ఆఫీసులో ఉన్నప్పుడు ఇంటి ఫోన్లు వస్తుంటే!

ఆఫీసులో మంచి పనిలో తలమునకలైపోయి ఉంటామా! ఇంటి దగ్గర్నుంచీ ఫోన్ వస్తుంది. అలాగని అదేమీ ఎమర్జన్సీ ఫోన్ కూడా కాదు. ఎలా ఉన్నారో ఓసారి పలకరించేందుకో, సాయంత్రం వచ్చేటప్పుడు కందిపప్పు తెమ్మని గుర్తుచేసేందుకో... చేసిన పోన్. ఇక ఇంట్లో ఫ్యామిలీతో కలిసి హాయిగా భోజనం చేసే సమయంలో సాటి ఉద్యోగుల నుంచి వచ్చే ఫోన్లకీ కొదవ ఉండదు. అది కూడా ఏమంత ఎమర్జన్సీ కాదు. పక్క సీట్లో సుబ్బారావు గురించో, పెరగకుండా మిగిలిపోయిన జీతాల గురించో కావచ్చు.   ఇలా ఇంట్లో ఉన్నప్పుడు ఆఫీసు ఫోన్లు, ఆఫీసులో ఇంటి ఫోన్ల వల్ల... ఇటు కుటుంబ జీవితం, అటు ఉద్యోగ జీవితం ఎంతవరకు ప్రభావితం అవుతున్నాయో చూడాలనుకున్నారు పరిశోధకులు. ఈ విషయాన్ని తేల్చేందుకు ఓ 121 మంది ఉద్యోగులను పదిరోజుల పాటు డైరీ రాయమని అడిగారు. ఆఫీసులో ఏం జరుగుతోంది- దాని వల్ల తన పనితీరు ఎలా ప్రభావితం అయ్యింది, ఇంట్లో ఏం జరుగుతోంది- దాని వల్ల తన కుటుంబ జీవితంలో ఎలాంటి మార్పు వచ్చింది... తదితర వివరాలన్నీ ఈ డైరీలో నమోదు చేయమని అడిగారు.   ఆఫీసులో ఇంటి ఫోన్లు, ఇంట్లో ఆఫీసు ఫోన్ల వల్ల అటు లాభమూ ఇటు నష్టమూ రెండూ ఉన్నట్లు తేలింది. ఆఫీసులో వచ్చే ఫోన్లతో జాబ్ శాటిస్ఫాక్షన్ లేకపోవడం, పని మీద శ్రద్ధ తగ్గడం, చిరాకు... లాంటి పర్యవసానాలు కనిపించాయి. కానీ కాస్త జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే మాత్రం ఇంటి నుంచి వచ్చే ఫోన్లతో పనిఒత్తిడి తగ్గడం, కుటుంబసభ్యుల మధ్య అనుబంధం పెరగడాన్ని గమనించారు. పనికీ పనికీ మధ్య ఖాళీ సమయంలోనో, భోజన విరామంలోనో, ఇంటికి వెళ్లే దారిలోనో ఇంటికి చేసే ఫోన్లతో అటు వారితో మాట్లాడినట్లూ ఉంటుంది, ఇటు ఉద్యోగానికీ ఇబ్బంది ఉండదట.   ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఆఫీసు ఫోన్ల విషయంలో తగినంత జాగ్రత్త ఉండాలంటున్నారు. పక్కన ఎవరూ లేని సమయంలోనో, పిల్లలు పడుకున్న తర్వాతనో సాగే ఆఫీసు ఫోన్లతో పెద్దగా నష్టం ఉండదని సూచిస్తున్నారు. అంతేకాదు! ఆఫీసు అవసరాలకి అనుగుణంగానే తమకు ఫోన్ చేయవలసిందిగా సాటి ఉద్యోగులకి తెలియచేయమంటున్నారు. చిన్న చిన్న విషయాలకి మెయిల్ చేయమనీ, విషయం వెంటనే తెలియాలి అనుకున్నప్పుడు మెసేజ్ చేయమనీ, అత్యవసరం పరిస్థితులలో అయితేనే ఫోన్ చేయమనీ సాటి ఉద్యోగులకు చెప్పి ఉంచమంటున్నారు. - నిర్జర.  

MANGO TOURISM గురించి విన్నారా!

కొన్ని దేశాలలో ద్రాక్ష తోటల్లో పర్యటకులని అనుమతిస్తుంటారు. ఆ తోటల్లో తిరుగుతూ, ద్రాక్షపళ్లతో ఆడుకుంటూ, ద్రాక్ష సారాయిని తయారుచేస్తూ పర్యటకులు సంబరపడిపోతుంటారు. వీళ్ల సరదా ద్రాక్షతోటల యజమానులకి కాసులను కురిపిస్తుంటుంది. మన రైతులకి కూడా ఇలాంటి అవకాశం ఉంటే బాగుంటుంది కదా! అందుకోసం మన దగ్గర ద్రాక్షతోటలు లేకపోతే ఏం... పళ్లకు రారాజైన మామిడి తోటలు ఉన్నాయి కదా!   మేంగో టూరిజం (mango tourism) ఇప్పుడిప్పుడే మన దేశంలో ప్రచారం పొందుతోంది. మహారాష్ట్రలోని రైతులు ఇప్పటికే ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోగా... ఉత్తర్ ప్రదేశ్, గుజరాత్, పశ్చిమబెంగాల్, కర్ణాటక వంటి రాష్ట్రాలు ఈ ఏడాది విస్తృతంగా మేంగో టూరిజంని అందిపుచ్చుకునే ఆశతో ఉన్నాయి. ఇంతకీ ఈ మేంగో టూరిజంలో ఏం చేస్తారంటారా! అబ్బో చెప్పుకోవాలంటే బోలెడు విశేషాలే ఉన్నాయి!   - మేంగో టూరిజంలో భాగంగా, విశాలమైన మామిడి తోటలలోకి పర్యటకులను అనుమతిస్తారు. కొన్ని సందర్భాలలో ప్రభుత్వమే కొందరు మామిడి రైతులో ఒప్పందం చేసుకొని, వారి తోటల దగ్గరకు యాత్రికులకు రవాణా సదుపాయాన్ని కల్పిస్తుంది.   - మామిడి తోటల్లోకి ప్రవేశించిన పర్యటకులను రైతులు తమ తోటలన్నీ తిప్పి చూపిస్తారు. మామిడి చెట్లను పెంచడంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు, పూత కాయగా మారేవరకు ఎంత శ్రద్ధగా చూసుకుంటారు, కాయలను ఎలా మగ్గపెడతారు... లాంటి వివరాలన్నింటినీ ఓపికగా చెబుతారు.   - పర్యటకులకు కావల్సిన అల్పాహారం, టీ కాఫీలు, భోజనం... అన్నీ కూడా రైతులే ఏర్పాటు చేస్తారు. వాటివల్ల అటు రైతులకీ ఆదాయం కలుగుతుంది, ఇటు యాత్రికులకీ స్వచ్ఛమైన పల్లె ఆహారం తిన్నట్లుంటుంది.   - మామిడి తోటల్లో తిరగడమే కాదు... మామిడి కాయలు కోసుకోవడానికి కూడా పర్యటకులకు స్వేచ్ఛ ఉంటుంది. అందుకోసం ఎలాంటి మామిడిపళ్లను ఎంచుకోవాలో రైతులు సలహా కూడా ఇస్తారు. కాకపోతే ఇలా కోసుకున్న పండ్లని చివరికి తూకం వేసి, వాటికి సరిపడా ధరని చెల్లించాల్సి ఉంటుంది. దీంతో పర్యటకులకు తాజా పళ్లు, రైతులకి తగిన గిట్టుబాటు ధరా లభిస్తాయి.   - కేవలం పళ్లే కాదు! చాలా తోటల్లో మామిడితాండ్ర, జాం, జ్యూస్, పచ్చళ్లు.. ఇలా మామిడితో చేసిన పదార్థాలన్నీ కూడా దొరికే అవకాశం ఉంటుంది.   - తోటల్లో తినడం, తిరగడంతోనే కాలం గడిపేస్తే మజా ఏముంటుంది! అందుకే చాలాచోట్ల ఎడ్లబండి మీద ప్రయాణం, మామిడి పళ్లని తినే పోటీలు పెట్టడం, జానపద నృత్యాలు ప్రదర్శించడం లాంటి కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేస్తుంటారు. ఇవేవీ ఇష్టం లేకపోతే హాయిగా నులకమంచం మీద చెట్టు కింద పడుకుని సేదతీరే అవకాశం ఎలాగూ ఉంటుంది.   - ఒక్క రోజులో హడావుడిగా గడిపేస్తే ఎలా అనుకునేవారికి... తోటల్లోనే ఒకటి రెండు రోజులు సేదతీరే సదుపాయాలూ కొన్ని చోట్ల ఉన్నాయి.   అదీ విషయం! మొత్తానికి ఏదో ప్రయోగాత్మకంగా మొదలుపెట్టిన ఈ మేంగో టూరిజం ఇప్పుడు రైతులకీ, ప్రభుత్వానికీ కాసులు పండిస్తోంది. అటు కొత్తదనం కోరుకునే పర్యటకులకీ సరికొత్త అనుభూతిని అందిస్తోంది. అందుకనే ఈ తోటల్లో విహరించేందుకు విదేశాల నుంచి కూడా యాత్రికులు వస్తున్నారట. మరి మామిడి పంటకు ప్రసిద్ధమైన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలాంటి టూరిజం మొదలైతే భలే ఉంటుంది కదా! - నిర్జర.  

మెదడు వందేళ్లు పనిచేయాలంటే!

వయసు మీదపడుతున్న కొద్దీ మెదుడు చురుగ్గా పనిచేయదన్నది మన ఆలోచన. మెదడులోని న్యూరాన్లు బలహీనపడటమే ఇందుకు కారణమంటారు శాస్త్రవేత్తలు. కేలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన రేచెల్ అనే శాస్త్రవేత్త ఇందుకు పరిష్కారం ఏమన్నా ఉందేమో కనుగొనే ప్రయత్నం చేశారు. దాదాపు 50 ఏళ్లపాటు చేసిన పరిశోధన ఫలితంగా రేచెల్ ఈ సమస్యకి ఒక పరిష్కారం సాధించానని చెబుతున్నారు.   చిన్నప్పుడు మనం ఏదన్నా కొత్త విషయాన్ని నేర్చుకోవాలన్నా, కొత్త నైపుణ్యాన్ని అలవర్చుకోవాలన్నా ఒక పద్ధతి ఉంటుంది. ఈ తరహా విధానానికి ‘Broad learning’ అని పేరు పెట్టారు రేచెల్. ఇక పెద్దయ్యేకొద్దీ మనం నేర్చుకునే తీరు మారిపోతుంది. ఈ విధానానికి ‘specialised learning’ అని పేరు పెట్టారు. వాటి మధ్య తేడాలని ఆరు రకాలుగా వివరించే ప్రయత్నిం చేశారు.   1 - చిన్నప్పుడు ఏదన్నా కొత్త విషయాన్ని నేర్చుకునేందుకు సిద్ధంగా ఉంటాము (open mindedness). కానీ పెద్దవారిలో ఇలాంటి విశాల దృక్పథం ఉండదు. ఏదన్నా కొత్త విషయం నేర్చుకొనేందుకు వారి అభిప్రాయాలు, విచక్షణ, అహంకారం... మాటిమాటికీ అడ్డం వస్తుంటాయి.   2- చిన్నతనంలో అయితే తెలియని విషయాన్ని చెప్పేందుకు టీచర్లు, పెద్దలు ఉంటారు. ఏదన్నా అనుమానం వచ్చినా ఠక్కున వారిదగ్గరకు వెళ్తాము. కానీ పెద్దయ్యాక ఇలా మరొకరి సాయం తీసుకునేందుకు మొహమాటం అడ్డువస్తుంది.   3 – కాస్త కష్టపడితే ఏదన్నా నేర్చుకోవచ్చనే నమ్మకం చిన్నతనంలో ఉంటుంది. కానీ పెద్దయ్యాక నమ్మకం మారిపోతుంది. ప్రతిభ పుట్టుకతో రావాలే కానీ, ఎంత కష్టపడినా ఉపయోగం ఉండదన్న నిర్వేదం పెద్దల్లో కనిపిస్తుంది.   4 – చిన్నతనంలో పొరపాట్లు చేసినా ఎవ్వరూ పెద్దగా పట్టించుకోరు. కాబట్టి పిల్లలు పడుతూలేస్తూ, తప్పులు చేస్తూ నేర్పు సాధించే అవకాశం ఉంటుంది. కానీ పెద్దయ్యాక మనం చేసే పని ఎక్కడ తప్పుగా మారుతుందో, అది ఏ ఫలితానికి దారితీస్తుందో అన్న భయం నిరంతరం వెంటాడుతూ ఉంటుంది.   5 – పిల్లల్లో ఏదన్నా నేర్చుకునేందుకు ఆసక్తి మొదలైతే... అది సాధించేదాకా ఊరుకోరు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎలాంటి పరిస్థితుల్లో అయినా పట్టిన పట్టు విడవరు. కానీ పెద్దలు అలా కాదు కదా! ఏదన్నా హాబీ మొదలుపెట్టారంటే ఓ రెండు నెలల్లోనే దాన్ని చాప చుట్టేస్తారు.   6 – పిల్లలు రకరకాల నైపుణ్యాలని ఒక్కసారిగా నేర్చుకునేందుకు (multiple skills) భయపడరు. ఒక పక్క బొమ్మలు గీస్తూనే మరో పక్క డాన్స్ నేర్చుకునే ప్రయత్నం చేస్తారు. ఇంకో పక్క చదువుకుంటూ ఉంటారు. కానీ పెద్దవాళ్లు అలా కాదు! ఏదన్నా ఒక విషయం మీద శ్రద్ధ పెడితే, మరో విషయాన్ని పట్టించుకుంటే ఎక్కడ తమ ఏకాగ్రత తప్పిపోతుందో అన్న భయంతో ఉంటారు.   ఈ ఆరు విషయాలనీ గమనించి... చిన్నతనంలో మనం ఎలాగైతే నేర్పుని సాధించే ప్రయత్నం చేసేవారమో గుర్తుచేసుకోమంటున్నారు రేచెల్. అవే పద్ధతులని పెద్దయ్యాక కూడా పాటిస్తే వృద్ధాప్యం వయసుకే కానీ మెదడుకి రాదని భరోసా ఇస్తున్నారు. - నిర్జర.  

కోపం ఒక విషవలయం!

