చంద్రబాబు శ్రీసిటీ సందర్శన!

ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం నాడు సూళ్ళూరుపేట దగ్గర వున్న శ్రీసిటీ పారిశ్రామిక ప్రాంతాన్ని సందర్శించారు. శ్రీసిటీలోని బిజినెస్ సెంటర్‌లో పలు కంపెనీల సీఈవోలతో నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. పరిశ్రమల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుందని, ఈ సంపద సంక్షేమానికి దోహదం చేస్తుందని చెప్పారు. పారిశ్రామికవేత్తలు ఉపాధి, సంపద సృష్టిస్తున్నారని సీఎం చంద్రబాబు తెలిపారు.  "అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు చొరవతో 1991లో దేశంలో ఆర్థిక సంస్కరణలు మొదలయ్యాయి. పెట్టుబడులు రాబట్టేందుకు పలు దేశాల్లో పర్యటించాను. ఐటీ పరిశ్రమ భారతదేశాన్ని ప్రపంచ పటంలో నిలుపుతుందని ఆనాడే చెప్పాను. గతంలో ప్రైవేట్ పబ్లిక్ పార్టనర్‌షిప్ విధానంలో హైటెక్ సిటీ చేపట్టాను. ప్రపంచంలో ప్రతి నలుగురు ఐటీ నిపుణుల్లో ఒక భారతీయుడు ఉంటారు. ఇందులోని ప్రతి నలుగురిలో ఒక ఏపీ వ్యక్తి ఉంటారు. శ్రీసిటీలో 8 వేల ఎకరాల్లో పారిశ్రామిక జోన్లు ఏర్పాటయ్యాయి. సెజ్, డొమెస్టిక్ జోన్, ఫ్రీట్రేడ్ జోన్లు వచ్చాయి. 220 కంపెనీల ఏర్పాటుకు ఇక్కడ అవకాశం ఉంది. ఆటోమేటివ్, ఎలక్ట్రానిక్స్, ఎఫ్ఎంసీజీ పరిశ్రమలు వచ్చాయి. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు ఇక్కడ ఏర్పాటయ్యాయి. 4.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు, 4 బిలియన్ డాలర్ల ఎగుమతులు సాధించడం చాలా గొప్ప విషయం" అని చంద్రబాబు అన్నారు.  ‘‘చెన్నై, కృష్ణపట్నం, తిరుపతి ప్రాంతాలకు శ్రీసిటీ దగ్గరగా వున్న శ్రీసిటీని అత్యుత్తమ ఎకనమిక్ జోన్‌గా తయారు చేయాలనేది తన ఆలోచన అని చంద్రబాబు చెప్పారు. "శ్రీసిటీకి ఐ.జి.బి.సి. గోల్డెన్ రేటింగ్ గుర్తింపు వచ్చేలా కృషి చేస్తున్నాం. పచ్చదనం కోసం వందశాతం వర్షం నీటి సంరక్షణకు చర్యలు తీసుకుంటాం. శ్రీసిటీకి అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఉన్నాయి. అత్యంత అనుకూల నివాసయోగ్య ప్రాంతంగా మారుస్తాం. సహజంగా చల్లనివాతారవణం కల్పనకు చర్యలు తీసుకుంటాం. వీలైనంత వరకు ఉత్పత్తి, లాజిస్టిక్ ధరలు తగ్గించుకోవాలి. ఆ దిశగా ప్రభుత్వం కూడా చర్యలు చేపడుతుంది. కొత్త రాజధాని అమరావతి నిర్మాణం చేపడుతున్నాం. ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం 29 వేల మంది రైతులు 34 వేల ఎకరాలు ఇచ్చారు. పరిశ్రమలు వినూత్న ఆలోచనలతో ముందుకు రావాలని కోరుతున్నా. 2029 నాటికి భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుంది. విజన్ 2047 ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం. 2047 నాటికి ఒకటి లేదా రెండు స్థానాల్లో భారత్ నిలుస్తుంది" అని చంద్రబాబు అన్నారు.

నేను సుద్దపూసని.. ఇట్లు సిద్దరామయ్య!

మైసూరు నగరాభివృద్ధి సంస్థ (ముడా) కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య మీద విచారణ జరపడానికి గవర్నర్ ఉత్తర్వులు ఇవ్వడం కర్నాటకలో రాజకీయ కలకలం రేపింది. ఈ నేపథ్యంలో సిద్దరామయ్య వివరణ ఇచ్చారు. ‘‘బీజేపీ ఆదేశాల ప్రకారం పనిచేసే గవర్నర్ నిర్ణయం నాకేమీ ఆశ్చర్యాన్ని కలిగించలేదు. నా 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో నేను ఎలాంటి తప్పూ చేయలేదు. రాజకీయాల్లో ఇలాంటి సవాళ్ళు ఎదురైనప్పుడు నాలో జోష్ మరింత పెరుగుతుంది. నా రాజకీయ జీవితం తెరిచిన పుస్తకం. ఇప్పటి వరకు ఏ తప్పూ చేయని నేను భవిష్యత్తులో కూడా తప్పు చేయను. నా ప్రతిష్ఠని దెబ్బతీయడానికి బీజేపీ, జేడీఎస్ కుట్ర పన్నాయి. ఈ కేట్రను నేను రాజకీయంగా, న్యాయపరంగా ఎదుర్కొంటాను. నన్ను నాశనం చేస్తే కాంగ్రెస్ పార్టీ మొత్తం నాశనం అవుతుందనే భ్రమలో ప్రతిపక్షాలు వున్నాయని సిద్దరామయ్య అన్నారు. మహారాష్ట్ర, ఝార్ఖండ్, ఢిల్లీ తరహాల్లోనే కర్నాటకలోనూ ప్రభుత్వాన్ని అస్థిపరిచడానికి కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది’’ అన్నారు. ‘ముడా’ వ్యవహారంలో తాను రాజీనామా చేయాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.

అయ్యబాబోయ్.. అయ్యబాంబోయ్!

ఉత్తర ఐర్లాండ్‌లోని కౌంటీ డౌన్ ప్రాంతంలో వున్న న్యూ టౌనార్డ్స్ పట్టణంలో ఒక పెద్దమనిషికి టౌన్ మధ్యలో ఒక స్థలం వుంది. ఆ స్థలంలో తన డ్రీమ్ హోమ్ నిర్మించుకోవాలని ఆ పెద్దమనిషి అనుకున్నాడు. అనుకున్న వెంటనే ఆ స్థలాన్ని భవన నిర్మాణం కోసం చదును చేయడం ప్రారంభించాడు. ఇంతలో భూమిలోనుంచి ఒక పెద్ద ఇనుప వస్తువు బయటపడింది. ఈ వస్తువు ఏంటా అని ఆ వ్యక్తి దాన్ని పగులగొట్టి తెలుసుకోవాలని ప్రయత్నిస్తూ వుండగా, ఆ వస్తువుని మిలట్రీలో పనిచేసి రిటైరైన ఒక సీనియర్ సిటిజన్ చూసి కెవ్వుమని అరిచాడు. దాన్ని పగలగొట్టకండ్రా బాబూ అని అరిచాడు. ఆ తర్వాత అందరికీ అర్థమైన విషయం ఏమిటంటే, ఆ వస్తువు మరేదో కాదు.. రెండో ప్రపంచ యుద్ధం సందర్భంగా పేలకుండా భూమిలో మిగిలిపోయిన బాంబు. పొరపాటున ఆ బాంబుని ఆ స్థలం ఓనర్ పగలగొట్టినట్టయితే ఆ టౌన్‌లో సగం భస్మీపటలం అయిపోయి వుండేది. స్థలం ఓనర్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు అక్కడకి వచ్చారు. భూమిలోంచి బయటపడింది రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి పేలని బాంబు అని కన్ఫమ్ చేశారు. దానిని పగలగొట్టడం కాదు.. కదిల్చినా పేలిపోయే అవకాశం వుంది కాబట్టి, ముందుగా దాన్ని జాగ్రత్తగా  నిర్వీర్యం చేసిన తర్వాతే అక్కడ నుంచి తొలగించాలని నిర్ణయించారు. దీని కోసం ఆ బాబుకు చుట్టుపక్కల 4 వందల మీటర్ల చుట్టుకొలతలో వున్న ఇళ్ళన్నిటినీ ఖాళీ చేయించి వాళ్ళని పునరావాస కేంద్రాలకి తరలించారు. ఇళ్ళ ఓనర్లు కొంతమంది మా ఇల్లు వదిలిపెట్టి మేం వెళ్ళం అని భీష్మించుకుని కూర్చున్నారు. అప్పుడు పోలీసులు.. ‘‘మీ మొహాలు మండ.. బాంబుని నిర్వీర్యం చేసే ప్రయత్నంలో వుండగా అది పేలిందంటే, మీ ఇళ్ళతోపాటు మీరూ పోతారు’’ అని చెప్పి వాళ్ళని నయానో భయానో ఒప్పించి తరలించారు. ఇంకా బాంబుని నిర్వీర్యం చేయలేదు. సేఫ్‌గా చేస్తారని ఆశిద్దాం.

