కాలాన్ని జయించే ‘POSEC Method’

  ప్రపంచంలో ఎవరికైనా రోజుకి 24 గంటలే ఉంటాయి. కానీ ఆ 24 గంటలని ఎవరు ఎలా ఉపయోగించుకుంటారు అనేదాని మీద వారి జీవితాలు ఆధారపడి ఉంటాయి. అందుకే 20వ శతాబ్దంలో ‘Time Management’కి చాలా ప్రాధాన్యతని ఇస్తున్నారు. వాటికోసం రకరకాల వ్యూహాలూ ప్రచారంలో ఉన్నాయి. అలాంటి ఒక పద్ధతే ‘POSEC Method’.   1943లో Maslow అనే ఆయన Hierarchy of needs అనే సిద్ధాంతాన్ని రూపొందించారు. ఒక మనిషి సంతోషంగా ఉండేందుకు ఎలాంటి అవసరాలు తీరాలో ఇందులో పేర్కొన్నారు. దీని ఆధారంగానే ‘POSEC Method’ని రూపొందించారు. మన అవసరాలు, లక్ష్యాలకు అనుగుణంగా సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలో ఈ పద్ధతిలో సూచించే ప్రయత్నం చేశారు.    అవేమిటంటే... Prioritize – మీ జీవితంలో అతిముఖ్యమైన లక్ష్యాలు ఏమిటి. వాటిని సాధించేందుకు ఏం చేయాలి. వాటి కోసం ఎంత సమయం కేటాయించాలి అన్న విషయాలన్నీ ఈ Prioritize కోవలోకి వస్తాయి.   Organize – జీవితం స్థిరంగా ఉండేందుకు ఎలాంటి పరిస్థితులు అవసరం అన్న అంశాలు ఈ విభాగంలోకి వస్తాయి. ఉదాహరణకు కుటుంబం, ఉద్యోగం, ఆరోగ్యం... లాంటి అంశాలన్నమాట.   Streamline – చేసే ప్రతి పనీ మనకి ఇష్టం లేకపోవచ్చు. కానీ జీవితం సాఫీగా సాగిపోవాలంటే వాటిని నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. సమయానికి బండిని సర్వీస్‌ చేయించుకోవడం దగ్గర నుంచీ, బీమా ప్రీమియం చెల్లించడం వరకు మన చుట్టూ ఉంటే పరిస్థితులను సక్రమంగా ఉంచుకోవడం వల్ల సమయం, శ్రమా రెండూ ఆదా అవుతాయి.   Economize – కొన్ని పనుల వల్ల ఉపయోగం ఉండదు. అవి అత్యవసరమూ కాదు. కానీ ఇవి లేకపోతే జీవితం మరీ బోర్‌ కొట్టేయవచ్చు. స్నేహితులతో పార్టీ చేసుకోవడం, బంధువులు ఇంటికి వెళ్లడం, సినిమా చూడటం... లాంటివన్నీ ఈ కోవలోకే వస్తాయి.   Contribute – పక్కవారికి ఏదో సాయం కావాలి! తోటి మనిషిగా ఆ బాధ్యతలో పాలు పంచుకోవడం మన కర్తవ్యం. వీధిలో జనం అంతా కలిసి రోడ్డుని శుభ్రం చేసుకుంటున్నారు! పౌరుడిగా పాల్గోవడం మన ధర్మం. ఎన్నికలు జరుగుతున్నాయి. పౌరుడిగా ఓటు వేసేందుకు లైనులో నిలబడటం మన బాధ్యత. ఇవన్నీ చేయాలని ఎవరూ అనరు. ఇలాంటి పనులు చేయడం వల్ల మనకి సమయం, శ్రమ వృధాగానే తోచవచ్చు. కానీ వీటి ఫలితం భవిష్యత్తులో కనిపించి తీరుతుంది. సమాజాన్ని ముందుకు నడిపించడంలో, మనం అశ్రద్ధ చేయలేదన్న తృప్తిని అందిస్తుంది. ఇలాంటి పనులన్నీ Contribute విభాగంలోకి వస్తాయి.   ఇవండీ ‘POSEC Method’ లక్షణాలు. మన జీవితంలో పనులన్నింటినీ ఈ దృక్పథంతో చూస్తే... వేటికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి, ఎంత సమయం కేటాయించాలి అన్న స్పష్టత ఏర్పడుతుంది.  - నిర్జర.

ప్రపంచమంతా సంక్రాంతి

  సంక్రాంతి కేవలం ఒక సంప్రదాయం కాదు. అది ఓ జీవన విధానం. పంటలు ఇళ్లకి చేరుకున్నాయన్న సంబరానికి సూచన. సూర్యుని గమనం దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి మారనుందన్న విషయానికి ప్రతీక. అందుకనే సంక్రాంతిని పోలిన పంటల పండుగలు ప్రపంచంలో అనేక చోట్ల కనిపిస్తాయి. ‘హార్వస్ట్ ఫెస్టివల్స్’ పేరుతో వీటిని ప్రతి జాతివారూ జరుపుకొంటారు. వాటిలో కొన్ని ముఖ్యమైనవి ఇవిగో... ఇండోనేషియా!! ఇండోనేషియాలో పంటల పండుగ ఎప్పుడో మేలో వస్తుంది. మే 31, జూన్ 1.. ఈ రెండు తేదీలలోనూ వారు ఈ పండుగను జరుపుకొంటారు. మనం సంపదకీ, సమృద్ధికీ లక్ష్మీదేవిని ఎలా కొలుచుకుంటామో ఇండోనేషియా ప్రజలు దేవిశ్రీ అనే దేవతను కొలుస్తారు. ఈ పంటల పండుగనాడు ఆ దేవతను ప్రత్యేకంగా ఆరాధిస్తారు. వీధుల్లో రంగురంగుల జెండాలను ఎగరవేస్తారు. పంటపొలాల్లో దిష్టిబొమ్మలను నిలుపుతారు. మన రాష్ట్రంలోలాగానే ఎడ్లపందాలను ఆడి సంబరపడిపోతారు. ఆఫ్రికా!! ఆఫ్రికా ఖండంలో అందునా ఘనా, నైజీరియా వంటి దేశాలలో యామ్ పండుగ అనే పంటల పండుని చేసుకుంటారు. యామ్ అనేది మన పెండలంలాంటి ఒక దుంప. ఆఫ్రికా ప్రజల ఆకలి తీర్చడంలో యామ్ది ముఖ్యపాత్ర. వర్షాకాలం ముగిసి ఆ యామ్ పంట చేతికి వచ్చే సమయంలో యామ్ ప్రజలు ఈ పండుగ జరుపుకొంటారు. ఇందులో పండుగ ముందురోజు పాత యామ్లని తిన్నంతగా తిని  పారేస్తారు. ఇక యామ్ పండుగ రోజుని కొత్త పంటతోనే ప్రారంభిస్తారు. వీటికి తోడుగా ఆటపాటలూ, విచిత్ర వేషధారణలూ ఎలాగూ ఉంటాయనుకోండి. ఇంగ్లండ్!! ఉత్తర ధృవంలోని ఇంగ్లండ్, ఐర్లాండ్ వంటి దేశాలలో లామాస్ పేరుతో పంటల పండుగను జరుపుకొంటారు. ఈ సమయంలో చేతికి వచ్చే గోధుమలతో రొట్టెలను చేసి వాటిని చర్చికి తీసుకువెళ్తారు. మన దేశంలో ఉత్తరాయణంతో పాటుగా మొదలయ్యే ఎండాకాలపు ప్రారంభంలో సంక్రాంతిని జరుపుకుంటాం. కానీ లామాస్ పండుగ మాత్రం ఇంగ్లండులో వేసవి ముగిసిపోయే సందర్భానికి సూచనగా భావిస్తారు. చైనా!! పంటల పండుగ గురించి చెప్పుకోవాలంటే చైనా, వియత్నాం దేశ ప్రజలు చేసుకునే లామాస్ గురించే చెప్పుకోవాలి. చైనీస్ కేలండర్లోన ఎనిమిదో నెలలోని పౌర్ణమి రోజున ఈ పండుగను జరుపుకొంటారు. ఇది సుమారుగా ఆగస్టు లేదా సెప్టెంబరు మాసాలలో వస్తుంది. ప్రాచీన సంప్రదాయాలలో చంద్రుని పంటలకు అధిపతిగా భావిస్తారు కాబట్టి, చైనీయులు ఈ రోజుల్లో చంద్రుని ఆరాధిస్తారు. చంద్రుని ఆకారంలో చేసిన రొట్టెలను పంచుకుంటారు. రకరకాల చైనా లాంతర్లలో దీపాలను వెలిగించి ప్రతి ఇంటి ముందరా వేలాడదీస్తారు. ఇజ్రాయేల్!! ఇజ్రాయేల్ కాలమానం ప్రకారం వారి ఏడో నెలలో పదిహేనవ రోజున సుకోత్ అనే పంటల పండుగను చేసుకుంటారు. ఇది సాధారణంగా సెప్టెంబరు, అక్టోబరు మాసాల మధ్య వస్తుంది. వారంరోజుల పాటు ధూంధాంగా జరుపుకొనే ఈ పండుగకు మరో పరమార్థం కూడా ఉంది. ఈజిప్టు సామ్రాజ్యం కింద యూదులు దాస్య విముక్తిని సాధించిన ఘట్టానికి ప్రతీకగా కూడా ఈ పండుగను జరుపుకొంటారు. ఆ కాలంనాటి సంస్కృతిని ప్రతిబింబించే గుడారాలను వేసుకుని, ఆ కాలంనాటి దుస్తులను ధరించి గత స్మృతులలోకి జారిపోతారు. - నిర్జర.

మీ శ్రమ వృధాకాదు

చిన్న కథలైనా కొన్ని మనసుకి హత్తుకుపోతాయి. గుర్తుండిపోతాయి. అలాంటి ఓ చిన్న కథ చెప్పుకుందాం. ఓ గురువుగారు తన పదిమంది శిష్యులతో కలసి దూర ప్రయాణం మొదలుపెట్టారు. చాలా రోజుల ప్రయాణం. కొండలు, గుట్టలు, అడవులు, సెలయేర్లు దాటాల్సి వుంటుంది అని ముందుగానే శిష్యులందర్నీ హెచ్చరించారు గురువుగారు. సరే అంటే సరే అంటూ శిష్యులంతా తలలూపారు. అన్ని రోజుల ప్రయాణానికి కావలసిన సరుకులని, తిండిగింజలని మూటకట్టి తటొకటి ఇచ్చారు గురువుగారు. దాంతోపాటు సుమారు ఆరడుగులు వున్న ఓ పొడవైన దూలంలాంటిదాన్ని కూడా ఒక్కొక్కటి చొప్పున ఇచ్చారు. ఆ దూలం ఎందుకో శిష్యులకు అర్థం కాలేదు. కానీ గురువుగారిని అడిగే ధైర్యం ఎవరూ చేయలేకపోయారు. మొత్తానికి ఒకవైపున దూలం, మరో వైపు సరుకుల మూటలతో వారి ప్రయాణం మొదలైంది. శిష్యులతోపాటు గురువుగారు కూడా సరుకుల మూటలు, దూలాన్ని మోస్తూ నడుస్తున్నారు. కొంతమంది శిష్యులు ఆ దూలాన్ని కూడా మేమే మోస్తాం ఇవ్వండి గురువుగారూ అని అడిగారు. అయినప్పటికీ గురువుగారు వద్దంటూ తానే ఆ దూలాన్ని మోస్తూ నడుస్తున్నారు. ఇలా కొంతదూరం నడిచారు. రోజులు గడుస్తున్నాయి. రాను రాను దూలాన్ని మోస్తూ నడవటం కష్టంగా మారిపోయింది శిష్యులకు. ‘‘అసలు ఈ దూలం ఎందుకు మనకి? అనవసరమైన బరువు తప్ప. ఆహారాన్ని మోస్తున్నామంటే అర్థం వుంది. ఈ గుదిబండ మోస్తూ కష్టపడటంలో అర్థం లేదు’’ అంటూ శిష్యులు తమలోతాము మాట్లాడుకోవటం మొదలుపెట్టారు.  ఈ మాటలు గురువుగారి చెవిన కూడా పడ్డాయి. అయినా ఆయన ఏం మాట్లాడకుండా మౌనంగా వున్నారు. మళ్ళీ వారి ప్రయాణం మొదలైంది. పెద్ద ఎడారిలో వేడి ఇసుకలో పాదాలు కాలిపోతూ, భుజాలపై బరువుతో నెమ్మదిగా కాళ్ళు ఈడుస్తూ నడుస్తున్నారు శిష్యబృందం. ఎడారిలో నడిచీ నడిచీ శిష్యుల్లో కొందరి ఓపిక అయిపోయింది. ఇన్నాళ్ళూ గురువుగారిపై గౌరవంతో  వాళ్ళు ఏం మాట్లాడకుండా వున్నారు. కానీ, ఇక ఆగలేక ధైర్యం చేసి గురువుగారిని అడిగారు. ఈ బరువు ఎందుకు అనవసరంగా. మోయలేకపోతున్నాం. ఈ దూలాన్ని ఇక్కడే వదిలేస్తాం అన్నారు. అది విన్న గురువుగారు నెమ్మదైన స్వరంతో దాని అవసరం వుంది కాబట్టే ఇంత దూరం మోశాం. వదలటానికి వీల్లేదు అన్నారు. దాంతో శిష్యుల్లో ఓపిక నశించింది. పోనీ కొంచెం పొడవు తగ్గిస్తాం. సులువుగా భుజం మీద మోయగలుగుతాం అన్నారు. గురువుగారు ఎంత చెప్పినా వాళ్ళు వినకపోవడంతో సరే మీ ఇష్టం అంటూ ముందుకు నడిచారు గురువుగారు. ఆయనతోపాటు మరో నలుగురు కూడా దూలాన్ని మోస్తూ ముందుకు నడిచారు. మిగిలిన ఆరుగురు మాత్రం వారి దూలాల పొడవు తగ్గించుకోవడం మొదలుపెట్టారు.  దూలం పొడవు కొంచెం తగ్గించాక ‘హమ్మయ్య’ అనకుంటూ ముందుకు నడిచారు ఆ ఆరుగురు శిష్యులు. అయితే కొంచెం దూరం నడిచాక అది కూడా బరువుగా అనిపించి, మరికొంత కోద్దాం అనుకుని మరికొంత కోసేశారు. ఇలా చివరికి ఆ దూలం భుజం మీద పెట్టుకుని నడిచేందుకు వీలుగా ఓ అడుగు వరకు చేసుకున్నారు. దాంతో ఆ ఆరుగురు సులువుగా దాన్ని మోస్తూ, గురువుగారిని, మిగతా శిష్యలని దాటుకుని హుషారుగా ముందుకు వెళ్ళిపోయారు. గురువుగారు వారిని నిర్లిప్తంగా చూశారు. మిగిలినవాళ్ళు గురువుగారి మీద నమ్మకంతో ఆ బరువుని మోస్తూ ముందుకు నడుస్తున్నారు. ఇలా కొంత దూరం వెళ్ళేసరికి ఎడారి పూర్తయి ఒక నది దాటాల్సి వచ్చింది. గురువుగారు, పూర్తి దూలాన్ని మోసిన నలుగురు శిష్యులు నదిలో తమ భుజాల మీద వున్న దూలాలను వేసి ఒక్కొక్కరు ఒక్కో దూలం మీద కూర్చుని అవతలి వైపుకి వెళ్ళిపోయారు. మిగిలిన ఆరుగురు వారి దగ్గరున్న అడుగు దూలంతో నదిని ఎలా దాటాలో తెలియక ఇవతలే ఉండిపోయారు. అప్పుడు వాళ్ళకి అర్థమైంది గురువుగారు దూలం పొడవు ఎందుకు తగ్గించవద్దన్నారో. అవతలి ఒడ్డుకు చేరిన గురువుగారు, నలుగురు శిష్యులు అక్కడ ప్రశాంతమైన వాతావరణంలో సాధన ప్రారంభించారు. నదికి ఇవతలే గురువు గారి వెంట వెళ్ళలేక నిలబడిపోయిన శిష్యులు బాధతో వెనక్కి తిరిగారు. ఇదీ కథ... చాలాసార్లు మనం మనకెదురయ్యే సమస్యలు, పరీక్షలకి విసిగిపోయి, నాకే ఎందుకిలా జరుగుతోంది. వీటన్నిటితో నేను ముందుకు ఎలా నడవాలంటూ బాధపడుతూ వుంటాం. అయితే మోసే ప్రతి బరువూ మనకు సహాయపడేదే అనుకుంటే అది బరువుగా తోచదు. అలాగే చాలాకాలంపాటు ఓపికపట్టి, చివరి నిమిషంలో నావల్ల కాదంటూ పక్కకి తప్పుకుంటాం. అంతవరకూ పడ్డ శ్రమకి విలువ లేకుండా చేసుకుంటాం. ప్రతీ అనుభవం మనకి ఎంతో కొంత నేర్పిస్తుంది. దానిని గ్రహిస్తూ మన వ్యక్తిత్వంలోకి చేర్చుకుంటూ ముందుకు నడిస్తే పరిపూర్ణమైన ఆ వ్యక్తిత్వం అనే దూలంతో మన లక్ష్యం చేరచ్చు.  

చివరికి మిగిలేది!