హరి మనసేం బాగోలేదు. పొద్దున లేవగానే భార్యతో గొడవైంది. మాటామాటా పెరిగింది. ఆ గొడవతో అతని భార్య స్వాతి మనసు కూడా చిరాకుగా మారిపోయింది. హరి ఆఫీసుకి వెళ్లేసరికి అక్కడ సురేష్‌ నవ్వుతూ ఎదురుపడ్డాడు. అతను హరి పక్కనే కూర్చుని ఏదో జోక్‌ చేయబోయాడు. కానీ హరి దాన్ని ఆస్వాదించే మూడ్‌లో లేడు. సురేష్‌ మాటలకి చాలా ముభావంగా స్పందించాడు. పైగా ‘నన్ను కాస్త ఒంటరిగా వదిలెయ్!’ లాంటి మాటేదో వాడేసాడు. హరి ముభావంగా ఉండటం, పుల్లవిరుపుగా మాట్లాడటం చూసి సురేష్‌కి కూడా చిరాకు మొదలైంది. ‘వీడి దగ్గరకి వెళ్లి కాలక్షేపం చేయడానికి నాకేంటి పని!’ అనుకున్నాడు. ఆ చిరాకుతోనే తన డెస్క్‌ దగ్గరకి వెళ్లి సిస్టమ్‌ ఆన్‌ చేశాడు. ఆ చిరాకుతోనే అస్తవ్యస్తంగా పనిచేయసాగాడు. చూస్తూ చూస్తుండగానే అతనికి తన పని మీదా, ఆ ఆఫీసు మీదా, ఉదయం క్యారియర్‌ ఇవ్వని తన భార్య మీదా కోపం మొదలయ్యాయి. క్యారేజీ సర్దని తన భార్యతో మనసులోనే వాదించడం మొదలుపెట్టాడు. సురేష్‌ మెదడు మాంచి వేడిగా ఉన్న సమయంలో, తన భార్య నుంచి ఫోన్‌ వచ్చింది- ‘భోజనం చేశారా?’ అంటూ! అంతే, పుండు మీద కారం చల్లినట్లయ్యింది. ఫోన్‌లోనే ఒక్కసారిగా విరుచుకుపడిపోయాడు. ‘నేను పస్తులుండటమేగా నీకు కావాల్సింది!’ అంటూ దెప్పిపొడిచాడు. సురేష్‌ మాటలకి అతని భార్య మీనా కళ్లు చెమర్చాయి. వండుకున్న అన్నం కూడా తినకుండా అలాగే పడుకుండిపోయింది. ఈలోగా మీనా ఇంటి తలుపు ఎవరో తట్టారు. కళ్లు తుడుచుకుని చూస్తే పనిమనిషి. ‘పనికి రావాల్సిన సమయమేనా ఇది! మిట్టమధ్యాహ్నం భోజనాలు చేసి, అంతా పడుకునే సమయానికి వచ్చి ఇబ్బంది పెట్టడానికి కాకపోతే ఇప్పుడెందుకు వచ్చినట్లు!’ అనిపించింది ఆ మనిషిని చూసిన వెంటనే. అసలే భర్త చేతిలో చివాట్లు తిన్న చిరాకులో ఉన్న మీనా... పనిమనిషిని ఎడాపెడా దులిపేయడం మొదలుపెట్టింది. మీనా మాటలన్నీ పనిమనిసి కిక్కురుమనకుండా విన్నది. ఆపై తను ఎందుకంత ఆలస్యంగా వచ్చిందో చెప్పుకొచ్చింది. తన భర్త అనారోగ్యం గురించీ, కుటుంబ పోషణ కోసం తను పడుతున్న కష్టం గురించీ చెప్పుకొచ్చింది. మీనా కాస్త శాంతించిన తర్వాత తన సహజశైలిలో సరదాగా కబుర్లు చెబుతూ పనిచేయడం మొదలుపెట్టింది. ఆ మాటా ఈ మాటా చెబుతూ చకచకా పని సాగించింది. ఓ పదినిమిషాలు గడిచేసరికి మీనా మనసులోని దిగులు కాస్తా తీరిపోయినట్లు తోచింది. తను కూడా మాటలు కలుపుతూ, నవ్వడం మొదలుపెట్టింది. కానీ మనసులో ఏదో ఒక మూల తన భర్త నొచ్చుకున్నాడన్న దిగులు మాత్రం అలాగే ఉండిపోయింది. ఆ దిగులుని పోగొట్టుకునేందుకు మరోసారి భర్తకి ఫోన్‌ చేసింది. ఆపాటికే సురేష్‌ బయట సుష్టుగా భోజనం చేసి తన డెస్కులోకి చేరుకున్నాడు. తన భార్య మీద నోరు పారేసుకున్నందుకు నొచ్చుకుంటున్నాడు. మళ్లీ సాయంత్రం తనతో ఎలా మాటలు కలపాలా అన్న సందిగ్ధంలో ఉన్నాడు. ఆ సమయానికి భార్యే ఫోన్‌ చేయడంతో అతని మనసు కాస్తా తేలికపడిపోయింది. ఫోన్లో ఓ రెండు నిమిషాలు మాట్లాడిన తర్వాత ఉదయం పోయిన హుషారు తిరిగి వచ్చినట్లయ్యింది. సురేష్‌ తన పనిలో ఉండగానే హరి మరోసారి ఎదురుపడ్డాడు. ‘పొద్దున్న పాపం ఏదో చిరాకులో ఉన్నట్లున్నాడు. నేనే అనవసరంగా అతన్ని ఇబ్బంది పెట్టాను!’ అనిపించింది. అందుకనే మళ్లీ సరదాగా హరిని కబుర్లోకి దింపే ప్రయత్నం చేశాడు. ఒకటికి రెండుసార్లు సురేష్‌ తనతో సరదాగా ఉండే ప్రయత్నం చేసి హరి మనసు కూడా తేలికపడింది. తాను కూడా సురేష్‌తో మాట కలిపాడు. తను కూడా నాలుగు సెటైర్లు వేసే ప్రయత్నం చేశాడు. చూస్తూచూస్తుండగానే ఆఫీసు సమయం అయిపోయింది. పెద్దగా పని ఒత్తిడి లేకుండానే ఆ రోజు ఆఫీసు గడిచిపోయింది. కానీ తన భార్యతో పడిన గొడవ తాలూకు ఒత్తిడి మాత్రం అతని మనసు మీద ఇంకా పనిచేస్తూనే ఉంది. ‘ఛా! ఒక్క చిన్న మాటతో మొదలైన గొడవ కాస్తా రాద్ధాంతం అయిపోయింది. నాకు ఈమధ్య  కోసం ఎక్కువైపోతోంది,’ అనుకున్నాడు. తన భార్యకి సారీ చెప్పడం కోసం ఫోన్‌ చేతిలోకి తీసుకున్నాడు. ఈ కథలో అయిదు పాత్రలే ఉన్నాయి. కానీ మన జీవితంలో అంతకు లెక్కకు మించిన మనుషులు ఎదురుపడుతూ ఉంటారు. ప్రతి ఒక్కరిదీ ఒకో కష్టం, ఒకో సమస్య, ఒకో వ్యక్తిత్వం. ఆ క్షణంలో వారు ఎందుకలా ప్రవర్తిస్తున్నారు అనేదాని వెనుక అనేక కారణాలు. ఈ నిమిషానికి వారితో మనకి ఉన్న సమస్యని అర్థం చేసుకునో, పరిష్కరించుకునో... రెండూ కుదరకపోతే కాసేపు పక్కకు తప్పుకునో ఉంటే మన జీవితం సాఫీగా సాగిపోతుంది. లేకపోతే ఎక్కడికక్కడ కొత్త వివాదం మొదలవుతూనే ఉంటుంది. ప్రతి బంధమూ బరువైపోతుంది. అంతేకాదు! ఆ కోపాన్ని, దుఃఖాన్నీ మనసులో నింపుకుని ముందు సాగితే... మన చిరాకుని చుట్టుపక్కల వారితో కూడా పంచుకున్నాట్లు అవుతుంది. వారి జీవితాలని కూడా ప్రభావితం చేస్తుంది. వీలైతే మన కోపానికి పరిష్కారాన్ని వెతుక్కోవాలి. లేదా కనీసం దాన్ని ఇతరులకి బదలాయించుకోకుండా జాగ్రత్త పడాలి. ఒకవేళ మన దగ్గరకే ఎవరన్నా చిరాకుతో వస్తే ఆ విషవలయాన్ని అక్కడితో ఛేదించాలి. - నిర్జర.

డబ్బు విలువ

అతను ఓ పెద్ద వ్యాపారి. తన కష్టానికి అదృష్టం కూడా కలిసిరావడంతో పట్టిందల్లా బంగారం అయ్యింది. దాంతో తన జీవితంలో ఎలాంటి లోటూ లేకుండా పోయింది. అంతా బాగానే ఉంది. కానీ తన తర్వాత వ్యాపారం పరిస్థితి ఏమిటా అన్న బెంగ మొదలైంది వ్యాపారస్తునికి. ఎందుకంటే తన కొడుకు ఎలాంటి కష్టమూ తెలియకుండా పెరిగాడు. అతనికి వ్యాపార సూత్రాలు కానీ, డబ్బు విలువ కానీ ఏమాత్రం తెలియవు. కష్టపడే తత్వం ఇసుమంతైనా లేదు. అలాంటి కొడుక్కి బుద్ధి చెప్పడం ఎలా? అని తెగ ఆలోచించాడు వ్యాపారస్తుడు. ఆలోచించగా... ఆలోచించగా... అతనికి ఓ ఉపాయం తట్టింది. మర్నాడు వ్యాపారస్తుడు తన కొడుకుని పిలిచాడు. ‘చూడు! నువ్వు ఎందుకూ పనికిరాకుండా పోతున్నావు. డబ్బు తగలెయ్యడం తప్ప సంపాదించడం చేతకావడం లేదు. అందుకని నీకో పరీక్ష పెడుతున్నాను. ఇవాళ నువ్వు ఏదో ఒక పని చేసి డబ్బు సంపాదించుకుని వస్తేనే రాత్రికి భోజనం పెడతాను. లేకపోతే ఖాళీ కడుపుతో పడుకోవాల్సిందే!’ అని తేల్చి చెప్పాడు. తండ్రి మాట విన్న కొడుకుకి ఏం చేయాలో పాలుపోలేదు. ఇన్నాళ్లూ తనకి కష్టం అంటే ఏమిటో తెలియదు. అసలు కష్టపడాల్సిన అవసరం తనకేముందని? అందుకని బిక్కమొహం వేసుకుని తల్లి దగ్గరకి వెళ్లి నిల్చొన్నాడు. కొడుకు సమస్య విని తల్లి తల్లడిల్లిపోయింది. తన భర్త ఇంక కర్కశంగా ప్రవర్తిచాడేమిటా అనుకుంది. వెంటనే తన పెట్టెలోంచి ఒక బంగారు నాణెం తీసి కొడుకు చేతిలో పెట్టింది. ‘ఇది తీసుకువెళ్లి మీ నాన్నగారికి ఇవ్వు. దాన్ని నువ్వే సంపాదించానని చెప్పు!’ అంది. తల్లి ఇచ్చిన బంగారు నాణెం తీసుకుని కొడుకు సంతోషంగా తండ్రి దగ్గరకి వెళ్లాడు. ఆయన చేతిలో బంగారు నాణేన్ని ఉంచి, తనే ఆ నాణాన్ని సంపాదించానని చెప్పాడు. తండ్రి మహా తెలివైనవాడు. అందుకే ఆ నాణెం ఎక్కడి నుంచి వచ్చిందో చటుక్కున గ్రహించేశాడు. ‘దానిని తీసుకుపోయి బావిలో పడెయ్యి, రేపు సాయంత్రం ఇలాగే నువ్వు సంపాదించుకుని రావాలి. అప్పుడే నీకు రేపు రాత్రి భోజనం దక్కుతుంది,’ అని చెప్పాడు. తండ్రి చెప్పినట్లుగానే ఆ బంగారు నాణేన్ని బావిలో పడేశాడు కొడుకు. మర్నాడు కొడుకు నిద్రలేచేలోగా, భార్యని ఏదో పని మీద ఊళ్లోకి పంపేశాడు వ్యాపారస్తుడు. దాంతో కొడుక్కి ఆ రోజు సంపాదన ఎక్కడి నుంచి తేవాలో అర్థం కాలేదు. వెంటనే తన అక్క దగ్గరకి వెళ్లాడు. తమ్ముడి కష్టం విన్న అక్క తెగ బాధపడిపోయింది. తండ్రి ఎందుకిలా తయారయ్యాడా అని తెగ మధనపడిపోయింది. వెంటనే తన పెట్టెలోంచి ఒక వెండి నాణెం తీసి తమ్ముడి చేతిలో పెట్టింది. ‘ఇది తీసుకువెళ్లి నాన్నగారికి ఇవ్వు. దాన్ని నువ్వే సంపాదించానని చెప్పు!’ అంది. అక్క ఇచ్చిన వెండి నాణేన్ని తీసుకుని తమ్ముడు సంతోసంగా తండ్రి సముఖానికి చేరుకున్నాడు. ఆయన చేతిలో నాణేన్ని పెట్టి తానే దానిని సంపాదించానని చెప్పాడు. తండ్రి తక్కువవాడా! ఆ నాణెం ఎక్కడిదో ఊహించేశాడు. ‘దానిని తీసుకుపోయి బావిలో పడెయ్యి, రేపు సాయంత్రం ఇలాగే సంపాదించుకుని రా! అప్పుడే నీకు రేపు రాత్రి తిండి పెట్టేది,’ అని చెప్పాడు. తండ్రి చెప్పినట్లుగానే ఆ వెండి నాణేన్ని బావిలో పడేశాడు కొడుకు. మర్నాడు కొడుకు నిద్రలేచేసరికి భార్యనీ, కూతురినీ చుట్టాలింటికి పంపేశాడు వ్యాపారస్తుడు. దాంతో ఇక కొడుక్క అసలు సమస్య మొదలైంది. బంధువులని డబ్బు అడిగితే తండ్రికి తెలిసిపోతుంది. తెలిసినవారిని అడగాలంటే మొహమాటం అడ్డు వచ్చింది. దాంతో ఎలాగొలా ఆ ఒక్కరోజూ కష్టపడదామని నిర్ణయించుకున్నాడు. ఆ కొట్టూ ఈ కొట్టూ తిరుగుతూ పనికోసం ప్రాథేయపడ్డాడు. కొంతమంది లేదన్నారు. కొంతమంది ఛీత్కరించారు. కొంతమంది తరిమికొట్టారు. పాపం ఇలాంటి అనుభవాలన్నీ అతనికి కొత్త. మరోవైపు కడుపు నకనకలాడిపోతోంది. చివరికి మధ్యాహ్నం ఎప్పటికో ఓ పుణ్యాత్ముడు అతనికి పని ఇచ్చాడు. కొట్టు బయట ఉన్న కట్టెలన్నీ తీసి లోపల పడేస్తే ఓ పదిరూపాయలు ఇస్తానన్నాడు. ఆ మాట వినగానే కొడుకు మొహం వెలిగిపోయింది. కానీ ఒకో కట్టెముక్కా తీసుకుని లోపలకి వేస్తుంటే అతని ఒళ్లు హూనమైపోయింది. వీపు దోక్కుపోయింది. చేతులు పుళ్లుపడిపోయాయి. చివరికి ఎలాగోలా తనకి అప్పచెప్పిన పనిని పూర్తిచేశాడు. పదిరూపాయల నాణెం తీసుకుని తండ్రి దగ్గరకి వెళ్లి నిల్చొన్నాడు. కొడుకు వాలకం చూడగానే తండ్రికి విషయం అర్థమైపోయింది. అయినా అతను చెప్పాలనుకున్న పాఠం ఇంకా పూర్తికాలేదు. అందుకనే- ‘దానిని తీసుకుపోయి బావిలో పడెయ్యి,’ అని చెప్పాడు. ఆ మాట వినగానే కొడుకు మనసు తరుక్కుపోయింది. ‘ఇంతా కష్టపడి సంపాదించిన డబ్బుని బావిలో పడెయ్యాలా! వద్దు నాన్నా!’ అని వేడుకున్నాడు. ఆ మాటలకి తండ్రి చిరునవ్వుతో- ‘చూశావా! ఎవరో ఇచ్చిన సంపద- అది బంగారమైనా, వెండైనా సరే... దాని విలువ మనకి తెలియదు. అందుకే బావిలో పారేసినట్లుగానే ఖర్చు చేసి పారేస్తాం. అదే రక్తం ధారపోసి సంపాదించినది రూపాయి అయినా సరే... దానిని జాగ్రత్తగా ఖర్చుపెట్టుకుంటాం. ఈ రోజుతో నీకు డబ్బు విలువ తెలిసొచ్చింది. ఇక మీదట నువ్వు నా వ్యాపారంలో చేదోడువాదోడుగా ఉండు,’ అని చెప్పాడు. (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా) - నిర్జర.