ఈ రక్షాబంధనం.. ఈ ఇద్దరికీ శిక్షాబంధనం!

సోమవారం నాడు దేశమంతటా రక్షాబంధన వేడుకలు ఆనందోత్సాహాలతో జరుగుతున్నాయి. సోదర, సోదరి ప్రేమకు, అనురాగానికి, ఆప్యాయతలకు తార్కాణంగా నిలిచే ఈ రక్షాబంధనం రోజున సోదరీమణులు సోదరులకు రాఖీ కట్టడం, సోదరులు బహుమతులు ఇచ్చి వారిని సంతోషపరచడం సంప్రదాయం. అసలు రక్షాబంధనం అంటే, సోదరుడి చేతికి రక్ష కట్టే సోదరికి, ఆ సోదరుడు రక్షగా నిలుస్తాడు అనే సందేశాన్ని ఇవ్వడం. ఈరోజు దేశంలో చాలామందికి రక్షాబంధనం.. కానీ ముఖ్యంగా ఇద్దరికి మాత్రం ఈరోజు ‘శిక్షాబంధనం’. ఆ ఇద్దరు ఎవరో కాదు... ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి, తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్. జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల, కేటీఆర్ సోదరి కల్వకుంట్ల కవిత ప్రతి ఏడాదీ తమ అన్నలకు రాఖీలు కట్టేవారు. ఆ ఫొటోలను మీడియాకి విడుదల చేసేవారు. ఆ ఫొటోల్లో అన్నాచెల్లెళ్ళ అనుబంధం చూసి అందరికీ కడుపు నిండిపోయేది. ‘‘ఒక కొమ్మకు పూచిన పువ్వులం.. అనురాగం మనదేలే! ఒక గూటికి చెందిన గువ్వలం మమకారం మనదేలే... అన్నయ్యా.. చెల్లెమ్మా...’’ అనే పాట అందరి చెవుల్లోనూ మార్మోగేది. కానీ ఈ ఏడాది మాత్రం ఈ రెండు కాంపౌండ్లలో అలాంటి సందడి ఏమీ వినిపించని పరిస్థితి. ఈ ఏడాది షర్మిల తన సోదరుడు జగన్మోహన్ రెడ్డికి రాఖీ కట్టే పరిస్థితి లేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవర్ని అడిగినా చెబుతారు. జగన్మోహన్‌డ్డి రాష్ట్రంలో  మహిళలందర్నీ నా అక్కచెల్లెళ్ళు అంటారుగానీ, సొంత చెల్లి చేత మాత్రం ఛీ కొట్టించుకున్నారు. మొన్నటి ఎన్నికలలో జగన్ ఓడిపోవడానికి గల అనేక కారణాలలో చెల్లెమ్మ షర్మిలమ్మ ఫ్యాక్టర్ కూడా ఒకటి. ఆస్తి గొడవలు, బాబాయ్ హత్య, రాజకీయంగా ఎంతో ఉపయోగపడిన షర్మిలను పక్కన పెట్టడం.. ఇవన్నీ అన్నాచెల్లెళ్ళ మధ్య బంధాన్ని తెంచేశాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో అందరికంటే పెద్ద శత్రువులైన అన్నాచెల్లెళ్ళు ఎవరయ్యా అంటే వినిపించే పేర్లు జగన్, షర్మిల.  ముఖ్యమంత్రిగా వున్నంతకాలం చెల్లెలి విలువ తెలియని జగన్ ఆమెని ఎంతమాత్రం లెక్కచేయలేదు. ఓడిపోయిన తర్వాత మాత్రం చెల్లెలి మీద జగన్‌కి ఆప్యాయత, అనురాగాలు ముంచుకొచ్చాయి. షర్మిల తనకు దూరంగా వుంటే వచ్చే ఎన్నికలలో కూడా డేంజరేనని అర్థం చేసుకున్న జగన్, ఆమెతో అనుబంధాన్ని మళ్ళీ పెంచుకోవడానికి ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు. కానీ, షర్మిల జగన్‌ని ఎంతమాత్రం నమ్మడం లేదు. అన్నయ్యకి దగ్గరయ్యే ఆలోచన చేయడం లేదు. గతంలో ఎన్నోసార్లు షర్మిలతో సఖ్యత కోసం ప్రయత్నాలు చేసి ఫెయిల్ అయిన జగన్, రాఖీ పండుగ సందర్భంగా మరోసారి తన తల్లి విజయమ్మతో రాయబారం నడిపినట్టు తెలుస్తోంది. చెల్లి ఈసారి తనకు రాఖీ కడితే, మళ్ళీ గతంలో లాగా వుందాం. ఆమె డిమాండ్లను నెరవేర్చడానికి ప్రయత్నిస్తాను అంటూ  విజయమ్మతో షర్మిలమ్మకి జగన్ రాయబారం పంపినట్టు తెలుస్తోంది. అయితే, ఈసారి కూడా షర్మిల రాజీ ప్రతిపాదనను తిరస్కరించినట్టు సమాచారం. రక్షాబంధనాన్ని తిరస్కరించడం ద్వారా షర్మిల జగన్‌కి తగిన శిక్ష విధించిందని భావించవచ్చు. ఇక మరో అన్నాచెల్లెళ్ళు కేటీఆర్, కల్వకుంట్ల కవిత. పాపం ఈ ఏడాది కవితకు ‘రక్షాబంధన’ కాకుండా ‘శిక్షాబంధన్’ అయి కూర్చుంది. ఆమె ఈ ఏడాది పుట్టినరోజు చేసుకున్న మర్నాడే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టు చేసి తీహార్ జైల్లో వేశారు. ఆమె ప్రతిసారీ బెయిల్ అప్లికేషన్ పెట్టుకోవడం.. అది రిజెక్టు కావడం టీవీ సీరియల్ తరహాలో కొనసాగుతోంది. తీహార్ జైల్లో అంతులేని ఆవేదనలో వున్న కవిత ఈసారి రాఖీ పండుగ చేసుకోకూడదని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. కేటీఆర్‌ని రాఖీ పండుగ కోసం జైలుకు రావొద్దని కూడా చెప్పినట్టు సమాచారం. కవిత ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక జైల్లో వున్నానన్న బాధతోపాటు, తనను త్వరగా విడుదల చేయించడం కోసం తన అన్న కేటీఆర్ పెద్దగా కృషి చేయడం లేదన్న ఆవేదన కూడా కారణమని తెలుస్తోంది. 

పదవిలోకి బొత్స.. జగన్ చేతికి బొచ్చె!

