‌లో వున్న ఒక పేషెంట్ ఫొటో కూడా ప్రపంచం మొత్తం చుట్టేసింది. సదరు ఫొటో మసగ్గా వుండేసరికి చాలామంది పాపం యోయో సింగ్ చనిపోయాడని అనుకున్నారు. మనసులో యోయో సింగ్‌కి శ్రద్ధాంజలి కూడా ఘటించేశారు. కొంతమంది అయితే సంతాప సభలు కూడా ఏర్పాటు చేయడానికి ఉత్సాహం చూపించారు. ఈ పుకారు అలా అలా ప్రయాణించి చివరికి యోయో సింగ్‌కి చేరింది. యోయో సింగ్ కూడా తనకు తాను సంతాపం ప్రకటించుకోబోయి, తాను బతికే వున్న విషయం, తనకు ఏ యాక్సిడెంటూ కాని విషయం గుర్తుకొచ్చి నాలుక్కరుచుకున్నాడు. ఈ పుకార్లని ఇక్కడితో ఖండించకపోతే పరిస్థితి ఇంకా డేంజరయ్యే అవకాశం వుందని తాను ట్వి్ట్టర్‌లోకి లైన్లోకి వచ్చాడు. నాకు ఎలాంటి యాక్సిడెంట్ కాలేదు, నేను బతికే వున్నాను. నమ్మండి ప్లీజ్ అంటు ట్విట్టర్‌లో ట్విట్ పోస్ట్ చేశాడు. పాపం యోయో సింగ్‌కి ఇదెక్కడి ఖర్మ?

పవన్‌కళ్యాణ్‌ మీద ‘ఆగడు’ మహేష్ సెటైర్లు

  మహేష్‌బాబు హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆగడు’ సినిమా టీజర్ విడుదలైంది. ఈ టీజర్‌ విడుదల కోసం ఎదురుచూస్తున్న మహేష్ అభిమానులు అదిరిపోయేలా వున్న టీజర్ చూసి పండగ చేసుకుంటున్నారు. టీజర్‌లో వినిపించిన ‘స్పెషల్ కామెంట్లు’ విని రెచ్చిపోతున్నారు. అయితే ఈ టీజర్ చూసిన పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం బిత్తరపోయారు. ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు మహేష్‌బాబు తమ హీరో పవన్ కళ్యాణ్‌ మీద ఎందుకు పడ్డాడా అని ఆలోచించీ ఆలోచించీ వాళ్ళ బుర్రలు హీటెక్కిపోతున్నాయి. ఇంతకీ అసలు విషయం ఏంటంటే, ‘ఆగడు’ టీజర్‌లో మహేష్‌బాబు పోలీస్ ఆఫీసర్‌గా కనిపించాడు. టీజర్ మొదలవటం మొదలవటమే ‘‘సినిమాల ప్రభావం జనాల మీద ఎంతుందో తెల్దుగానీ, పంచ్ డైలాగుల ప్రభావం మాత్రం గట్టిగా వుంది’’ అని మహేష్ చెబుతాడు. ఈ కామెంట్ ఎవర్ని ఉద్దేశించి అన్నాడా అని జనం ఆలోచనలో వుండగానే మరో పవర్ ఫుల్ డైలాగ్ మహేష్ నోట్లోంచి బయటకి వస్తుంది. ‘‘ప్రతివోడూ పులులు, సింహాలు, ఏనుగులు, ఎలకలతోటి ఎదవ కంపారిజన్... ఎలపరం వచ్చేస్తంది’’ అంటాడు. దాంతో మహేష్‌బాబు ఈ టీజర్‌లో పవన్ కళ్యాణ్‌ని టార్గెట్ చేశాడని అందరికీ అర్థమైపోయి ముక్కున వేలేసుకుంటున్నారు. ‘అత్తారింటికి దారేది’ సినిమాలో పవన్ కళ్యాణ్ తనని సింహంతో పోల్చుకుంటూ చెప్పిన పంచ్ డైలాగ్‌ బాగా పాపులర్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు మహేష్ ‘ఆగడు’ టీజర్ ఈ డైలాగ్ మీద, పవన్ కళ్యాణ్ మీద సైటైర్లు విసిరినట్టుగా వుందని పవన్ కళ్యాణ్ అభిమానులు ఫీలవుతున్నారు. సాటి హీరో మీద, సాటి హీరో సినిమా మీద మహేష్ ఇలా సెటైర్లు విసరడం న్యాయం కాదని పవన్ కళ్యాణ్ అభిమానులు అనుకుంటున్నారు. తన సినిమాలలో ఎవరో ఒక సినిమా వ్యక్తి మీద కామెంట్లు చేసే శ్రీను వైట్ల తన దుష్ట సంప్రదాయాన్ని ‘ఆగడు’లో కూడా కొనసాగించారని, అయితే దీనికి మహేష్ బాబు మద్దతు ఇవ్వడం మాత్రం అన్యాయమని బాధపడుతున్నారు.