జీవితం బోర్ కొట్టేస్తోందా!

నిమిషం ఖాళీ లేని జీవితం.... ఇంటినిండా కావల్సినన్ని వస్తువులు. అయినా ఏదో వెలితి. ఆ వెలితి ఒకోసారి హద్దులు దాటి జీవితం అంటేనే బోర్ కొట్టేస్తూ ఉంటుంది. అలాగని ఉన్న ఉద్యోగాన్నీ వదులుకోలేము, సమాజానికి దూరంగానూ పారిపోలేము. కాకపోతే చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే ఆ నిస్సత్తువ నుంచి కాస్త బయటపడవచ్చని అంటున్నారు నిపుణులు... కదిలి చూడండి ఒక రెండు రోజులు సెలవు పెట్టి ఏ ఊరికో వెళ్లి చూడండి. అదీ కాదంటారా! దగ్గరలోనే ఉన్న చూడదగ్గ ప్రదేశాలన్నీ ఓ చూపు చూసి రండి. కాదూ, కూడదంటారా! ఊళ్లోనే ఉన్న స్నేహితుల ఇళ్లకు వెళ్లి పలకరించి రండి. మొత్తానికి మీరున్న చోట నుంచి కదిలే ప్రయత్నం చేయండి. రోజూ కళ్ల ముందు కనిపించే వాతావరణం నుంచి కాస్త దూరం జరగండి. సృజనకు పదునుపెట్టండి లోలోపల గూడు కట్టుకుపోయి ఉన్న చిరాకులను వెలికితీయాలన్నా, మనసు కాస్త సేదతీరాలన్నా సృజనలో తప్పకుండా సాంత్వన లభిస్తుంది. బొమ్మలు వేయడమో, పాత వస్తువులని కొత్తగా తీర్చిదిద్దడమో... ఆఖరికి ఏ సుడోకుని ఆడటమో చేసే ప్రయత్నం చేస్తే మనసుకి కాస్త ఊరటగా ఉంటుంది. రొటీన్కు భిన్నంగా చేయాలనుకుంటే మన చుట్టూ చాలా పనులే ఉంటాయి. వాటిపట్ల మనకి అభిరుచి లేకపోవడం వల్ల మనం దూరంగా ఉంటామంతే! వంట చేయడం, మొక్కలు పెంచడం, డైరీ రాయడం... ఇవన్నీ మనసుని కాసేపు పట్టి ఉంచే పనులే. ఎప్పుడన్నా బోర్ కొట్టినప్పుడన్నా వీటివైపు మళ్లే ప్రయత్నం చేయండి. కావల్సినంత కాలక్షేపం దొరుతుంది. మనసుకి కూడా తృప్తిగా ఉంటుంది. నలుగురిలో కలవండి మనసులోని చిరాకుని పంచుకోవాలన్నా, ఒంటరితనం నుంచి తప్పించుకోవాలన్నా... మరో మనిషితో మాట్లాడాల్సిందే! అది ఎదురింటివారైనా కావచ్చు, పాత పరిచయస్తులైనా కావచ్చు. కాసేపు అలా నలుగురి మధ్యలోకీ వెళ్లి వారితో నాలుగు కబుర్లు చెప్పి, కాసేపు నవ్వుకొంటే మనసు తేలికపడుతుంది. శారీరిక శ్రమ ఏ పనీ లేనప్పుడు మనసంతా ఏవో ఒక ఆలోచనలతో క్రుంగిపోతుంటుంది. అందుకే శరీరాన్ని కాస్త కష్టపెడితే మనసు కూడా కుదుటపడుతుంది. వ్యాయామం చేయడమో, కాస్త దూరం నడవడమో, ఇల్లు సర్దుకోవడమో చేస్తే శరీరం అలసిపోతుంది. మనసుకి ఆలోచించుకునే సమయం ఉండదు. కాలక్షేపం చేయండి అప్పటికప్పుడు మనసుని కాస్త ఉల్లాసపరుచుకోవాలంటే... ఏదన్నా కాలక్షేపం చేయాల్సిందే! పుస్తకం చదవడమో, టీవీ చూడటమో, సినిమాకి వెళ్లడమో... ఇలా కాలాన్ని కాసేపు సరదాగా గడిపేయండి. మనసుని లయం చేయండి మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడం కష్టమైన పనే. కానీ ప్రయత్నిస్తే తప్పేమీ లేదుగా! సంగీతం వినడమో, ధ్యానంలో మునిగిపోవడమో, గుడికి వెళ్లి కాసేపు సేదతీరడమో చేస్తే... మన సమస్యలన్నీ తాత్కాలికమే అన్న ధైర్యం కలుగుతుంది. ఏతావాతా అప్పుడప్పుడూ బోర్ కలగడం మంచిదే! మన జీవితంలో ఎక్కడో ఏదో పొరపాటు దొర్లుతోందనే సత్యాన్ని అది తెలియచేస్తుంది. ఆ సమయంలో ఒక్క క్షణం ఆగి మన జీవనవిధానాన్ని తరచి చూసుకుంటే... ఒకోసారి మన గమ్యాన్నే మార్చుకునే అవకాశం కలుగుతుంది. - నిర్జర.

కదిలితేనే జీవితం కనిపిస్తుంది

ఒక రాజుగారికి దూరదేశాల నుంచి ఎవరో రెండు డేగలను బహుమతిగా పంపించారు. తన రాచరికాన్ని చాటుతూ ఆ రెండు డేగలూ ఉద్యానవనంలో తిరుగుతూ ఉంటే రాజుగారికి భలే సరదాగా ఉండేది. అవి ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరినప్పుడల్లా తన కీర్తిపతాక ఎగిసిపడినంతగా మురిసిపోయేవారు రాజుగారు. కానీ అందులోని ఒక డేగ అకస్మాత్తుగా ఎగరడమే మానేసింది. నిరంతరం ఓ చెట్టు కొమ్మ మీదే కూర్చుని తన దగ్గరకు విసిరేసిన మాంసం ముక్కలను తింటూ కాలం గడపడం మొదలుపెట్టింది.   డేగని సాధారణ స్థితికి తీసుకురావడానికి రాజభటులు చేయని ప్రయత్నం లేదు. వైద్యులు వచ్చి పరీక్షిస్తే ఆ డేగలో లోపమేదీ లేదని తేలింది. పక్షులకు శిక్షణ ఇచ్చేవారు వచ్చినా పెద్దగా ఉపయోగం లేకపోయింది. సమస్య చిన్నదే అయినా అది ఎందుకనో రాజుగారి మనసుని బాధించడం మొదలుపెట్టింది. ఒక మామూలు పక్షినే తాను మార్చలేనివాడు ఇక ప్రజలను ఏం పాలిస్తానన్నంతగా విరక్తి మొదలైంది. రాజుగారి బాధని తీర్చేందుకు నలుగురూ నాలుగు రకాలుగా సలహాని ఇచ్చారు. కానీ అవేవీ పనిచేయలేకపోయాయి. రాజుగారి వ్యధని తగ్గించేందుకు నలుగురూ నాలుగు వేదాంతపు మాటలు చెప్పారు. కానీ అవేవీ ఆయనకు ఉపశమనాన్ని కలిగించలేకపోయాయి.   ఇక ఆఖరి ప్రయత్నంగా ఒక వేటగాడిని పిలిపించి చూద్దామనుకున్నారు రాజభటులు. వేటగాళ్లు నిరంతరం అడవుల్లోనే బతుకుతుంటారు కాబట్టి వారికి పక్షుల గురించి, వాటి స్వభావం గురించి తెలిసి ఉంటుంది కదా! అలా ఓ వేటగానికి వెతికి పట్టుకుని రాజుగారి ఉద్యానవనంలోకి తీసుకువచ్చారు. ఎగరలేని డేగని చూపించి సమస్యను వివరించారు. ‘ఓస్‌ అంతేకదా! ఈ రాత్రికి నన్ను ఈ ఉద్యానవనంలో వదిలేయండి’ అన్నాడు వేటగాడు.   ఉదయాన్నే తన కిటికీలోంచి ఉద్యానవనంలోకి తొంగిచూసిన రాజుగారి ఆశ్చర్యానికి అంతులేకుండా పోయింది. నిన్నటివరకూ స్తబ్దుగా ఉన్న డేగ ఇప్పుడు అంతెత్తున ఎగురుతూ కనిపించింది. వెంటనే ఆ వేటగాడిని పిలిపించారు- ‘‘ఇంతమంది ఇన్ని ప్రయత్నాలు చేసిన వృధా అయిపోయాయి. ఆ డేగని అంగుళం కూడా కదిలించలేకపోయారు. నీ చేతిలో ఏం మహిమ ఉందో కానీ ఒక్కరాత్రిలోనే దాని రెక్కలకు పనిపెట్టావు. ఇంతకీ ఏం చేశావేంటి?’’ అని ఆసక్తిగా అడిగారు రాజుగారు.   ‘‘రాజా! ఆ డేగ మీ ఆతిథ్యంలోని సుఖాన్ని మరిగింది. నోటి దగ్గరకు వచ్చే ఆహారానికి అలవాటు పడింది. అందుకనే దానికి కదలాల్సిన అవసరం లేకపోయింది. నిన్న రాత్రి మాటిమాటికీ దాని మీద దాడి చేశాను, అది కూర్చున్న కొమ్మనల్లా నరికివేశాను. అప్పుడది ఎగరక తప్పలేదు. మనిషి కూడా ఆ డేగలాంటివాడే! తానున్న ప్రదేశం సుఖంగా, తృప్తిగా ఉంటే మిగతా ప్రపంచంలోకి తొంగిచూడడు. ప్రపంచంలో ఇంకెన్ని అవకాశాలు ఉన్నాయో, ఇంకెంత సంతోషం ఉందో తెలుసుకునేందుకు ప్రయత్నించడు. వాడి ఉనికికి ప్రమాదం ఏర్పడినప్పుడే తన మేధకు పనిపెడతాడు. తనలో లోతుల్లో ఉన్న శక్తిని ఉపయోగిస్తాడు,’’ అంటూ చెప్పుకొచ్చాడు వేటగాడు. వేటగాడి మాటల్లో జీవితసత్యం కనిపించింది రాజుగారికి.   - నిర్జర.