బొత్స సత్యనారాయణ విశాఖ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ కావడం ఇక లాంఛనమే. తెలుగుదేశం పోటీ నుంచి తప్పుకోవడంతో బొత్సకు లైన్ క్లియర్ అయ్యింది. అంత వరకూ ఓకే కానీ..  బొత్స ఎమ్మెల్సీ కావడం వైసీపీకి మాత్రం తీరని నష్టమే అన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఆ ప్రచారం చేస్తున్నది వైసీపీ ఉత్తరాంధ్ర నేతలూ, శ్రేణులే కావడం ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇంతకీ బొత్సకు జగన్ విశాఖ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడం, ఇంతకాలం అంటే జగన్ అధికారంలో ఉన్నంత కాలం విశాఖలో చక్రం తిప్పిన నేతలకు ఇసుమంతైనా ఇష్టం లేదు. అయితే తెలుగుదేశం కూడా పోటీ చేస్తుంది. అధికారంలో ఉండటం వల్లనో, ప్రజా వ్యతిరేకత కారణంగా పెద్ద సంఖ్యలో స్థానిక సంస్థలలో వైసీపీ ప్రజా ప్రతినిథులుగా ఉన్న వారు గోడ దూకేసీ కూటమికి మద్దతు పలుకుతారన్న భావనతో వారు బొత్స ఓటమి తథ్యమని భావించారు. ఆ కారణంగానే ఉత్తరాంధ్ర జిల్లాల వైసీపీ ఇన్ చార్జ్ వైవీ సుబ్బారెడ్డి వంటి వారు బొత్స నామినేషన్ కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి విశాఖ నుంచి కంటే బొత్స సొంత జిల్లా విజయనగరం నుంచే ఎక్కువ మంది హాజరయ్యారు. దీనిని బట్టే విశాఖలో బొత్స ఎంట్రీని ఆ జిల్లా వాసులు ఎంతగా వ్యతిరేకిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పడనే కాదు.. ఎన్నికలకు ముందు కూడా జగన్ బొత్సను నమ్మారు కానీ విశాఖ వైసీపీ నేతలను పెద్దగా నమ్మలేదు. అందుకే విశాఖ ఎంపీ స్థానానికి బొత్ సతీమణినే నిలబెట్టారు. ఆమె ఘోరంగా ఓడిపోయారనుకోండి అది వేరే విషయం. కానీ బొత్స సతీమణిని విశాఖ ఎంపీగా నిలబెట్టడం ద్వారా జగన్ బొత్స సత్యనారాయణ తన అధికార, వ్యాపార సామ్రాజ్యాన్ని విశాఖకు, అలాగే శ్రీకాకుళం జిల్లాకు విస్తరించుకునేందుకు జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారనే చెప్పొచ్చు. ఎందుకంటే ఎన్నికలలో గెలుపు ఓటములతో సంబంధం లేకుండా బొత్స రాజకీయంగా, వ్యాపారాల పరంగా విజయనగరం జిల్లాలో పాతుకు పోయారు. ఇసుక, క్యారీలు, మద్యం, రియల్ ఇలా ఏ రంగం తీసుకున్నా బొత్స కుటుంబానిదే మొత్తం ఆధిపత్యం. ఇక రాజకీయంగా ఆయన జిల్లాలో  బొత్స ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వైఎస్ హయాం నుంచీ కూడా బొత్స హవా విజయనగరం జిల్లాలో నడుస్తూనే ఉంది. రాష్ట్ర విభజన తరువాత జరిగిన తొలి ఎన్నికలలోనూ, ఆ తరువాత ఇటీవల జరిగిన ఎన్నికలలో మాత్రమే బొత్స, ఆయన కుటుంబ సభ్యులు పరాజయం పాలయ్యారు.   విజయనగరం జిల్లాలో అంతగా పాతుకు పోయిన బొత్స  విశాఖలోపై కూడా ఆధిపత్యం చెలాయించే అవకాశాన్ని జగన్ ఇచ్చారు. అందుకే లోక్‌సభ ఎన్నికలలో ఆయన సతీమణిని విశాఖ రప్పించి పోటీ చేయించారు. కానీ గాలివాటం మారడంతో ఆమె ఓడిపోయారు. సరే విశాఖ జిల్లాలో వైసీపీకి ఇటీవలి ఎన్నికలలో జీరో రిజల్టే వచ్చింది. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ సహా వైసీపీ నుంచి పోటీ చేసిన వారంతా పరాజయం పాలయ్యారు. అయినా వారికి ఉన్న రాజకీయ నేపథ్యం కారణంగా విశాఖ స్థానిక సంస్థల కోటా ఎమ్మోల్సీ కోసం పోటీ పడ్డారు. జగన్ బోత్సను ప్రమోట్ చేయడాన్ని వ్యతిరేకించారు. పోటీ అంటూ జరిగితే సహాయ నిరాకరణకు కూడా రెడీ అయ్యారు. అయితే అనూహ్యంగా తెలుగుదేశం కూటమి పోటీ నుంచి తప్పుకోవడంతో బొత్స ఎన్నిక ఏకగ్రీవం అయిపోయింది.  బొత్సకు విజయం ఎలా దక్కిందన్నది పక్కన పెడితే ఇప్పుడు శ్రీకాకుళం, విజయగనరం, విశాఖ జిల్లాలపై బొత్స ప్రభావం, పెత్తనం కచ్చితంగా ఉంటుంది. అంటే ఉత్తరాంధ్ర వైసీపీకి ఇప్పుడు ముఖచిత్రంగా బొత్స మారిపోయారు.  బొత్సకు ఎమ్మెల్సీ ఇవ్వడం ద్వారా వచ్చే ఎన్నికల నాటికి ఉత్తరాంధ్రలో వైసీపీ బలోపేతం అన్న బాధ్యతను జగన్ బొత్సకు అప్పగించారు. అయితే రాష్ట్ర రాజకీయాలలో వేగంగా చోటుచేసుకుంటున్న మార్పులను బట్టి చూస్తే జగన్ తన పార్టీని అంత కాలం ఎలాంటి పొత్తులూ లేకుండా నడిపే అవకాశం ఇసుమంతైనా లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే జగన్ కాంగ్రెస్ కు దగ్గరకావడానికి డిస్పరేట్ గా ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రయత్నాలు ఫలిస్తే బొత్సకు కాంగ్రెస్ నాయకులతో ఉన్న పరిచయాల ద్వారా జగన్ ను అధిగమించి సొంతంగా నిర్ణయాలు తీసుకోవడానికే ఎక్కువ అవకాశలు ఉన్నాయని రాజకీయవర్గాలలో జోరుగా చర్చ జరుగుతోంది. వైసీపీ కాంగ్రెస్ లో విలీనమైనా, ఆ పార్టీతో పొత్తు పెట్టుకుని కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నాలు చేసినా బొత్స రాజకీయ నిర్ణయం తీసుకునే అవకాశాలే మెండుగా ఉన్నాయని అంటున్నారు. తన విధేయత జగన్ పట్ల కాదనీ, వైఎస్ పట్ల అనీ ప్రకటించి బొత్స షర్మిల పంచన చేరినా ఆశ్చర్య పోవలసిన అవసరం లేదంటున్నారు. ఒక విధంగా విశాఖ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో జగన్ బొత్సకు పార్టీ టికెట్ ఇవ్వడం ద్వారా ఉత్తరాంధ్రలో పార్టీ మొత్తాన్ని పువ్వుల్లో పెట్టి బొత్సకు అప్పగించారనీ, ఇక ఉత్తరాంధ్రపై జగన్ రాజకీయం నడవదనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

అవాస్తవ వార్త ప్రసారం చేసిన మీడియా సంస్థకు బిఆర్ఎస్ నోటీసులు 

బీజేపీలో బీఆర్‌ఎస్‌ విలీనం అవుతుందని ఫేక్‌ వార్తలు ప్రచారం చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆర్టీవీ న్యూస్‌ నెట్‌వర్క్‌ సంస్థకు, రవి ప్రకాశ్‌కు బీఆర్‌ఎస్‌ పార్టీ లీగల్‌ నోటీసులు పంపింది. ఐదు రోజుల్లోగా నోటీసులకు సమాధానాలు ఇవ్వాలని, విలీనం వార్తలను ఆర్టీవీ నెట్‌ వర్క్‌ వెంటనే తొలిగించాలని, భేషరతుగా క్షమాపణలు చెప్పాలని పేర్కొన్నది. లేదంటే లీగల్‌ చర్యలు తీసుకుంటామని బీఆర్‌ఎస్‌ తన నోటీసుల్లో పేర్కొన్నది. గత పదేళ్ల నుంచి బీజేపీతో బీఆర్‌ఎస్‌ విభేదిస్తున్న విషయాన్ని నోటీసులో పేర్కొన్నది. కానీ ఆర్టీవీలో ప్రచారం చేసిన అసత్య ప్రచారంతో బీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలు, ప్రజలు ప్రభావితమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ అసత్య ప్రచారంతో బీఆర్‌ఎస్‌ ప్రతిష్ఠ దెబ్బతిన్నదని తెలిపింది. బీఆర్‌ఎస్‌పై ఆర్టీవీలో ప్రచారం చేసిన అసత్య ప్రచారాలకు సంబంధించిన యూట్యూబ్‌ లింక్‌లను నోటీసుల్లో పేర్కొన్నది.  ఆర్టీవీ ప్రసారం చేసిన తర్వాతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిఆర్ఎస్, బిజెపిలో విలీనం కానుందన్న వార్త నిజమేనన్నారు. బిఆర్ఎస్ అధ్యక్షుడు కెసీఆర్ కు గవర్నర్ పదవి, వర్కింగ్ ప్రెసిడెంట్ కెటీఆర్ కు  కేంద్ర మంత్రి పదవి ఇవ్వనున్నట్లు  చేసిన ప్రకటనతో బిఆర్ఎస్ పూర్తిగా డిఫెన్స్ లో పడిపోయింది. ఒక వేళ విలీనమైతే బిఆర్ఎస్ ఆస్తులు బిజెపికి ఇచ్చేయాల్సి ఉంటుందని కథనాలు వెలువడ్డాయి. అధికారమే పరమావధిగా పని చేస్తున్న కారు పార్టీకి ఫోర్త్ పిల్లర్ అయిన మీడియా పట్ల ఎలాంటి గౌరవం లేదని పలుమార్లు నిరూపించుకున్నారు. అలాగే కెసీఆర్ కు న్యాయవ్యవస్థ పట్ల కూడా నమ్మకం లేదు. సుప్రీం తీర్పులను డస్ట్ బిన్ లో పడేసి పాలన చేసిన బిఆర్ఎస్ ను ప్రజలు అథోపాతాళానికి తొక్కేశారు. అయినప్పటికీ కెసీఆర్ తన అహంకారాన్ని వీడటం లేదు. 