అది ఓ ప్రభుత్వ ఆసుపత్రి... అందులోని ఐసీయూ వార్డు. ఆ వార్డులో చావుబతుకుల మధ్య ఉన్న ఓ వృద్ధుడు. ఖచ్చితంగా అతను ఆ రాత్రిని మించి బతకడని వైద్యులందరికీ తేలిపోయింది. అందుకనే అతని బంధువులు అందరికి ఫోన్లు చేసి త్వరగా రమ్మంటున్నారు. ఆసుపత్రిలో అతని తాలూకు పిల్లలు ఎవరన్నా ఉన్నారేమో అని ఓ నర్సు వార్డు బయట అటూఇటూ చూసింది. వార్డు బయట బెంచీ మీద ఓ యువకుడు కనిపించాడు. ‘ఐసీయూ వార్డులో ఫలానా పెద్దాయన మీ తండ్రేనా!’ అని అడిగింది.‘ఏ ఏమైంది!’ అని కంగారుగా అడిగాడు ఆ యువకుడు.   ‘ఆయన ఆఖరి క్షణాల్లో ఉన్నారు. తన కొడుకుల కోసం తెగ కలవరిస్తున్నారు. ఈ రాత్రి కాస్త ఆయన పక్కనుంటే ప్రశాంతంగా కన్నుమూస్తారు’ అని చెప్పుకొచ్చింది నర్సు.‘నేను ఆయన చిన్న కొడుకుని. దయచేసి ఈ రాత్రి ఆయన పక్కనే ఉండే అవకాశం ఇవ్వండి,’ అని అడిగాడు యువకుడు. యువకుడు లోపలికి వెళ్లేసరికి వృద్ధుని పరిస్థితి నిజంగానే బాగోలేదు. కళ్లు తెరుచుకోవడం లేదు. ఏదేదో కలవరిస్తున్నాడు. కొడుకుల స్పర్శ కోసం చేతిని చాస్తున్నాడు. యువకుడు ఠక్కున వెళ్లి ఆ చేతిని అందుకున్నాడు. అతని పక్కనే ఒక బల్ల వేసుకుని రాత్రంతా కూర్చున్నాడు.   ఆ రాత్రి ఒకో జాము గడిచేకొద్దీ వృద్ధుడు తన జీవితానికి సంబంధించి ఏవేవో చెబుతూ ఉన్నాడు. దానికి యువకుడు ఊ కొడుతూనే ఉన్నాడు. మధ్యమధ్యలో వృద్ధుడు యువకుడి చేతిని గట్టిగా అదిమిపట్టుకుంటూ ఉన్నాడు. చివరికి ఆ సమయం రానే వచ్చింది. వృద్ధుడు శరీరంలో ఇక ప్రాణం నిలిచేట్లు లేదు. ఆఖరుగా ‘బిడ్డా! నువ్వు ఈ చివరి క్షణాల్లో నా దగ్గర ఉంటావని అనుకోలేదు. ఇంతకంటే నాకు ఇంకేం కావాలి,’ అంటూ చెక్కిలి మీద నుంచి కన్నీరు జారుతుండగా కన్నుమూశాడు. ఆ దృశ్యం చూసిన యువకుడికి దుఃఖం ఆగలేదు. కన్నీటిని అదిమిపెట్టుకుంటూ బయటకు వెళ్లి కూర్చున్నాడు. కాసేపటికి అతని దగ్గరికి నర్సు కంగారుగా రావడం కనిపించింది. ‘ఆ ముసలాయన కుటుంబమంతా ఇప్పుడే వచ్చింది. నిన్న రాత్రి వాళ్లు రాలేకపోయారంట. వాళ్లలో ఒకతను ఆయన చిన్నకొడుకునని అంటున్నాడు. మరి మీరెవరు?’ అని అడిగింది.   ‘నిజానికి ఆ ముసలాయన ఎవరో నాకు తెలియనే తెలియదు. కానీ చివరిక్షణంలో ఆయన దగ్గర ఎవరూ లేకపోవడం మాత్రం బాధ కలిగించింది. జీవితంలో ఎంత సాధించినా ఆఖరు క్షణాన ఒంటరిగా మిగిలిపోవడం నిజంగా నరకం. అందుకనే మీరు నన్ను పిలిచినప్పుడు మారుమాటాడకుండా లోపలకి వచ్చేశాను. మంచం మీద ఉన్న ఆ మనిషికి కావల్సింది తనవారు పక్కనే ఉన్నారన్న ధైర్యం, వారి స్పర్శలో ఉండే స్థైర్యం... అని అర్థమైంది. మరేం ఆలోచించకుండా ఆయనకి నా చేతిని అందించాను. జీవితపు చివరి క్షణంలో కావల్సిన తృప్తిని ఇచ్చాను’ అంటూ సంజాయిషీగా చెప్పుకొచ్చాడు.     ..Nirjara

సెల్ఫీలతో సంతోషం!

సెల్‌ఫోన్‌ చేతిలో ఉండి సెల్ఫీ దిగనివారు అరుదు. అందులోనూ కుర్రకారు సంగతైతే చెప్పనే అక్కర్లేదు. వీలైనంత వింత సెల్ఫీ దిగేందుకు వారు చేయని సాహసం అంటూ ఉండదు. సెల్ఫీలు మన విచక్షణని దెబ్బతీస్తున్నాయనీ, శవాలతో కూడా సెల్ఫీలు దిగేస్తున్నారని పెద్దలు విసుక్కోవడం కొత్తేమీ కాదు. ఇక సెల్ఫీల వల్ల వచ్చే మానసిక రోగాల గురించి వెలువడే పరిశోధనలూ తక్కువేమీ కాదు. కానీ ఇప్పుడు సెల్ఫీలు సంతోషానికి దారితీస్తాయంటూ తేల్చిన ఒక పరిశోధన సంచలనం కలిగిస్తోంది.   కుర్రకారు మీద పరిశోధన యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియాకు చెందిన యూచెన్‌ అనే పరిశోధకురాలు తమ విశ్వవిద్యాలయంలోని 41 మంది విద్యార్థులను ఈ పరీక్ష కోసం ఎన్నుకొన్నారు. సాధారణంగా, చదువుకోవడం కోసం ఇల్లు వదిలి వచ్చే విద్యార్థులు రకరకాల ఒత్తిడిని ఎదుర్కొంటూ ఉంటారు. ఆర్థిక ఇబ్బందులు, ఒంటరితనం, కొత్త పరిసరాలకు సర్దుకుపోలేకపోవడం, శ్రమతో కూడిన చదువు... ఇవన్నీ కూడా వారిని విపరీతమైన ఒత్తిడికి గురిచేస్తూనే ఉంటాయి. వీటివల్ల విద్యార్థులు చదువులో వెనకబడటమే కాదు, ఒకోసారి డిప్రెషన్‌లో సైతం కూరుకుపోయే ప్రమాదం లేకపోలేదు.   సెల్ఫీల ప్రభావం తన పరిశోధనలో భాగంగా యూచెన్‌ ఈ 41 మంది విద్యార్థులనూ తమ ఫోన్లతో మూడు రకాలైన ఫొటోలను తీస్తూ ఉండమని చెప్పారు. ఒకటి- తాము నవ్వుతూ దిగిన సెల్ఫీలు; రెండు- తమకి నచ్చి, ఇతరులతో పంచుకోవాలనుకునే వస్తువుల ఫొటోలు; మూడు- ఇతరులు సంతోషపడతారనుకునే సన్నివేశాల తాలూకు ఫొటోలు. ఈ మూడు రకాల ఫొటోలను తీసి సోషల్‌ మీడియాలో పంచుకోమని ప్రోత్సహించారు. ఇలా ఫొటోలు తీయడంతో పాటుగా, తమ ఉద్వేగాలను (moods) ఎప్పటికప్పుడు నమోదు చేసుకునేలా వారి ఫోన్లలో ఒక యాప్‌ను కూడా ఏర్పాటుచేశారు పరిశోధకులు.   ఊహించని ఫలితం ఓ నాలుగువారాల పాటు అభ్యర్థులు నమోదుచేసిన 2,900 ఉద్వేగాలను గమనించిన తరువాత ఆశ్చర్యకరమైన ఫలితాలు తేలాయి. ఎప్పటికప్పుడు నవ్వుతూ సెల్ఫీలను దిగిన విద్యార్థులలో ఆత్మస్థైర్యం పెరిగిందట. తరచూ నవ్వడానికి వారు అలవాటుపడ్డారట. ఇక ఇతరులతో పంచుకునేందుకు తమకు ఇష్టమైన ఫొటోలను పంపించేవారిలో భావవ్యక్తీకరణ సామర్థ్యం పెరిగిందట. ఇతరులకి నచ్చే ఫొటోలు తీసినవారిలో, సామాజిక సంబంధాలు మెరుగుపడ్డాయట.   ఇప్పటిదాకా సెల్ఫీల ప్రతికూల లక్షణాల గురించే పరిశోధనలన్నీ వెలువడ్డాయనీ, దానికి ఉన్న మంచి లక్షణాలను కూడా గమనించేందుకే ఈ పరిశోధన చేప్టటామనీ... విశ్వవిద్యాలయంలోని అధికారులు చెప్పుకొస్తున్నారు. ఇలా కాలేజీ విద్యార్థుల చేతిలో నిరంతరం ఉండే ఫోన్లని, ఒత్తిడి నివారించేందుకు కూడా ఉపయోగించవచ్చునని సూచిస్తున్నారు ముఖ్యపరిశోధకురాలైన యూచెన్‌. ఆ విషయం మనం కుర్రకారుకి వేరే చెప్పాలా!   - నిర్జర.

పైపై మెరుగుల కోసం పాకులాడితే

అనగనగా ఓ రెండు గుర్రాలు ఉండేవి. దేవతా గుర్రాలంటే మాటలా! పాలరాతి తెలుపుతో, నురగలాంటి జూలుతో మహా అందంగా ఉండేవి. వాయువేగంతో ముల్లోకాలూ చుట్టిపారేసేవి. జనం ఆ గుర్రాలను చూసినప్పుడల్లా ముక్కున వేలేసుకునేవారు. అంత అందమైన గుర్రాలను చూడటంతో తమ జన్మ ధన్యమైపోయిందని మురిసిపోయేవారు. కానీ ఆ గుర్రాల మనసులో ఏదో చింత! రెండు గుర్రాలనీ అంతా సమానంగా చూస్తున్నారు. రెండూ అందమైనవే అనీ, రెండూ వేగమైనవే అనీ పొగుడుతున్నారు. ‘అలా జరగడానికి వీల్లేదు! ఈ ప్రపంచంలో అన్ని గుర్రాలకంటే నేనే అందంగా ఉండాలి,’ అన్న ఆలోచన రెండు గుర్రాలలోనూ కలిగింది. అంతే వాటిలో ఒక గుర్రం నిదానంగా దేవుడి దగ్గరకి చేరింది.   ‘భగవంతుడా! నన్ను ఇంత అందంగా అద్భుతంగా సృష్టించినందుకు కృతజ్ఞతలు. దేవతా గుర్రంగా నా జన్మ ధన్యమైపోయింది. కానీ నాదో చిన్న కోరిక,’ అంది ఆ గుర్రం. దాని మనసులో మాట గ్రహించినట్లుగా భగవంతుడు ఓ చిరునవ్వు నవ్వి- ‘నువ్వు దేవతా గుర్రానికి. నీ కోరికని తీర్చాల్సిందే! ఏం కావాలో కోరుకో!’ అన్నాడు. ‘నేను అందంగా ఉన్న మాట నిజమే కానీ ఇంకాస్త అందంగా ఉంటే బాగుండు అన్న దుగ్థ నన్ను తెగ వేధిస్తోంది. ఆలోచించి చూస్తే నాలో చాలా అవకరాలే కనిపిస్తున్నాయి. అవన్నీ సరైపోయి నేను ఇంకా అందంగా ఉండేట్లు ఆశీర్వదించండి స్వామీ!’ అని వేడుకుంది.   ‘ సరే! నీలో నీకు ఏ లక్షణాలు లోపాలుగా కనిపిస్తున్నాయో చెప్పు. అవన్నీ సరిదిద్దుతాను,’ అంటూ అభయమిచ్చాడు భగవంతుడు. దాంతో ఆ గుర్రం తనలో తనకి లోపాలుగా తోచిన లక్షణాలన్నింటినీ ఏకరవు పెట్టడం మొదలుపెట్టింది. ‘ఈ తల చూసారా! మరీ మెడకి అంటుకుపోయినట్లుగా ఉంది. అది ఇంకాస్త పొడవు ఉంటే బాగుంటుంది. ముక్కు కూడా మరీ సన్నగా ఉందేమో అని నా అనుమానం. ఇక కాళ్లు ఇంకాస్త పొడవుంటే భలే ఉంటుంది. దయచేసి ఇవన్నీ సరిదిద్దురూ!’ అంది గుర్రం. ‘తథాస్తు! రేపు ఉదయం నువ్వు లేచి చూసుకునే సరికి ఈ లోపాలేవీ లేని సరికొత్త రూపం నీకు వస్తుంది,’ అన్నాడు భగవంతుడు.   మొదటి గుర్రం సంతోషంగా భగవంతుని దగ్గర సెలవు తీసుకుంది. అది అలా వెళ్లిందో లేదో రెండో గుర్రం భగవంతుడి దగ్గరకు చేరుకుంది. ‘హే భగవాన్‌! ఆ గుర్రం తన అందాన్ని పెంచుకోవాలనే కోరికతోనే నీ దగ్గరకి వచ్చిందని నాకు తెలుసు. ఎలాగైనా ప్రపంచంలోనే గొప్ప గుర్రం అనిపించుకోవాలని దాని తపన. దాని అత్యాశని మీరు అణచాల్సిందే! అది తనలోని అందం మెరుగుపడేందుకు ఏ లక్షణాలనైతే కోరుకొందో... అవి నాలో మరింత ఎక్కువగా ఉండేలా వరం ఇవ్వండి,’ అని వేడుకుంది. ‘అయ్యో అదెంత భాగ్యం! అసలే నువ్వు దేవతా గుర్రానివి. నీ కోరికను తీర్చాల్సిందే! రేపు ఉదయం నువ్వు లేచి చూసుకునేసరికి ఆ లక్షణాలన్నీ నీలో కనిపిస్తాయి. తథాస్తు!’ అంటూ నవ్వాడు భగవంతుడు.   ఆ రాత్రి గుర్రాలకి సరిగా నిద్రపట్టనే లేదు. ఎప్పుడెప్పుడ తెల్లవారుతుందా... నిబిడీకృతమైన తమ అందాన్ని ఎప్పుడెప్పుడు చూసుకుంటామా అన్న ఉద్విగ్నతతో ఆ రాత్రిని గడిపాయి. ఎప్పుడో అర్ధరాత్రి వాటికి మాగన్నుగా నిద్రపట్టింది. తెల్లవారాక చూసుకుంటే ఆ రెండు గుర్రాలకీ తమ కోరిక నెరవేరిన విషయం తెలిసిపోయింది. కాకపోతే... మొదటిగుర్రం కోరుకున్న లక్షణాల కారణంగా అది అచ్చు ఒంటెలా మారిపోయింది. మొదటి గుర్రం కోరుకున్న లక్షణాల మోతాదు తనలో మరింతగా ఉండాలని కోరుకోవడంతో రెండో గుర్రం జిరాఫీలా మారిపోయింది!!!   తమ శరీరాల వంక చూసుకున్న గుర్రాలు రెండూ లబోదిబోమంటూ భగవంతుడి దగ్గరకు పరుగులెత్తాయి. ఆయనను చూస్తూనే ‘ఏమిటీ మాకీ అన్యాయం!’ అంటూ ఆక్రోశించాయి.   ‘మీరు కోరుకున్న వరాన్ని యథాతథంగా తీర్చాను. ఇది అన్యాయం ఎలా అవుతుంది? ఆగమేఘాల మీద పరుగులు తీసే దేవతాశ్వాలు ఎలా ఉండాలో, మిమ్మల్ని అలా పుట్టించాను. కానీ మీకు మీ శరీరం పట్ల కానీ, దానిని అందించిన నా పట్ల కానీ నమ్మకం లేదు. అదే అసలైన అన్యాయం. మీరు నిజంగా నన్ను ఏదన్నా కోరుకోవాలని అనుకుంటే... ఎలాంటి నిస్సత్తువా దరిచేరకుండా బలిష్టంగా ఉండాలనో, కోరుకున్న గమ్యాలని సమర్థంగా చేరుకోవాలనో అడగాల్సింది! కానీ మీరు పైపై మెరుగులకే ప్రాధాన్యతని ఇచ్చారు. ఇక ఫలితం అనుభవించండి. ఇక నుంచీ మీరు దేవతా అశ్వాలు కాదు. ఒకరేమో ఒంటెలాగా ఎడారుల్లో తిరుగుతూ నానా బరువులూ మోయాల్సి ఉంటుంది. మరొకరేమో చిటారుకొమ్మ మీద దొరికే ఆహారంతో తృప్తిపడుతూ అడవులలో కాలం గడపాల్సి వస్తుంది. పోండి!,’ అనేశాడు భగవంతుడు. అదీ విషయం! (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)   - నిర్జర.