నిబ్బరంగా ఉండకపోతే

అది ఓ పెద్ద పడవ. ఆ పడవలో వందమందికి పైగా ప్రయాణికులు పయనిస్తున్నారు. అకస్మాత్తుగా ఆకాశం మేఘావృతమైపోయింది. చూస్తూ చూస్తుండగానే చిరుజల్లు మొదలైంది. ఆ చిరుజల్లు కాస్తా క్షణాల్లో పెనుతుపానుగా మారిపోయింది. పడవలోని ప్రయాణికులంతా బిక్కుబిక్కుమంటూ ఆ పరిస్థితిని గమనిస్తున్నారు. తాము ఎలాగైనా సురక్షితంగా బయటపడితే బాగుండురా భగవంతుడా! అని ఆకాశం వైపు చేతులెత్తి ప్రార్థిస్తున్నారు. కానీ ఒక ప్రయాణికుడు మాత్రం ఈ పరిస్థితిని తట్టుకోలేకపోయాడు. అరుపులు, ఏడుపులు, శాపనార్థాలతో గోల పెట్టడం మొదలుపెట్టాడు. అతను అలా అటూ ఇటూ కదలడం వల్ల పడవకి మరింత ప్రమాదం అని ఎందరు చెప్పినా ఊరుకోలేదు. తన పెడబొబ్బలకి పసిపిల్లలు భయపడతారని వారించినా వెనక్కి తగ్గలేదు.   పడవ యజమానికి ఏం చేయాలో తోచలేదు. ఆ ఒక్క ప్రయాణికుడు స్థిమితంగా లేకపోవడం వల్ల ప్రయాణికులంతా భయంలో, ప్రమాదంలో పడుతున్నారని అతనికి తెలుసు. కానీ ఏం చేయడం? నయానా భయానా ఎంతగా వారించేందుకు ప్రయత్నించినా ఆ కంగారు ప్రయాణికుడు మాత్రం తన గొంతుని తగ్గించడంలేదు.   ఇదంతా గమనిస్తున్న ఓ స్వామిజీ నిదానంగా పడవ యజమాని దగ్గరకు వెళ్లాడు. ‘మీరు కనుక అనుమతిస్తే, నేను ఆ ప్రయాణికుడిని శాంతింపచేయగలను,’ అని సూచించాడు. యజమాని సరే అనగానే పడవ నడిపేవారి వద్దకు వెళ్లి, వారి చెవిలో ఏదో చెప్పాడు. వెంటనే పడవ నడిపేవారంతా కలసి.... గగ్గోల పెడుతున్న ప్రయాణికుడిని ఒక్కసారిగా నీటిలో పడేశారు. దాంతో ఆ ప్రయాణికుడు చేతులు కాళ్లు కొట్టుకుంటూ, నడిసముద్రంలో ప్రాణాల కోసం అర్తనాదాలు చేయడం మొదలుపెట్టాడు. జరుగుతున్న తంతుని తోటి ప్రయాణికులంతా దిగ్భ్రాంతితో గమనించసాగారు. ఇలా ఓ రెండు నిమిషాలు గడిచిన తరువాత, ఆ ప్రయాణికుడిని పడవలోకి చేర్చమని అడిగారు స్వామీజీ.   ప్రయాణికుడిని తిరిగి పడవలోకి చేర్చగానే అతను ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయాడు. అప్పటివరకూ కేకలు వేసినవాడల్లా నిస్తేజంగా ఉండిపోయాడు. అతడిని చూస్తూ స్వామిజీ చిరునవ్వుతో ‘మనం ఉన్న పరిస్థితి ఎంత సురక్షితంగా ఉందో అన్న విషయం, అంతకంటే దారుణమైన ప్రమాదంలోకి చేరుకుంటే కానీ తెలియదు. కాస్తంత మబ్బులు కమ్ముకోగానే నువ్వు భయపడిపోయావు. కానీ ఇంత నడిసముద్రంలో నీకంటూ నీడగా ఓ పడవ ఉందనీ, నిన్ను కాపాడేందుకు వందల మంది మనుషులు ఉన్నారనీ మర్చిపోయావు. ఒక్క గంట గడిస్తే చాలు తీరాన్ని చేరుకుంటానని కూడా నీకు తట్టలేదు. నీటిలో పడగానే, ఈ నావే నీకు ఆధారం అన్న విషయం నీకు గుర్తుకువచ్చింది. ఇంతకుముందు ఆ విచక్షణ లేకపోవడం వల్ల నీతోపాటు తోటి ప్రయాణికులను కూడా భయపెట్టేశావు. పడవ మునిగిపోయే పరిస్థితులు కల్పించావు. నీ పట్ల నమ్మకం, నువ్వున్న పరిస్థితుల మీద కృతజ్ఞత లేకపోతే... నువ్వు ఏ తీరాన్నీ చేరుకోలేవు,’ అంటూ చెప్పుకొచ్చారు. (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా) - నిర్జర.

గతం!

అనగనగా ఓ చిట్టి పావురం ఉండేది. దానిదో స్వేచ్ఛా జీవితం! ఆకలేస్తే ఇన్ని గింజలు తినడం. ఆశాశంలోకి రివ్వుని ఎగరడం. అలా జీవితాన్ని ఆడుతూ పాడుతూ గడిపేస్తున్న పావురానికి ఓ అలవాటు మొదలైంది. తన మనసుని ఎవరైనా నొప్పిస్తే ఆ విషయాన్ని సహించలేకపోయేది. ఆ విషయాన్ని గుర్తుంచుకునేందుకు ఓ వింత పద్ధతిని మొదలుపెట్టింది. తన మనసు నొచ్చుకున్న ప్రతిసారీ ఓ గులకరాయిని మూటగట్టుకునేది. తను ఎక్కడికి వెళ్లినా ఆ రాళ్లను కూడా తనతో పాటు తీసుకువెళ్లేది. తరచూ ఆ రాళ్లని చూసుకుంటు కాలక్షేపం చేసేది పావురం. అందులో ఏ రాయి ఏ సందర్భంలో పోగేసిందో దానికి గుర్తే! రోజులు గడిచేకొద్దీ రాళ్ల బరువు కూడా పెరిగిపోయింది. ఇదివరకులా వాటిని మోసుకుంటూ ఎక్కువ దూరం వెళ్లలేకపోయేది పావురం. కానీ దాని అలవాటు మానుకోలేదు సరి కదా… చిన్ని చిన్న విషయాలకే రాళ్లను పోగేయడం మొదలుపెట్టింది. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదుగా! పావురం ఉండే చోటకి కరువు వచ్చిపడింది. చెట్లన్నీ మలమలా ఎండిపోయాయి. చెరువులన్నీ అడుగంటిపోయాయి. `మనం ఆ కనిపించే కొండల వైపుకి వెళ్లిపోదాం పద నేస్తం` అని మన పావురానికి ఓ నేస్తం సలహా ఇచ్చింది. `నాక్కూడా అక్కడికి వెళ్లాలనే ఉంది. కానీ ఇంత బరువుని మోసుకుని కదల్లేకపోతున్నాను` అని బదులిచ్చింది పావురం. `అలాంటప్పుడు వాటిని మోసుకుంటూ తిరగడం ఎందుకు. అవతల పారేయరాదా` అంది నేస్తం. `పారేయడానికనుకున్నావా నేను పోగేసుకుంది. వీటిలో ప్రతి ఒక్కటీ నా గాయాలకు ప్రతీక` అంది పావురం. `పాత గాయాలను పోగేసుకుంటూ ఉంటే వాటి బరువుతో ముందుకు పోలేవు. నా మాట విని వాటిని వదిలెయ్యి` అంది నేస్తం. `అసంభవ౦. వాటిని వదిలి నేనుండలేను. అవి నా జీవితంలో భాగమైపోయాయి. వాటిని వదులుకోవడమంటే నా గతాన్ని వదులుకోవడమే. అంత ధైర్యం నేను చేయలేను` అంది పావురం.   పావురాన్ని వదిలేసి నేస్తం ఎగిరిపోయింది. పావురం మాత్రం తను పోగేసిన రాళ్లను చూసుకుంటూ ఉండిపోయింది. కరువు విజృంభించింది. పావురానికి ఎండుగింజలు సైతం దొరకలేదు. నోరు తడుపుకునేందుకు చుక్కనీరు కూడా మిగల్లేదు. అయినా తన గతం తాలూకు బరువుని వదిలి వెళ్లేందుకు దానికి మనసు రాలేదు. అక్కడే ఆ పాత చోటే అర్థంతరంగా తన జీవితాన్ని ముగించుకుంది.

కాగితాలతో ప్రపంచం నాశనం!

చుట్టూ ఎన్ని కంప్యూటర్లు వచ్చినా, ప్రపంచం ఎంత డిజిటల్ విప్లవాన్ని సాధించినా... పేపరు వాడకం పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. 90 శాతానికి పైగా కాగితాలని చెట్ల నుంచి తయారుచేయాల్సిందే! ఇలా టన్నులకొద్దీ కాగితాలను తయారుచేయడానికి ఏటా 300 కోట్లకు పైగా చెట్లని నాశనం చేయవలసి వస్తోంది. ఇక కాగితం తయారీకి కావల్సిన నీటి సంగతి చెప్పనవసరం లేదు. ఒక కిలో కాగితం తయారుచేయడానికి 300 లీటర్ల నీరు కావాలి. ఇక కాగితం తళతళ్లాడిపోయేలా చేయడం దగ్గర నుంచీ దాని మీద ప్రింటింగ్ చేయడం వరకూ నానారకాల రసాయనాలనూ ఉత్పత్తి చేయక తప్పదు.   కాగితాన్ని ఉత్పత్తి చేసేందుకు కొన్ని చెట్లను ప్రత్యేకించి పెంచుతూ ఉంటారు. కానీ తయారీ కోసం నరికే చెట్లలో ఇవి కొద్ది శాతం మాత్రమే. కాబట్టి కాగితం వాడకాన్ని తగ్గించకపోతే నీరు, గాలి కలుషితం కావడం అటుంచి... భూమ్మీద చెట్టనేదే లేకుండా పోతుంది. మన వంతుగా తీసుకునే చిన్న చిన్న చర్యలు కూడా కాగితం వృధా కాకుండా అడ్డుకుంటాయని చెబుతున్నారు నిపుణులు.   - ఏటీఎం, మెడికల్ షాప్, సూపర్ మార్కెట్ ఇలా ఎక్కడికి వెళ్లినా ఒకో బిల్లు తెచ్చుకోవడం మనకి అలవాటు. కొనేది ఒకటి రెండు వస్తువులే అయినా, బిల్లు విషయంలో అనుమానం లేకపోయినా, స్క్రీన్ మీద అంతా కనిపిస్తున్నా... బిల్లు లేకుండా బయటకు రాలేం. ఈ బిల్లుల కోసం కాగితం తయారీ, వాటి మీద ఇంకు... రెండూ కూడా పర్యావరణానికి నష్టమే! ఇలాంటి చోట బిల్లు అవసరం లేదన్న ఒక్క మాట కాగితం వృధాని ఆపుతుంది.   - ఇప్పుడు ప్రతి పుస్తకమూ ఈ-బుక్ రూపంలో లభిస్తోంది. అయినా పాత అలవాటుని వదులుకోలేకనో, పుస్తకం ఇచ్చే సాంత్వన కోసమో జనం ఏటా కోట్ల పుస్తకాలు కొంటూనే ఉన్నారు. ఈ పద్ధతి మారేందుకు కొన్నాళ్లు పడుతుందేమో! కానీ మళ్లీ చదవాల్సిన అవసరం లేదు అన్న పుస్తకాన్ని మరొకరికి ఇచ్చేస్తే సరి.   - మన కంటి ముందున్న ప్రతి కాగితమూ ఈ లోకాన్ని నాశనం చేస్తూ పుట్టింది అన్న అవగాహన ఉన్నప్పుడు... చిన్నపాటి కాగితాన్ని కూడా వృధా చేయం. కాగితాన్ని రెండువైపులా వాడటం, ఏదన్నా నోట్స్ రాసుకునేందుకు చిన్నపాటి కాగితాలను ఉపయోగించడం లాంటి చర్యలు చాలా కాగితాన్నే ఆదా చేస్తాయి.   - ఇంట్లో ఓ నలుగురు చేరినా కూడా కాగితం ప్లేట్లు, పేపరు కప్పులు వాడేస్తుంటాం. ఇవి చూసేందుకు సోగ్గా కనిపించవచ్చు. కానీ పేపరు కప్పులలో ఏం పోసిన తడిసిపోకుండా ఉండేందుకు వాటిలో నానారకాల రసాయనాలు కలుపుతారు. వీటి వల్ల ఆరోగ్యం ఎలాగూ దెబ్బతింటుంది. పైగా వీటిని రీసైకిల్ చేయడం కూడా కష్టమైపోతుంది.   - ఆఫీసులో మనం ఎంత కాగితం వాడుతున్నామో అడిగేవారు లేకపోవచ్చు. పైగా చేతిలో ప్రింటర్ కూడా అందుబాటులో ఉంటుంది. కాబట్టి అంతగా ఆలోచన లేకుండానే కిలోల కొద్దీ కాగితాన్ని వాడేస్తుంటాం. ఈమెయిల్స్, వర్డ్ డాక్యుమెంట్స్ ద్వారా చక్కబెట్టే పనులకి కాగితాన్ని వాడకపోవడం, ప్రింట్ అవుట్ అవసరం అయినా చిన్నపాటి కాగితాలని ఉపయోగించడం, రెండువైపులా ప్రింట్ ఔట్ తీసుకోవడం వంటి చర్యలతో కాగితం వృధా కాకుండా ఉంటుంది. ఆపీసులో కాగితం వాడకానికి కూడా ఒక చిన్నపాటి ఆడిట్ జరిగితే... వీలైనంత వృధా తగ్గిపోతుంది. - నిర్జర.    