కేటీఆర్ వర్సెస్ హరీష్.. బీఆర్ఎస్ దారెటు?

అధికారం కోల్పోయినప్పటి నుంచీ బీఆర్ఎస్ సంక్షోభం నుంచి సంక్షోభంలోకి కూరుకుపోతున్నది. ఆ పార్టీ అధినేత కాడె వదిలేసినట్లు కనిపిస్తోంది. దీంతో పార్టీలో ఆధిపత్య పోరు ప్రారంభమైనట్లు పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ముఖ్యంగా రెండవ శ్రేణి నాయకత్వం, క్యాడర్ మాజీ మంత్రి హరీష్ రావు  వెనుక ర్యాలీ అవుతుంటే.. బీఆర్ఎస్ కార్య నిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ పార్టీలో తన స్థానాన్ని, ఆధిపత్యాన్నీ, నంబర్ 2 స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి పావులు కదుపుతున్నారు. దీంతో బీఆర్ఎస్ హరీష్, కేటీఆర్  వర్గాలుగా నిలువునా చీలిపోనుందా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల్లోనే వ్యక్తం అవుతున్నాయి. మొత్తం మీద చాపకింద నీరుగా  బీఆర్ఎస్ లో అంతర్గత పోరు షురూ అయ్యి విస్తరిస్తోందని  గత కొద్ది రోజులుగా  పార్టీలో చోటు చేసుకుంటున్న వరుస పరిణామాలు ఉదహరిస్తూ  పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  మాజీ మంత్రి హరీష్ టార్గెట్ గా కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నా.. బీఆర్ఎస్ నుంచి హరీష్ రావుకు పెద్దగా మద్దతు లభించడం లేదు. సిద్దిపేటలో హరీష్ రావు రాజీనామా చేయాలంటూ ఫ్లెక్సీలు, పోస్టర్లూ వెలిసినా, కేటీఆర్ కానీ, బీఆర్ఎస్ నేతలు కానీ పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు.   రైతు రుణమాఫీ విషయంలో హరీష్ రావు రాజీనామా చేయాలని, లేదంటే అమరవీరుల స్థూపం వద్ద ముక్కు నేలకు రాయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించడానికి బీఆర్ఎస్ నుంచి ఎవరూ పెద్దగా ఉత్సాహం చూపలేదు. మరీ ముఖ్యంగా కేటీఆర్ అసలు స్పందించ లేదు.  దీంతో తనపై రేవంత్ చేసిన వ్యాఖ్యలకు హరీష్ రావే స్వయంగా కౌంటర్ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఈ పరిణామాలను గమనిస్తున్న పరిశీలకులు బీఆర్ఎస్ లో వర్గపోరు ఆరంభమైందనీ, ఇది కేటీఆర్ వర్సెస్ హరీష్ రావుగా రూపాంతరం చెందడానికి పెద్దగా సమయం తీసుకునే అవకాశాలు లేవనీ అంటున్నారు.  మరో వైపు కాంగ్రెస్ కూడా కేటీఆర్ ను పెద్దగా పట్టించుకోకుండా హరీష్ నే టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించడాన్ని చూస్తుంటే.. పార్టీ బలం కేటీఆర్ కాదు, హరీష్ రావే అని అధికార పార్టీ భావిస్తున్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. సరిగ్గా ఇదే సమయంలో గతంలో అంటే పార్టీ శాసనసభా పక్ష నేతగా కేటీఆర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకునే విషయంలో బీఆర్ఎస్ విఫలం అయి4న సంగతిని గుర్తు చేస్తున్నారు. పార్టీ శ్రేణులు హరీష్ నాయకత్వం వైపే మొగ్గు చూపుతున్నాయనడానికి ఇదే నిదర్శనమని చెబుతున్నారు.  అన్నిటికీ మించి బీఆర్ఎస్ లో కేసీఆర్ కు ప్రత్యామ్నాయంగా హరీష్ ను ఫోకస్ అవుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందుకే హరీష్ రావుపై సీఎం రేవంత్, మంత్రులు, కాంగ్రెస్ నేతల విమర్శలు, వ్యాఖ్యలపై కేటీఆర్ మౌనం వహిస్తున్నారని అంటున్నారు.  

తెలంగాణలో అతిపెద్ద సైబర్ మోసం.. రూ. 8.6 కోట్లు నష్టపోయిన డాక్టర్ !

తెలంగాణలో అతిపెద్ద సైబర్ మోసం జరిగింది.  ఈ మోసంలో  హైదరాబాద్ కు చెందిన ఓ  డాక్టర్ ఏకంగా రూ. 8.6 కోట్లు మోసపోయాడు. తనను చీట్ చేసిన వైనాన్ని డాక్టర్ పోలీసులకు ఫిర్యాదుచేశాడు తెలంగాణలో నమోదైన బిగ్గెస్ట్  సైబర్ క్రైం ఇదేనని పోలీసులు అంగీకరిస్తున్నారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో కి బాధితుడు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.మే 21న వైద్యుడి ఫేస్‌బుక్‌లో ఓ స్టాక్ బ్రోకింగ్ కంపెనీ పేరిట ప్రకటన కనిపించింది. దీంతో అందులోని వివరాలను నింపాడు. ఆ వెంటనే కంపెనీ ప్రతినిధులమంటూ కొందరు వైద్యుడిని సంప్రదించి ఆయన ఫోన్ నంబరును నాలుగు వాట్సాప్ గ్రూపుల్లో చేర్చారు. ప్రముఖ కంపెనీల తరపున స్టాక్ బ్రోకర్లుగా తాము వ్యవహరిస్తున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా ఆయా సంస్థలు వివరాలు చెప్పాలని డాక్టర్  అడిగితే అవి రహస్యమని, చెప్పడం కుదరదని స్పష్టం చేశారు. ఆ తర్వాత నాలుగు సంస్థల పేరిట యాప్ లింకులను పంపి వాటిలో డబ్బులు  పెట్టుబడి పెట్టమన్నారు. ఆ తర్వాత వచ్చిన లాభాలను ఎప్పటికప్పుడు ఉపసంహరించుకోవచ్చని కూడా చెప్పారు. దీంతో పలుమార్లు పెట్టుబడులు పెట్టిన వైద్యుడు లాభాలను కూడా ఉపసంహరించుకున్నాడు. దీంతో వారిపై మరింత నమ్మకం కుదరడంతో విడతల వారీగా ఏకంగా రూ. 8.6 కోట్లు పెట్టుబడిగా పెట్టాడు. కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిన తర్వాత లాభాల ఉపసంహరణకు వైద్యుడు ప్రయత్నించగా కుదరలేదు. లాభాల్లో 20 నుంచి 30 శాతం చెల్లిస్తేనే వాటిని ఉపసంహరించుకునే అవకాశం ఉందని చెప్పడంతో వైద్యుడు షాకయ్యాడు. ఆపై కస్టమర్ కేర్‌ను సంప్రదించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోవడంతో తాను మోసపోయినట్టు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.ఈజీగా డబ్బు సంపాదించవచ్చనో, కమిషన్‌కు ఆశపడో తమ బ్యాంకు ఖాతాలను సైబర్ క్రిమినల్స్‌కు అప్పగించే వారిని ‘మనీ మ్యూల్స్’గా వ్యవహరిస్తారు. డాక్టర్  మొత్తంగా 63 విడతల్లో బదిలీ చేసిన నగదులో కొంతమొత్తం కరీంనగర్‌ జిల్లా వీణవంక బ్యాంకుకు చేరగా.. మిగతా మొత్తం విశాఖపట్టణం, కడప, ముంబై, ఢిల్లీ, థానే, చెన్నై, లక్నో, ఝాన్సీ, ఇండోర్, లుథియానాతోపాటు హరియానాలోని కొన్ని ప్రాంతాల్లోని మ్యూల్ ఖాతాలకు వెళ్లినట్టు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

మంగళగిరి ఎయిమ్స్ లో తాగునీటి సమస్య.. చిటికెలో పరిష్కారం!