ఇలా చేస్తే ..అన్ని కలిసొస్తాయి

కొందరిని చూస్తే ఆశ్చర్యం గా అనిపిస్తుంది. ఎప్పుడు ఆనందం గా వుంటారు, జరిగే పొరపాట్లని హుందాగా ఒప్పుకుంటారు. ఏది కలిసి రాని సమయంలో కూడా నమ్మకంతో వుంటారు. ఇవన్నీ వాళ్ళని ప్రత్యేకం గా నిలబెడతాయి . ఏంటి వాళ్ళ సీక్రెట్ ? అంటే జాన్స్ హోప్ కిన్స్ యూనివర్సిటీ కి చెందిన డాక్టర్ బ్లాకేమన్ ఏం చెబుతున్నారో తెలుసా ? పాజిటివ్ మైండ్ సెట్ ...తో జీవితం లో ఎదురయ్యే ప్రతి సంఘటనని చూడటం . ఆ ఒక్క అలవాటే వారిని అందరి నుంచి ప్రత్యేకం గా నిలబెడుతుంది, అంతే కాదు అలాంటి వారికే అన్ని కలిసివస్తాయి కూడా. ఎందుకంటే వాళ్ళకి ఎదురయ్యే ప్రతిదానిలో ఒక అవకాసం కనిపిస్తుంది .అంటున్నారు ఆయన. మరి అలాంటి మాజిక్ మన జీవితాలలో కూడా జరగాలంటే ? ఆయన చెబుతున్న ఈ కింది వాటిని ఫాలో అవ్వటమే.   లోపలినుంచి మొదలు కావలి .. మన లోపలి నుంచి మనం ఎంత ప్రశాంతం గా, ఉంటామో మనలో ఆందోళన అంత తక్కువ వుంటుంది. అంటే ఆందోళనగా వున్నప్పుడు అప్పటికప్పుడు మనసుని ప్రశాంతం కమ్మని చెబితే మాట వినదు. మొదటి నుంచి దానికి ఆ ప్రశాంత తని  అలవాటు చేయాలి. దానికోసం రోజు ధ్యానం, మెడిటేషన్ వంటి ఆరోగ్యకర అలవాట్లని చేసుకోవాలి. ఒక్క అరగంట అయినా చాలు . ఆ రోజు లో మనకి ఎదురయ్యే ఎన్నో సంఘటనలు ని ఆందోళన పడకుండా దాటగలుగుతాము .ఆందోళన లేనప్పుడు మెదడు చురుకుగా పని చేస్తుంది . సమస్యలు కి పరిష్కారాలు సులువుగా దొరుకుతాయి. అలా ఆడుతూ పాడుతూ వాటిని దాటుతుంటే అందరు వీళ్ళకి అన్ని కలిసివస్తాయి అంటారు. అది కేవలం మీరు ప్రశాంతం గా వుండటం వల్లే సాధ్యమవుతుంది .   ఓ చిన్న మంత్రం ఇది కూడా గడిచి పోతుంది ...ఇదే మంత్రం చాలా మందిని ఎన్నో గడ్డు సమయాలని దాటేలా చేసింది. చేస్తోంది. చాలా సారులు కాలం పరీక్ష పెడుతుంది. ఒకదాని వెనుక ఒకటి మన సహనాన్ని పరీక్షిస్తాయి. అప్పుడే నిటారుగా నిలబడాలి. ఎదురయ్యిన గాలికెరటం మనలని దాటి పోయేదాకా ఎదురు చూడాలి . అది దాటిపోతుందని, మంచి రోజులు ఎదురవుతాయని నమ్మాలి. జీవిత చక్రం లో ఎత్తుపల్లాలు ఎంత సహజమో తెలిసి కూడా క్రుంగి పోవటం లో అర్ధం లేదుకదా   నీకు నీవే శత్రువు కావద్దు ఒక చిన్న పొరపాటు జరిగితే చాలు ..నేనింతే ..అనుకుంటూ నిందించుకోవటం మానేయాలి. ఎదుట వుండే శత్రువుతో పోరాడటం సులువు, కాని మన లోపలి శత్రువు తో పోరాడలేము , గెలవలేము. పొరపాట్లు చేయటం నేరం కాదు. వాటిని ఎలా సరిదిద్దు కోవాలో ఆలోచించాలి .అంతే సగం బాధ తీరిపోతుంది. చాలా సారులు జరిగిన విషయాన్నే తలుచుకు , తలుచుకు బాధ పడుతుంటారు . దానివల్ల ఆత్మ విశ్వాసం తగ్గటం తప్ప వేరే లాభం ఏమి ఉండదు.   చుట్టూ వైఫైలా వుండాలి మంచి ఆలోచనలతో , ఉత్సాహం గా వుండే స్నేహితులని చుట్టూ ఉంచు కుంటే చాలు. చాలావరకు సమస్యలు ఎదురే కావు.. మన స్వబావం మూలం గా మనం కొని తెచ్చు కునే సమస్యలు ఎన్నో వుంటాయి. అవి మన స్నేహితుల వల్ల మన దగ్గరకి రాకుండా వుంటాయి. ఎప్పడు మంచి ఆలోచనలు కలిగి వుండటం ఒక్కటి చాలు ఎన్నో విజయాలు పొందటానికి.   ప్రతి చిన్న విజయం విలువైనదే ప్రతి రోజు చిన్నదో , పెద్దదో ఒక విజయాన్ని అయితే సెలెబ్రేట్ చేసుకోవాలి. నచ్చిన పని చేయటం, ఇష్టమైన పుస్తకం చదవటం, నుంచి పెట్టుకున్న టార్గెట్ రీచ్ అవ్వటం వరకు అన్ని విలువైనవే.ఆ విజయాల్ని మననం చేసిన కొద్ది ఉత్శాహం కలుగుతుంటుంది. దానితో తృప్తి కలుగుతుంది.  

ఈ ఆసనాలు వేయగలరా!

ఒక వ్యక్తి స్థిరంగా ఒకే భంగిమలో ఉంటే, దానిని ఆసనం అంటారు. ఒక ఆసనం వేసేటప్పుడు శరీరంలోని ఏ భాగమైతే నిశ్చలంగా ఉండిపోతుందో... ఆ అవయవానికి రక్తప్రసరణ మెరుగుపడుతుందనీ, తద్వారా ఆరోగ్యం చేకూరుతుందనీ చెబుతారు. ఈ ఆసనాలలో కొన్ని సులువుగా ఉంటే, మరికొన్ని మాత్రం అసాధ్యంగా తోస్తాయి. యోగాలో ఎంతో నిష్ణత, శరీరంలో పటుత్వం ఉంటేగానీ ఇవి సాధ్యం కావు. అలాంటి కొన్ని ఆసనాలు ఇవిగో... మన యోగా ఎంత లోతైనదో చెప్పుకొనేందుకే ఈ ఉదాహరణలు!     అష్టవక్రాసనం: పూర్వం అష్టావక్రుడనే ఓ రుషి ఉండేవాడు. తండ్రిలో తప్పుని ఎత్తి చూపిన కారణంగా ఆయన అష్టవంకర్లతో జన్మించమన్న శాపం దక్కుతుంది. అలా అష్టవంకర్లతో జన్మించినా కూడా గొప్ప జ్ఞానిగా ఆ రుషి చరిత్రలో నిలిచిపోయాడు. ఈ అష్టవక్రాసనం ఆయన పేరు మీదుగానే వచ్చిందని అంటారు. రెండుకాళ్లనీ ముడివేసి, ఒక చేతిని వాటిలోంచి చొప్పించి... కేవలం అరచేతుల మీదుగా నేల మీద ఉండటం ఈ ఆసనంలో ప్రత్యేకత. ఈ ఆసనంతో వెన్నులో రక్తప్రసారం మెరుగుపడుతుంది.   శీర్ష పాదాసనం: శీర్షాసనం వేసి, పాదాలను తల మీదుగా వచ్చేలా ఉండే భంగిమే శీర్షపాదాసనం. ఇందులో మెడ, చేతులు, హృదయం, కాళ్లు, వెన్ను... అన్నింటి మీదా ఒత్తిడి పడుతుంది. ఈ ఆసనంతో మెదడు మీద కూడా గొప్ప ప్రభావం ఉంటుందట. ఏకాగ్రత పెరగటానికీ, వెన్ను బలపడటానికీ ఈ ఆసనాన్ని తప్పక సూచిస్తారు. ఈ ఆసనమే కష్టం అనుకుంటే ఇందులో పాదశీర్ష బకాసన, పాదశీర్ష ప్రపాదాసన వంటి ఆసనాలూ ఉన్నాయి. కాకపోతే వాటిజోలికి పోయేవారు తక్కువ.     గండభేరుండ ఆసనం: శీర్షాసనంలో కేవలం కాళ్లు తలవరకు రావడమే కష్టం. ఇక ఆ కాళ్లు మొఖానికి అటూ ఇటూ ఉండేలా నేల మీదకి ఆన్చడం ఇంకెంత కష్టమో కదా! అదే గండభేరుండ ఆసనం. ఈ ఆసనంతో శరీరం స్ప్రింగులాగా ఎటుతిరిగితే అటు తిరిగిపోయే దశకు చేరుకుంటుందని నమ్ముతారు. ప్రముఖ యోగా గురువులు B. K. S. Iyengar కూడా ఈ ఆసనం మహా కష్టమైన ఆసనాలలో ఒకటిగా పేర్కొన్నారు.       యోగనిద్రాసనం: చెట్టంత మనిషి చిన్న మూటలాగా చుట్టుకుపోయే ఈ ఆసనం ఫొటోలలో చూడాల్సిందే తప్ప ఎవరికి పడితే వారు వేయడం అసాధ్యం. చేతులు రెండింటినీ నడుము దగ్గర పెనవేసి, కాళ్లని తల కింద ముడివేసి కనిపించే ఈ ఆసనంతో శరీరం యావత్తూ శక్తిమంతమైపోతుందట! స్త్రీలలో రుతుపరమైన సమస్యలని నివారించడంలో ఈ ఆసనం దివ్యంగా పనిచేస్తుందట.   కాలభైరవాసనం: ఈ భంగిమ కాలబైరవుడైన శివుని తలపిస్తుంది కాబట్టి ఆ పేరు. పైన చెప్పుకొన్న ఆసనాలంత కష్టతరం కాకపోయినా... ఇప్పటి తరానికి ఇది అసాధ్యంగానే తోచవచ్చు. ఒక చేతిని, ఒక కాలిని నేల మీద ఆన్చి... ఒక కాలిని, ఒక చేతిని ఆకాశం దిశగా నిలపడమే ఈ ఆసనంలోని ప్రత్యేకత. ఈ ఆసనం వల్ల కాలికండరాలు బలిష్టంగా తయారవుతాయని యోగనిపుణులు హామీ ఇస్తున్నారు.   ఏదో కొన్ని ఆసనాల గురించి చెప్పుకొనే వీలు మాత్రమే ఉంది కాబట్టి ఐదు ఆసనాల గురించి మాత్రమే చెప్పుకొన్నాం. కానీ ఎన్నో రోజుల కఠోర శ్రమ, గురువుల పర్యవేక్షణ లేకుండా వేయడం అసాధ్యంగా తోచే ఆసనాలు చాలానే ఉన్నాయి. ఈ రోజుల్లో గర్వంగా చెప్పుకొనే ఏరోబక్స్కు ఏమాత్రం తీసిపోని భంగిమలు మన యోగాలో ఉన్నాయి. ఇంత లోతైన శాస్త్రం మన దగ్గర ఉండగా ఆరోగ్యం కోసం, ప్రశాంతత కోసం పాశ్చత్య విధానాల వైపు పరుగుతీయడం ఎంత హాస్యాస్పదమో కదా! - నిర్జర.  

క్రీస్తు జీవితం నేర్పే పాఠాలు

రెండువేల సంవత్సరాల క్రితం జీసస్‌ అనే వ్యక్తి ఈ భూమ్మీద సంచరించాడు అనడంలో ఎవ్వరికీ ఏ సందేహమూ లేదు. ఆయనను దైవకుమారునిగా భావించినా భావించకున్నా, తన వ్యక్తిత్వంతో ఈ పుడమి మీద ఓ స్పష్టమైన ముద్రని వేశారనడంలో ఎలాంటి అనుమానమూ అక్కర్లేదు. అందుకే జీసస్‌ బోధలనే కాదు, ఆయన జీవితాన్ని గమనించినా కూడా అనేక పాఠాలు కనిపిస్తాయి. కాలం మారినా వాటిలోని విలువలు మనల్ని తీర్చిదిద్దుతాయి.   కరుణ జీసస్‌ అంటే మన దృష్టిలో కరుణామయుడే! తన చెంతకు వచ్చినవారు ఎలాంటివారైనా, వారిని తనవారిగా భావించాడు. అనారోగ్యంతో ఉన్నవారిని స్వస్థపరిచాడు. బాధలో ఉన్నవారిని ఓదార్చాడు. మంచి కోరిన వారికి నీతిని బోధించాడు. పొరుగువారిని ప్రేమించమంటూ... ఈ ప్రపంచాన్నే కరుణతో ముంచెత్తేందుకు ప్రయత్నించాడు. ఆఖరికి తనని శిక్షించినవారిని కూడా క్షమించమంటూ భగవంతుని వేడుకున్నాడు.   స్పష్టమైన జీవితం ఈ ప్రపంచం గురించి జీసస్‌కు స్పష్టమైన అభిప్రాయాలు ఉన్నాయి. వాటిని వెల్లడించేందుకు ఆయన ఎన్నడూ జంకలేదు. తన ప్రాణానికి ముప్పు పొంచి ఉందని పలువురు హెచ్చరించినా, తను చెప్పదల్చుకున్న విషయాన్ని కరాఖండిగా చెబుతూనే ముందుకు సాగారు. సాతాను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించినా కూడా, తాను సత్యం అనుకున్నదానినే ఆచరించేందుకు నిశ్చయించుకున్నారు. పేదవారి కోసం, బలహీనుర కోసం అధికారులతో పోరాడేందుకు సైతం సిద్ధపడ్డారు. ఆఖరికి తనని బంధించేందుకు అధికారులు కాపు కాశారని తెలిసినా కూడా నిర్భయంగా గెత్సెమనే తోటకు వెళ్లారు. వినయం ఏసు మాటలు కఠినమైన సత్యాలతో నిండి ఉండేవి. కానీ పరుషపదజాలాన్ని మాత్రం ఆయన ఎప్పుడూ వాడలేదు. రాజు ముందైనా, పేదవాడి ముందైనా ఆయన తీరు ఒకలాగే సాగింది. తనని విశ్వసించేవారు ఎంతమందున్నా, తాను భగవంతుని కుమారుడిని అనే చెప్పుకున్నారు కానీ సాక్షాత్తూ దైవాన్ని అని చెప్పుకోలేదు. పొగడ్తలకు, ఆడంబరాలకు అతీతంగా ఆయన జీవితం సాగింది. ఆఖరు క్షణంలో సైతం జీసస్‌ ఒక్క మాట తూలలేదు. విశ్వాసం – ప్రార్థన జీసస్‌ ఒంటరిగా ధ్యానించుకునేందుకు, భగవంతుని ప్రార్థించుకునేందుకు ఇష్టపడేవారు. రోజుల తరబడి భగవత్ ధ్యానంలో గడిపిన ఘట్టాలూ జీసస్‌ జీవితంలో కనిపిస్తాయి. ఆయన ఆఖరు రాత్రి సైతం ప్రార్థనలోనే గడిచింది. ఆత్మపరిశీలన చేసుకోవడం, భగవంతుని పట్ల అచంచల విశ్వాసాన్ని కలిగి ఉండటం, ప్రార్థించడం... అనే మూడు అంశాలకీ జీసస్ గొప్ప ప్రాధాన్యతను ఇచ్చినట్లు కనిపిస్తుంది. సహనం జీసస్‌ జీవితం యావత్తూ ఓరిమిలోనే గడిచింది. తన చుట్టూ ఉన్న శిష్యులు సైతం ఎన్ని అనుమానాలను ప్రకటించినా, వారి సందేహాలన్నింటికీ ఓర్పుతో జవాబులందించేవారు. గిట్టనివారు ఎంతగా తూలనాడినా అదే ఓరిమితో భరించారు. చివరికి శిలువ మీదకు చేరాల్సి వచ్చినా శారీరికంగా, మానసికంగా... తనకి వచ్చిన కష్టాన్ని సహించారు. ఇలా విశ్లేషిస్తూ పోతే జీసస్‌ జీవితంలో మనకి తారసపడే విలువలెన్నో! అందుకనే వేల సంవత్సరాలు గడిచినా కూడా క్రీస్తు అన్న మాట వింటే చాలు విశ్వాసులు పరవశించిపోతారు. భక్తుల మనసు అప్రయత్నంగానే ఆయన పట్ల లగ్నమవుతుంది. అలాంటి స్మరణకి ఈ క్రిస్మస్‌ను మించిన సదవకాశం మరేముంటుంది.   - నిర్జర.

బంధాలు బలపడే మార్గాలివిగో...