తమ డబ్బు మొత్తాన్ని కోల్పోయిన 5 మంది బిలియనీర్లు

సంపద తెలియకుండానే టెంకాయ లోపలి నీరు వచ్చినట్లు వస్తుంది. సంపద తెలియకుండానే ఏనుగు మింగిన వెలగపండులోని గుజ్జువలె   మాయమవుతుంది అంటూ సుమతీశతకంలో చెప్పారు. ఈ విషయం కొంతమంది జీవితాలను చూస్తే నిజమే అనిపిస్తుంది. చాలా తక్కువ సమయంలో కోట్లకు పడగలెత్తిన వారు అంతే తక్కువ సమయంలో పాతాళానికి పడిపోతారు. అలాంటి కొందరు బిలియనీర్ల గురించి తెలుసుకుందాం... ఐకే బాటిస్టా బ్రెజిలియన్ వ్యాపారవేత్త, కానీ అతను దురదృష్టవశాత్తు తన డబ్బు మొత్తాన్ని కోల్పోయాడు. మైనింగ్ , చమురు పరిశోధన పరిశ్రమలో రాణించిన అతను రెండు దశాబ్దాల కాలంలో తన వైభవాన్ని దానిని కోల్పోయాడు. 2011 సంవత్సరంలో అతని ఆస్తుల విలువ  30 బిలియన్ డాలర్లు.  ప్రపంచంలోని ధనవంతుల జాబితాలో ఎనిమిదో వ్యక్తిగా నిలిచాడు, బ్రెజిల్‌లో అత్యధిక సంపన్నుడి స్థాయిని అందుకున్నాడు. అయితే మైనింగ్ పరిశ్రమలో అకస్మాత్తుగా పతనం ప్రారంభమైంది. తన అతిపెద్ద కంపెనీలలో ఒకటైన ogx కుప్పకూలింది. ఆ తర్వాత సంపద తగ్గిపోతూ బిలియనీర్ స్థాయి పడిపోయింది. 2013 సంవత్సరంలో, ఫోర్బ్స్ ప్రకారం దాదాపు 20 బిలియన్ల ఆస్తులను అతను కోల్పోయాడు. కేవలం ఒక సంవత్సరంలోనే విపరీతమైన నష్టాలను చవిచూశాడు. ఆ తర్వాత అతని అపారమైన అప్పులు,  పడిపోతున్న కంపెనీ స్టాక్ కారణంగా ఆస్తులన్నీ కోల్పోయాడు. తన వ్యక్తిగత సంపదలో ఎక్కువ భాగాన్ని అమ్మేశాడు. 2017 సంవత్సరంలో బ్రెజిల్ అధికారులు అతన్ని 100 మిలియన్ డాలర్ల మనీలాండరింగ్ కేసులో అరెస్టు చేశారు. అలెన్ స్టాన్ఫోర్డ్ ఈ వ్యక్తి మాజీ బిలియనీర్, ఫైనాన్షియర్. అయితే ఇప్పుడు మాత్రం శ్రీకృష్టుడి జన్మస్థానంలో ఉన్నాడు.  2009లో అతనికి 110 సంవత్సరాల జైలు శిక్ష ఖరారు కాగా ప్రస్తుతం జైలు జీవితం అనుభవిస్తున్నాడు.   ఆర్థిక కుంభకోణంలో దోషిగా నిర్ధారించబడిన తరువాత శిక్ష పడింది. అతను ఇప్పుడు వాడుకలో లేని ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ స్టాన్ఫోర్డ్ ఫైనాన్షియల్ గ్రూప్ చైర్మన్. 136 వివిధ దేశాలలో  కనీసం 30,000 మంది ఖాతాదారులలో 8.5 బిలియన్ డాలర్లు ఉన్న సహాయక సంస్థలలో ఒకటి. ఈ సంస్థ  2009 లో ప్రారంభమైంది.  అయితే ఈ కంపెనీ ప్రారంభమైన సెకన్ లోనే  అలెన్ స్టాన్ఫోర్డ్ పై అన్వేషణ ప్రారంభించింది. 8 బిలియన్ డాలర్ల అధిక దిగుబడి ధృవీకరణ పత్రాలను అక్రమంగా విక్రయించినందుకు అతనిపై చీటింగ్ కేసు నమోదు అయ్యింది.  మనీలాండరింగ్, చీటింగ్ తదితర ఆరోపణలతో 2009 జూన్ లో అరెస్ట్ చేశారు. విచారణ తర్వాత 110 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. ఎలిజబెత్ హోమ్స్ ఎలిజబెత్ అమెరికన్ ఆవిష్కర్త , ఎంటర్ ప్రెన్యూర్,   ఆమె హెల్త్ కేర్ టెక్నాాలజీ కార్పోరేషన్ ప్రారంభించిన తర్వాత  2015లో సెల్ఫ్ మెడ్  మహిళా బిలియనీర్ గా రికార్డ్ సృష్టించారు.  ఆ సంస్థ 9 బిలియన్ డాలర్ల విలువకు చేరుకోవడంతో పాటు భారీగా లాభాలు ఆర్జించింది. 2015 నాటి 100 మంది అత్యంత ముఖ్యమైన వ్యక్తులలో  ఆమె పేరు చేరడంతో  సెలబ్రిటీ అయ్యారు. ఆ తర్వాత ఎలిజబెత్ కంపెనీపై అన్వేషణ జరిగింది. కొత్త ఇన్వెంటివ్ బ్లడ్ టెస్టింగ్ టెక్నాలజీ గురించి పెట్టుబడిదారులను తప్పుదారి పట్టించారన్న ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత  ఆమెపై విశ్వసనీయత, ఆమె వ్యక్తిగత ఆస్తులు రెండూ తగ్గిపోవడం ప్రారంభమైంది.  . ప్రపంచంలోని అత్యంత నిరాశపరిచిన నాయకులలో ఒకరిగా హోమ్స్ పేరును ఫోర్బ్స్ పేర్కోంది.  మెడికేర్ , మెడిసిడ్ సేవలు అందించే ఆమె కంపెనీలో రెండు సంవత్సరాలు ఎలాంటి పోజిషన్ ఇవ్వలేదు. బెర్నార్డ్ మాడాఫ్ పోంజీ పథకాలకు(చైన్ లింక్) రూపకల్పన చేసిన వ్యక్తి బెర్నార్డ్.   2008 లో అరెస్టు అయ్యేవరకు దాదాపు 20 ఏళ్ళపాటు మార్కెట్ లో చైన్ లింగ్ సామాజ్యాన్ని పరిపాలించాడు. స్ప్లిట్ స్ట్రైక్ కన్వర్షన్ అనే తన వెంచర్ వ్యూహంతో అతను వేలకొలది బిలియన్ డాలర్ల పెట్టుబడిదారులను విజయవంతంగా మోసం చేశాడు. అతను తన ఖాతాదారులకు అధిక , స్థిరమైన రాబడిని ఇస్తానని వాగ్దానం చేశాడు. తన నిధులను ఒకే బ్యాంకు ఖాతాలో జయ చేయడం ద్వారా కంపెనీ కార్యకలాపాలను నిర్వహించేవాడు. అయితే  2008 ఆర్థిక సంక్షోభ సమయంలో అతని పథకం విఫలమైంది.  మార్కెట్లలో ఎక్కువ మంది ఖాతాదారులను ఆకర్షించలేకపోయాడు. ఆ తర్వాత అతని 64.8 బిలియన్ డాలర్ల మోసం బయటపడింది. దాదాపు  బిలియన్ డాలర్ల సంపద కూడబెట్టినట్లు అంచనా. విజయ్ మాల్యా భారతీయ వ్యాపారవేత్త ,  మాజీ బిలియనీర్, అతను ప్రస్తుతం ఆర్థిక నేరాల నుంచి తప్పించుకునేందుకు బ్రిటన్ లో తలదాచుకున్నాడు. అతనిని UK నుండి భారతదేశానికి అప్పగించే అంశంపై చర్యలు జరుగుతున్నాయి. విజయ్ మాల్యా  28 ఏళ్ళ వయసులో తన తండ్రి  సంస్థను స్వాధీనం చేసుకున్నాడు.  ఆ తర్వాత వ్యాపారాన్ని విస్తరిస్తూ కింగ్ ఫిషర్ బ్రాండ్ మద్యం మార్కెట్ లోకి తీసుకువచ్చి సంపన్నుల జాబితాలో చేరాడు.  మద్యం  వ్యాపారాన్ని మల్టీ బిలియన్ డాలర్ల సంస్థగా మార్చాడు. కానీ దురదృష్టవశాత్తు, అతని విమానయాన సంస్థలు నష్టాల బాటపట్టింది.  బ్యాంకులతో తీసుకున్న అప్పులు ఎగవేతకు పాల్పడ్డాడు. యునైటెడ్ స్పిరిట్స్ అని పిలువబడే తన సంస్థపై నియంత్రణను కోల్పోయాడు . చైర్మన్ పదవి నుండి తప్పుకోవలసి వచ్చింది. అతని ఆస్తులు వేలం వేయమని ఆదేశాలు ఇచ్చారు. ప్రస్తుతం అతనిని యూకె నుంచి భారత్ కు రప్పించడానికి చర్చలు జరుగుతున్నాయి.

లోపం లేని మనిషి

ఒక ఊరిలో జనమంతా కలిసి తమకి ఇష్టమైన దేవుని శిల్పాన్ని ప్రతిష్టించాలనుకున్నారు. అందుకోసం చుట్టుపక్కల అంతా వాకబు చేసి ఒక శిల్పిని రప్పించారు. శిల్పి వచ్చీరాగానే తన పనిని ప్రారంభించాడు. శిల్పం కోసం సరైన శిలను ఎన్నకున్నాడు. ఊరి ప్రజల అభీష్టాన్నీ అనుసరించి వారి ఇష్టదైవాన్ని ఆ శిల్పంలో తొలవడం మొదలుపెట్టాడు. రోజులు గడిచాయి. రోజులు వారాలుగా మారాయి. వారాలు కాస్తా రెండు నెలలయ్యాయి. శిల్పి చెక్కుతున్న శిల్పం తుదిరూపుకి చేరుకుంది. కానీ మనసులో ఏం తోచిందో ఏమో కానీ, ఒక రోజున ఆ శిల్పాన్ని కాస్తా పక్కనపెట్టేశాడు శిల్పి. విగ్రహాన్ని చెక్కే పనిని మళ్లీ మొదటినుంచి మొదలుపెట్టాడు. ఒక రోజు శిల్పిని వెతుక్కుంటూ అతని స్నేహితుడు వచ్చాడు. దీక్షగా విగ్రహాన్ని చెక్కుతూ కూర్చున్న శిల్పిని చూశాడు. ఆ పక్కనే పడేసి ఉన్న విగ్రహమూ అతనికి కనిపించింది. ‘‘ఆ విగ్రహం ఇంచుమించుగా పూర్తయిపోయింది కదా! మళ్లీ రెండో విగ్రహాన్ని చెక్కుతున్నావేంటి’’ అంటూ వాకబు చేశాడు స్నేహితుడు. ‘‘ఆ విగ్రహం సరిగా రాలేదు’’ అంటూ బదులిచ్చి తన పనిలో నిమగ్నం అయిపోయాడు శిల్పి. ఆ మాటలకు స్నేహితుడు శిల్పం దగ్గరకి వెళ్లి పరీక్షగా చూశాడు. ఎంతగా చూసినా అతనికి ఎలాంటి లోపమూ కనిపించలేదు. ‘‘అదేంటి శిల్పం అద్భుతంగా వచ్చింది కదా! నేను చూసిన గొప్ప శిల్పాలలో ఇది ఒకటని ఖచ్చితంగా చెప్పగలను,’’ అన్నాడు స్నేహితుడు. శిల్పి చిరునవ్వుతో ‘‘ఒక్కసారి ఆ శిల్పం కళ్లని పరీక్షగా చూడు. అవి సరిగ్గా కుదరలేదు,’’ అని చెప్పాడు. స్నేహితుడు మరోసారి ఆ శిల్పాన్ని పరీక్షగా చూస్తే ఆ మాట నిజమేననిపించింది. కానీ అంత చక్కటి శిల్పాన్ని పక్కన పెట్టడాన్ని అతని మనసు ఇంకా ఒప్పుకోలేదు. ‘‘ఆ శిల్పాన్ని ఎక్కడ ఉంచుతున్నారు!’’ అని అడిగాడు స్నేహితుడు. ‘‘ఈ ఊరి దేవాలయంలో, పది అడుగుల ఎత్తైన పీఠం మీద,’’ బదులిచ్చాడు శిల్పి. ‘‘నీకేమన్నా మతి పోయిందా! పది అడుగుల ఎత్తైన పీఠం మీద, మరో పది అడుగుల ఎత్తున్న ఈ విగ్రహంలోని కళ్లలో చిన్నపాటి లోపం ఎవరికి కనిపిస్తుంది. పైగా కాస్త రంగు పూశావంటే ఆ ఉన్న కాస్త లోపమూ ఎవ్వరికీ తెలియనే తెలియదు. దాని కోసం రెండు నెలలుగా పడ్డ కష్టాన్ని వృధా చేసుకుంటావా! ఈ పల్లెటూరి బైతుల కోసం ఇంత కష్టం అవసరమా!’’ అంటూ దులిపేశాడు స్నేహితుడు. శిల్పి చిరునవ్వుతో- ‘‘ఈ విగ్రహంలో లోపం ఎవ్వరికీ, ఎప్పటికీ తెలియకపోవచ్చు. కానీ నాకు తెలుసు కదా! ఒక లోపంతో ఉన్న శిల్పాన్ని చెక్కానన్న విషయం నా మనసులో నిలిచిపోతుంది. అది జీవితాంతం నా వృత్తి మీద ఒక మచ్చగానే మిగిలిపోతుంది. ఇక కష్టాన్ని వృధా చేసుకోవడం అంటావా... అది నా దృష్టిలో పనితీరుని మరింతగా మెరుగుపరుచుకోవడమే! మనం చేసే పనికి ఎంత ధర వస్తోంది? ఎవరి కోసం పనిచేస్తున్నాం? అన్న విషయం ఎప్పుడూ ముఖ్యం కాదు. మనసుకి తృప్తి కలిగించేలా పనిని పూర్తిచేశామా లేదా అన్నదే ముఖ్యం. ఆ తృప్తి కోసం పడే తపన మన పనిని మరింతగా మెరుగుపరుస్తుంది. అదే చివరివరకూ నిలుస్తుంది,’’ అంటూ చెప్పుకొచ్చాడు. (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా) - నిర్జర.

అనుకున్నది సాధించాలంటే!

అనగనగా ఓ మహా పర్వతం. ఆ పర్వతం మీద ఓ దుర్మార్గమైన తెగ ఉండేది. ఆ తెగ ఓసారి పర్వతం మీద నుంచి కిందకి దిగి వచ్చింది. కింద మైదాన ప్రాంతాల్లో ఉండే ఓ గ్రామం మీద దాడి చేసంది. దాడి చేయడమే కాదు... వెళ్తూ వెళ్తూ తమతో పాటు ఓ పసిపిల్లవాడిని కూడా ఎత్తుకు వెళ్లిపోయింది. ఆ దాడితో గ్రామంలోని జనమంతా బిత్తరపోయారు. కాస్త తేరుకున్న తరువాత, తమ పిల్లవాడిని ఎలాగైనా సరే తిరిగి తెచ్చుకోవాలని నిశ్చయించుకున్నారు. కానీ ఎలాగా! వాళ్లు ఎప్పుడూ ఆ పర్వతాన్ని ఎక్కనే లేదయ్యే! అదో దుర్గమమైన కొండ. ఆ కొండ మీద ఉండే తెగకి తప్ప మిగతా మానవులెవ్వరికీ దాని శిఖరాన్ని చేరుకోవడం సాధ్యం కాదు. అయినా పిల్లవాడి కోసం ప్రాణాలకు తెగించి బయల్దేరారు.   గ్రామంలోని ఓ పదిమంది నిదానంగా కొండని ఎక్కడం మొదలుపెట్టారు. ఎక్కడ ఏ మృగం ఉంటుందో, ఎటువైపు నుంచి ఏ రాయి దొర్లిపడుతుందో అనుకుంటూ బిక్కుబిక్కుమంటూ బయల్దేరారు. ఎలాగొలా కొండ శిఖరాన్ని చేరుకున్నా, అక్కడ శత్రువుల కళ్లుగప్పి, వారి చెర నుంచి పిల్లవాడిని తీసుకురావడం ఎలాగా అంటూ బితుకు బితుకుమంటూ నడుస్తున్నారు.   ఒక రోజు గడిచింది, రెండు రోజులు గడిచాయి.... నాలుగు రోజులు గడిచాయి. కానీ తాము ఎటు పోతున్నామో వాళ్లకి అర్థం కాలేదు. ఒక అడుగు పైకి వెళ్తే నాలుగు అడుగులు కిందకి జారిపోతున్నారు. క్రూరమృగాలని తప్పించుకోలేక సతమతమైపోతున్నారు. తెచ్చుకున్న ఆహారం కాస్తా అయిపోయింది. ఇక మరొక్క అడుగు ముందుకు వేసే ధైర్యం లేకపోయింది. దాంతో పిల్లవాడి మీద ఆశలు వదిలేసుకుని నిదానంగా వెనక్కి తిరిగారు. తిరిగి తమ ఇళ్లకు చేరకుంటే చాలు దేవుడా అన్న ఆశతో తిరుగుప్రయాణం కట్టారు.   వాళ్లు తిరిగి వస్తుండగా దారిలో ఆ పిల్లవాడి తల్లి కనిపించింది. ‘ఎక్కడికి వెళ్తున్నావు! ఈ కొండ శిఖరాన్ని చేరుకోవడం మనవల్ల కాదు. నీ పిల్లవాడి ఆయువు ఇంతే అనుకో! అక్కడే అతను క్షేమంగా ఉంటాడని కోరుకో. మాతో పాటు వచ్చేసేయి,’ అంటూ ఆమెను చూసి అరిచారు. వారి మాటలు విన్న తల్లి మారు మాటాడకుండా దగ్గరకు వచ్చి నిల్చొంది. ‘నేను పైకి వెళ్లడం లేదు. పై నుంచి కిందకి దిగి వస్తున్నాను,’ అంటూ వెనక్కి తిరిగి తన వీపుకి కట్టుకుని ఉన్న పిల్లవాడిని చూపించింది.   ‘ఇంతమంది వల్ల కాని పని నీ ఒక్కదాని వల్ల ఎలా సాధ్యమైంది. ఇంత అసాధ్యమైన కొండని ఎక్కి, శత్రువుల కళ్లుగప్పి నీ బిడ్డను ఎలా తెచ్చుకోగలిగావు,’ అని వారంతా ఆశ్చర్యపోయారు. దానికి ఆ తల్లి చిరునవ్వుతో ‘నా పిల్లవాడిని తీసుకురావడం అంటే మీకు బాధ్యత మాత్రమే! కానీ నాకు మాత్రం జీవిత లక్ష్యం. పిల్లవాడు లేనిదే నా జీవితం అర్ధరహితం అనుకున్నాను. అందుకనే వాడి కోసం బయల్దేరాను. ఈ కొండని ఎక్కడం నాకు అంత కష్టం అనిపించలేదు. శత్రువు కళ్లుగప్పడం అసాధ్యంగా తోచలేదు,’ అంటూ చెప్పుకొచ్చింది. ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం ఓ బాధ్యతగా కాకుండా జీవన గమనంగా సాగిస్తే ఏదైనా సాధించవచ్చని ఆ తల్లి నిరూపిస్తోంది. (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా) - నిర్జర.  