నారా చంద్రబాబు నాయుడు సమస్యల పరిష్కారం విషయంలో అనితర సాధ్యమైన వేగంతో ఉంటారు. జగన్ హయాంలో పరిష్కారానికి నోచుకోకుండా రోగులను నానా యాతనా పెట్టిన మంగళగిరి ఎయిమ్స్ లో తాగునీటి సమస్యను చంద్రబాబు అధికారంలోకి రాగానే చిటికెలో పరిష్కారం చూపారు. మంగళగిరి ఎయిమ్స్ లో తాగునీటి పరిష్కారం కోసం ప్రభుత్వ చొరవ కారణంగా పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ ఎయిమ్స్ పైపులైన్లు వేయడానికి అనుమతి మంజూరు చేసింది.  ఇదే గత వైసీపీ ప్రభుత్వం అసలు మంగళగిరి ఎయిమ్స్ ఆసపత్రిలో తాగునీటి సమస్య పరిష్కారం కోసం అసలు ప్రయత్నమేదీ చేయలేదు. బాధలు పడేది ప్రజలే కదా అన్నట్లుగా నిర్లక్ష్యంగా వ్యవహరించింది.  ఫలితంగా ఎయిమ్స్ ఆసుపత్రికి వచ్చే రోగులు దాహార్తితో నానా బాధలూ పడ్డారు. జగన్ సర్కార్  ఎయిమ్స్ కు తాగునీటి సమస్య లేకుండా పైప్ లైన్లు వేయడానికి అవసరమైన అనుమతులు తీసుకోకుండానే పనులు చేపట్టింది.  ఏదో విధంగా స్టేజ్ 1 అనుమతులు తీసుకున్నప్పటకీ రోడ్డు కట్టింగ్ చార్జీలు చెల్లించకపోవడంతో కేంద్ర ప్రభుత్వం పనులను ఆరంభిం చేందుకు అనుమతులు ఇవ్వలేదు. దీంతో  జగన్ హయాంలో ఎయిమ్స్ కు వచ్చే రోగులు తాగునీటి కోసం కటకటలాడారు. వాళ్లే కాదు వైద్య విద్యార్థులు, ప్రొఫెసర్లు, వైద్యులూ కూడా సమస్యలు ఎదుర్కొ న్నారు. అయితే ఎప్పుడైతే చంద్రబాబు అధికార బాధ్యతలు చేపట్టారు.. ఆ క్షఏణం నుంచీ మంగళగిరి ఎయిమ్స్ కు తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారంపై దృష్టి పెట్టారు. ఎయిమ్స్  డైరెక్టర్ డాక్టర్ మధుబనంద భాకర్ చంద్రబాబును కలిసి సమస్యను వివరించిన వెంటనే  ఈ సమస్యకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన చంద్రబాబు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ అధికారులతో పర్సనల్ గా మాట్లాడారు.   చంద్రబాబు స్వయంగా చొరవ చూపడంతో  సమస్య చిటికెలో పరిష్కారం అయ్యింది.  కేంద్ర ప్రభుత్వం రెండో దశ పనులకు అనుమతి ఇచ్చేసింది. ఇందుకు సంబంధించిన జీవో నేడో రేపో విడుదల కానుంది. 850 మీటర్ల పైప్ లైన్ ద్వారా ఎయిమ్స్ కు తాగునీటి సమస్య శాశ్వతంగా పరిష్కారం కానుంది.

వైసీపీని వదిలేశాడని చంపేశారు!

మా కార్యకర్తలని చంపేస్తున్నారు అంటూ వైసీపీ నాయకుడు జగన్ నోటికొచ్చిన లెక్కలు చెబుతూ ఢిల్లీ వరకు వెళ్ళినా ప్రయోజనం లేకపోయింది. జగన్ చెప్పేవన్నీ అబద్ధాలని నేషనల్ మీడియా వాళ్ళు చనిపోయిన 36 మంది పేర్లు చెప్పమని అడిగితే తప్పించుకున్నప్పుడే అర్థమైపోయింది. నిజానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మారణహోమం సృష్టిస్తున్నది సాక్షాత్తూ జగన్ పార్టీ నాయకులే. ఇప్పటికే చాలామంది తెలుగుదేశం నాయకులను హత్య చేసిన వైసీపీ నాయకులు ఆదివారం నాడు బీజేపీ నాయకుడిని దారుణంగా హత్య చేశారు. కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్దహరివాణంలో ఇంటి ముందు నిద్రిస్తున్న శేఖన్న (50) అనే బీజేపీ నాయకుడిని వైసీపీ నాయకులు గొంతు కోసం చంపారు. శేఖన్నకు గ్రామంలో ఎవరితోనూ విభేదాలు లేవు. అయితే ఈమధ్య శేఖన్న వైసీపీని విడిచిపెట్టి బీజేపీలో చేరాడు. అది కూడా హత్యకు కారణం కావచ్చన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

వినేష్ ఫొగాట్‌కి అస్వస్థత!

ప్యారిస్ ఒలింపిక్స్ క్రీడల్లో అనూహ్యమైన అనుభవాన్ని ఎదుర్కొన్న వినేష్ ఫొగాట్ స్వదేశానికి తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే. ప్యారిస్ నుంచి తిరిగి వచ్చిన ఆమెకు ఢిల్లీలో ఘన స్వాగతం లభించింది. ఢిల్లీ నుంచి ఆమె తన స్వగ్రామమైన హర్యానాలోని బలాలికి పది గంటలపాటు ప్రయాణించి చేరుకుంది. స్థానికులు వినేష్ ఫొగాట్‌కి ఆమెకు భారీ లడ్డూని బహుమతిగా అందించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో కూర్చున్న వినేష్ స్పృహ కోల్పోయినట్టుగా కొద్దిసేపు కుర్చీలో తల వాల్చి కూర్చున్నారు. దాంతో అక్కడున్న అందరూ ఆందోళన చెందారు. ఆమెకు ప్రథమ చికిత్స చేసిన అనంతరం కోలుకున్నారు. ఈ సందర్భంగా వినేష్ ఫొగాట్ మాట్లాడుతూ, ‘‘బిజీ షెడ్యూలు కావడం, సుదీర్ఘంగా ప్రయాణిస్తూనే వుండటం, నిద్ర లేకపోవడం వల్ల అలసిపోయాను. అంతకంటే ఆందోళన చెందాల్సిందేమీ లేదు’’ అన్నారు.

ఫైళ్ల దగ్ధం వెనుక కుట్రదారులను అరెస్టు చేయాలి!