ఇద్దరు వ్యక్తులు జీవితాంతం కలసి వుండటానికి ప్రేమ ఎంతో ముఖ్యమని అందరికీ తెలిసిందే. ఏరికోరి పెళ్ళిని ప్రేమతో ముడివేసుకున్న వాళ్ళు కూడా ఒకోసారి పెళ్ళి తర్వాత ఆ ప్రేమ కోసం వెతుకులాడటం చూస్తుంటాం... ఎందుకని? ఇద్దరు వ్యక్తులు కలసి బతకడంలో ఎక్కడో ఆ ప్రేమని జారవిడుచుకుంటారు. అందుకు కారణం నువ్వంటే నువ్వని వాదించుకుంటారు. మార్పు ఎదుటి వ్యక్తిలో రావాలని ప్రగాఢంగా నమ్ముతారు. ఖాళీ మనసులతో, నిర్జీవంగా మారిన బంధంతో, సర్దుకోలేక అసంతృప్తితో నలిగిపోతారు. మరి దీనికి పరిష్కరం లేదా అంటే... సమాధానం ‘ఉందనే’ చెప్పాలి. భార్యాభర్తల మధ్య ‘ప్రేమ’ ఎప్పటికీ తాజాగా నిలవాలంటే అందుకు మొదటి రూల్... మనసుకు కష్టం కలిగించిన వెంటనే ఆ విషయాన్ని భాగస్వామితో చర్చించాలి. నెమ్మదిగా చెప్పాలి. అలా కాకుండా ఆ బాధను దిగమింగితే అది మనసులోనే పెరిగి, పెద్దదై, చీడపురుగులా మారి ప్రేమవృక్షాన్ని తొలిచేయడం మొదలుపెడుతుంది. అలా అని ప్రతీ నిమిషం నాకిది నచ్చలేదు, నువ్వు ఇలా చేశావు అంటూ ఆరోపణలు గుప్పించటం కాదు. బాధ కలిగింది అన్న విషయాన్ని కమ్యునికేట్ చేయటమే లక్ష్యం తప్ప ఎదుటి వ్యక్తి పొరపాట్లని ఎంచటం ఉద్దేశం కాకూడదు. అలాగే... ఏం చెబితే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారోనని ఊహించుకుని భయపడటం కూడా మంచిది కాదు.ఇతరుల మెదడులోకి చూడటం మాని మనం ఏం అనుకుంటున్నామో అవి చెప్పాలి. ఎందుకంటే అపోహతో ఎదుటి వ్యక్తిని దూరం చేసుకునే బదులు బాధను పంచుకుని దగ్గర చేసుకోవటం వివేకమనిపించుకుంటుంది. నూరేళ్ళ జీవితంలో ‘ప్రేమ’ పచ్చగా కళకళలాడుతూ మనల్ని అంటిపెట్టుకుని వుండాలంటే మనం పాటించాల్సిన మరో సూత్రం.... తెలిసీ తెలియక ఏ చిన్న పొరపాటు చేసినా, మాట తూలినా, ఎదుటి వ్యక్తి మనసు కష్టపెట్టినా ఆ పొరపాటుల్ని అంగీకరించాలి. జరిగిన పొరపాటుని సరిదిద్దే బాధ్యత కూడా తీసుకోవాలి. అప్పుడే ఎదుటి వ్యక్తి విశ్వాసాన్ని పొందగలం. అలాగే మన ఆత్మవిశ్వాసం నిలుపుకోగలం. పొరపాటు అంగీకరించినట్లు ఎదుటివారు గుర్తించినప్పుడు మాత్రమే వారూ ఓ అడుగు ముందుకు వేసి సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తారు. ఏ కంటికి బాధకలిగినా రెండు కళ్ళూ కన్నీటితో నిండుతాయి. ఇద్దరిలో బాధ ఎవరికి కలిగినా రెండు మనసులూ మూగబోతాయి. ఇక మూడో సూత్రం... చాలా సరదాగా మొదలైన చర్చ తీవ్రరూపం దాలుస్తుంటే దానిని అక్కడితో ఆపేయడం మంచింది. ఎవరికి వారు వేరే పనిలో కాసేపు దృష్టిపెట్టి, ఆవేశం చల్లారాక మాట్లాడటానికి ప్రయత్నించాలి. అందుకు కొంత సమయం పట్టినా పర్వాలేదు. తొందరపాటుతో బంధాన్ని బలహీనపరచుకోవటం కన్నా ఓపికపట్టడం తప్పుకాదు. ఒక్క విషయం గుర్తుపెట్టుకు తీరాలి. ఏ సమస్యకి అయినా సరైన వాతావరణంలో ప్రశాంతంగా చర్చించడం ద్వారానే పరిష్కారం దొరుకుతుంది. ఇక నాలుగో సూత్రం... ఎదుటి వ్యక్తి చెప్పేది వినటం. వినటమంటే చెవులతో కాదు... మనసుతో వినటం ముఖ్యం. తను చెప్పేది కరెక్ట్ అనిపిస్తే రెండో ఆలోచన లేకుండా ఒప్పుకోగలగాలి. అయితే... కానీ లాంటి కారణాలు వెతకద్దు. అలాగే తన ఆలోచన తప్పనిపిస్తే దానిని కూడా స్పష్టంగా, నెమ్మదిగా చెప్పాలి. అంతేకాని, అప్పటికి ఆ విషయాన్ని ముగించాలని ఒప్పుకున్నట్టు నటించటం వంటివి చేస్తే ‘విశ్వాసం’ కోల్పోతాం. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఏ విషయంలో అయినా మనసుకి పని చెప్పాలి కానీ, మెదడుకి కాదు. అన్నిటికంటే ముఖ్యం భార్యాభర్తల మధ్య నిశ్శబ్దానికి చోటుండకూడదు. ఎందుకంటే నిశ్శబ్దాన్ని నిశ్శబ్దంతో కూడినా, తీసివేసినా, భాగించినా, గుణించినా మిగిలేది నిశ్శబ్దమే.. మరి ఆలోచిస్తారు కదూ! -రమ ఇరగవరపు

షాంపైన్ ఎందుకు అంత ఖరీదైనది

దేవతలు అమృతం తాగి అమరులైతే సంపన్నులు షాంపైన్ తో ఆనందాన్ని రెట్టింపు చేసుకుంటారు. ధనవంతులు విందువినోదాల్లో తప్పనిసరిగా ఉంటుంది షాంపైన్. ప్రపంచంలోనే ఖరీదైన మద్యంగా దీన్ని చెప్పవచ్చు. మరి మిగతా వైన్ లకు షాంపైన్ కు వ్యత్యాసం ఎంటో తెలుసుకుంటే ఇది ఎందుకు ఇంత ఖరీదు అయినదో తెలుస్తుంది. షాంపైన్ అనేది విలాసానికి, వినోోదానికి  పర్యాయపదంగా ఉంది. ఇతర వైన్స్ కన్నా రెట్టింప ధర ఉంటుంది.  తక్కువలో తక్కువ షాంపైన్ ధర యాభై డాలర్ల నుంచి మూడు వందల డాలర్ల వరకు ఉఁటుంది. అంతేకాదు పాత షాంపైన్ బాటిల్ ధర వెయ్యి డాలర్ల వరకు పలుకుతుంది. మరీ షాంపైన్ ఇంత ఖరీదు ఎందుకు మెరిసేదంతా బంగారం కానట్టు షాంపైన్ గా పిలువపడే అన్ని రకాల వైన్లు షాంపైన్ కావు. కేవలం ఉత్తర ఫ్రాన్స్‌లోని షాంపైన్ ప్రాంతంలో తయారు చేస్తే షాంపైన్ మాత్రమే నిజమైన షాంపైన్. ఈ ప్రాంతం వెలుపల తయారు చేసిన అన్ని ఇతర వైన్లను, ఫ్రాన్స్   పొరుగు ప్రాంతాల నుండి వచ్చే వాటిని కూడా గుర్తించాలి.  ప్రాసిక్కో , కావా వంటి ఇతర  వైన్ల ధర కంటే రెట్టింపు ధరలో షాంపైన్ దొరుకుతుంది. మంచి-నాణ్యమైన షాంపైన్ బాటిల్ ధర ఎక్కవగా ఉంటుంది. ప్యారిస్‌కు తూర్పున 150 కిలోమీటర్ల దూరంలో, ఫ్రాన్స్‌లోని ఈ అత్యంత రక్షిత ప్రాంతం షాంపైన్.  ప్రపంచంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన,  ఖరీదైన షాంపైన్ అమ్మకందారులకు కొనుగోలుదారులకు ఇచి కేరాఫ్ గా చెప్పవచ్చు. మోయిట్ & చాండన్ , పెరియర్-జౌట్ కంపెనీలు కూడా  ఈ ప్రాంతం వెలుపల తయారు చేసిన వైన్ లను అమ్ముతాయి. ఫ్రాన్స్ లో తయారైనా, ఫ్రాన్స్ వెలుపల తయారైన షాంపైన్ గా లేబుల్ చేయాలి. ఈ చిన్న ప్రాంతంలో శాన్ ఫ్రాన్సిస్కో కంటే రెండు రెట్లు ఎక్కువ పరిమాణంలో నిజమైన షాంపైన్  తయారు చేయబడుతుంది.  ప్రతి సంవత్సరం 300 మిలియన్ బాటిళ్లకు పైగా ఇక్కడ ఉత్పత్తి అవుతాయి. ఈ షాంపైన్  వార్షిక ఆదాయం 5 బిలియన్ డాలర్లు. షాంపైన్ అమ్మకాలు 1950 ల నుండి క్రమంగా పెరిగాయి.  కానీ దాని భవిష్యత్ ఈ ప్రాంతంలోని  ప్రత్యేక వాతావరణం పరి రక్షణపై ఆధారపడి ఉంది. ఉత్తర ఫ్రాన్స్  ప్రత్యేక పరిస్థితులు పెరిగిన ధరలకు మొదటి కారకం. సగటున 50 డిగ్రీల ఫారెన్‌హీట్ ఉష్ణోగ్రతతో, ఈ ప్రదేశం ఫ్రాన్స్ లో ఇతర వైన్ తోటలు పెరుగు తున్న ప్రాంతాల కంటే చల్లగా ఉంటుంది, ఇది ద్రాక్షకు మెరిసే-వైన్ ఉత్పత్తికి సరైన ఆమ్లతను ఇస్తుంది. ఏదేమైనా, తరచుగా గడ్డకట్టే ఖండాంతర వాతావరణం,  పర్యావరణ వ్యవస్థ  వైన్ రుచిని మరింత ప్రత్యేకంగా మార్చుతాయి. "షాంపైన్ ఎక్కువ మన్నికైనది కావడానికి  చాలావరకు  ద్రాక్ష పంట పెరిగే భౌగోళిక పరిస్థితులు, అక్కడి స్థానిక వాతావరణం పై ఆధారపడి ఉంటుంది. అంతేకాదు దాని ఉత్పత్తిచేసే విధానం కూడా ప్రత్యకంగా ఉంటుంది. కాలక్రమేణా ఈ తయారీ విధానం మరింత మెరుగుపరచబడింది.  మేము  రెండు శతాబ్దాలకు పైగా ఇక్కడ ద్రాక్షను పండిస్తున్నాం. ఇది నిజంగా  చాలా ముఖ్య మైన అంశం. దీనితో పాటు  ఆల్కహాలిక్ కిణ్వ  ప్రక్రియ లో తయారయ్యే  వైన్  చాలా  కిక్ ఇస్తుంది.  వివిధ రకాల  వైట్ వైన్లకు మించి రుచి ఇస్తుంది అంటున్నారు " ఫాబ్రిస్ రోసెట్, చైర్మన్ అండ్ సిఇవో, షాంపైన్ డ్యూట్జ్  ద్రాక్షపంటకోత సమయంలో దాదాపు 1,20,000 మంది కార్మికులు పనిచేస్తారు. వీరంతా 84,000 ఎకరాల విస్తీర్ణంలో పండిన  తోటల నుంచి ద్రాక్షను సేకరిస్తారు. ద్రాక్ష పంటల సాగులో యంత్రాలను ఉపయోగించడం నిషేధం. అందుకే భూమి సాగు నుంచి పంటకోత వరకు అన్నీ కార్మికులే  చేతులతో చేస్తారు. అంతే కాదు ఉత్తమమైన ద్రాక్షను మాత్రమే ఎంచుకుంటూ   తీగల నుంచి ద్రాక్షను సేకరిస్తారు.  దీనివల్ల నాణ్యమైన ద్రాక్షను ఉపయోగించ డం వీలవుతుంది. కొండపై రోజంతా సూర్యురశ్మి తగులుతుంది. అంతేకాదు వర్షం పడినా నీరు మాత్రం ఆగదు. ఈ నేలలో ద్రాక్ష సాగు చారిత్రాత్మకంగా కొనసాగుతుంది. దీనితో ఉత్తమమైన నేలలో పండిన ద్రాక్ష లభిస్తుంది. ఇక్కడి మట్టి , వాతావరణంలో పెరిగే ద్రాక్షకు మాత్రమే షాంపైన్ తయారుచేసే ఉత్తమగుణాలున్నాయి. అంటాడు ఇరేలియన్ లాహెర్టే, ద్రాక్ష తోటల పెంపకందారుడు. ప్రామాణికమైన షాంపైన్ మాథోడ్ ఛాంపెనోయిస్ ద్వారా ఉత్పత్తి చేయబడుతుంది. ఇక్కడ వైన్ ఓక్ ,  స్టెయిన్లెస్ స్టీల్ వాట్స్‌  లో ప్రాధమిక కిణ్వ ప్రక్రియకు జరుగుతంది. ఆ తర్వాత  బాటిల్ లోపల ద్వితీయ కిణ్వ ప్రక్రియ జరుగుతుంది. ఈ పద్ధతి యూరోపియన్ యూనియన్‌కే పరిమితం చేయబడింది. అందుకే షాంపైన్ ప్రాంతం వెలుపల నుండి వచ్చే వైన్‌లను షాంపైన్ అని అనరు. ఏదేమైనా ప్రపంచం నలుమూల్లో అన్ని రకాల వైన్ సరిగ్గా అదే విధంగా ఉత్పత్తి చేయబడుతుంది. అయితే షాంపైన్ మాత్రం సాంప్రదాయక ద్వారా ఉత్పత్తి చేయబడుతుంది. యూరప్ వెలుపల ఉన్న దేశాలలో కొంతమంది వైన్ తయారీదారులు యూరోపియన్ లేబులింగ్ చట్టాలను పూర్తిగా విస్మరిస్తారు. షాంపైన్ పేరుతో  మెరిసే వైన్ ఉత్పత్తిని కొనసాగిస్తున్నారు. ప్రామాణికమైన షాంపైన్ బ్రాండ్‌ను రక్షించడానికి ప్రపంచవ్యాప్తంగా 80 మందికి పైగా న్యాయవాదులతో కలిసి పనిచేసే కామిట్ షాంపైన్ ఈ అనుకరణలను నిరంతరం సవాలు చేస్తుంది. అంతిమంగా, ఉత్పత్తిలో సారూప్యతలు , రుచి ఉన్నప్పటికీ, నిజమైన షాంపైన్ మాత్రమే ఈ ప్రాంతం  చరిత్ర, ప్రతిష్టతో ముడిపడి ఉంటుంది. షాంపైన్ ఉత్పత్తి విధానం మూడవ శతాబ్దం నాటిది. రోమన్లు మొట్టమొదట ఈశాన్య ఫ్రాన్స్‌లో ద్రాక్షతోటలను సాగుచేశారు. 17 వ శతాబ్దం మధ్యలో సీసాలో కిణ్వ ప్రక్రియ అభివృద్ధి చేయడంతో  షాంపైన్ అధికారికంగా రుచికరమైన పానీయంగా మారింది.  దీన్ని  లూయిస్ XIV హయాంలో రాజు ఇచ్చే విందులో అతిథిలకు అందించేవారు.   ప్రారంభంలో సీసాలను భూమితో దాచేవారు. అయితే సీసాల లోపల ఉత్పత్తి అయ్యే  కార్బన్ డయాక్సైడ్ వాయువు తరచుగా సీసాలు పేలడానికి కారణమయ్యేది. 19 వ శతాబ్దం నాటికి షాంపైన్ ప్రజాదరణ పొందింది.  ముఖ్యంగా ధనిక, రాయల్ కుటుంబాల్లో  షాంపైన్ విలాసవంతమైన వైన్ గా పేరుగాంచింది.  వారి ఇంట్లో మందమైన గాజు సీసాల్లో మెరిసే షాంపైన్ బాటిల్స్  ఉంచడం స్టేటస్ గా భావించేవారు. దాంతో ఆధునిక షాంపైన్ పరిశ్రమ ఏర్పడటం ప్రారంభమైంది. ఆశ్చర్యకరమైన విషయం ఎమిటంటే  మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధం సమయాల్లో ఈ ప్రాంతం కీలక యుద్ధభూమిగా మారినప్పటికీ, కొన్ని షాంపైన్ ఉత్పత్తి  మాత్రం కొనసాగింది. అయితే  యుద్ధం ముగిసేనాటికి షాంపైన్ ద్రాక్షతోటలలో 40శాతం నాశనమయ్యాయని అంచనా. ఉత్పత్తిలో కోత కారణంగా యుద్ధ సమయంలో తయారు చేసిన సీసాలు అధిక ధర పలికాయి.  2015 లో సోథెబైస్ క్రుగ్ యుద్ధకాలంలోని 1915నాటి షాంపైన్ బాటిల్ ను  116,000 డాలర్లకు వేలం వేసింది. విలాసానికి, సంపదకు, ప్రముఖులకు  షాంపైన్ అనుబంధం ఎంతో ఉంది. రాజులకు పట్టాభిషేకం చేసే సమయంలోనూ, పెద్దపెద్ద నౌకలను ప్రారంభించే సమయంలోనూ షాంపైన్  ధరలను అధికంగా  ఉండేవి. అమెరికన్ ర్యాపర్, జే-జెడ్ 2014 లో కాటియర్ కుటుంబం నడుపుతున్న షాంపైన్ బ్రాండ్ అర్మాండ్ డి బ్రిగ్నాక్ తయారు చేసే "ఏస్ ఆఫ్ స్పేడ్స్" లో భాగస్వామి అయ్యాడు. సెప్టెంబరు 2019 లో వారు 2009, 2010, 2012 ఏండ్ల నాటి ఉత్పత్తులైన అరుదైన షాంపైన్ రకాలను విడుదల చేశారు. ఇందులో 3,535 బ్రాండ్ మాత్రం  వెయ్యి డాలర్ల ధరతో అందుబాటులో ఉంది. ఈ షాంపైన్ ఆరు సంవత్సరాల పాటు బాటిల్ లో నిల్వచేయబడింది. ప్రపంచవ్యాప్తంగా ఇంత ప్రాముఖ్యతను, డిమాండ్ ను సంపాదించుకున్న షాంపైన్ భవిష్యత్ ఏంటీ అన్నది ప్రస్తుతం తలెత్తుతున్న ప్రశ్న. షాంపైన్ ప్రపంచంలోనే మొట్టమొదటి వైన్-పెరుగుతున్న ప్రాంతంగా అవతరించింది. అయితే గణాంకాలను బట్టి చూస్తే గ్లోబల్ వార్మింగ్  కారణంగా గత 30 ఏళ్లలో ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు 1.2 డిగ్రీల సెల్సియస్ పెరిగాయి.. దాంతో ద్రాక్ష పంట కోతకు వచ్చే తేదీల్లో మార్పులు వచ్చాయి.  15రోజుల ముందుగానే పంట చేతికి వస్తుంది. షాంపైన్ ప్రాంత  వాతావరణ పరిస్థితులు మారుతున్నందున, పారిస్ ఒప్పందం వాతావరణ లక్ష్యాలు గ్లోబల్ వార్మింగ్‌ను కొనసాగించడంలో విఫలమైనందున భవిష్యత్త్ లో ఈ చారిత్రాత్మక ప్రాంతంలో వైన్ తయారీ ప్రమాదంలో పడుతుంది.  