క్రికెటర్ సురేష్ రైనాతో శ్రుతి హాసన్ డేటింగ్..!

      చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బ్యాట్స్ మెన్, ఇండియన్ క్రికెటర్ సురేష్ రైనాతో కమల్ హాసన్ కూతురు, క్రేజీ హీరోయిన్ శ్రుతి హాసన్ డేటింగ్ చేస్తున్నట్లు ఓ హాట్ న్యూస్ మీడియాలో ప్రచారం చేస్తోంది. క్రికెటర్లతో సినిమా కథానాయికలు ప్రేమాయణం సాగించడం కొత్తేమి కాదు. గతంలో చాలా మంది ఇండియన్ క్రికెటర్లు బాలీవుడ్ ముద్దుగుమ్మలతో ఎఫైర్లు కొనసాగించిన సంగతి తెలిసిందే. రీసెంట్ గా ఇండియన్ స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లి కూడా బాలీవుడ్ భామ అనుష్క శర్మతో డేటింగ్ చేస్తున్నట్లు వరుస కథనాలు కూడా వచ్చాయి. లేటెస్ట్ గా శ్రుతి హాసన్ సురేష్ రైనాతో కలిసి డేటింగ్ లాంటి వ్యవహారాలు నడుపుతోందంటూ కొన్ని పత్రికలు కథనాలు ప్రచురించాయి. శ్రుతి గత ఐపీఎల్ సీజన్ లో చెన్నై మ్యాచ్ లకు హాజరై తన మద్దతు తెలుపుతూ సందడి కూడా చేసింది. అయితే ప్రస్తుతం తాను షూటింగ్ లతో బిజీగా ఉండడంతో ఖాళీ దొరికినప్పుడు చెన్నై పార్టీలకు మాత్రం హాజరవుతుందట. ఐపీఎల్ 7లో సూపర్ జోష్ లో వున్న సురేష్ రైనా అసలు రహస్యం ఇదేనని సోషల్ మీడియాలో కొంతమంది సెటైర్లు కూడా వేస్తున్నారు.

'మనం' అక్కినేని చూడలేకపోవడం బాధాకర౦: వర్మ

      ట్విట్టర్ లో కాంట్రవర్సీ కామెంట్ లతో వార్తలలో నిలిచే రామ్ గోపాల్ వర్మ తాజాగా 'మనం' మూవీపై ప్రశంసల వర్షం కురిపించాడు. బాలీవుడ్ లో ఈ చిత్రం విడుదలై ఉంటే సులభంగా వంద కోట్ల రూపాయలు వసూలు చేసేదని అన్నారు. నాగేశ్వరరావు గారితో తొలిసారిగా నాగార్జున నటించేటప్పడు తడబాటుకు గురయ్యాడు. అయితే నాగ చైతన్య విషయంలో అలాంటిది జరగలేదని. నాగార్జున కంటే నాగచైతన్యనే బెటర్ గా యాక్ట్ చేశారని వర్మ ట్వీట్ చేశారు. మనం చిత్రాన్ని ఎన్నార్ చూడలేకపోవడం చాలా బాధాకరమని అన్నారు. అక్కినేని కుటుంబంలోని మూడు తరాల హీరోలు నటించిన 'మనం' సూపర్ హిట్ టాక్ తో బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఈ సినిమా టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తుందని అంటున్నారు.