వైసీపీ హయాంలో వివిధ శాఖలలో జరిగిన అవినీతి, అక్రమాలు, అన్యాయాలు వెలుగులోకి రాకూండా ఉండాలన్న లక్ష్యంతో రాష్ట్రంలో ఇప్పుడు ఫైళ్ల దగ్ధం అనే కార్యక్రమం సాగుతోందా అనిపిస్తోంది.  గతంలో ఎన్నడూ లేని విధంగా వివిధ ప్రభుత్వ కార్యాలయాలలో కీలకమైన ఫైళ్లు దగ్ధం అవుతుండటం పలు అనుమానాలకు తావిస్తోంది.   ప్రభుత్వ కార్యాలయాలలో వరుసగా జరుగుతున్న ఫైళ్ల దగ్ధం వెనుక కుట్ర ఉందన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. మదనపల్లో సబ్ కలెక్టర్ కార్యాలయంతో మొదలు పెడితే తాజాగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన కీలక ఫైళ్ల దగ్ధం వరకూ జరిగిన సంఘటనల వెనుక కుట్రకోణాన్ని వెలికి తీయాలన్న డిమాండ్ జోరందుకుంటోంది. ఈ ఫైళ్ల దగ్ధం సంఘటనలపై విచారణ అంటూ కాలయాపన చేయకుండా, కుట్రదారులను వెంటనే అరెస్టు చేయాలని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య డిమాండ్  చేశారు.  మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాకాలోని మదనపల్లెలో పెద్ద ఎత్తున ఫైళ్ళు ధగ్దం చేశారని, వేలాది మంది రైతుల   భూములు అన్యాక్రాంతం అయ్యాయనీ, రికార్డులు తారుమారు అయ్యాయనీ, రైతులపై దౌర్జన్యాలకు పెద్దిరెడ్డి మనుషులు తెగబడ్డారన్న వందల ఫిర్యాదులు ఉన్నాయనీ, ఈ నేపథ్యంలోనే ఫైళ్లు దగ్ధం కావడం పులు అనుమానాలకు తావిస్తోందని ఆయనో ప్రకటలో పేర్కొన్నారు. ఇప్పుడు తాజాగా  ధవళేశ్వరం కార్యాలయంలో పోలవరం ముంపు నిర్వాసితులకు సంబంధించిన నష్టపరిహారం దస్త్రాలు దగ్ధమయ్యాయి.  దాదాపు 4,202 కోట్ల పోలవరం ప్రధాన కాలువ నిర్మాణ పనులు, భూసేకరణ దస్త్రాల దగ్ధం వెనుక కూడా కుట్ర ఉందన్నారు. అలాగే విజయవాడలోని ప్రభుత్వ కార్యాలయాలలో కూడా ఫైళ్ల దగ్ధం సంఘటనలు జరిగాయని పేర్కొన్నారు.  ఫైళ్ళు ఎందుకు దగ్ధం అవుతున్నాయో, దీని వెనుక ఉన్న కుట్ర కోణం ఏమిటో  వెల్లడి కావాలన్నారు.  వైసీపీ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాల సాక్ష్యాలు లేకుండా చేయాలన్న దురుద్దేశంతోనే కొందరు అధికారుల సహకారం, పర్యవేక్షణతొ ఇవి జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.  ఇందులో భాగమైన ఉద్యోగులపై సస్పెన్సున్, బదిలీలతో సరిపెట్టే ధోరణి వీడి, కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని బాలకోటయ్య డిమాండ్ చేశారు. 

చంద్రబాబు రాఖీ శుభాకాంక్షలు

రక్షాబంధన్ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తెలుగు మహిళలకు రాఖీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన తెలుగింటి ఆడపడుచులు, అనునిత్యం ఆశీస్సులు అందజేసే అక్క చెల్లెళ్లకు రాఖీ శుభాకాంక్షలు అని పేర్కొన్నారు. ఆ సందేశంలో చంద్రబాబు తెలుగుదేశం పార్టీ ఆరంభం నుంచీ కూడా ఆడపడుచుల పక్షపాతి అని గుర్తు చేశారు. మహిళలకు ఆస్తిలో సమానహక్కు కల్పించినది తెలుగుదేశం ప్రభుత్వమే అని పేర్కొన్నారు. అలాగే ప్రభుత్వ పరంగా ఇచ్చే పథకాలను, ఆస్తులను మహిళల పేరుపైనే ఇచ్చే విధంగా సంస్కరణ తెచ్చింది కూడా తెలుగుదేశమే అని చంద్రబాబు గుర్తు చేశారు.  మహిళా సాధికారత కోసం ‘డ్వాక్రా’ సంఘాలు, బాలికా విద్యకు ప్రోత్సాహం, స్థానిక సంస్థలలో మహిళలకు రిజర్వేషన్లు వంటి విప్లవాత్మక నిర్ణయాలతో మహిళా సంక్షేమం కోసం తెలుగుదేశం ఎంతో కృషి చేసిందన్నారు. ఆడబిడ్డల ఆత్మగౌరవం, భద్రత, అభివృద్దికి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రకటించారు.  

పోలవరం ఫైల్స్ దహనం కేసు.. ఇదీ అసలు కథ!

ఏపీలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అక్రమార్కులు బెంబేలెత్తిపోతున్నారు. వైసీపీ  హయాంలో పలు శాఖల్లో భారీ ఎత్తున అవినీతి జరిగింది.  వైసీపీ నేతలు అధికారుల సహకారంతో అందిన కాడికి ప్రభుత్వ సొమ్మును దోచుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైసీపీ హయాంలో అవినీతి అక్రమాలు, భూకబ్జాల వ్యవహారంపై దృష్టిసారించింది. ఫలితంగా ఒక్కొక్కరి అవినీతి బండారం వెలుగులోకి వస్తోంది. దీంతో సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులతో కమిటీలు వేస్తూ పూర్తి స్థాయి విచారణకు ఆదేశిస్తున్నారు. విచారణ ప్రక్రియ వేగంగా జరుగుతుండటంతో ఎవరు ఎప్పుడు అరెస్ట్ అవుతారోనన్న ఆందోళన వైసీపీ నేతలు, వారికి సహకరించిన అధికారుల్లో వ్యక్తమవుతోంది. ఇప్పటికే అగ్రిగోల్డ్ భూముల వ్యవహారం కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్ కుమారుడు అరెస్టు కాగా.. జోగి రమేశ్ చుట్టూ  ఉచ్చు బిగిసింది. అయితే, పలు ప్రాంతాల్లో విచారణ జరుగుతున్న క్రమంలోనే ఫైల్స్ మాయం లేదా దగ్ధం అవుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. గత నెల అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దహనం కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ కావడంతో ఉన్నతాధికారులు రంగంలోకి దిగి ఫైల్స్ దగ్దం వెనుక అసలు కథ ఏమిటో వెలికి తీస్తున్నారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలోని పోలవరం ప్రాజెక్టు భూసేకరణ స్పెషల్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్లు దహనం ఘటన చోటు చేసుకుంది.  పోలవరం భూసేకరణ ఫైళ్ల దహనం ఘటనపై విచారణాధికారిగా జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.చినరాముడును నియమించారు. విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో తొలుత అధికారులపై చర్యలకు ఉపక్రమించారు. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం పోలీసు స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడంతో పాటు నిబంధనలు పాటించని సీనియర్‌ అసిస్టెంట్లు కె.నూకరాజు, కారం బేబీ, స్పెషల్‌ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ కె.కళాజ్యోతి, ఆఫీసు సబార్డినేట్‌ కె.రాజశేఖర్‌ను సస్పెండ్‌ చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉన్న డిప్యూటీ తహశీల్దార్లు ఎం.కుమారి, ఎ.సత్యదేవికి నోటీసులు జారీ చేశారు.   వైసీపీ హయాంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని అగమ్యగోచరంగా మార్చేశారు. ఆ పార్టీ నాయకులు భూ పరిహారాన్ని అందిన కాడికి దోచుకున్నారు. అక్రమాలకు కొందరు అధికారులు అండగా నిలవడంతో నకిలీ భూ పట్టాలు పెట్టి ప్రభుత్వ సొమ్ము దోచుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అక్రమార్కుల్లో గుబులు మొదలైంది. ఈ నేపథ్యంలో పోలవరం భూ పరిహారం చెల్లింపుల్లో అక్రమాలను మాయం చేయాలని భావించి ఫైళ్ల దహనానికి పాల్పడ్డారు.  ఫైళ్ల దహనం వెనుక పలువురు వైసీపీ నేతలు, అధికారుల హస్తం ఉందన్న విమర్శలు ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టు పరిధిలోని ముంపు గ్రామాల్లో పరిహారం చెల్లింపుల్లో భారీగా అవకతవకలు జరిగాయి. పోలవరం ప్రాజెక్టు భూ సేకరణలో కొండ పోరంబోకు భూములకు అప్పట్లో నకిలీ డీఫాం పట్టాలు, దొంగ లబ్ధిదారులను సృష్టించి కోట్లలో పరిహారాన్ని పక్కదారి పట్టించారు. ఇందులో పలువురు వైసీపీ నేతలు, రెవెన్యూ, ప్రాజెక్టు భూ సేకరణ అధికారుల ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఫైల్స్ ను పరిశీలించకుండా కొందరు అధికారులు వైసీపీ నేతలకు అనుకూలంగా వ్యవహరించి అర్హులకు అందాల్సిన పరిహారాన్ని కాజేశారన్న విమర్శలు ఉన్నాయి. అయితే, ధవళేశ్వరంలోని పోలవరం ప్రాజెక్టు పరిపాలన కార్యాలయానికి సంబంధించిన ఫైళ్లు తగలబెట్టినప్పుడు కీలక అధికారులు సెలవులో ఉండటం, మరి కొందరు అందుబాటులో లేకపోవటం గమనార్హం. దీనినిబట్టి చూస్తే ఉద్దేశపూర్వకంగానే ఫైళ్లను దహనం చేశారన్న వాదన  బలంగా వినిపిస్తోంది. ఫైళ్ల దహనంపై అధికారులు విచారణ జరిపి కాలినవన్నీ సంతకాలు లేని జిరాక్స్ పేపర్లు, అవి పనికిరానివని అధికారులు చెప్పడం వెనక ఏదో మతలబు ఉందన్న చర్చ జోరుగా జరుగుతుంది. అధికారుల విచారణ తీరుపై మంత్రి కందుల దుర్గేశ్ అనుమానం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. చిత్తు కాగితాలేనని మీరు ఎలా తేల్చేస్తారు? ఎవర్నయినా కాపాడే ప్రయత్నం చేస్తున్నారా? అంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో వైపు ఫైళ్ల దగ్దం వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవడంతో భూ పరిహారం అక్రమాల్లో చక్రంతిప్పిన కొందరు దళారులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు తెలిసింది. పోలవరం భూసేకరణ ఫైళ్ల దహనం ఘటనపై పోలవరం ప్రాజెక్టు పరిధిలోని ముంపు గ్రామాల ప్రజలు కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నేటికీ తమకు పరిహారం అందలేదని, ఇప్పుడు ఫైళ్లు దహనం చేయడంతో మాకు పరిహారం అందించామని అధికారులు చెబితే మేము ఏం చేయాలని ఆందోళన చెందుతున్నారు. అక్రమాలకు పాల్పడిన వారిని గుర్తించి వారిపై అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి దగ్దమైన ఫైళ్లు చిత్తు కాగితాలే అని అధికారులు విచారణలో తేల్చినా.. అసలు కథ వేరే ఉందన్న వాదన స్థానికంగా బలంగా వినిపిస్తోంది. నకిలీ డీ ఫాం పట్టాలు, దొంగ లబ్ధిదారులను సృష్టించి వైసీపీ నేతలు కోట్లాది రూపాయలు పరిహారం సొమ్మును దోచుకున్నారని, ప్రస్తుతం ఆ వివరాలు వెలుగులోకి రాకుండా ఉండేందుకే ఫైళ్లను దహనం చేశారని, ప్రభుత్వం ఈ విషయంపై మరింత దృష్టి కేంద్రీకరించాలని ముంపు గ్రామాల లబ్ధిదారులు కోరుతున్నారు.