భూమిని రక్షించే 22 ఆవిష్కరణలు...!

విపరీతంగా ప్లాస్టిక్ వాడకం వల్ల భూమి ఉష్టోగ్రతలు అంతకంతకు పెరుగుతున్నాయి. ఈ కారణంగా వాతావరణంలో వచ్చే పెనుమార్పులు ప్రకృతివైపరీత్యాలకు దారితీస్తున్నాయి. ఆధునిక జీవనశైలిని పర్యావరణ పరిరక్షణకు అనుకూలంగా మార్చేలా అనేక కొత్త కొత్త ఆవిష్కరణలు వెలుగులోకి వస్తున్నాయి. వాటిలో కొన్ని.. 1. పాత ప్లాస్టిక్ బాటిళ్లను బల్బులుగా మార్చడం.  నీళ్లు, కూల్ డ్రింక్స్ ఎక్కువగా బాటిల్స్ లోనే లభ్యమవుతున్నాయి. ఇవి అంత త్వరగా భూమిలో కలిసిపోవు. వీటిని రీ యూజ్ చేయడం ద్వారా చాలావరకు పర్యావరణాన్ని రక్షించవచ్చు. పాత ప్లాస్టిక్ బాటిళ్లలో సూక్ష్మమైన సోలార్ పానెల్ లు ఉంచడం వల్ల వీటిని బల్బులుగా మార్చవచ్చు. ఇవి పేద వర్గాల నివాసప్రాంతాలకు విద్యుత్ కాంతిని అందించడానికి వీలుగా ఉంటాయి. 2. తినదగిన వాటర్ బాల్స్ నీళ్ల కోసం ఉపయోగించే ప్లాస్టిక్ బాటిల్స్ ను తగ్గించే ప్రయత్నంలో భాగంగా వచ్చిన ఆవిష్కరణ ఇది. వాటర్ ను బాల్స్ గా అందుబాటులోకి తీసుకురావడంతో ప్లాస్టిక్ బాటిల్స్ ఉపయోగం చాలావరకు తగ్గుతుంది. తినదగిన వాటర్ బాల్స్ ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించడానికి సహాయపడతాయి. 3. మిస్టర్ ట్రాష్ నదుల్లో చెత్త పెరుకుపోవడంతో నదీజలాలు, సముద్రజలాలు కలుషితం అవుతున్నాయి. కోట్లాది జలచరాలు ప్రాణాలో కోల్పోతున్నాయి. ఈ ముప్పును తగ్గించడానికి అందుబాటులోకి వచ్చిన ఆవిష్కరణ మిస్టర్ ట్రాష్. ఇది నదుల నుండి చెత్తను తొలగిస్తుంది. కరెంట్ లేదా సోలార్ తో పనిచేసే ఇది బెల్టిమోర్ లో 999 టన్నుల చెత్తను తొలగించింది. 4. ప్లాస్టిక్ రహిత షాంపో పాడ్లను, కరిగే ఫిల్మ్స్ ద్వారా తయారు చేస్తారు. బెంజమిన్ స్ట్రెయిన్ తన 14వ ఏట దీన్ని రూపొందించాడు. కేవలం 5 మిల్లిలీటర్లు ఉన్న ఆ పాడ్ ఎంతటి పొడవైన జుట్టునైన శుభ్రం చేస్తుంది. 5. మెల్లిగా కదిలే నీళ్ళద్వారా టర్బైన్ హార్వెస్ట్ గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి అవుతుంది. దీని కోసం మోటార్ పనిచేయాలంటే అతి తక్కువగా  2mph కరెంటు ఉంటే చాలు. 6. పాత కంటైనర్లును బాగుచేసి, షిప్పింగ్ కంటైనర్ పూల్ ను తయారు చేస్తారు. వాటిలో నీటిని ఫిల్లర్ చేసే పరికరాలు, మెట్లు, డెక్ అన్ని అమర్చబడి ఉంటాయి. 7. సీబిన్ సముద్రంలోని చెత్తను సేకరిస్తుంది. అందులో ఉన్న పంపు నీటి ప్రవాహాన్ని సృష్టించి చెత్త అంతా ఆ బ్యాగ్ లో నిండేలా చేస్తుంది. మరోవైపు నుండి నీరు అంతా బయటకు వెళ్ళిపోతుంది. 8. తినదగిన ఈ స్పూన్లు చిన్న చిన్న ఫంక్షన్స్ లోనూ ప్లాస్టిక్ స్పూన్లు ఉపయోగిస్తారున్నారు. వీటిని తగ్గించే ప్రయత్నమే తినదగిన స్పూన్లను రూపకల్పన. ఇవి ప్లాస్టిక్ ఉపయోగాన్ని తగ్గిస్తుంది. అవి వేపర్స్ లాగా రుచిగా ఉంటాయి. వీటిని రైస్, మిల్లెట్స్, గోధుమల నుండి తయారు చేస్తారు. 9.సాల్ట్ వాటర్ బ్రేవరీ సముద్ర జీవులకు  ఆహారంగా తీసుకోవడానికి వీలుగా ప్యాకింగ్ చేస్తుంది. ఉత్పత్తి చేసే రింగ్స్ ను బార్లీ, గోధుమలతో తయారు చేస్తారు. వీటిని జలచరాలు సులభంగా తిన గలవు. 10. ఈ పోర్టబుల్ టర్బైన్ అనేది 24 గంటలూ విద్యుతును ఉత్పత్తి చేస్తునే ఉంటుంది. ఇది 12 kwh వరకు ఉత్పత్తి చేస్తుంది. ఒక ఇంటికి ఇంతకంటే ఎక్కువ అవసరం ఉండదు. ఇది పర్యావరణ రహితం కూడా. 11. ప్లాస్టిక్ బాటిల్ కట్టర్ అనేది బాటిళ్లను దారాలుగా కట్ చేయడానికి ఉపయోగపడుతుంది. బాటిళ్ల దారాన్ని వేరే రూపంగా ఉపయోగించుకునేందుకు పనికొస్తాయి. కార్లకు కట్టి లాక్కెళ్లాడానికి మొదలైన వాటికి పనికొస్తాయి. 12. ఈ టూత్‌పేస్ట్ మాత్రలు అనేవి ప్యాకేజీలో దొరుకుతాయి. లిండ్సే మెకార్మీస్ వీటిని తయారుచేసింది. వాటిని ఫ్రెష్ గా భద్రపరచాల్సిన అవసరం కూడా లేదు. 13. పాత టైర్లను ముక్కలుగా చేయడం.. పాత టైర్లను ముక్కలుగా చేసే ఈ భారీ యంత్రం టైర్లకు సెకండ్ లైఫ్ ఇస్తుందనే చెప్పవచ్చు. ఇది కాటన్, ఫైబర్, ఉక్కు మొదలైన వాటి నుండి రబ్బరును వేరు చేస్తుంది.  ఈ మెటీరియల్ ను తిరిగి ఉపయోగించుకునేలా చేస్తుంది. 14. వాటర్ లిల్లీ.. ఈ చిన్న టర్బైన్ అనేది గ్రిడ్  శక్తిని పెంచుతుంది. ఈ వాటర్ లిల్లీ గాలి లేదా నీటి నుండి శక్తిని సేకరించి విద్యుత్ గా మారుస్తుంది. ఇది ఎటువంటి పవర్ డివైజ్ ను అయినా ఛార్జ్ చేస్తుంది. 15. సోయాబీన్స్ తయారు చేయబడిన పౌడర్ నీటి నుండి మురికిని వేరు చేస్తుంది. దీన్ని మురికినీటిలోనో, పొల్యూషన్ నీటిలోనో మిక్స్ చేస్తే ఆ మురికినంతా అడుక్కు చేరేలా చేసి నీటిని శుభ్రపరుస్తుంది. 16. ఈ బాల్స్ మానుషుల విసర్జనతో తయారుచేయబడిన బొగ్గులు. మానవ వ్యర్థాలను రెండు మూడు వారాలపాటు గ్రీన్ హౌస్ లో ఎండబెట్టి  ఆ తర్వాత వాసనను పోగొట్టడానికి 700 సెంటిగ్రేడ్ దగ్గర వాటిని వేడి చేస్తారు. ఆ తర్వాత బాల్స్ గా తయారుచేస్తారు. 17. ఈ బయోడిగ్రేడబుల్ బ్యాగులు నీటిలో కరిగిపోతాయి. వీటిని దుంపజాతి పంటలైన కర్రపెండలం నుండి తయారు చేస్తారు. నీటిలో అవి కరిగిపోయిన తర్వాత తాగేందుకు ఉపయోగపడతాయి. 18. ఈ వర్ల్పూల్ టర్బైన్బైన్లు చాలా ఇండ్లకు కరెంటును అందిస్తాయి. ఇవి 24 గంటలు విద్యుత్ ను ఉత్పత్తి చేస్తూనే ఉంటాయి. ప్రపంచ వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ ఉత్పత్తి కోసం వీటిని రూపొందించారు. 19. ఈ కంపోస్ట్ బిన్ అనేది చెత్తను గ్యాస్ గా మారుస్తుంది. ఒక లీటరు సేంద్రియ వ్యర్థాలకు 200 లీటర్ల గ్యాస్ ను  ఇది ఉత్పత్తి చేస్తుంది. ఈ బిన్ ను ఒక పైప్ ద్వారా ఇంటికి కనెక్ట్ చేసుకోవాలి. 20. ఈ యంత్రం కరెంట్ లేకుండా వాషింగ్ మిషన్ లో  బట్టలు ఉతికి పెడుతుంది. దీనికి కావాల్సిందంతా మానవ శక్తి , కొన్ని నీళ్లు. పెడల్ తొక్కడం ద్వారా తిరిగే ఈ యంత్రాన్ని అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రజలను లక్ష్యంగా చేసుకొని కనుక్కోబడింది. 21. క్యాప్ స్టవ్ 2 అనేది పొగను తగ్గించే యంత్రం. ఇంధన వినియోగాన్ని సగానికి పైగా తగ్గిస్తుంది. స్టవ్  నుండి పొగ వెలువడటం ద్వారా సంవత్సరంలో 1.5 మిలియన్ మంది ప్రజలు చనిపోతున్నారు. 22. హైడ్రో వీల్ ఒక మైలు దూరం వరకు నీటిని పంపుచేస్తుంది. దీనికి ఎటువంటి విద్యుత్ అవసరం ఉండదు. పైగా దీనికి పెద్దగా మెకానికల్ పార్ట్స్ ఉండవు కాబట్టి సులభంగా మెంటేన్ చేయవచ్చు.

సంవత్సరానికి 15 బిలియన్ డాలర్ల విలువైన పనిచేసే తేనెటీగలు

తేనెటీగలు అంతరించిపోతే .. పార్క్ లోనూ... ఎప్పుడైనా పొలాల వైపు వెళ్లినప్పుడో తేనెటీగలను చూస్తాం. అవి ఎక్కడ కుడ్డతాయో అని భయపడతాం. కానీ, ఆ తేనెటీలు లేకపోతే మనకు ఆహారమే కష్టం అన్న విషయం మాత్రం గమనించం. వాటి మకరందం సేకరణ వెనుక జీవజాతి ఆహారం ఆధారపడి ఉంది అన్నది వాస్తవం.. శివుడి ఆజ్ఞ లేనిది చీమైన కుట్టదు అన్నది నిత్యసత్యం. తేనెటీగలకు మనం తినే ఆహారానికి ఎంటో సంబంధం అనుకుంటున్నారా.. చాలా ఉంది.. పర పరాగ సంపర్కం.. సైన్సు పాఠ్య పుస్తకాల్లో కనిపించే సామాన్య పదం ఇది. కొన్ని రకాల కీటకాలు ఒక పువ్వు నుంచి మరో పువ్వు మీద వాలినప్పుడు, వాటి కాళ్లకు అంటుకున్న పుప్పొడి రేణువుల ద్వారా పర పరాగ సంపర్కం జరిగి ఆయా మొక్కల ప్రత్యుత్పత్తి జరుగుతుందని ఈ పాఠం చెబుతుంది. అంటే ప్రకృతి పచ్చగా కళకళలాడాలంటే కీటకాల పాత్ర కీలకం. తేనెటీగలు, తుమ్మెదలు, తూనీగలు... ఇవన్నీ కూడా పుప్పొడి వాహక కీటకాలే. పర పరాగ సంపర్క చోదకాలే. ఇలాంటి వాటన్నిటినీ కలిపి ‘పాలినేటర్స్‌’ అంటారు. అయితే ప్రపంచవ్యాప్తంగా అనేక మానవ తప్పిదాల వల్ల క్రమక్రమంగా ఈ ‘పాలినేటర్స్‌’ అంతరించిపోతున్నాయి. ‘పాలినేటర్స్‌’ లేని ప్రపంచాన్ని ఊహించడమంటే... పోషకాలనిచ్చే పండ్లు, గింజలు, కూరగాయల మొక్కలు లేని ప్రకృతిని వీక్షించడమే. అందుకే పలు గుణపాఠాల అనంతరం యావత ప్రపంచం అప్రమత్తమయ్యింది. పలు దేశాలు యుద్ధప్రాతిపదికన వీటిని అభివృద్ధి చేయడానికి నడుం బిగించాయి. తేనెటీగలు మీకు ఇష్టమైన కీటకాలు కాకపోవచ్చు. ఎందుకంటే అవి కుడితే నిజంగా బాధేస్తుంది. అయితే పర పరాగ సంపర్కం జరిపే ముఖ్యమైన కీటక జాతుల్లో తేనెటీగలు అగ్రస్థానంలో ఉన్నాయి.  ప్రపంచ జనాభాకు కావల్సిన ఆహారంలో అధికశాతం ఈ తేనెటీగల పరాగ సంపర్కం ములానే లభిస్తుంది. . కానీ నేడు రికార్డ్ స్థాయిలో ఈ తేనెటీగలు చనిపోతున్నాయి. ఒకవేళ ఈ తేనెటీగలే లేకపోతే, మన ప్రపంచ ఆహార సరఫరా పరిస్థితి ఏమైపోతుంది..? రేపు ఒకవేళ సడన్ గా ఈ భూమిపై ఉన్న తేనెటీగలనీ చనిపోతే పరిస్తితులేం బావుండవు.  సమతుల్య ఆహారం కోసం, మానవులకు అవసరమైన పండ్లు, ఇతర కూరగాయలు, మొక్కల పునరుత్పత్తి చేయడానికి, వాటిని పెంచడానికి ఈ పరాగ సంపర్కం అవసరం. ఈ సంపర్కాన్ని తేనెటీగలు బెస్ట్ అని చెప్పవచ్చు. కొన్ని మిలియన్ సంవత్సరాల నుండి పుష్పించే మొక్కలతో కలిసి ఉండటం వల్ల ఇవి పరాగ సంపర్క యంత్రాలుగా మారిపోయాయి. మనం తినే 84శాతం పంటలను పరాగ సంపర్కం చేయడానికి తేనెటీగలు సహాయపడుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇది ఆహార వార్షిక ఉత్పత్తిలో 236 బిలియన్ డాలర్ల నుండి 577 బిలియన్ డాలర్ల వరకు ఉంటుంది. ఒకవేళ తేనెటీగలు లేదా పరాగ సంపర్కం చేసే ఇతర కీటకాలు లేకుంటే ఇవాళ ఉండే సూపర్ మార్కెట్లలోని కూరగాయలు, పండ్లు సగం వరకు ఉంటాయి. తేనెటీగల్లో విలుప్త వినాశనకరమైన డొమైన్ ను కలిగివుంటుంది. అది మొక్కలను తినే జంతువులని సంహరించడమే కాకుండా ఫుడ్ చైన్ ను పెంచుతూ పోతుంది. అమెరికన్ వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం తేనెటీగలు మనకు చేసే పని సంవత్సరానికి 15 బిలియన్ డాలర్ల విలువతో సమానం అని లెక్కకట్టింది. ఒకవేళ అవే లేకుంటే మన ఉత్పత్తి ఖర్చు ఆకాశాన్ని అంటుకునేదేమో..?సామాజికంగా, ఆర్థికంగా సవాళ్ళను ఎదుర్కొంటున్న వాళ్ళు సమతుల్యమైన ఆహారాన్ని ఇప్పటికే పొందేందుకు ఇబ్బందులు పడుతున్నారు. అటువంటి వాళ్లపై మరింత ఘోరమైన ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. మనం ఊహించిన దానికంటే కూడా తేనెటీగలు తక్కువ స్థాయిలో ఉన్నాయి. 2018 సంవత్సరంలో అమెరికాలోని తేనెటీగల పెంపకందారుల్లో తమ కాలనీలో 45శాతం కోల్పోయామని చెప్పారు. అదే విధంగా ప్రపంచవ్యాప్తంగా గత దశాబ్ద కాలంగా రికార్డ్ స్థాయిలో తేనెటీగలు చనిపోతున్నాయి. తేనెటీగలు అకస్మాత్తుగా ఇలా తగ్గిపోవడానికి శాస్త్రవేత్తలు కచ్చితమైన కారణాలను కనుగొనలేదు కానీ, గ్లోబల్ వార్మింగ్, అధిక మోతాదులో పురుగుల మందుల వాడకం, తేనెటీగల పెంపకంపై వైరసును వ్యాప్తి చేసే పరాన్నజీవి వర్రోవా వంటి పురుగులు కారణం అని భావిస్తున్నారు. ప్రస్తుతం అయితే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తేనెటీగలను పర్యవేక్షణ చేయడానికి, రోబోట్లను ఉపయోగించి కొత్త పరాగ సంపర్క పద్దతులను రూపొందించడానికి కృషి చేస్తున్నారు. సగటు మనిషి తేనెటీగలతో స్నేహంగా ఉండటానికి ఏమిచేయవచ్చు అనే ప్రశ్న రావచ్చు. మీకు ఉద్యానవనం ఉంటే అందులో పువ్వులను నాటండి, వాటిపై వాలిన తేనెటీగలు సంవత్సరం పొడవునా అమృతాన్ని ఇస్తాయి.  తేనెటీగల్లో స్థానిక తేనెటీగలు, అడవి తేనెటీగలు అని రకాలు ఉంటాయి. కొన్ని మట్టిలో గుడుకట్టుకొని ఉంటాయి. ఒకవేళ మట్టిని చదును చేస్తుంటే తేనెటీగలు ఉన్న వాటిని వదిలివేయడం, ఆ మట్టికి నీళ్ల అందేలా చూడటం, సాధ్యమైతే పురుగుల మందులకు దూరంగా ఉండటం కూడా వాటికి సహాయ పడినట్లే. ప్రపంచ తేనెటీగల జనాభాను కాపాడటానికి ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నప్పటికీ భూమిని రక్షించు కోవడానికి ఇంకా చేయాల్సింది మాత్రం చాలానే ఉంది.