'మనం' రివ్యూస్ రిపోర్ట్: చరిత్ర సృష్టిస్తుందట!

      అక్కినేని కుటుంబంలోని మూడు తరాల హీరోలు నటించి చరిత్ర సృష్టించిన చిత్రం 'మనం'. నట దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావు నటించిన చివరి చిత్రం కూడా 'మనం'మే. గత కొంత కాలంగా ఈ సినిమా చూడడానికి తెలుగు సినిమా ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచుస్తున్నారు. అయితే ఈ 'మనం' ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రాన్ని సినీ విమర్శకులు పొగడ్తలతో ముంచెత్తడం విశేషం. అక్కినేనికి సిసలైన నివాళిగా ఈ చిత్రం నిలిచిపోతుందని వారు అంటున్నారు. అనూప్‌ సంగీతం ఈ చిత్రానికి ప్రాణ వాయువుగా మారింది. పాటలన్నీ వీనుల విందుగానే కాక కనువిందు చేశాయట. నాగ చైతన్య ఈ సినిమాలో మంచి నటనను కనబరిచారని అ౦టున్నారు. సమంత, చైతన్య కెమిస్ట్రీ మరోసారి బాగా కుదిరిందని అంటున్నారు. విక్రమ్‌ కుమార్‌... అక్కినేని హీరోలందరినీ ఒకే కథలోకి తెచ్చే ఛాలెంజ్‌ని యాక్సెప్ట్‌ చేసి దానిని సక్సెస్‌ఫుల్‌గా అచీవ్ చేసాడు. అక్కినేనికి సిసలైన నివాళిగా ఈ చిత్రం నిలిచిపోతుందని.. ఆయన నటించడంతో సినీ చరిత్ర పుటల్లో ఈ సినిమా చేరడం ఖాయమని అంటున్నారు.

నాజర్ కొడుక్కి యాక్సిడెంట్: పరిస్థితి విషమం

  తమిళ, తెలుగు, హిందీ భాషల్లో కేరెక్టర్ నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న నాజర్ కుమారుడు ఫైజల్ చెన్నైలో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఫైజల్ పరిస్థితి ప్రస్తుతం విషమంగా వున్నట్టు తెలుస్తోంది. తలకు బలంగా గాయాలు తగలడంతో పరిస్థితి చెయ్యిదాటిందని తెలుస్తోంది. ప్రస్తుతం ఫైజల్ చెట్టినాడులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఫైజల్ తన స్నేహితులతో కలసి కారులో చెన్నై నుంచి మహాబలిపురం వైపు వెళ్తుండగా కారు ప్రమాదానికి గురైంది. ఫైజల్ ఈ ప్రమాదం నుంచి కోలుకోవాలని కోరుకుంటూ తమిళనాడులోని అనేకమంది నటులు, నటీమణులు ట్విట్లు పోస్టు చేశారు. ఫైజల్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడాలని మనమూ కోరుకుందాం.

‘రభస’ ఫస్ట్ లుక్ సూపరెహె: ‘జక్కన్న’ రాజమౌళి ప్రశంస

  దర్శకుడు రాజమౌళి తాను రూపొందించే సినిమాలను శిల్పం చెక్కినట్టు చెక్కుతూ వుంటారు. అందుకే ఆయన సినిమాలు వరుసగా విజయాలు సాధిస్తున్నాయి. రాజమౌళికి వున్న ఈ లక్షణాన్ని చూసి జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళిని అమరశిల్పి జక్కనతో పోలుస్తూ ‘జక్కన్న’ అని పిలుస్తూ వుంటారు. ఆ జక్కన్న రాజమౌళి ఎన్జీఆర్ తాజా చిత్రం ‘రభస’ ఫస్ట్ లుక్‌ని ఫేస్ బుక్‌లో అభినందించారు. జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న రభస ఫస్ట్‌లుక్ పోస్టర్స్ రిలీజ్ చేశారు. బెల్లంకొండ సురేష్ నిర్మాణ వహిస్తోన్న ఈ సినిమాను సంతోష్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్నారు. జూనియర్ సరసన సమంత నటిస్తోంది. సోషల్ నెట్‌వర్నింగ్ సైట్‌లలో ఇప్పటికే హల్‌చల్ చేస్తోన్న ఈ ఫస్ట్‌లుక్ ఫోటోలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ పవర్‌ఫుల్ పోస్టర్‌లను రాజమౌళి ఫేస్ బుక్‌లో అభినందించారు. ''ఎన్టీఆర్‌ని ఇటువంటి పోస్టర్లలో చూసి చాలా రోజులవుతుంది'' అని ఫేస్‌బుక్‌లో పెట్టారు. జక్కన్నకి నచ్చాయంటే ఇక చెప్పేదేముంది?

