ఆరోగ్య శ్రీ బకాయిల చెల్లింపులకు 300 కోట్లు విడుదల

జగన్ హయాంలో  పథకాల అమలు తీరు పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా సాగింది. పథకాలు అమలు చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటూ, వాటి కోసం అంటూ రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చేశారు జగన్. అలా పేరుగొప్ప ఊరుదిబ్బ చందంగా జగన్ హయాంలో అమలైన పథకం ఆరోగ్య శ్రీ.   ఆర్భాటంగా పథకాల ప్రకటనే తప్ప ఆ పథకాల అమలుకు కావలసిన సొమ్ముల  విడుదలలో మొండి చేయి చూపడంతో జగన్ హయాంలో ఆరోగ్య శ్రీ అమలు తూతూ మంత్రంగానే సాగింది.  వందల కోట్లు అప్పు చేసి జగన్ సర్కార్ చేస్తున్నదేమిటయ్యా అంటే విడతల వారీగా ప్రభుత్వోద్యోగుల వేతనాలు చెల్లించడం. ఇప్పటికే అమలు చేస్తున్న బటన్ నొక్కుడు కార్యక్రమాలకు అరకొరగా నిధులు పందేరం చేయడం మాత్రమే.  జగన్ విధానాల డొల్ల తనానికి  బకాయిలు పేరుకు పోయి ఆరోగ్య శ్రీ  పథకం ఓ నిదర్శనం.   ఆస్పత్రులకు ఆరోగ్య శ్రీ బకాయిలు విడుదల చేయడానికి చేతులు రాని జగన్.. సరిగ్గా ఎన్నికలకు ముందు మాత్రం ఆర్భాటంగా ఆరోగ్య శ్రీ కింద వైద్య సేవల పరిమితిని పాతిక లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.   అమలు కాని పథకానికి పరిమితి ఎంత పెంచితే  మాత్రం నష్టం ఏమిటన్న రీతిలో జగన్ సర్కార్ తీరు ఉండేది.    జగన్  హయంలో ఆసుపత్రులకు చెల్లించాల్సిన ఆరోగ్యశ్రీ బకాయిలు కొండలా పేరుకుపోయాయి. ఒక్కో ఆసుపత్రికి   కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాల్సి ఉందంటే అతిశయోక్తి కాదు.  గతంలో అంటే విభజిత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు హయాంలో  కొంచం ఆలస్యంగానైనా, అంటే  ఏ ఏడాదికి ఆ ఏడాది ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించే వారు.   వైసీపీ అధికారంలోకి వచ్చాక జగన్ సర్కార్ ఆరోగ్య శ్రీ బిల్లుల చెల్లింపును మూలన పడేశారు. ఈ విషయంపై  ఆసుపత్రుల యాజమాన్యాలు ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంతో ప్రభుత్వ పెద్దలు బెదిరింపులకు దిగారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.  సరే ప్రస్తుతం జగన్ సర్కార్ నిర్వాకం తెలుగుదేశం కూటమికి భారంగా మారింది.  ఆరోగ్య శ్రీ బకాయిలు చెల్లిస్తే తప్ప ఆ సేవలు అందించలేమంటూ ఆస్పత్రులు చేతులెత్తేసే పరిస్థితి వచ్చింది. దీంతో చంద్రబాబు సర్కార్ ఆరోగ్య శ్రీ ట్రస్ట్ అనుబంధ ఆస్పత్రులకు పెండింగ్ బయాయిల చెల్లింపుల కోసం 300 కోట్ల రూపాయలు విడుదల చేసింది. విడతల వారిగా బకాయిలన్నీ చెల్లించేందకు నిర్ణయం తీసుకుంది. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించే విషయంలో రాజీ ప్రశక్తే లేదని చంద్రబాబు ఉద్ఘాటించారు.  ప్రజలకు మేలు చేయడమే ప్రభుత్వాల విధి అని చాటారు. రాష్ట్రం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నా పేదలకు ఆరోగ్య సేవలు నిరాటంకంగా అందాలన్న లక్ష్యంతో నిధులు విడుదల చేశారు. 

దూకుడు కాదు.. దిగజారుడే.. బీఆర్ఎస్ రూటేంటి?