ప్రపంచంలో అత్యంత భయానక రహస్య సరస్సులు

ప్రపంచం అనేక అద్భుతాల సమాహారం. అందమైన జలపాతాలు, అలరించే అడవులు, చిత్రకారుణి కుంచెను మించిన అపూర్వమైన దృశ్యాలు ఎన్నో ఎన్నెన్నో.. అయితే కొన్ని అద్భుతాల వెనుక భయంకరమైన వాస్తవాలు దాగి ఉన్నాయి. వాటి గురించి తెలుసుకున్నప్పుడు ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ప్రపంచంలోని అందమైన సరస్సులే కాదు అత్యంత భయానక సరస్సులు కూడా ఉన్నాయి. వాటిలో కొన్ని ప్రాణాలను హరిస్తాయి. ముందుగా వీటి గురించి తెలుసుకోవడం వల్ల ఆయా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం సాధ్యమవుతుంది. మరి ఆ భయానక రహాస్య సరస్సుల విశేషాలు ఏంటో చూద్దామా... 1. బ్లూ లేక్, రష్యా రష్యాలోని వింతైన సరస్సు ఇది. ఈ సరస్సులోకి నీరు వర్షం ద్వారా ఈ సరస్సులోని నీరు  ప్రవాహాల నుంచి,  నదుల నుంచి ఇందులోకి చేరదు. భూగర్భ నీటి బుగ్గల ద్వారా సరస్సులోకి నీళ్లు చేరుతాయి. అయితే నీటిలో హైడ్రోజన్ సల్ఫైడ్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగా నీటి రంగు నీలం రంగులో కనిపిస్తుంది.  సరస్సు 258 మీటర్ల లోతులో ఉంది. ఇది 75 మీటర్ల ఎత్తున ఉన్న సీటెల్ స్పెస్ కూడా ఈజీగా ఇందులో మునిగిపోతుంది. ఈ సరస్సు నీరు రాళ్ళను సైతం కోస్తూ వెళ్లడంతో సరస్సు రోజురోజుకు లోతుగా మారుతోంది. ఈ నీలం సరస్సు ప్రపంచంలోని అతిపెద్ద గుహలను తనలో నిక్షిప్తం చేసుకుందని కొంతమంది శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. 2. లేక్ నాట్రాన్, టాంజానియా తూర్పు ఆఫ్రికాలో లోతైన సరస్సు ఇది.  టాంజానియా కథలలో ఈ సరస్సు ప్రస్తావన ఉంటుంది.  ప్రజల జీవితాలను ఇది ప్రభావితం చేస్తుంది. అయితే ఈ సరస్సు ఒడ్డున ఫ్లెమింగోలు, చిన్న పక్షులు, గబ్బిలాలు ప్రాణములేని స్థితిలో కనిపిస్తాయి. అత్యంత భయంకరమైన విషయం ఏమిటంటే, ప్రాణాలు కోల్పోయిన అన్ని జీవుల శరీరాలు భద్రపరచబడి కనిపిస్తాయి. నీటిలోని సోడియం కంటెంట్ కారణంగా సరస్సు పసుపు రంగును కనిపిస్తుంది. అయితే ఇందులో ఉండే అనంతమైన సూక్ష్మజీవుల కారణంగా ఈ జలాలు నారింజ రంగులో ఉంటాయి. కానీ నెమ్మదిగా నారింజ రంగు మరింత ముదురుగా మారి, నీటి రంగు ప్రకాశవంతమైన ఎరుపు రంగులోకి మారుతోంది. ఈ సరస్సులో నాట్రాన్ పుష్కలంగా ఉంది, సహజంగా సంభవించే సోడియం సమ్మేళనం సోడియం కార్బోనేట్, బైకార్బోనేట్, క్లోరైడ్ మరియు సల్ఫేట్ల మిశ్రమాన్ని కలిగి ఉంటుంది. ఈ సరస్సు చుట్టూ వాతావరణం రంగురంగుల ల్యాండ్ స్కేప్ మాదిరిగా కనిపిస్తోంది. 3. మిచిగాన్ లేక్, యుఎస్ఎ అమెరికాలో ఉన్న ఐదు గొప్ప సరస్సుల్లో మిచిగాన్ లేక్ ఒకటి. ఈ సరస్సు వందలాది మంది ప్రాణాలను తీసిన విషయం చాలా తక్కువ మందికి తెలుసు. సరస్సులో ఎలాంటి రాక్షసులు లేరు. అంతేకాదు మరణించినవారు నీటికి దూరంగా ఉన్నప్పుడే మరణించారు. అయితే ఇక్కడి అలలను ప్రమాదకరంగా పరిగణిస్తారు. ఒడ్డుకు వచ్చే అలలు, నీటి ప్రవాహాలు ఊహించని విధంగా ప్రాణాలను హరిస్తాయి. అంతేకాదు గజ ఈతగాళ్లు కూడా  మిచిగాన్ ఒడ్డున ప్రవాహాలను ఎదుర్కోలేరని, ఇవి చాలా ప్రమాదకరమైనవి అంటారు. సమ్మర్ సీజన్ లో ఇక్కడికి ఈతకు వచ్చి అనేక మంది ప్రాణాలు కోల్పోతారు.  ఆ నిర్దిష్ట సమయంలో నీటి ప్రవాహం, అలల తాకిడి ఎక్కువ కావడంతో ఎక్కువ మరణాలు సంభవిస్తాయి. శరదృతువు ఈ సరస్సు వాతావరణం పడవలు, మత్స్యకారులకు ప్రమాదకరం.  నీటి ఉపరితలంపై హఠాత్తుగా పెరుగుతున్న ప్రవాహాలు ప్రాణాంతక తరంగాలకు కారణమవుతాయి. 4. న్యోస్ కామెరూన్ సరస్సు ఈ సరస్సు అనేక పొరుగు గ్రామాలకు అనేక శతాబ్దాలుగా నిశ్శబ్దంగా నీటిని అందించింది. కానీ దాని ఉపరితలం కింద, ఒక రహస్యం ఉంది. ప్రకృతి ప్రాణాంతక శక్తిని అకస్మాత్తుగా విడుదల చేసిన తరువాత సరస్సు ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతిని పొందింది. ఈ సంఘటన ఆగస్టు 21, 1986 న జరిగింది. సరస్సు నుండి అధిక శక్తితో కూడిన వాయువు మేఘం పెరిగింది. సమీపంలో నివసించే ప్రతిదీ ప్రజలు, పశువులు, పక్షులు మొదలైనవి ఏమీ ఈ విపత్తు నుంచి బయటపడలేదు! సరస్సు చుట్టూ నివసించే చిన్న కీటకాలు కూడా కుళ్ళిపోయాయి. ఈ సంఘటన సుమారు 1746 మంది మానవుల ప్రాణాలను తీసింది.  ప్రపంచం నలుమూలల శాస్త్రవేత్తలు ఈ ప్రదేశాన్ని సందర్శించారు, సరస్సులో అగ్నిపర్వత బిలం ఉన్నట్లు వారు కనుగొన్నారు. 5.కరాచాయ్ సరస్సు, రష్యా రష్యా లోని యురల్స్ లో ఉన్న ఈ సరస్సు ప్రపంచంలో అత్యంత కలుషితమైన వాటిలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ సరస్సు ఒడ్డున కేవలం రెండు గంటలు గడపడం వల్ల మీరు రెండు గంటలు ఎక్స్‌రే మెషీన్‌లో కూర్చున్నట్లుగా అనిపిస్తుంది. అంతేకాదు అది కూడా సీసంతో కప్పబడిన కవరింగ్ లేకుండా ఉంటుంది. రేడియేషన్ పాయిజనింగ్ ద్వారా చాలా నెమ్మదిగా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సరస్సు 1950 లలో జరిగిన యుద్ధం కారణంగా నాశనమైంది. ఆ తర్వాత ఈ సరస్సును ద్రవ రేడియోధార్మిక వ్యర్థాల నిల్వ కోసం ఉపయోగించారు.  

ఆమె తూర్పు.. అతను పడమర...

మౌలికంగా స్త్రీ, పురుషుల ఆలోచనా విధానంలోనే తేడా వుంటుంది. అందుకే ఒకరు చేసేది మరొకరికి నచ్చదు అంటున్నారు టొరంటో యూనివర్సిటీ పరిశోధకులు. భార్యాభర్తల బంధంలో ‘అర్థం చేసుకోవడం’ అనేది చాలా ముఖ్యమైన విషయం. అయితే ఎవరు ఎవర్ని అర్థం చేసుకోవాలన్నదే సమస్య. నన్ను అర్థం చేసుకుని నాకు నచ్చినట్టు నడిస్తే బావుంటుందని ఎవరికి వారు కోరుకుంటారుట భార్యాభర్తలిద్దరూ. అదిగో అక్కడే మొదలవుతుందిట సమస్యంతా. భార్యాభర్తల గొడవల్లో ఎక్కువగా వినిపించే కారణం ‘అర్థం చేసుకోలేకపోవడం’. అయితే ఒకే విషయానికి స్త్రీ, పురుషులు స్పందించే తీరు వేరే వేరేగా వుంటుంది. అది సర్వ సాధారణం. ఈ ఒక్క విషయాన్ని గ్రహించగలిగితే ఎన్నో కుటుంబాలలో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు వుండవు అంటున్నారు పరిశోధకులు. వీరు స్త్రీ, పురుషుల మనస్తత్వాలు, వివిధ సందర్భాలలో వారు స్పందించే విధానంపై ఓ అధ్యయనం చేపట్టారు. ఏ విషయం వారిని ఎక్కువగా బాధిస్తుంది అన్న విషయంలో కూడా ఇద్దరి మధ్య ఎంతో తేడా వుందని గుర్తించారు. స్త్రీలు ఎక్కువగా సన్నిహిత సంబంధాలు, బంధుత్వాల విషయంలో చాలా సున్నితంగా వుంటారుట. ఆ సన్నిహితుల విషయంలో, సంబంధాల విషయంలో ఏవైనా వైఫల్యాలు ఎదురైతే డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతారు అంటున్నారు పరిశోధకులు. అదే మగవారిని ఆ విషయాలు అంతగా కదిలించవట. తమ ఉద్యోగం, సంపాదన, తన మాటకి విలువ, గౌరవం, సమాజంలో, కుటుంబంలో గుర్తింపు వంటివి మగవారికి ముఖ్యమైన అంశాలుగా నిలుస్తాయట. వీటిల్లో వచ్చే హెచ్చుతగ్గులు వారిని డిప్రెషన్‌కి గురి చేస్తాయట. డిప్రెషన్‌కి గురైన స్త్రీలు నిస్సహాయంగా, నిరాశగా, ఒంటరిగా గడపటానికి ఇష్టపడుతుంటే, మగవారు మాత్రం కోపం, పంతం వంటి లక్షణాలు కనబరుస్తారని గుర్తించారు టొరంటో యూనివర్సిటీ పరిశోధకులు. అలాగే పగ, కసి, శత్రుత్వం వంటి లక్షణాలు మగపిల్లల్లో టీనేజ్ నుంచే ఎక్కువగా కనిపిస్తున్నాయని కూడా వీరి పరిశోధనలో తేలింది. దీనిని దృష్టిలో పెట్టుకుని మగపిల్లల తల్లిదండ్రులు వారి ప్రవర్తన, మానసిక స్థితి వంటివాటిని ఎప్పటికప్పుడు గమనిస్తూ వుండాలని కూడా హెచ్చరిస్తున్నారు వీరు. నిరాశ, నిస్పృహ వంటివి మనిషిని కృంగదీసినప్పుడే మరో వ్యక్తి తోడు, ఆసరా అవసరం అవుతాయి. ముఖ్యంగా భార్యాభర్తల విషయంలో భార్య భర్త నుంచి ఓదార్పుని, తోడ్పాటుని కోరుకుంటే భర్త తన భార్య సహనంగా అర్థం చేసుకోవడాన్ని కాంక్షిస్తాడుట. స్త్రీలు నేనున్నానంటూ భరోసాని కోరుకుంటారు. కానీ, మగవారు తమ భార్యలు వారి సమస్యలలో తల దూర్చకుండా, సలహాలు ఇవ్వకుండా ఉండాలని ఆశిస్తారుట. దాదాపు కొన్ని వందల జంటలపై దీర్ఘకాలం సాగిన ఆ పరిశోధనలో బయటపడిన కొన్ని ఆసక్తికర అంశాలివి. -రమ

మధ్యమధ్యలో కాలుకదపితే... ఆయుష్షు పెరుగుతుంది!