‘బాహుబలి’ ప్రభాస్ భుజానికి అసలేమైంది? చిన్న గాయమేనా?

  రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న భారీ చిత్రం ‘బాహుబలి’ సెట్స్ మీద వుంది. అత్యంత భారీ వ్యయంతో రూపొందుతున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు, ఎదురుచూపులు వున్నాయి. ‘బాహుబలి’ అనేది ఒక పేరు కావొచ్చు.. నిజానికి ఆ మాటకు అర్థం బలమైన చేతులున్నవాడు అని. సినిమాలో ప్రభాస్‌కి బలమైన చేతులున్నాయేమోగానీ, నిజ జీవితంలో మాత్రం కాస్తంత బలహీనమయ్యాయి. కండలు తిరిగిన చేతులున్న ప్రభాస్‌ ఒక భుజానికి ఆమధ్య ‘బాహుబలి’ షూటింగ్ సమయంలోనే గాయమైంది. ఆ విషయం అప్పట్లో మీడియాకి లీక్ అయినప్పటికీ యూనిట్ దాన్ని కొట్టిపారేశారు. తాజాగా సోషల్ మీడియాలో ప్రభాస్ తన భుజానికి శస్త్రచికిత్స చెప్పాడు. దాని ప్రకారం ప్రభాస్‌కు బాహుబలి షూటింగ్‌లో భుజానికి గాయలయ్యాయట. అయితే ఆ సమయంలో భుజానికి శస్త్ర చికిత్స చేయించుకోక పోవడంతో గాయాలు తిరగ బెట్టాయట ఇక లాభం లేదని ప్రభాస్ వెంటనే ఆపరేషన్ చేయించుకున్నాడు. నిజానికి ఈ ఆపరేషన్ చాలా రోజుల క్రితం జరగాల్సింది. కానీ నేనే ఆలస్యం చేస్తూ వచ్చాను. ప్రస్తుతం అంతా బాగానే వుంది. మరో నెల రోజుల్లో 'బాహుబలి' షూటింగ్‌లో పాల్గొంటాను. నా ఆరోగ్య విషయంలో ఎవరూ కంగారుపడాల్సిన అవసరం లేదని ప్రభాస్ తెలిపాడు.

‘బాహుబలి’ బాహువుకి ఏమైంది?

  రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న భారీ చిత్రం ‘బాహుబలి’ సెట్స్ మీద వుంది. అత్యంత భారీ వ్యయంతో రూపొందుతున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు, ఎదురుచూపులు వున్నాయి. ‘బాహుబలి’ అనేది ఒక పేరు కావొచ్చు.. నిజానికి ఆ మాటకు అర్థం బలమైన చేతులున్నవాడు అని. సినిమాలో ప్రభాస్‌కి బలమైన చేతులున్నాయేమోగానీ, నిజ జీవితంలో మాత్రం కాస్తంత బలహీనమయ్యాయి. కండలు తిరిగిన చేతులున్న ప్రభాస్‌ ఒక భుజానికి ఆమధ్య ‘బాహుబలి’ షూటింగ్ సమయంలోనే గాయమైంది. ఆ విషయం అప్పట్లో మీడియాకి లీక్ అయినప్పటికీ యూనిట్ దాన్ని కొట్టిపారేశారు. తాజాగా సోషల్ మీడియాలో ప్రభాస్ తన భుజానికి శస్త్రచికిత్స చెప్పాడు. దాని ప్రకారం ప్రభాస్‌కు బాహుబలి షూటింగ్‌లో భుజానికి గాయలయ్యాయట. అయితే ఆ సమయంలో భుజానికి శస్త్ర చికిత్స చేయించుకోక పోవడంతో గాయాలు తిరగ బెట్టాయట ఇక లాభం లేదని ప్రభాస్ వెంటనే ఆపరేషన్ చేయించుకున్నాడు. నిజానికి ఈ ఆపరేషన్ చాలా రోజుల క్రితం జరగాల్సింది. కానీ నేనే ఆలస్యం చేస్తూ వచ్చాను. ప్రస్తుతం అంతా బాగానే వుంది. మరో నెల రోజుల్లో 'బాహుబలి' షూటింగ్‌లో పాల్గొంటాను. నా ఆరోగ్య విషయంలో ఎవరూ కంగారుపడాల్సిన అవసరం లేదని ప్రభాస్ తెలిపాడు.