ఏసీఏకు కొత్త టీం.. వైసీపీ హ‌యాంలో అవినీతిపై కొరడా?!

వైసీపీ ప్ర‌భుత్వం హ‌యాంలో ఆంధ్రా క్రికెట్ అసోసియేష‌న్ (ఏసీఏ)ను వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి త‌న జేబు సంస్థ‌లా మార్చేసుకున్నారు. అధ్య‌క్షుడు స‌హా, మిగిలిన ప‌ద‌వుల‌న్నీ త‌న బంధుగ‌ణం, అనుచ‌రుల‌తో నింపేశారు. ఈ క్ర‌మంలో ఏసీఏలో పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగం జ‌రిగింది. కోట్లాది రూపాయ‌లు చేతులు మారాయి. ఒక్క‌ మాట‌లో చెప్పాలంటే గ‌తంలో ఎప్పుడూ లేని విధంగా ఏసీఏను వైసీపీ హ‌యాంలో విజ‌య‌సాయిరెడ్డి భ్రష్టుప‌ట్టించారు. జ‌గ‌న్ మెప్పుకోసం నిధుల‌ను సంస్థ‌కు సంబంధంలేని ప‌నుల‌ కోసం దారి మ‌ళ్లించారు. దీంతో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన కొద్ది రోజుల్లోనే ఏసీఏపై గురి పెట్టింది. అక్క‌డ పెద్ద ఎత్తున నిధుల‌ను ప‌క్క‌దారి ప‌ట్టించార‌ని గుర్తించింది. ఏసీఏను స‌క్ర‌మ మార్గంలోకి తీసుకొచ్చేందుకు సీఎం చంద్ర‌బాబు నాయుడు దృష్టి సారించారు. ఈ క్ర‌మంలో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఏసీఏ పగ్గాలు కొత్త పాలక వర్గం చేతుల్లోకి వ‌చ్చాయి. అధ్యక్షుడిగా ఎంపీ కేశినేని చిన్ని (శివనాథ్‌)తో పాటు మొత్తం కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నికైంది. ఈ ఎన్నికల్లో ఏసీఏలోని అన్ని పదవులకు ఒక్కొక్కరే నామినేషన్‌లు దాఖలు చేయడంతో ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా పి. వెంకట ప్రశాంత్‌, కార్యదర్శిగా సాన సతీష్, సంయుక్త కార్యదర్శిగా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, ట్రెజరర్ గా దండమూడి శ్రీనివాస్, కౌన్సిల‌ర్ గా డి. గౌరు విష్ణుతేజ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే ఫలితాలను అధికారికంగా వచ్చే నెల 8న ప్రకటించనున్నారు. అంత‌కు ముందు వైసీపీ ఎంపీ విజయ‌సాయిరెడ్డి బంధువ‌ర్గంమే ఏసీఏ ప‌ద‌వుల్లో కొన‌సాగింది. 2019లో వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత నాలుగు నెల‌ల‌కు జ‌రిగిన ఎన్నిక‌ల్లో అర‌బిందో డైరెక్ట‌ర్ శ‌ర‌త్‌చంద్రారెడ్డి ఏసీఏ అధ్య‌క్షుడిగా ఎన్నిక‌య్యారు. ఉపాధ్య‌క్షుడిగా రోహిత్ రెడ్డి, కార్య‌ద‌ర్శిగా గోపీనాథ్ రెడ్డి ఎన్నిక‌య్యారు. 2022 న‌వంబ‌ర్ జ‌రిగిన ఎన్నిక‌ల్లోనూ ఒక్కో పోస్టుకు ఒక్క‌రే నామినేష‌న్ వేయ‌డంతో మ‌ళ్లీ వారే ప‌దువుల్లో కొన‌సాగారు. ఏసీఏకు శ‌ర‌త్‌చంద్రారెడ్డి, రోహిత్ రెడ్డి పేరుకే అధ్య‌క్ష‌, ఉపాధ్య‌క్షులు.. వ్య‌వ‌హారాలన్ని మొత్తం విజ‌య‌సాయిరెడ్డి క‌నుస‌న్న‌ల్లోనే జ‌రిగేవి. విజ‌య‌వాడ కేంద్రంగా ఏసీఏ ప‌నిచేస్తుండ‌గా..విజయ సాయిరెడ్డి మ‌నుషుల‌ చేతుల్లో వెళ్లిన త‌రువాత ఏసీఏ ప్ర‌ధాన కార్యాల‌యాన్ని విశాఖ‌ప‌ట్ట‌ణంకు మార్చేశారు.  2024 ఎన్నికల్లో వైసీపీ పరాజయంపాలై తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చింది. ఆ వెంటనే ఏసీఏ సర్వసభ్య సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ఏసీఏ కార్యవర్గం రాజీనామా చేసింది. ఇప్పుడు కొత్తగా ఎన్నికై బాధ్యతలు చేపట్టనున్న నూతన కార్యవర్గం మందు కీల‌క బాధ్య‌త‌లు ఉన్నాయి. వైసీపీ ప్ర‌భుత్వం హ‌యాంలో ఏసీఏకి చెడ్డ‌పేరు వ‌చ్చింది. ఇష్టారీతిలో నిధుల దుర్వ‌నియోగం జ‌రిగింది. లీగ్‌ల పేరుతో పెద్దెత్తున దోచుకున్నార‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. బీసీసీఐ ప్ర‌తీయేటా ఏసీఏకి సుమారు రూ. 100 కోట్లు కేటాయిస్తుంది. వాటిని ఇష్టానుసారంగా ఖ‌ర్చు పెట్టారు. దీంతో నిధుల దుర్వినియోగంపై కేసులు ప‌ట‌డంతో.. అవి తేలేవ‌ర‌కు నిధుల‌ను ఉద్యోగుల జీతాలు, మ్యాచ్‌ల నిర్వ‌హ‌ణ‌కు మాత్ర‌మే ఖ‌ర్చు చేయాల‌ని హైకోర్టు ఆదేశించింది. విశాఖ‌లోని క్రికెట్ స్టేడియంలో టీ20, వ‌న్డే అంత‌ర్జాతీయ మ్యాచ్‌లు జ‌రిగిన స‌మ‌యంలో టికెట్ల‌ను బ్లాక్‌లో విక్ర‌యించి క‌మిటీ స‌భ్యులు కోట్లు దండుకున్నార‌ని విమ‌ర్శ‌లు ఉన్నాయి నిధులు దోచుకునేందుకే  ఆంధ్రా ప్రీమియ‌ర్ లీగ్‌, ఉమెన్ ప్రీమియ‌ర్ లీగ్ ప్ర‌వేశ‌పెట్టార‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. మొత్తానికి వైసీపీ ఎంపీ విజ‌యాసాయిరెడ్డి క‌నుస‌న్న‌ల్లో ఏసీఏలో గ‌త ఐదేళ్ల‌లో  నిధులు భారీగా దుర్వినియోగం అయ్యాయ‌న్న విమర్శలు బ‌లంగా ఉంది.  వైసీపీ హ‌యాంలో ఏసీఏలో జ‌రిగిన అవినీతిపై నూత‌నంగా ఎన్నికైన క‌మిటీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌రువాత ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటంద‌నే ఆస‌క్తి అంద‌రిలోనూ నెల‌కొంది. ముఖ్యంగా గ‌డిచిన ఐదేళ్ల కాలంలో ఎన్ని నిధులు వ‌చ్చాయి. ఎన్ని నిధులు ఖ‌ర్చు చేశారు. ఎందు కోసం ఖ‌ర్చు చేశారు అనే విష‌యాల‌పై దృష్టి సారిస్తే  శ‌ర‌త్‌చంద్రారెడ్డి, రోహిత్ రెడ్డి, గోపీనాథ్ రెడ్డిలు క‌ట‌క‌టాల పాలుకావ‌డం ఖాయ‌ం అని క్రికెట్ వర్గాలు అంటున్నాయి. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఆధ్వ‌ర్యంలో నూత‌న క‌మిటీ పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత ఆ దిశగా చర్యలు తీసుకోవడం ఖాయమని అంటున్నారు. 