ప్రపంచంలో అత్యంత ప్రమాదకర 7 వీధులు

ప్రపంచంలో అందమైన నగరాలను చూశాం. అద్భుతమైన సముద్రతీరాలను తిలకించాం.ఎత్తైన భవనాలను, విలాసవంతమైన హోటల్స్ ఇలా అనేక అంశాలను మనం తెలుసుకుంటున్నాం. అయితే కొన్ని దేశాల్లోని వీధుల్లో అడుగు పెట్టాలంటే భయంతో వణికే పరిస్థితి ఉంటుంది. ఆయా ప్రాంతాల్లో భద్రత లోపించడం ఇందుకు ప్రధానకారణం. మరి అంత భయంకరమైన వీధులు ఎక్కడ ఉన్నాయో.. అవి ఎందుకు సురక్షితం కాదో మనం తెలుసుకుందాం.. 1. కాటియా, కారకాస్, వెనిజులా( catia,caracas, venezuela) ఈ వీధి అత్యంత ప్రమాదకరమైన వీధిగా పేరుగాంచింది. ఈ నగరంలో సురక్షితం కాని ప్రాంతాల్లో ఇది ఒకటి. 2016 లో ఈ నగరంలో మర్డర్ రేటు  చాలా భయానకంగా ఉందేది. అది రోజురోజుకూ పెరిగింది.  ప్రస్తుత రాజకీయ వాతావరణం కారణంగా ఈ నగరాన్ని సందర్శించకపోవడమే మంచిది. ఇక్కడ జరిగే నేరాలు స్థానిక ప్రజలనే కాదు పర్యాటకులను ఎన్నో ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. వెనిజులా ఎలాంటి వాతావరణం, ప్రజల పరిస్థితి ఉందో చెప్పడానికి  ఇది ఒక ఉదాహరణ మాత్రమే. 2. రెనాసిమింటో, అకాపుల్కో, మెక్సి కో(renacimiento, acapulco, mexico) పాత హాలీవుడ్ చలనచిత్రాల్లో కనిపించే  ఆకర్షణీయమైన బీచ్ పట్టణం ఇది. అయితే ఇప్పుడు పరిస్థితి వేరుగా ఉంది.  ఇది మెక్సికోలో అత్యంత హింసాత్మక నగరంగా మారింది. ఇక్కడ కొన్ని వీధుల్లో జరుగుతున్న హత్యలు ఇక్కడ ఉన్న నేరపరిస్థితులను స్పష్టం చేస్తున్నాయి. గత రెండు దశాబ్దాలలో అత్యంత ఘోరమైన  నేరాలు  2017 సంవత్సరం  జూన్ నెలలో జరిగాయి. ఇక్కడ గ్యాంగ్ లదే పైచేయిగా మారింది. అంతేకాదు ఈ నగరంలో నివసించే ప్రతి  ఒక్కరూ వారి వారపు జీతంలో కొంత భాగాన్ని రౌడీ మాములుగా  చెల్లించడానికి క్యూలో నిలబడాలి. ఇది ఇక్కడి ప్రజల దుస్థితికి అద్దం పడుతుంది. అక్రమ పదార్థ రవాణా, గ్యాంగ్ ల మధ్య  వార్ ల  కారణంగా  ఇక్కడ అనునిత్యం హింసాత్మక వాతావరణం ఉంటుంది. 3. ఫోర్టాలెజా, సీరా, బ్రెజిల్ (fortaleza,  ceara, Brazil) ముఠాల మధ్య వివాదం కారణంగా మే నెల 2018 లో ఒక నైట్‌క్లబ్ లో జరిగిన కాల్పుల్లో 14 మంది మరణించారు.  ఈ నగరంలో నేరాల రేటు పెరగడానికి ముఠాల మధ్య గొడవలే  ప్రధాన కారణంగా మారాయి. ఇక్కడ అనేక ప్రాంతాల నేరాలకు చిరునామాగా కనిపిస్తాయి.  అనేక నగరాలు ఇక్కడ సురక్షితం కావు. ముఖ్యంగా చీకటి పడ్డాక బయటకు వెళ్లాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెళ్లాల్సిందే.  బీచ్ ప్రాంతం చుట్టూ ఉన్న వీధుల్లో నేరాల సంఖ్య మరీ ఎక్కువగా ఉంటుంది. అనుక్షణం జాగ్రత్తగా ఉంటూ నేరాల నుంచి తప్పించుకోవలసిన ప్రదేశాలు చాలానే ఉన్నాయి. 4. సాన్ పెడ్రో సులా, కోర్టెస్, హోండురాస్ (SAN pedro Sula, cortes, Honduras) చాలా భయంకరమైన ఈ నగరంలో వీధుల  చుట్టూ చనిపోయిన మృతదేహాలను చూడటం చాలా సాధారణంగా కనిపిస్తుంది. వాటిని చూసి  మీరు ఆశ్చర్యపోవచ్చు. ఇది దక్షిణ అమెరికా లోని  అత్యంత భయంకరమైన నగరాల్లో ఒకటి అని చెప్పవచ్చు. ఇక్కడి ఆర్థిక వ్యవస్థ నేరాలకు కారణం అవుతుంది. రహదారులు, వీధుల్లో భద్రత ఉండదు. ప్రశాంతమైన ప్రజాజీవనానికి విఘాతం కలిగిస్తున్న ఈ ప్రాంతం లోో నేరాలను అదుపు చేయడానికి వివిధ సంస్థలు సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. ఇవి నెమ్మదిగా ఈ నగరాన్ని సురక్షితంగా ఉంచడానికి దోహదం చేస్తున్నాయి. ఈ ప్రయత్నాలు త్వరగా ఫలించి ఈ నగరం నేరాల  జాబితా నుంచి త్వరగా బయటపడుతుందని  ఆశిద్దాం. 5. శాన్ సాల్వడార్, ఎల్ సాల్వడార్ (san salvador, El salvador) ఈ నగరం హత్యలకు మారుపేరుగా నిలిచింది. 2016 లో ప్రతి 1,00,000 మందికి సగటున 83.39శాతం హత్యలు ఇక్కడ జరిగాయి.  దురదృష్టవశాత్తు ఇక్కడ యునైటెడ్ స్టేట్స్‌లో ఎంఎస్ -13 అనే ముఠా కార్యకలాపాలు లోతుగా పాతుకుపోయాయి.  ఈ ముఠాను అమెరికాలో సాల్వడార్ వలసదారుల పిల్లలు ప్రారంభించారు. అనేక నేరాలతో సంబంధాలు కలిగి ఉండే ఈ ముఠాలు భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. చాలా వీధులు నేరాలకు నిలయాలు. 6. కేప్ టౌన్, దక్షిణ ఆఫ్రికా (cape town, south africa) పోలీసుల లెక్కల  ప్రకారం ఈ ప్రదేశం 2016-2017 సంవత్సరానికి దక్షిణ ఆఫ్రికాలోనే అత్యధిక నేరాలు జరిగిన ప్రాంతం.  అయితే ఈ నగరం ఇతర నగరాల మాదిరిగా కాకుండా అత్యంత సుందరమైన, అద్భుతమైన నగరం కావడంతో సందర్శకులు వస్తుంటారు.  నగరం ఎంత అద్భుతంగా ఉన్నప్పటికీ  నేరాలు ఎక్కువగా జరగడంతో సందర్శకుల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. నగరం వాస్తవిక పరిస్థితి తెలిసిన వారెవ్వరూ ఈ నగరంలోని అద్భుతాలను చూసేందుకు ఆసక్తి చూపించరు. ఇక్కడ ఉండటం అనేది చాలా ప్రమాదకరం. ముఖ్యంగా రాత్రివేళ వీధుల్లో తిరగడం, ఈ నగరంలో బస చేయడం అనేది ఎంతమాత్రం సురక్షితం కాదు. 7. ఈస్ట్ సెయింట్ లూయిస్, సెయింట్ క్లెయిర్ కౌంటీ, ఇల్లినాయిస్ (East saint louis, St clair county, illinois) ఇది అమెరికాలో ఉన్న చెత్త నగరంగా పేరుగాంచింది.  ఈ ప్రదేశం  వీధులు పేదరికం, నేరాలతో నిండి ఉంటాయి. ఇక్కడ 2013లో తలసరి హత్య రేటు అమెరికా జాతీయ  సగటు కంటే 18 శాతం ఎక్కువ. 19 హత్య లు, 42 అత్యాచార కేసులు, 146 దోపిడీ కేసులు, 682 తీవ్ర దాడి కేసులు, 12 కాల్పుల కేసులు 2015 లో నమోదయ్యాయి. అప్పుడు జనాభా కేవలం 26,616 మాత్రమే.  ఈ నగరం  2016లో మొత్తం దేశంలోనే అత్యధిక హత్య రేటును కలిగి ఉంది. ఇది మరింత ప్రమాదకరమైన నగరంగా గుర్తింపు పొందింది. ఇక్కడ నేరాల సంఖ్య పెరుగుతునే ఉంది. పేదరికం నేరాలకు పెరగడానికి మరోకారణం. సో.. ఇవి ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన వీధులు, నగరాలు. కొత్త ప్రదేశానికి వెళ్లేముందు ఆ ప్రాంతం గురించి తెలుసుకోవడానికి ఇలాంటి సమాచారం ఎంతో ఉపయోగపడుతుంది.

ఫోర్బ్స్ ప్రకారం భూమిపై అత్యంత శక్తివంతమైన ఏడుగురు మహిళలు

ప్రపంచవ్యాప్తంగా మహిళలు అనేక రంగాల్లో రాణిస్తున్నారు. వారిలో అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాను ప్రతి ఏటా ఫోర్బ్స్ సంస్థ  వెల్లడిస్తోంది. తాజాగా ఫోర్బ్స్ వెల్లడించిన జాబితా ప్రకారం అత్యంత శక్తివంతమైన మహిళల్లో మొదటి ఏడుగురి గురించి తెలుసుకుందాం... 1 ఏంజెలా మెర్కెల్,(Angela Merkel) ఛాన్సలర్, జర్మనీ  జర్మనీ రాజకీయాల్లో సంచలన నేత ఏంజెలా మెర్కెల్. శాస్త్రవేత్తగా ఎన్నో పరిశోధనలు చేసిన ఆమె రాజకీయాల్లోనూ అరుదైన రికార్డులు సృష్టించారు. ఆమె 2005 లో జర్మనీకి మొదటి మహిళా ఛాన్సలర్ అయ్యారు.  ఆ తర్వాత వరుసగా నాల్గవసారి ఆమె ఛాన్సలర్ గా పనిచేస్తున్నారు. ఆమె వయసు 66 సంవత్సరాలు. ఆమె జర్మనీలోని  బెర్లిన్ లో నివసిస్తున్నారు. జర్మనీలో సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తూ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు.  యూరోప్‌లో  పెరుగుతున్న వలస వ్యతిరేక భావనతో ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు.  మెర్కెల్ జర్మనీకి ఛాన్సలర్ కాకముందు శాస్త్రవేత్త. ఆమె భౌతిక రసాయన శాస్త్రంలో పీహెచ్‌డీ పూర్తి చేసి  క్వాంటం కెమిస్ట్రీపై  థీసిస్ రాశారు. లీప్జిగ్ విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్ ఆఫ్ సైన్స్ పూర్తి చేసిన ఆమె అదే యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ కూడా అందుకున్నారు. ఆమె "శరణార్థులను కాపాడటంలో యూరోప్ విఫలమైతే అది మనం కోరుకున్న యూరోప్ కాదు." అంటూ ఆమె తన గళాన్ని గట్టిగానే వినిపిస్తారు. 2.  క్రిస్టిన్ లాగార్డ్ (Christine lagarde) యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ అధిపతి యూరోపియన్ సెంట్రల్ బ్యాంకుకు అధిపతి అయిన మొదటి మహిళగా క్రిస్టిన్ రికార్డు సృష్టించారు. నవంబర్ 1, 2019 న ఆమె ఈ అరుదైన అవకాశాన్ని అందుకున్నారు.  ఆమె ప్రపంచ ద్రవ్య వ్యవస్థ స్థిరత్వాన్ని నిర్ధారించడానికి పనిచేసే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్‌కు  2011 నుండి 2019 మధ్యకాలం వరకు సారధ్యం వహించారు. ఆమె వయసు 64 సంవత్సరాలు. కొలంబియా జిల్లాలోని వాషింగ్టన్ లో ఆమె నివసిస్తున్నారు. క్రిస్టిన్ టీనేజ్ లో మంచి స్మిమ్మర్ గా గుర్తింపు పొందారు. అంతేకాదు ఫ్రెంచ్ స్మిమ్మర్స్ టీమ్ లో సభ్యురాలు. యూరోపియన్ ఆర్థిక వృద్ధి మందగించే సమయంలో ఆమె ద్రవ్య విధానానికి బాధ్యత వహిస్తూ అంతర్జాతీయ ద్రవ్య నిధిని నడిపించారు. దేశీయ అవకాశాలను పెంచుకుంటూ బహుపాక్షిక వాణిజ్యంపై దృష్టి సారించారు. ఆమె వయసు 64. కొలంబియా జిల్లాలోని వాషింగ్టన్ లో ఉంటున్నారు. 3.  నాన్సీ పెలోసి (Nancy pelosi) యు.ఎస్. ప్రతినిధుల సభకు స్పీకర్. యు.ఎస్. ప్రతినిధుల సభకు నాన్సీ పెలోసి 52 వ స్పీకర్. ఈ పదవి ఆమెను దేశంలో అత్యధిక ర్యాంకు పొందిన మహిళగా  నిలబెట్టింది.     2013 లో జరిగిన కార్యక్రమంలో ఆమెను నేషనల్ ఉమెన్స్ హాల్ ఆఫ్ ఫేమ్‌లోకి చేర్చారు. 2007 నుంచి 2011 వరకు స్పీకర్ గా బాధ్యతలు నిర్వహించిన ఆమె మరోసారి 2019 లో స్పీకర్‌గా ఎన్నుకోబడ్డారు. అంతేకాదు యుఎస్ చరిత్రలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు వ్యతిరేకంగా నాల్గవసారి అభిశంసన విచారణను ఆమె 2019 లో ప్రారంభించారు. ఆమె  కాలిఫోర్నియాలోని  శాన్ ఫ్రాన్సిస్కోలో నివసిస్తారు.  ట్రినిటీ వాషింగ్టన్ విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ / సైన్స్ పూర్తి చేశారు. వివాహం చేసుకుని ఐదుగురు  పిల్లల తల్లిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 4 ఉర్సులా వాన్ డెర్ లేయన్ (Ursula von der leyen) అధ్యక్షులు, యూరోపియన్ కమిషన్,  యూరోపియన్ యూనియన్ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ అయిన యూరోపియన్ కమిషన్ అధ్యక్షపదవిలో జూలై 2019 లో ఉర్సులా వాన్ డెర్ లేయన్ నియమితులయ్యారు. ఈ పదవికి ఎన్నికైన మొదటి మహిళగా రికార్డు సృష్టించారు ఉర్పులా. అంతేకాదు ఏంజెలా మార్కెల్ క్యాబినెట్‌లో 2005 నుండి 2009 వరకు అతి ఎక్కువ కాలం పనిచేశారు. గతంలో ఏ క్యాబినెట్ సభ్యులు కూడా ఈ పదవిలో ఎక్కువ కాలం పనిచేయలేదు. కేబినెట్‌లో ఉన్న చివరి ఆరు సంవత్సరాలుగా ఆమె జర్మనీ రక్షణ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహించారు. జర్మనీ పౌరసత్వం కలిగి ఉన్న ఆమె  బెల్జియంలో నివసిస్తున్నారు. 5. మేరీ బరా (Mary barra) సీఈఓ, జనరల్ మోటార్స్ మేరీ  2014 నుండి జనరల్ మోటార్స్ CEO. డెట్రాయిట్ బిగ్ త్రీ వాహన తయారీ సంస్థ ఆమెకు అత్యధిక పరిహారంగా  2018 లో 21.9 మిలియన్ డాలర్లు అందించింది. ఆమె ఎలక్ట్రిక్ వాహనాలు, సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు  మావెన్ అనే రైడ్-షేర్ సేవలలో బిలియన్ల పెట్టుబడులు పెట్టారు. మేరీ ఆటోమొబైల్ వాహన తయారీ సంస్థకు నేతృత్వం వహించిన  మొట్టమొదటి మహిళా.  ఆమె వయసు 58 సంవత్సరాలు. మిచిగాన్ లోని నోవిలో ఆమె నివాసం ఉంటున్నారు. USA సిటిజన్ షిప్ కలిగిన మేరీ వివాహం చేసుకుని ఇద్దరు  పిల్లల తల్లిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కెట్టెరింగ్ యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ / సైన్స్, స్టాన్ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ పట్టాలను అందుకున్నారు. 6.  మిలిండా గేట్స్(Melinda gates) కో-చైర్, బిల్ & మిలిండా గేట్స్ ఫౌండేషన్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ సహ వ్యవస్థపకురాలు. దాతృత్వంలో అత్యంత శక్తివంతమైన మహిళగా తన స్థానాన్ని కొనసాగిస్తున్నారు. 2000 లో స్థాపించబడిన మిలిండా గేట్స్ ఫౌండేషన్ 40 బిలియన్ల ట్రస్ట్ మూలధనంలో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ ఛారిటబుల్ ఫౌండేషన్ గా ఏర్పడింది. ఈ ఫౌండేషన్ లక్ష్యం విద్య అందించడం, పేదరిక నిర్మూలన, పారిశుధ్యం, ఆరోగ్యం అందించడం మొదలైనవి. కఠినమైన  సవాళ్లను పరిష్కరించడంలో మిలిండా ఎక్కువగా కృషి చేస్తారు.ప్రజలందరికీ ఆరోగ్యకరమైనక జీవితాలను అందించే  ఫౌండేషన్ మిషన్‌లో భాగంగా  ఆమె ఎక్కువ భాగం మహిళలు, బాలికల హక్కుల సాధన కోసం  పనిచేశారు. ఆమె వయసు 55 సంవత్సరాలు. మదీనా, వాషింగ్టన్ లో ఆమె నివాసం.  బిల్ గేట్స్ ను వివాహం చేసుకున్నారు. వారికి ముగ్గురు పిల్లలు. డ్యూక్ విశ్వవిద్యాలయం లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ / సైన్స్, ఫుక్వా స్కూల్ ఆఫ్ బిజినెస్ లో  మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ పూర్తి చేశారు. 7 అబిగైల్ జాన్సన్ (Abigail Johnson) CEO, ఫిడిలిటీ ఇన్వెస్ట్‌మెంట్స్ ఆమె ఆస్తుల విలువ 15 బిలిియన్ డాలర్లు.   అబిగైల్ జాన్సన్ 2014 నుండి ఫిడిలిటీ ఇన్వెస్ట్‌మెంట్స్  CEO గా పనిచేశారు, ఆమె తన తండ్రి నుంచి 2016లో బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి చైర్మన్‌గా ఉన్నారు.  ఆమె తాత, ఎడ్వర్డ్ జాన్సన్ II మ్యూచువల్ ఫండ్ సంస్థను 1946 లో బోస్టన్ లో స్థాపించారు. ఆ సంస్థలో ఆమె వాటా 24.5శాతం. అంటే దాదాపు 2.9 ట్రిలియన్ డాలర్లు. జాన్సన్ కుటుంబం బోస్టన్ ప్రాంతంలో లాభాపేక్షలేకుండా అనేక దానధర్మాలు చేస్తుంది. అంతేకాదు న్యూ ఇంగ్లాండ్ లోని చారిత్రాత్మక హార్వర్డ్‌ యూనివర్సిటీ ఏర్పాటుకు సహాకారం అందించింది.   ఆమె మసాచుసెట్స్ లోని మిల్టన్ లో నివసిస్తున్నారు.  యుఎస్ పౌరసత్వం ఉన్న జాన్సన్ వివాహం చేసుకుని ఇద్దరు పిల్లల తల్లిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుంచి మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ పూర్తి చేశారు.