Sedentary lifestyle.  అబ్బో ఈ మాటని ఈమధ్య చాలా ఎక్కువగానే వింటున్నాం. ఎలాంటి శారీరిక శ్రమా లేకుండా, నిరంతరం కూర్చుని ఉండే జీవనశైలిని sedentary lifestyle అంటారని మనకి తెలుసు. నిరంతరం కూర్చుని కూర్చుని ఉంటే, ఆరోగ్యపరంగా చాలా సమస్యలు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు వైద్యులు. గంటల తరబడి కూర్చుని ఉండటం వల్ల పొట్ట మీద ఒత్తిడి పెరిగి జీర్ణవ్యవస్థ పాడైపోవడం, మెదడుకి చేరే రక్తప్రసారంలో లోపం ఏర్పడటం, వెన్నెముక బలహీనపడిపోవడం, ఇన్సులిన్‌ ఉత్పత్తి దెబ్బతినడం, గుండెజబ్బులు రావడం, ఎముకలు పెళుసుబారిపోవడం వంటి నానాసమస్యలూ దరిచేరతాయి. ఇవి డయాబెటిస్‌, పక్షవాతం, గుండెపోటు లాంటి తీవ్రమైన ప్రమాదాలకి దారితీస్తాయి.   కూర్చుని ఉండటం వెనుక ఎన్నో ప్రమాదాలు దాగిఉన్నాయని తేలిపోయింది. పోనీ రోజూ కాసేపు వ్యాయామం చేద్దామా అంటే... అది అందరికీ కుదరకపోవచ్చు. కాబట్టి అసలు కూర్చోవడంలోనే ఏమన్నా మార్పు తీసుకురావచ్చునేమో గమనించే ప్రయత్నం చేశారు. ఇందుకోసం దాదాపు ఎనిమిదివేల మందికి ఓ యంత్రాన్ని అమర్చారు. ఆ యంత్రం ద్వారా వారి శరీరకదలికల మీద నిఘా ఉంచారు.   ఎనిమిదివేల మంది అభ్యర్థులలో దాదాపు 77 శాతం మంది నిరంతరం కూర్చునే ఉంటున్నారని తేలింది. వీరి రోజులో సగభాగం కూర్చునే సాగిపోతోందట. మరో నాలుగేళ్లు గడిచిన తర్వాత వీరిలో ఓ 340 మంది చనిపోయారు. అయితే దఫాకు ఓ గంట నుంచి గంటన్నర పాటు కదలకుండా కూర్చునేవారే తొందరగా చనిపోతున్నట్లు తేలింది. అరగంటకి ఓసారి లేచి అటూఇటూ తిరిగేవారి ఆయుష్షు ఎక్కువగానే ఉన్నట్లు గమనించారు. అంటే రోజంతా కూర్చునే ఉన్నాకూడా, మధ్యమధ్యలో లేస్తూ ఉండటం వల్ల మన ఆయుష్షు పెరుగుతుందన్నమాట. వినడానికి బాగానే ఉంది కదా! మరింకేం ఆచరించేస్తే సరి. - నిర్జర.  

ప్రపంచంలోని అత్యంత విలువైన నాణెలలో ఆరు

ప్రపంచం డిజిటల్ మనీ, ఈ మనీ వైపు పరుగులు తీస్తుంది. కానీ, వేలాది సంవత్సరాలుగా డబ్బుగా చెలామణి అయినవి నాణెలు మాత్రమే.  లోహంతో తయారు చేయబడి  చెలామణిలో ఉన్న నాణెలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అయితే  కాగితం కరెన్సీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ నాణెల ప్రాధాన్యత బాగా తగ్గిపోయింది.  ప్రపంచంలో అరుదైన నాణెలుగా రికార్డు సృష్టించిన నాణెలు ఎన్నో ఉన్నాయి. వాటి విలువ కోట్లాది రూపాయల్లో ఉంటుంది. మరి వాటి వివరాలు ఎంటో చూద్దామా.. 6. లిబర్టీ హెడ్ నికెల్ మోర్టన్ స్మిత్ ఎలియాష్ బర్గ్ (1913 ) ఖరీదు 4.5మిలియన్ డాలర్లు (33,33,96,675  రూపాయలు) ఈ నాణెం ఖరీదు 2018లో వేలం ద్వారా 4,560000 డాలర్లకు చేరుకుంది. అత్యంత ప్రసిద్ధ చెందిన ఈ నాణెం ఈ భూగ్రహం మీద ఉనికిలో ఉన్న నాణెం ఐదు నమూనాలలో ఇది ఒకటి. వేలంపాటతో ధర పెరుగుతూ వచ్చి 2018లో 4.5మిలియన్ డాలర్లకు మించి ధర పలికింది. ఈ నాణెం పై భాగం నునుపుగా అద్దం వలే కనిపిస్తుంది. ఇలాంటి ఫినిషింగ్ ఉన్న నాణెం అరుదుగా ఉంటుంది. దీని  విలువ  ఎక్కువగా ఉండటానికి ఇది కూడా ఒక కారణం. అంతేకాదు ఈ నాణెం ముద్రణ గురించి  అధికారిక రికార్డులు లేనందున ఇది ఏ కాలం నాటిది అన్న విషయంపై చాలా వివాదాలు ఉన్నాయి.  కేవలం ఐదు లిబర్టీ నికెల్ నాణాలు మాత్రమే లభించాయి.  ఇవన్నీ అనధికారంగా తయారుచేశారంటారు. అయితే 1913 లో లిబర్టీ నికెల్ నాణెలను తయారు చేయడానికి  చట్టం అనుమతించింది. కాని కొంతమంది  మింట్ ఉద్యోగులు కొన్ని అక్రమ నమూనాలను ముద్రించారన్న ఆరోపణ ఉంది. ఈ ప్రసిద్ధ నాణెం 1972 నుండి రికార్డులను బద్దలు కొడుతున్నాయి. 100,000 కు అమ్ముడైన మొదటి నాణెం ఇదే. ఆ తర్వాత 1996 లో దీని ధర  ఒక మిలియన్ డాలర్లు పలికింది.  ప్రస్తుత రికార్డ్ హోల్డర్ ఎలియాస్‌బర్గ్ స్పెసిమెన్, గ్రేడెడ్ పిసిజిఎస్ పిఎఫ్ 66.  ఇది 2018 లో  4.5 మిలియన్ డాలర్లకు అమ్ముడైంది. 5.ఎడ్వర్డ్ 111 ఫ్లోరిన్ (1343) ఖరీదు 6.8 మిలియన్ డాలర్లు(50,37,99,420 రూపాయలు) ప్రపంచంలో అత్యంత ఖరీదైన నాణాల్లో ఇది ఒకటి. అంతేకాదు చాలా పురాతనమైన నాణెం.  దాదాపు 670ఏండ్ల చరిత్ర ఉంది. ఈ నాణెం విలువ ఎక్కువగా ఉండడానికి మరో ముఖ్యమైన కారణం ఇది అతి పురాతన నాణెం కావడం. ఒకే విధమైన నాణాల్లో మూడు మాత్రమే అనేక శతాబ్దాల నుంచి చెక్కుచెదరకుండా ఉన్నాయి. అంటే ఇది చాలా విలువైనది మాత్రమే కాదు, అరుదైనది కూడా. ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి నాణెలు ఇప్పటి వరకు కనుగొనబడలేదు.  ఈ నాణెం 2006 సంవత్సరంలో వెలుగులోకి వచ్చింది. అదే సంవత్సరంలో వేలంపాట ద్వారా దీన్ని విక్రయించారు. ఆ తర్వాత 1857 లో టైన్ నదిలో కనుగొనబడిన మిగిలిన రెండు నాణేలు ప్రస్తుతం బ్రిటిష్ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు. 4.బ్రషర్ డబులూన్ (1787) ఖరీదు 7.4 మిలియన్లు(54,82,50,830 రూపాయలు) న్యూయార్క్ రాష్ట్రంలో నాణాల తయారిలో బంగారం బదులు రాగిని ఉపయోగించాలన్న బ్రషర్ లక్ష్యం  మేరకు రూపుదిద్దుకున్న నాణెలు. అయితే బంగారానికి బదులుగా రాగి నాణెలు తయారుచేయాలన్న ఎఫ్రియం బ్రషర్ల ప్రతిపాదనను ఆ రాష్ట్రం ఒప్పుకోలేదు. బంగారు నాణెలనే చెలామణిలోకి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. అయితే  బ్రషర్ ప్రతిభావంతుడైన స్వర్ణకారుడు. అతను స్టేట్ చేసిన సూచనను విస్మరిస్తూ కొత్త నాణెలను ముద్రించాడు. వాటిలో ఎక్కువ భాగం కాంస్యంతో తయారు చేయబడ్డాయి. వాటిలో కొన్ని 22 క్యారెట్ల బంగారంతో కూడా తయారుచేశాడు. ఈ నాణెలు చాలా అరుదుగా లభిస్తాయి. అంతేకాదు ఆసక్తి గల  కథ వీటిపై ఉంటుంది. కాబట్టి, అవి చాలా విలువైనవి.  ఒక వాల్ స్ట్రీట్ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ 2011 లో  వేలంలో 7.4 మిలియన్ డాలర్లకు ఒక నాణెం కొనుగోలు చేసింది. 3.సెయింట్ గౌడెన్స్ బబుల్ ఈగిల్ (1907) ఖరీదు 7.6 మిలియన్ డాలర్లు(56,30,62,340 రూపాయలు) ఈ నాణాలను ఎక్కువ పరిమాణంలో ఉత్పత్తి చేయడం అనుకున్న దానికన్నా చాలా కష్టమని తేలింది. సంక్లిష్టమైన రూపకల్పన కారణంగా  వీటి ఉత్పత్తిని నిలిపివేశారు.  ఆ తర్వాత కొన్ని మార్పు చేశారు. యు.ఎస్. మింట్స్ చీఫ్ గా బాధ్యతలు నిర్వహించే చార్లెస్ బార్బర్ ఈ నాణెం పై దేవుడిని మేం విశ్వసిస్తున్నాం అన్న పదాలను తొలగించాడు. నాణెం మార్పులో,  తయారీ బాధ్యత పూర్తిగా అతనే తీసుకున్నాడు.  కానీ దీన్ని సమావేశంలో అంగీకరించలేదు. అయినప్పటికీ నాాణెం తయారీ మాత్రం ఆగలేదు.  ఇప్పుడు అది అత్యంత విలువైన నాణెంగా రికార్డు నెలకొల్పింది. 2. డబుల్ ఈగల్ (1933) ఖరీదు 7.6మిలియన్ డాలర్లు(56,30,62,340 రూపాయలు) డబుల్ ఈగిల్ 1933 అనేది యునైటెడ్ స్టేట్స్ 20 డాలర్ల బంగారు నాణెం. ఈ నాణెం రెండో ముద్రణ 1933లో జరిగింది. అయితే ఇవి చెలామణిలోకి రాలేదు. అప్పటివరకు సాధారణ ప్రజల మధ్య వాడకంలో ఉన్న ఈ నాణెలు కరిగించబడ్డాయి. అంతేకాదు అమెరికా అధ్యక్షుడైన థియోడర్ రూజ్‌వెల్ట్ ప్రజలు బంగారం కలిగి ఉండకుండా ఈ నాణాలను నిషేధించాడు. ఆ సమయంలో నెలకొనిఉన్న బ్యాంకింగ్ సంక్షోభానికి ఇది సహాయపడుతుందని అతను భావించాడు.  అయితే  కొద్ది మొత్తంలో ఈ నాణాలు ముద్రణాలయం నుంచి బయటకు వచ్చాయి.  ఏలా వచ్చాయి అన్నది మాత్రం స్పష్టం తెలియదు. కానీ, ఈ నాణాలను కలిగి ఉండటం అనేది చట్టవిరుద్ధం. ఎవరితోనైనా ఈ నాణెం ఉందని తెలస్తే దాన్ని వెంటనే స్వాధీనం చేసుకునేవారు. కానీ, ఎక్కడ నాణెలు ఉన్నాయి అన్నది తెలుసుకునే లోగానే ఇది ఒక కాయిన్స్ కలెక్టర్ వద్దకు చెేరింది. అవుతుంది. ఏదేమైనా, ఒక ప్రైవేట్ యజమాని ఒక నాణెం పొందగలిగాడు. ఇది మొదట ఈజిప్ట్ రాజు ఫరూక్ దగ్గర ఉండేది. ఆ తర్వాత ప్రైవేట్ వ్యక్తి దీన్ని పొందాడు. నాణెం  విక్రయించి లాభాలను యుఎస్ మింట్ కు తో విభజించాడు. ఏదీ ఏమైనా 4,455.,000 నాణెలు ముద్రించబడినప్పటికీ ఏదీ అధికారిక నాణెంగా వాడుకల్లోకి రాలేదు. 1. ఫ్లోయింగ్ హెయిర్ సిల్వర్, కాపర్ డాలర్ (1794) ఖరీదు 10 మిలియన్ డాలర్లు (74,21,43,500 రూపాయలు) ప్రపంచంలోనే అత్యంత విలువైన నాణెం ఇది. పరిశోధకుల అంచనా ప్రకారం వెండితో తయారుచేయబడిన మొదటి నాణెం ఇది.  యూఎస్ ఫెడరల్ ప్రభుత్వం చేత ముద్రించబడి ప్రజలకు అందుబాటులోకి వచ్చిన మొదటి వెండి నాణెంగా గుర్తింపు పొందింది. అంతేకాదు  2013 లో ఈ నాణెం మరో రికార్డు సాధించింది. ఇది ఇప్పటివరకు అమ్మకానికి వచ్చిన అతి ఖరీదైన సింగిల్ కాయిన్ గా ప్రపంచ కొత్త రికార్డును సృష్టించింది. వెండి నాణేల ముద్రణకు వెళ్ళేముందు మింట్ 1792లో ముద్రణకు సంసిద్ధం అయ్యింది.  రాగి, వెండి నమూనా నాణేలను మాత్రమే తయారు చేసింది. అయితే ఈ నాణాలను సేకరించేవారు ఈ చారిత్రాత్మక,  అత్యంత విలువైన నాణెంను 200 సంవత్సరాలకు పైగా సంరక్షించారు. నాణేల ముద్రణ వెనుక ఉన్న కథ దాని విలువను పెంచుతుంది. చాలా సార్లు అంతకన్నా ఎక్కువే ఉంటుంది.