తొలి ఫలితం తెలంగాణలో చార్మినార్, ఆంధ్రలో రాజోలు

      ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో తొలి ఫలితం తెలంగాణలోనే వెల్లడి కానుంది. చార్మినార్ అసెంబ్లీ ఫలితం 13 రౌండ్లలో తేలిపోనుంది. కాబట్టి ఉదయం పది గంటలకే ఈ నియోజకవర్గ ఫలితం వచ్చే అవకాశం ఉంది. ఇక, సీమాంధ్రలో తూర్పు గోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గ ఫలితం 14 రౌండ్లలో పూర్తి కానుంది. దీంతో, చార్మినార్ కానీ, రాజోలు కానీ తొలి ఫలితంగా వెల్లడయ్యే అవకాశం ఉంది. ఇక, లోక్‌సభ ఎన్నికల ఫలితాలకు సంబంధించి అనకాపల్లి ఫలితం మొదట వెల్లడి కానుంది. ఇక్కడ 18 రౌండ్లలో అధికారు లు ఫలితాన్ని వెల్లడించనున్నారు. అదే విధంగా, రాష్ట్రంలోనే అత్యధిక మంది ఓటర్లు, అభ్యర్థులు పోటీ పడిన మల్కాజిగిరి పార్లమెంటు ఫలితం మాత్రం చిట్టచివరన రానుంది. ఈ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని కూకట్‌పల్లి అసెంబ్లీ ఫలితం కూడా చివరనే రానుంది. ఈ రెండుచోట్ల 45 రౌండ్లుపాటు ఓట్లను లెక్కించనున్నారు.

కాలుజారిన పూనమ్!

  నిన్నటి తరం గ్లామర్ హీరోయిన్ పూనమ్ ధిల్లాన్ వయసు మీద పడినా తన గ్లామర్‌ని ఎంతమాత్రంకోల్పోకుండా అప్పట్లో ఎలా మిలమిలా మెరిసేదో ఇప్పుడు కూడా మిలమిలా మెరవడమే కాకుండా చమక్‌మని అంటూ వుంటుంది. అలాంటి పూనమ్ ధిల్లాన్ లేటెస్ట్ గా కాలుజారి పడిపోయింది. ఇదెలా జరిగిందంటే, ముంబైలోని ప్రముఖ డిజైనర్ విక్రమ్ ప్రడ్నిస్ ఏర్పాటు చేసిన ఫ్యాషన్ ఈవెంట్‌కి పూనమ్ ధిల్లాన్ చీఫ్ గెస్ట్ గా హాజరైంది. ర్యాంప్ మీద యువతరం మోడల్స్ తమ కులుకులు ప్రదర్శిస్తుండగా, పూనమ్ ధిల్లాన్ నేను మాత్రం తక్కువా అన్నట్టుగా తాను కూడా ర్యాంప్ మీద నడుస్తూ హొయలు పోయింది. అయితే ఆమె హైహీల్ చీరకి తగలడంతో పూనమ్ ధిల్లాన్ ర్యాంప్ మీదే బొక్కబోర్లా పడిపోయింది. ఆ తర్వాత లేచి నిలబడింది. అలా అందరిముందూ పడిపోవడంతో పూనమ్ ధిల్లాన్ మొదట్లో ఇబ్బంది పడినా ఆ తర్వాత ముఖం నిండా నవ్వులు పులుముకుని ర్యాంప్ మీద నుంచి దిగిపోయింది.