అంతర్జాతీయ పరిశోధనారంగంలో అగ్రగామిగా..

అందుబాటు ధరల్లో వ్యాక్సిన్ అందించే లక్ష్యంతో భారత్ బయోటెక్   వ్యాక్సిన్ దిగుమతి చేసుకునే స్థాయి నుంచి ఎగుమతి చేసుకునే స్థాయికి తమ దేశం రావాలన్న సుదీర్ఘ లక్ష్యంతో స్వదేశానికి వచ్చారు వారిద్దరు. వారి ఆలోచనతో 1996లో బ్యాంకు రుణాలతో ప్రారంభమైంది భారత్ బయోటెక్ - ఈనాడు అంతర్జాతీయ వ్యాక్సిన్ రంగంలో ప్రభంజనం సృష్టిస్తున్నది. కోవిడ్ లాంటి భయంకరమైన వైరస్ నుంచి రక్షణ కల్పించే కోవాగ్జిన్ వ్యాక్సిన్ తయారీలో ముందంజలో ఉంది. ఈ రోజు దేశప్రధాని నరేంద్ర మోడి స్వయంగా వచ్చి ఈ సంస్థ చేస్తున్న పరిశోధనలను అభినందించడం వెనుక దాదాపు పాతికేళ్ల శ్రమ ఉంది. ఇద్దరు దంపతుల ఆశయం ఉంది. ఒకరు పరిశోధనలపై దృష్టి పెడితే మరొకరు మార్కెటింగ్ పై పట్టు సాధించారు. వారే భారత్ బయోటెక్ ఎండీ కృష్ణ ఎల్లా, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్ర ఎల్లా. ఇప్పుడు భారతదేశంలో హైపటైటిస్ బి వ్యాక్సిన్ పుట్టిన ప్రతిబిడ్డకు ఇస్తున్నాం అంటే అందుకు కారణం ఈ సంస్థే. అంతేకాదు ప్రపంచంలో 1 వ వైద్యపరంగా నిరూపితమైన కంజుగేట్ టైఫాయిడ్ వ్యాక్సిన్, స్వైన్ ఫ్లూ వ్యాక్సిన్, రోటవైరస్ వ్యాక్సిన్‌, జికా వ్యాక్సిన్ ఇలా అనేక వ్యాక్సిన్ లను అందించిన ఘనత భారత్ బయోటెక్ సొంతం. ప్రపంచాన్ని భయభ్రాంతులకు గురిచేసి ప్రజాజీవనాన్ని స్తంభింపచేసిన కోవిడ్ వైరస్ వ్యాక్సిన్ అతి తర్వలో అందుబాటు ధరలో తీసుకువచ్చే ప్రయత్నం విజయానికి చేరవలో ఉంది. మరి ఇదంతా సాధించడం వెనుక సుచిత్ర ఎల్లా అకుంఠిత దీక్ష ఉంది. డిగ్రీ చేతపట్టుకుని అమెరికా వెళ్ళిన సుచిత్ర మార్కెటింగ్ రంగంలో ఉన్నత విద్యను అభ్యసించారు. గృహ ణిగా.. ఉద్యోగినిగా.. పారిశ్రామికవేత్తగా మారిన  సుచిత్ర ఎల్లా ప్రస్థానం ...   బి.ఎస్. దేవరాజులు, కాంచనమాల దంపతుల రెండో సంతానం సుచిత్ర. దేవరాజులు  నైవేలీ లిగ్నయిట్ కార్పొరేషన్లో మైనింగ్ ఇంజనీర్ గా పనిచేసేవారు. కాంచనమాల గృహిణి. వారికి ముగ్గురమ్మాయిలు, ఒక అబ్బాయి. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆత్మసైర్యం కోల్పోవద్దని ఉగ్గుపాలతోనే నేర్చుకున్నారు. మద్రాస్ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేసిన  తరువాత ఎల్లా కృష్ణతో వివాహం జరిగింది. వారి పెళ్లినాటికి కృష్ణ ఎల్లా మాలిక్యూలర్ బయాలజీలో పరిశోధన చేస్తున్నారు. పెళ్లి తర్వాత వారు అమెరికా వెళ్లారు. వారికి ఇద్దరు పిల్లలు. అక్కడ వచ్చే స్టైఫండ్ తో బతకడం కష్టం కావడంతో సుచిత్ర ఉద్యోగంలో చేరారు. చంటిపిల్లలను చూసుకోవడం కోసం ఒకరు ఇంట్లో ఉంటే మరొకరు ఆఫీసు వెళ్లేవాళ్లు. శని, ఆదివారాలు కృష్ణ రిసెర్చ్ కు సెలవు కావడంతో ఆ రెండురోజులు సుచిత్ర డే షిప్టులకు వెళ్లేవారు. అలా షిఫ్ట్ ల ప్రకారం ఉద్యోగాలు చేస్తూ ఇంటిబాధ్యతలు పంచుకునేవారు. ఒక వైపు ఉద్యోగం, మరోవైపు ఇంటి బాధ్యతలు చూస్తూనే బిజినెస్ మార్కెటింగ్ లో పీజీ పూర్తిచేశారు సుచిత్ర.    సుదూర లక్ష్యంతో స్వదేశానికి... కృష్ణ ఎల్లా పరిశోధన పూరైయిన తరువాత కొన్ని సంస్థల్లో ఉద్యోగం చేశారు. అదే సమయంలో ఇండియా విదేశాల నుంచి వాక్సిన్లను దిగుమతి చేసుకోవడం, అనేక చిన్నదేశాలకు వాక్సిన్స్ ఉత్పత్తికి అవసరమైన నిధులు సమకూర్చుకునే శక్తి లేక పోవడం గమనించి వారిద్దరూ బాధ పడిన రోజులు ఎన్నో ఉన్నాయి. తన పరిశోధనానుభవాన్ని స్వదేశం కోసం వినియోగించాలని నిర్ణయించుకున్నారు. ఇండియాకు తిరిగి రావాలనుకున్న వారి నిర్ణయం విని స్నేహితులంతా ఆశ్చర్యపోయారు. బంధువులు కూడా ఇక్కడకు వచ్చి ఎం చేస్తారు.. అంటూ నిష్టూరంగా మాట్లాడారు. అయినా వారు వెనుకడుగు వేయలేదు. తమ విజ్ఞానం స్వదేశానికి ఉపయోగపడాలి. స్వంతంగా వ్యాక్సిన్స్  తయారుచేసుకునే స్తోమత ఇండియాకు రావాలి. చిన్న చిన్న దేశాలకు వ్యాక్సిన్ ఎగుమతి చేయాలి అన్న లక్ష్యం తో స్వదేశానికి పయనమయ్యారు.   పరిశోధనారంగంలో వ్యాక్సిన్ తయారి కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి వారి వద్ద తగిన ఆర్థిక వనరులు లేవు. కృష్ణ పరిశోధనానుభవం, సుచిత్ర  మార్కెట్ మెలకువలు, స్నేహితుల సహకారంతో బ్యాంక్ లో అప్పులు తీసుకుని 1996లో భారత్ బయోటెక్ ఏర్పాటు చేశారు. త్యాగాలకు సిద్ధపడి ఈ సంస్థను ఏర్పాటు చేసాం అంటారు సుచిత్ర.  త్యాగాలు అని ఎందుకు అన్నానంటే ఆ రోజుల్లోనో.. నెలలగడువులోనోమా ప్రొడక్ట్ మార్కెట్ లోకి వచ్చేది కాదు. వ్యాక్సిన్ తయారి అనేది పరిశోధన.. ఆ పరిశోధన ఫలితాలు తెలియడానికి సంవ త్సరాలు.. కొన్నిసార్లు దశాబ్దాలు పడుతుంది. అయితే డాక్టర్లు వీటిని ప్రిఫర్ చేయాలి. మనపై ఎంతో నమ్మకం కుదరాలి. అన్నీ అనుకూలించాలంటే.. ఓపిక, పట్టుదల ఉండాలి.   పరిశోధనారంగంలో అంత పెట్టుబడి పెట్టి, ఫలితాలకోసం ఎదురుచూసేవారు చాలా తక్కువ. ప్రొడక్ట్ గురించి చెప్పడమే తప్ప .. ఫలితాలను వెంటనే చూపించలేం. మా లక్ష్యం ఎమిటో స్పష్టంగా ఉంది కాబట్టి, శాయ శక్తుల శతవిధాల ప్రయత్నం చేశాం. కేంద్ర ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ నుంచి అనుమతి పొందాం. ప్రొడక్ట్ మార్కెట్లోకి రావడానికి, వచ్చిన తరువాత ఫలితాలు తెలుసుకోవడానికి చాలా కాలం పడుతుంది. మా ఉత్సాహాన్ని, పరిశోధనారంగంలో ఉన్న అనుభవాన్ని, మనదేశంలో వ్యాక్సిన్ తయారీకి ఉన్న కొరతను గమనించిన ప్రభుత్వం ప్రోత్సాహాన్ని అందించింది. ఇప్పుడు ప్రభుత్వానికి హైపటైటిస్ - బి వ్యాక్సిన్, ఇతర వ్యాక్సిన్స్ లతో పాటు కోవిడ్ వ్యాక్సిన్ తయారీలో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ సంస్థకు దాదాపు 150 పేటెంట్స్ ఉన్నాయి.   దేశం పేరును అంతర్జాతీయంగా నిలపాలనే... చారిత్రకంగా, సాంస్కృతికంగా, శాస్త్రీయంగా భారతదేశం ప్రపంచంలోని అన్ని దేశాలకన్నా ముందు ఉంటుంది. ఇతర దేశాల మాదిరిగా బిలియన్ డాలర్లతో పరిశోధనలు చేసే ఆర్థిక స్థితి లేకపోయినా మేధోసంపత్తిని పెట్టుబడిగా పెట్టి, తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితాలు సాధించి, ప్రపంచఖ్యాతి పొందిన దేశం మనది. అందుకే మా సంస్థకు మా పిల్లల పేర్లో, ఇతర పేర్లో పెట్టకుండా భారత్ బయోటెక్ అని నమోదు చేశాం. వ్యాక్సిన్ తయారిలోనూ మన దేశం అంతర్జాతీయంగా పేరు సాధించాల న్నది మా ఆకాంక్ష, వ్యాక్సిన్ దిగుమతి చేసుకునే స్థాయి నుంచి ఎగుమతి చేసే స్థాయికి రావాలి అన్నదే తమ లక్ష్యం అంటారు సుచిత్ర ఎల్లా.   మహిళా సాధికారతే జాతీయ సంపద... చాలామంది ఆడవారికి చదవు ఉంటే చాలు అనుకుంటారు. కాని, విజ్ఞానం. విషయపరిజ్ఞానం ఉన్న వ్యక్తి ఖాళీగా ఉంటే దేశ సంపద నిరూపయోగంగా ఉన్నట్టే కదా.. సంపద అంటే ఆస్తులు, ధనమే కాదు..ఉత్పాదక శక్తి. ఆలోచన ఉన్న వ్యక్తి ఖాళీగా ఉండటం కూడా అభివృద్ధి నిరోధకమే అన్నది నా అభిప్రాయం. ఎంతో ఉన్నత విద్యను అభ్యసించిన మహిళలు కూడా వివాహం తరువాత, పిల్లలు పుట్టిన తరువాత ఉద్యోగాలు మానేస్తారు. అలా చేస్తే వారి కెరీర్ డెబ్బతింటుంది. కేవలం వారు ఎన్నుకున్న రంగంలోనే కాకుండా ఇతర రంగాల్లోనూ అవగాహన పెంచుకోవాలి. చాలా మంది ఉద్యోగస్తులుగా ఉండడానికి ఇష్టపడుతున్నారు తప్ప ఎంటర్ ప్రెన్యూర్ గా ఉండటానికి ఆసక్తి చూపించడం లేదు. సంస్థను స్థాపించాలంటే చాలా విషయాలను త్యాగం చేయాలి. పాజిటివ్ థింకింగ్, కొత్తగా ఆలోచించగల నేర్పు, కష్టనష్టాలను ఎదుర్కోగల ఓర్పు కావాలి. మహిళల్లో ఈ గుణాలు ఎక్కువే. మహిళలు అన్ని రంగాల్లో తమ ఉనికిని చాటుకుంటున్నప్పటికీ చాలా మంది 30 సంవత్సరాలు పై బడిన మహిళలు తమ ప్రొఫెషన్ కు  దూరం అవుతు న్నారు. సామాజిక ఒత్తిడిని, వ్యక్తి గతజీవితాన్ని బ్యాలెన్స్ చేసుకున్నప్పుడే విజయం సుసాధ్యమవుతుంది.   అందుబాటు ధరల్లో వ్యాక్సిన్స్... కాలుష్యం పెరిగిపోతున్న తరుణంలో నేటి తరం అనేక వ్యాధులకు గురౌతున్నది. ఇక రేపటి తరం ఎలా ఉంటుందో అన్న ఆలోచనే భయంగా ఉంది. అందుకే చిన్నారులకు అనేక వ్యాధులు నుంచి రక్షణ ఇచ్చే వ్యాక్సిన్లను మా సంస్థ తయారు చేస్తోంది. కిందిస్థాయి వారికి కూడా అందుబాటులో ఉండే ధరలతో వీటిని మార్కెట్లోకి విడుదల చేస్తాం అంటున్నారు సుచిత్ర..