కోపం ఒక శాపం!

ఓ ఊళ్లో ప్రశాంత్‌ అనే కుర్రవాడు ఉండేవాడు. అతను పేరుకి మాత్రమే ప్రశాంత్‌. కోపం మాత్రం ముక్కుమీదే ఉండేది. రోజూ ఎవరో ఒకరితో గొడవ పెట్టుకోవడం, అవతలి వాళ్ల వయసుకీ, వ్యక్తిత్వానికీ గౌరవం ఇవ్వకుండా నానా మాటలు అనడం… ఇదీ ప్రశాంత్‌ గుణం. ప్రశాంత్‌ చూడటానికి ముచ్చటగా ఉండేవాడు, ఏ పనిని మొదలుపెట్టినా సమర్థవంతంగా పూర్తిచేసేవాడు. కానీ ఏం లాభం! కోపం వస్తే విచక్షణ లేని పశువుగా మారిపోతాడు. ప్రశాంత్‌ గురించి ఊరంతా చెడుగా చెప్పుకుంటుంటే అతని తల్లిదండ్రులకు బాధగా ఉండేది. కానీ నయాన భయాన ఎంతగా నచ్చచెప్పినా వాళ్లు ప్రశాంత్‌లో మార్పుని తీసుకురాలేకపోయారు. చివరికి ప్రశాంత్‌ తండ్రికి ఓ ఉపాయం తట్టింది. ఆ సాయంత్రం ప్రశాంత్‌ను పిలిచి “ఎన్నిరోజులు ఎదురుచూసినా నీలో మార్పు రావడం లేదు బాబూ!” అన్నాడు దీనంగా. “ఏం చేసేది నాన్నా! కోపం వస్తే నన్ను నేను మర్చిపోతాను. కోపాన్ని అదుపుచేసుకోవడం నా వల్ల కావడం లేదు” అని అంతే దీనంగా బదులిచ్చాడు ప్రశాంత్‌. “సరే దీనికి నేనో ఉపాయాన్ని ఆలోచించాను విను. నీకు ఎప్పుడైతే కోపం వస్తుందో మన పెరటిగోడ దగ్గరకి వెళ్లి నీ బలమంతా ఉపయోగించి ఓ మేకుని కొట్టు. అలా నీ కోపం చల్లారుతుందేమో చూద్దాం” అన్నాడు తండ్రి. తండ్రి చెప్పిన ఉపాయం ప్రశాంత్‌కి నచ్చింది. తనకి కోపం వచ్చిన ప్రతి సందర్భంలోనూ పెరటిగోడ దగ్గరకి వెళ్లి తన కోపమంతా ఉపయోగించి ఓ మేకుని గోడలోకి కొట్టేవాడు. ఆశ్చర్యంగా, రోజులు గడుస్తున్న కొద్దీ అతనిలో తెలియని ఓ ప్రశాంతత అవహించింది. రోజురోజుకీ అతను కొట్టే మేకుల సంఖ్య తగ్గసాగింది. ఒకో రోజైతే అసలు మేకుని కొట్టాల్సిన అవసరమే రావడం లేదు! “నాన్నాగారూ! మీరు చెప్పిన ఉపాయం భలే పనిచేసింది. నాకు ఇప్పుడు కోపం వచ్చినప్పుడు అదుపు చేసుకోగలుగుతున్నాను” అన్నాడు ఓ రోజు ప్రశాంత్‌ తన తండ్రితో. “మంచిది! ఇప్పుడో పని చేద్దాం. నువ్వు ఒక రోజంతా నీ కోపాన్ని అదుపుచేసుకున్నప్పుడు, దానికి గుర్తుగా ఇప్పటివరకూ కొట్టిన మేకులలో ఒకదాన్ని బయటకి తీయి” అని సూచించాడు తండ్రి. “ఓస్‌ అదెంత భాగ్యం! తొందరలోనే ఆ గోడకి ఉన్న మేకులన్నీ ఖాళీ అయిపోతాయి చూడండి” అన్నాడు ప్రశాంత్‌ గర్వంగా. అన్నమాట ప్రకారమే కొన్నాళ్లకి ఆ మేకులన్నింటినీ బయటకు లాగిపారేసే అవకాశం వచ్చింది ప్రశాంత్‌కు. ఒక శుభదినాన ఆ గోడంతా ఖాళీ అయిపోయింది. ఆబగా తన తండ్రిని ఆ గోడ దగ్గరకు లాక్కువచ్చి “చూశారా నాన్నా! ఈ గోడ ఒకప్పటిలాగే ఉంది. నా కోపం మీద పూర్తిగా పైచేయి సాధించాను” అన్నాడు గొప్పగా! ప్రశాంత్‌ మాటలకు అతని తండ్రి చిరునవ్వు నవ్వుతూ “ఇంకొకసారి జాగ్రత్తగా చూడు బాబూ! ఈ గోడ ఒకప్పటిలాగానే ఉందా!” అని అడిగాడు. లేదు! ఆ గోడు ఒకప్పటిలా అందంగా లేదు. దాని మీద కొట్టిన మేకుల దెబ్బలకి గోడ మొత్తం తూట్లు పడిపోయి ఉంది. “మన కోపం కూడా ఇంతే బాబూ! కోపంలో మనం నానా మాటలూ అంటాం. విచక్షణ మర్చిపోయి ప్రవర్తిస్తాం. కానీ కాలం గడిచి ఆ కోపం చల్లారాక జరిగిన నష్టాన్ని నివారించలేం. అప్పటికే మనం అన్న మాటలు ఒకరి మనసుని నొప్పించి ఉంటాయి. మన ప్రవర్తన ఎవరికో బాధ కలిగించి ఉంటుంది. ఆ తరువాత నువ్వు ఎన్ని క్షమాపణలు వేడుకున్నా కాలాన్ని వెనక్కి మళ్లించలేవు కదా!” అన్నాడు అనునయంగా. తండ్రి మాటలతో తన ఒకప్పటి ప్రవర్తనను గుర్తుతెచ్చుకుని కుమిలిపోయాడు కొడుకు. 

ప్రపంచంలో ఖరీదైన నివాసభవనాలు

తల దాచుకోవడానికి చిన్న గూడైన ఉండాలనుకుంటారు సగటు మనుషులు. అయితే ప్రపంచంలోనే కుబేరుల జాబితాలో చేరిన కొందరి ఇళ్లు చూస్తే ఇంద్ర భవనమా.. దేవంద్ర భవనమా.. మయుడి వాస్తు కళా నైపుణ్యామా అన్న ఆశ్చర్యం కలుగుతుంది. అలాంటి కొన్ని ఇళ్ల విశేషాలు చూద్దాం... అంటిలియా - ముఖేశ్ అంబానీ ప్రపంచంలోనే లక్షలాది ఇండ్ల మాదిరిగా  అంటిలియా ను చూడలేం. వాటిలో ఒకటిగా లెక్కించలేం. ఎందుకంటే ఇది ప్రపంచంలోనే అతి ఖరీదైన గృహాల్లో రెండవది. దక్షిణ ముంబయిలో ఉండే ఈ ఇంటికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఇది భారతీయ బిలీయనీర్ ముఖేష్ అంబానీ, అతని కుటుంబ సభ్యుల రెడిడెన్సీ.  ఆంటీలియాను  డిజైన్ చేసింది చికాగో ఆర్కిటెక్ట్ పార్కిన్సన్ విల్. ఈ భవనాన్ని ఆస్ట్రేలియన్ కన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ హోల్డింగ్స్  నిర్మించారు. ఈ భవనంలో 27 అంతస్తులు ఉంటాయి.  అనేక ఆధునిక హంగులతో దీన్ని రూపొందించారు. ఇందులో సెలూన్, న్యూ మూవీ థియేటర్ ఐస్ క్రీమ్ పార్లర్, స్విమ్మింగ్ ఫూల్, జిమ్ ,స్పా లాంటివి ఆధునిక సదుపాయాలు ఉన్నాయి. ఇంటి ఖరీదు రెండు బిలియన్ డాలర్లు. ప్రపంచంలోనే అతి ఖరీదైన గృహాల్లో రెండోవ స్థానం సాధించిన ఈ ఇల్లు భారతదేశంలో అతి ఖరీదైన మొదటి గృహం. జెకె హౌస్,  గౌతమ్ సింఘానియా ఇప్పటి వరకు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇంటి టైటిల్‌ను అంటిలియా  సొంతం చేసుకుంది.  ఇప్పుడు భారతదేశానికి చెందిన మరో బిలియనీర్ కుటుంబం సింఘానియా  నివాసగృహం వెలుగులోకి వచ్చింది.   j.k కంపెనీ అధినేత విలాసవంతమైన, ఆధునిక హంగులు ఉన్న ఇంటిని నిర్మించుకున్నారు.  భారతీయ వ్యాపార సంస్థలలో అతి పెద్దదైన  jk పరిశ్రమల పేరుతో నిర్మించిన ఈ ఇల్లు అంటీలియా తర్వాత అత్యంత ఖరీదైన గృహంగా రికార్డు సొంతం చేసుకుంది.   16,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ఇంటిలో ఐదు ఫ్లోర్ల వరకు కార్ల పార్కింగ్ కోసమే వినియోగిస్తున్నారు.  పట్టణంలో ఉన్న ఉత్తమ కార్లను పార్క్ చేయడానికి మాత్రమే ఐదు ఫ్లోర్ల స్థలం ఉపయోగిస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు.. ఈ ఇల్లు, ఇంటిలోని వారు ఎంత రిచో.. మిగతా అంతస్తుల్లో  స్పా, స్విమింగ్ ఫూల్, జిమ్ వంటి వసతులతో పాటు  ఎంటర్ టైన్ మెంట్ కోసం ప్రత్యేక స్థలం ఉంది. అంతేకాదు సొంత హెలిప్యాడ్ కూడా ఉన్నాయి. జెకే సంస్థకు గౌతమ్ సింఘానియా, చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్.  ఈ సంస్థ  రేమండ్ గ్రూప్ గా ప్రసిద్ధి చెందింది. ఆయనకు  ఫాస్ట్ కార్లు,  ఆధునిక పడవలు,  లగ్జరీ రివేట్ జెట్‌లపై అమితమైన ఆసక్తి.  ఆధునిక సదుపాయాలతో కూడిన ఈ ఖరీదైన భవనం విలువ  సుమారు 6000 కోట్ల రూపాయలు ఈ ఖరీదైన గృహం  అంటిలియా తరువాత భారతదేశంలో రెండవ ఎత్తైన ప్రైవేట్ భవనం. అడోబ్, అనిల్ అంబానీ ముంబైలోని పాలి హిల్ ప్రాంతంలో ఉన్న అనిల్ అంబానీ ఇల్లు భారతదేశంలో అత్యంత ఖరీదైన  గృహాలలో ఒకటిగా  చెప్పవచ్చు. ఈ  ఎత్తైన భవనం ఫాన్సీ హెలిప్యాడ్ వంటి అత్యంత ఆధునిక సదుపాయాలతో నిర్మించారు.  ఈ భవనం 16,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ,  దాదాపు 70 మీటర్ల ఎత్తులో ఉంది.  ఈ విలాసవంతమైన ఇంటి విలువ సుమారు 5000 కోట్ల రూపాయలకు పైగా ఉంది.  అయితే ఈ విలాసవంతమైన భవనంలో నివసించే అనిల్ అంబానీ  జీవనశైలి మాత్రం చాలా సింపుల్ గా ఉంటుంది.  మన్నాట్, షారుఖ్ ఖాన్ ముంబయిలో ఉన్న మరో ఖరీదైన భవనం మన్నాట్. ఈ భవనం వార్తల్లోకి రావడానికి కారణం ఈ ఇంటి యజమాని ప్రముఖ బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ కావడం.  ఈ భవనం పై నుంచి  అరేబియా సముద్రం అందాలను వీక్షించే సదుపాయం ఉంది.  ఇది ముంబైలోని బాంద్రాలోని బ్యాండ్‌స్టాండ్ వద్ద ఉంది.  గ్రామీణ ప్రాంతంలోని ఇంటి సగటు పరిమాణం 497 చదరపు అడుగులు, ఇది వ్యక్తికి 103 చదరపు అడుగులు. అయితే మన్నాట్ లో మాత్రం సుమారు 225 మంది  నివసించవచ్చు. షారూఖ్ డ్రీమ్ హోమ్ అయిన ఈ భవనం ప్రపంచంలోని ఖరీదైన  గృహాల జాబితాలో 10 వ స్థానంలో ఉంది.  13.32 కోట్లతో షారూఖ్ ఈ ఇంటిని సొంతం చేసుకున్నారు. ఇప్పుడు దాని  విలువ 200 కోట్ల రూపాయలు.  స్కై హౌస్, విజయ్ మాల్యా కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యా   పెంట్ హౌస్ ఖరీదైన గృహాల జాబితాలో చోటు సాధించింది.  40,000 చదరపు అడుగుల స్థలంలో తన డ్రీమ్ హౌస్ ను  విజయ్ మాల్యా  నిర్మించుకున్నారు.  35 అంతస్తుల ఎత్తైన భవనంపై నిర్మించిన పెంట్ హౌస్ ఇది.   బెంగళూరు సిటీ నడిబొడ్డున ఉన్న ఈ భవనాన్ని కింగ్‌ఫిషర్ టవర్స్ -  నివాసం అంటారు. ఎత్తైన టవర్ల పైభాగంలో  నిర్మించిన ఆకాశ హర్మ్యం ఇది. దీన్ని  మాల్యా  వైట్ హౌస్, స్కై హౌస్ గా కూడా పిలుస్తారు.  ఎత్తైన టవర్ల పై స్విమింగ్ ఫూల్,  వైన్ సెల్లార్,  సెలూన్ , స్పా, జిమ్ తో పాటు అనేక ఇతర విలాసవంతమైన  సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయి. హెలిప్యాడ్ కూడా తప్పనిసరిగా ఉంటుంది. వాస్తవానికి పెంట్ హౌస్ లా కనిపించినప్పటికీ ఇది  ఒక పెంట్ హౌస్ కాదు, ఇది విల్లా కన్నా ఎక్కువ.  స్కై హౌస్ విలువ గతంలో   135 కోట్ల రూపాయలు. ఇప్పుడు విలువ 150 కోట్ల రూపాయలు.