మంత్రి ఆనం శృంగేరి శారదాపీఠ సందర్శన!

ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదివారం ఉదయం శృంగేరీ చేరుకొన్నారు. మొట్టమొదట శృంగేరీలో కొలువై ఉన్న శ్రీ శారదా అమ్మవారి దేవాలయాన్ని, ఇతర దేవతా సన్నిధులను దర్శించుకుని నరసింహవనంలో చాతుర్మాస్య దీక్షలో ఉన్న ఉభయ జగద్గురువులను దర్శించుకున్నారు. మొదట జగద్గురు శ్రీ శ్రీ భారతీతీర్థ మహాస్వామివారిని దర్శించుకుని వారి ఆశీస్సులు పొందారు. తదనంతరం జగద్గురు శ్రీ శ్రీ విధుశేఖరభారతీ మహాస్వామి వారి దర్శనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడ్డాక మొట్టమొదటగా దక్షిణామ్నాయ శ్రీ శృంగేరీ శారదాపీఠాన్ని సందర్శించి రాష్ట్ర పరిపాలన అభివృద్ధి కార్యక్రమాలకు జగద్గురువుల మార్గదర్శకాలను, ఆశీరనుగ్రహాన్ని పొందటానికి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రార్థనాసందేశాన్ని కుడా విన్నవించటానికి తాము వచ్చినట్టు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి గారు స్వామివారికి తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి తమ ఆశీస్సులు మార్గదర్శకత్వము ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయని, ధర్మ బద్ధంగా ప్రజలకు మేలు కలిగేలా సత్పరిపాలన అందించటానికి ప్రభుత్వం కృషి చేయాలని శ్రీ స్వామివారు ఆశీర్వదించారు. 2018వ సంవత్సరం మార్చి నెలలో తమ ఆంధ్రప్రదేశ్ విజయయాత్రలో భాగంగా విజయవాడలో ఉన్నప్పుడు అప్పుడు కుడా ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు తమను సందర్శించినట్టు, తరువాత ముఖ్యమంత్రి గారిని ఆయన నివాసంలో తాము కుడా సందర్శించి ఆశీర్వదించినట్టు శ్రీ విధుశేఖరభారతీ మహాస్వామి వారు గుర్తు చేసుకున్నారు. మంత్రి ఆనం రామనారాయణరెడ్డితో పాటు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ కమీషనర్ ఎస్.సత్యనారాయణ ఐఏఎస్, శ్రీశైలం శ్రీ భ్రమరాంబామల్లికార్జున స్వామి వారి దేవస్థాన కార్యనిర్వాహణాధికారి డి.పెద్దిరాజు, తిరుమల వేదపాఠశాల ప్రిన్సిపాల్ కుప్పా శివసుబ్రహ్మణ్య అవధాని, శ్రీశైలం దేవస్థాన వేదపండితులు గంటి రాధాకృష్ణమూర్తి తదితరులు ఈ సందర్భంగా జగద్గురువులను సందర్శించుకున్నారు.

బూమ్ బూమ్ వాసుదేవరెడ్డి అరెస్టు

ఏపీ బేవరీజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. వాసుదేవరెడ్డి ప్రస్తుతం సీఐడీ అదుపులో వున్నారు. జగన్ రాక్షస పాలనలో భారీ స్థాయిలో జరిగిన మద్యం కుంభకోణంలో వాసుదేవ రెడ్డి కీలక పాత్ర నిర్వహించారు. ప్రస్తుతం ఒక అజ్ఞాత ప్రాంతంలో వాసుదేవ రెడ్డిని సీఐడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. అప్పట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ‘జే’ బ్రాండ్ మద్యం ప్రవాహానికి ముఖ్య కారకుడు వాసుదేవరెడ్డి. ఈ స్కామ్‌లో వాసుదేవరెడ్డి మీద భారీ స్థాయిలో అభియోగాలు వచ్చాయి. జగన్ అధికారంలోకి రాగానే డిప్యూటేషన్‌పై వాసుదేవ రెడ్డిని రప్పించిన జగన్ ఏపీ బేవరీజెస్ కార్పొరేషన్ ఎండీ బాధ్యతలు తద్వారా మద్యం సేల్స్ బాధ్యతలు అప్పగించారు. డిస్టిలరీలు, డిపోలు, షాపులపై వాసుదేవ రెడ్డిదే అజమాయిషీ. జే బ్రాండ్లు తీసుకురావటంలో వాసుదేవరెడ్డి కీలక పాత్ర పోషించారు. మద్యంపై ఆదాయాన్ని తాకట్టు పెట్టి కోట్ల రూపాయలు అప్పులు తెచ్చారు. వైసీపీ దోపిడీకి కర్త, కర్మ, క్రియ వాసుదేవరెడ్డి. కేసులు వెంటాడడంతో 2 నెలలకుపైగా వాసుదేవరెడ్డి పరారీలో వున్నారు. కోర్టు ద్వారా బెయిల్ కోసం ప్రయత్నాలు చేసినప్పటికీ ఉపయోగం లేకపోయింది. వాసుదేవరెడ్డి ఇంటిపై దాడి చేసి సోదాలు నిర్వహించిన సీఐడీ పోలీసులకు అనేక కీలక ఆధారాలు దొరికాయి.