భూమిపై గురుత్వాకర్షణ లేని 6 ప్రదేశాలు...!

భూమి తన చుట్టూ తాను తిరుగుతూ, సూర్యుని చుట్టూ కూడా తిరుగుతుందని మనం చిన్నప్పటి నుండి చదువుకుంటూనే ఉన్నాం. కానీ భూమి తిరుగుతున్నప్పుడు, దానిమీద ఉన్న మనం , ఇతర వస్తువులు ఎందుకు కిందపడట్లేదో ఎప్పుడైనా ఆలోచించామా..? కింద పడిపోక పోవడానికి కారణం గురుత్వాకర్షణ. దీన్ని మొదటిసారిగా ఆర్యభట్ట వివరించాడు. ఈ భూమిపై నిలబడి మనం ఏ వస్తువును విసిరివేసిన.. లేదా కిందకు పాడేసిన అది కిందపడి పోతుంది. కానీ కొన్ని ప్లేసుల్లో మాత్రం కిందకు వేసినవి భూమిపైన పడకుండా పైకే వెళతాయి. అలాంటి 6 వింతలు ఎక్కడున్నాయో తెలుసుకుందాం.. 1. రివర్స్ జలపాతం, ఇంగ్లాండ్. ఈ జలపాతం హేఫీల్డ్ దగ్గర ఉంది. ఈ ప్రదేశంలో నీళ్లు కిందకు ప్రవహించడానికి బదులు పైకే ప్రవహిస్తుంది. దీనికి కారణం గాలి. ఇక్కడ గాలి బలంగా వీస్తుంది. అందుకని దిగువకు ప్రవహించే నీరు గాలి ఒత్తిడి మూలంగా పైకి పైకి నెట్టబడుతుంది. అద్భుతమైన ఈ జలపాతం  78 అడుగుల ఎత్తులో ఉంటుంది. 2. రహస్యాల ఇల్లు, ఒరెగాన్, యు.ఎస్. ఇక్కడి అడవిలో చిన్న గది లాంటి ఇల్లు ఉంది. ఇదేమి ఒరెగాన్ ఆధ్యాత్మిక సుడిగుండం కాదు. స్థానిక అమెరికన్లు ఈ ప్రాంతాన్ని 'నిషేధిత భూమి'గా వర్ణించారు. ఈ స్థలంలో ఒక రకమైన గోళాకారపు శక్తి కేంద్రం ఉందని వాళ్ళు నమ్ముతారు. అందులో సగం శక్తి కింద అడుగు భాగాన, మరికొంత పై భాగాన కేంద్రీకృతం అయి ఉందని భావిస్తారు.  ఇక్కడికి వచ్చిన సందర్శకులు వాస్తవికంగా ఆ అనుభూతిని చెందుతారు. ఈ ప్రదేశంలో గురుత్వాకర్షణ ఉండదు. కాబట్టి నడవడం సాధ్యం కాదు. సందర్శకులు సముద్రంలో పడకుండా ఉండాలంటే గోడలను పట్టుకోవాలి. ఆ ఇంట్లో చీపురు ను ఉంచినా కూడా కిందపడకుండా ఎప్పుడూ అది నిటారుగానే ఉంటుంది. ఈ విచిత్రమైన మర్మమైన ప్రదేశంలో బాల్స్ ను ఉంచినా అవి ఉపరితలంపై పైకి వస్తాయి. ఈ మాయా ఘటనల వెనుక ఎటువంటి ట్రిక్స్ లేవు. కేవలం గురుత్వాకర్షణ లేకపోవడమే దీనికి కారణం.  3.  అరాగట్స్ పర్వతాల కింద ఉన్న రోడ్, ఆర్మేనియా. ఈ పర్వతం టర్కీ, అర్మేనియా సరిహద్దులో ఉంది. ఈ అద్భుతమైన గురుత్వాకర్షణ నిరోధక దృగ్విషయాన్ని చూసేందుకు ప్రతి సంవత్సరం వేలాది మంది సందర్శకులు ఈ పర్వతాన్ని సందర్శిస్తారు. ఈ పర్వతం కింద ఎవరైనా కార్ ఇంజన్ ఆపి అక్కడే ఉంచితే దాన్ని డ్రైవ్ చేయకున్నా కూడా పైకి వెళుతుంది. ఆ ప్రదేశాన్ని సందర్శించిన వ్యక్తులు దిగువ వైపు వెళ్లడం కంటే పైవైపు వెళ్లడం చాలా సులభం అని చెబుతారు. 4. హూవర్ డ్యామ్, నెవాడా, యుఎస్. ఈ ఆనకట్ట ఎత్తు 726.4 అడుగులు. ఎవరైనా కానీ ఈ పొడవైన ఆనకట్టను అధిరోహించాలని అనుకుంటే చిన్న ప్రయోగం చేస్తే చాలు. పెద్దగా చేయవలసిన అవసరం లేదు, బాటిల్లోంచి కొంచెం నీళ్లను కిందుకు పోస్తే అది కింది వైపు ప్రవహించదానికి బదులు పైకి ప్రవహిస్తుంది. ఇది కేవలం ఒక్క నీటి విషయంలోనే కాదు, ఆ ఆనకట్ట నుండి ఏ వస్తువును క్రిందికి విసిరినా ఆ వస్తువు కిందికి పడకుండా పైకి తేలుతుంది. ఇలా వస్తువులు తేలుతూ లేదా నీరు పైకి ప్రవహించటానికి కారణం ఈ ప్రదేశంలో ప్రవహించే బలమైన గాలి. 5. డెవిల్స్ టవర్, వ్యోమింగ్, యుఎస్. ఈ ప్రదేశం  లాడ్జ్ రేంజర్ జిల్లాలో ఉంది. మట్టిదిబ్బ అద్భుతమైన ఆకారం, పరిమాణం వ్యోమింగ్‌లో చాలా ముఖ్యమైన దృశ్యాన్ని చేస్తుంది. హైకర్లు కూడా ఇష్టపడతారు. కాని కొన్ని కారణాల వల్ల, ఎవరెస్ట్ మౌంట్ ఎక్కిన హైకర్లు కూడా డెవిల్స్ టవర్ శిఖరాన్ని అధిరోహించడంలో విఫలమవుతాడు. ఇది 1,267 అడుగుల పొడవు మాత్రమే ఉన్నప్పటికీ, దీని వెనుక కారణం అది నిటారుగా ఉన్న గోడలు. ఈ నిటారుగా ఉన్న గోడలు హైకర్లు పైకి చేరుకోవడం అసాధ్యం చేస్తుంది .  తిరిగి రావడం మరింత కష్టతరం చేస్తుంది. 6. దక్షిణ కొరియాలోని మర్మమైన రహదారి. జెజు ద్వీపంలోని ఈ రహదారిపై ఖాళీగా పడి ఉన్న డబ్బాలు, సీసాలు సాధారణంగా క్రిందికి వెళ్లడానికి బదులుగా పైకి వెళ్తాయి. పర్యాటకులు దీనిని చాలాసార్లు ప్రాక్టికల్ గా ప్రయత్నించి చూశారు కూడా.  దీన్ని గమనించిన అధికారులు ఈ రహదారిని మాగ్నెట్ కలిగిన పర్యాటక ప్రాంతంగా మార్చారు. గురుత్వాకర్షణ క్రమరాహిత్యం ఎక్కడ మొదలవుతుందో చూపించేందుకు అక్కడ సైన్ బోర్డును కూడా పెట్టారు.

ప్రపంచంలో అత్యంత ఖరీదైన 5 పడవలు

భూమిపై మూడువంతుల నీరు, ఒక వంతు భూమి ఉందన్న విషయం మనందరికీ తెలుసు. అందుకే మన పూర్వీకులు జల ప్రయాణాలు ఎక్కువగా చేసేవారు. చిన్నచిన్న పడవల నుంచి టన్నుల కొద్ది సరుకులను దేశవిదేశాలకు ఎగుమతిదిగుమతి చేయడంలో జల రవాణా సాధనాల ప్రాముఖ్యత ఎంతో ఉంది. రామాయణంలో వనవాసానికి బయలుదేరిన రాముడు సీత, లక్ష్మణుడు పడవ ప్రయాణం ద్వారానే అయోధ్యను దాటారు. వాస్కోడిగామా పడవ ప్రయాణం చేస్తూనే కొత్తదేశాల ఆనవాళ్లు తెలుసుకున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే పడవల చరిత్ర చాలానే ఉంది. అయితే ప్రస్తుతం రవాణాసాధనాల తీరు మారింది. భూ, జల మార్గాలే కాదు వాయుమార్గం కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో పడవలు కేవలం రవాణా సాధనాలుగానే కాదు వారివారి సంపదకు చిహ్నాలుగా మారాయి. ప్రపంచంలోని సంపన్న బిలియనీర్లకు ఖరీదైన కార్లు, విమానాలే కాదు ఆధునిక వసతులతో  పడవలు కూడా ఉన్నాయి. అత్యంత విలాసవంతమైన పడవల్లో హెలిప్యాడ్‌లు, థియేటర్లు, కచేరీ హాళ్లు,  స్విమ్మింగ్ పూల్ లు, ఆవిరి స్నానాలు, హాట్ టబ్‌లు వంటి అత్యంత ఆధునిక సదుపాయాలు ఉన్నాయి. మరి వాటి వివరాలు ఎంటో తెలుసుకుందామా.. 1. హిస్టరీ సుప్రీం (HISTORY SUPREME) ఖరీదు -  4.8 బిలియన్( 35,54,43,12,000 రూపాయలు) హిస్టరీ  సుప్రీం పడవ ఖరీదు 4.8 బిలియన్ డాలర్లు. ఇంత ఖరీదు ఎందుకు అనుకుంటున్నారు కదా.. ఈ పడవ స్వచ్ఛమైన బంగారంతో తయారు చేయబడినది. అంతే ప్రపంచంలోనే  అత్యంత ఖరీదైన పడవగా రికార్డు సృష్టించింది. ఈ నౌక  మలేషియా కు చెందిన సంపన్నుడు  రాబర్ట్ నోక్ సొంతం. ఈ ఓడ తయారీలో పది వేల కిలోల  బంగారం,  ప్లాటినం ఉపయోగించారట.  100 అడుగుల పొడవైన ఈ పడవ నిర్మించడానికి దాదాపు మూడు సంవత్సరాలు పట్టిందట. దీనిని UK కు చెందిన  ప్రఖ్యాత లగ్జరీ డిజైనర్ స్టువర్ట్ హ్యూస్ రూపొందించారు. బంగారం , ప్లాటినం లోహాలతో పడవను దాని బేస్ నుండి భోజన ప్రాంతం, డెక్, మెట్లు తదితర భాగాలను  అలంకరించారు. ఈ లగ్జరీ ఓడతో అత్యధికంగా ఆకర్షించేది మాస్టర్ బెడ్ రూమ్.  ఇది మెటోరైట్ రాక్ నుండి తయారు చేయబడిన గోడ. అంతేకాదు టైరన్నోసారస్ రెక్స్ ఎముకలతో తయారు చేసిన విగ్రహం ఇక్కడ కనిపిస్తుంది. 2. ఎక్లిప్స్  (ECLIPSE) ఖరీదు -  1.5 బిలియన్ డాలర్లు( 11,10,75,97,500 రూపాయలు) ప్రపంచంలో రెండవ అతిపెద్ద పడవ ఎక్లిప్స్. ఇది రష్యన్ బిలియనీర్ రోమన్ అబ్రమోవిచ్ సొంతం. ఈ పడవతో డిటెక్షన్ సిస్టమ్ ద్వారా క్షిపణి గుర్తింపు వ్యవస్థ ఉంటుంది. అంతేకాదు 2 హెలిప్యాడ్‌లు, 24 గెస్ట్ క్యాబిన్లు, డిస్కో హాల్, రెండు స్విమ్మింగ్ పూల్ లు, హాట్ టబ్‌లు ఉన్నాయి. దీనిని జర్మనీకి చెందిన బ్లోమ్ , వోస్ నిర్మించారు. 533 అడుగుల పొడవైన పడవలో మినీ జలాంతర్గామి కూడా ఉంది, ఇది నీటిలో 50 మీటర్ల వరకు మునిగిపోయే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. మాస్టర్ బెడ్ రూమ్ కిటికిలు  బుల్లెట్ ప్రూఫ్. 3. ది అజ్జామ్ ( THE AZZAM) ఖరీదు -  600 మిలియన్ డాలర్లు ( 44,42,49,90,000రూపాయలు) 590 అడుగుల పొడవైన పడవ 35 కిలోమీటర్ల వేగంతో నీటిపై దూసుకుపోతుంది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన  పడవ ఇది.  యుఎఇ  రాజకుటుంబ సభ్యుడు అజ్జామ్ యాజమాన్యంలో ఉందని వినికిడి. దీని తయారీదారుల ప్రకారం, ఇప్పటివరకు తయారు చేయబడిన అత్యంత క్లిష్టమైన పడవ ఇది.ఫ్రెంచ్ ఇంటీరియర్ డెకరేటర్ క్రిస్టోఫ్ లియోని అధునాతన ఇంటీరియర్‌లను డిజైన్ చేయగా, దాని వెలుపలి భాగాలను నౌటా యాచ్ రూపొందించారు. ఇది మొత్తం 35048 కిలోవాట్ల శక్తితో రెండు గ్యాస్ టర్బైన్లు ,రెండు డీజిల్ ఇంజన్లు ఉంటాయి. 4. మోటర్ యాచ్ ఎ (MOTOR YACHT A ) ఖరీదు - 440 మిలియన్ డాలర్లు (32,58,97,00,000) మోటారు యాచ్ ఎ  రష్యన్ వ్యాపారవేత్త ఆండ్రీ మెల్నిచెంకోకు చెందినది. ఇందులో 14 మంది అతిథులు ,  42 మంది సిబ్బందిని ఉండవచ్చు. 400 అడుగుల పొడవైన పడవ ఇంటీరియర్స్ 24,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. 2,500 చదరపు అడుగుల మాస్టర్ బెడ్‌రూమ్ , డిస్కోతో పాటు ఆరు అతిథి సూట్‌లు ఉన్నాయి. వీటిని నాలుగు పెద్ద స్టేటర్‌ రూమ్‌లుగా మార్చడానికి అనువుగా మూవబుల్ వాల్స్ ఉంటాయి. ఇంటీరియర్స్ , ఫర్నిచర్, గ్లాస్ వేర్,  ఫ్రెంచ్ క్రిస్టల్‌తో తయారు చేసిన టేబుల్‌వేర్లను అలంకరించిన అద్దాలు పడవ విలాసవంతమైన  లుక్ ను మరింత పెంచుతాయి. ఇందులో హెలిప్యాడ్,  30 అడుగుల స్పీడ్ బోట్ ఉంటాయి. ఈ పడవలో మూడు స్విమ్మింగ్ పూల్స్  ఉన్నాయి.  వాటిలో ఒకటి గ్లాస్ బాటమ్తో, మరోకటి డిస్కో పై ఉంటుంది. ఈ విలాసవంతమైన పడవను ఆర్కిటెక్ట్ మార్టిన్ ఫ్రాన్సిస్,  ఫిలిప్ స్టార్క్ రూపొందించారు. ఇది చాలా సింపుల్ గా కనిపిస్తున్నప్పటికీ,  సూపర్ లగ్జరీ సదుపాయాలు ఇందులో ఉన్నాయి. 5. దుబాయ్ (DUBAI) ఖరీదు -  400 మిలియన్ డాలర్లు(29,63,98,00,000) ఈ పడవ యుఎఇ ఉపాధ్యక్షుడు, ప్రధాన మంత్రి షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ సొంతం.  531 అడుగుల పొడవు ఉన్న దుబాయ్ పడవను బ్లోమ్,  వోస్ నిర్మించారు.  దాని వెలుపలి భాగాలను ఆండ్రూ వించ్ రూపొందించారు. అత్యంత ఖరీదైన ధరతో పాటు  గొప్ప నాణ్యత,  సృజనాత్మకత కనిపిస్తాయి. అదేవిధంగా ఇందులో మొజాయిక్ స్విమ్మింగ్ పూల్, వృత్తాకార మెట్లు, హెలిప్యాడ్ కలిగి ఉంది. ఈ బ్రహ్మాండమైన సూపర్‌యాచ్‌లో సిబ్బందితో సహా 155 మంది అతిథులు ఉండేలా సదుపాయాలు ఉంటాయి.  దాని ఔట్ లుక్ తో పాటు  లోపలి భాగం చాలా దృఢంగా  ఉంటుంది.  పడవ  ఇంటీరియర్స్  రంగులతో ఆధిపత్యం చెలాయిస్తుండగా, దాని డెక్‌లో స్ప్లిట్-లెవల్ యజమాని డెక్, లాంజ్, అనేక విఐపి ప్రాంతాలు , అతిథుల సూట్‌లు ఉంటాయి. ఈ పడవలో సెలవురోజుల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా అలా అలా సముద్రయానం చేయవచ్చు.