గత ఏడాది డిసెంబర్ లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయం పాలైన తరువాత ఆ పార్టీ గమనం దశ, దిశ లేకుండా సాగుతున్నట్లుగా కనిపిస్తోంది. పార్టీ అధినేత ఫామ్ హౌస్ కు పరిమితమైపోయారు. ఆ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి క్యూకడుతున్నారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కల్వకుంట్ల   తారకరామారావు, మరో మాజీ మంత్రి, సీనియర్ నేత హరీష్ రావులే పార్టీ గొంతుకగా మెలుగుతున్నారు. అయితే వారిరువురూ రేవంత్ సర్కార్ పై చేస్తున్న విమర్శలు చాలా వరకూ బూమరాంగ్ అవుతున్నాయి. ఎవరి పక్షాన అయితే తాము నిలబడి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నామని చెబుతున్నారో ఆ రైతులే కేటీఆర్, హరీష్ ల పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.  మరో వైపు బీఆర్ఎస్ రాష్ట్రంలో కనుమరుగు కాబోతోంది, ఆ పార్టీ బీజేపీ లేదా కాంగ్రెస్ లో విలీనం అవుతుంది అంటూ బీజేపీ, కాంగ్రెస్ లు చేస్తున్న విమర్శలను గట్టిగా తిప్పి కొట్టడంలో కేటీఆర్, హరీష్ లు విఫలమౌతున్నారు. అధికారంలో ఉండగా కృష్ణార్జునుల్లా చక్రం తిప్పిన వీరు విపక్షంలో మాత్రం తడడబుతున్నారు. విలీనం కథనాల నేపథ్యంలో  పార్టీ ఉనికిని బలంగా చాటాలన్న తాపత్రయంలో దూకుడు పెంచుతున్నామంటూ వారు చేస్తున్న విన్యాసాలు ఇంత దిగజారుడుతనమేంటి అన్న అభిప్రాయాన్ని కలిగిస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తొలుత హరీష్ రావు రేవంత్ పాపానికి తాను ప్రక్షాళన చేస్తున్నానంటూ దేవాలయాల యాత్ర మొదలు పెడితే, ఆ తరువాత కేటీఆర్ రేవంత్ ను ఉద్దేశించి చేసిన సవాల్ ఆయన స్థాయిని దిగజార్చింది. మగాడివైతే సెక్యూరిటీ లేకుండా ఊళ్లల్లోకి రా అంటే కేటీఆర్ చేసిన సవాల్ దూకుడు ప్రదర్శనగా కాకుండా దిగజారి మాట్లాడటంగా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. భాష విషయంలో జాగ్రత్తలు తీసుకోకుండా నోటికి వచ్చినది మాట్లాడితే ఫలితం ఎలా ఉంటుందో గత ఏడాది డిసెంబర్ లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు, ఆ తరువాత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూపాయి.  రాష్ట్రంలో  బిఆర్ఎస్ ఉనికి, అస్థిత్వం కోసం దూకుడుగా ముందుకు వెళ్లాలన్న తాపత్రయంతో కేసీఆర్, హరీష్ లు పార్టీకి మరింత నష్టం చేస్తున్నారని పోలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది.  

భక్తుల సౌకర్యాల విషయంలో నో కాంప్రమైజ్.. టీటీడీ అదనపు ఈవో ఆకస్మిక తనిఖీ

తిరుమల ప్రక్షాళన విషయంలో ప్రభుత్వం అస్సలు రాజీపడటం లేదు. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుల నియామకంపై ఒక పక్క కసరత్తు జరుపుతూనే  తిరుమల పవిత్రత, పారిశుద్ధ్యం, భక్తులకు నాణ్యమైన సేవలు వంటి విషయాలలో అలసత్వం కూడదన్న ఆదేశాలు ఇచ్చింది. దీంతో అధికారులు తిరుమలలో వరుస తనిఖీలతో ఎప్పటికప్పుడు పరిస్థితిని పరిశీలించి పర్యవేక్షిస్తున్నారు. ఇందులో భాగంగానే తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి శనివారం (ఆగస్టు 24) తెల్లవారు జామున తిరుమలలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, కృష్ణ తేజ సర్కిల్, నారాయణగిరి ఉద్యానవనంలోని షెడ్లు, క్యూలైన్లను పరిశీలించారు. ఈ సందర్భంగా భక్తులతో ముచ్చటించారు. భక్తులకు టీటీడీ అందిస్తున్న సౌకర్యాలను వారికి వివరించారు. కంపార్ట్ మెంట్లలో టీటీడీ అందిస్తున్న ఉప్మా నాణ్యత గురించి ఆరా తీశారు.   అలాగే వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో తాగునీరు, అన్న‌ప్ర‌సాదాలు, పాలు అందించే విధానాన్ని పరిశీలించి, కంపార్ట్మెంట్ల వెలుపల ఉన్న బోర్డులపై భక్తులకు అందించే ఆహార పానీయాలు, సమయాలను పేర్కొనాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.  కంపార్ట్మెంట్లను నిరంతరం పర్యవేక్షించి ఎక్కడా జాప్యం లేకుండా భక్తులను దర్శనానికి వదలాలన్నారు. వీక్యుసి కంపార్ట్మెంట్ల నుండి భక్తులను దర్శనానికి పంపిన వెంటనే, మరింత మెరుగైన పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని ఆదేశించారు.  కృష్ణ తేజ సర్కిల్ వద్ద భక్తులు క్యూ లైన్ ల లోకి ప్రవేశించే మార్గాల వద్ద  కొందరు ప్రైవేటు టాక్సీ, జీప్ డ్రైవర్లు అడ్డంగా   పార్కింగ్ చేయడాన్ని గమనించి, డ్రైవర్లను హెచ్చరించారు. భవిష్యత్తులో ఐటువంటి అనధికారిక పార్కింగ్ నివారించేందుకు, స్థానిక పోలీసులతో చర్చలు జరపాలని టీటీడీ విజిలెన్స్ అధికారులను ఆదేశించారు.  

ఏపీ నుంచి రోజా పలాయనం.. తమిళనాట పొలిటికల్ ఎంట్రీ?

మాజీ మంత్రి, వైసీపీ మ‌హిళా నేత ఆర్కే రోజా వైసీపీకి గుడ్ బై చెప్ప బోతున్నారా? ఏపీ రాజ‌కీయాల‌ నుంచి నిష్క్రమించబోతున్నారా?   త‌మిళ రాజ‌కీయాల్లో త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకునేందుకు రెడీ అయిపోయారా?  త‌మిళ హీరో విజ‌య్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగేందుకు రోజాకు రూట్ క్లియ‌ర్ అయిందా? అంటే అవున‌నే స‌మాధానమే వినిపిస్తోంది.  పుట్టినింట రాజ‌కీయాల్లో మంచో చెడో త‌న‌దైన ముద్ర‌వేసుకున్న రోజా.. ఇప్పుడు మెట్టినింట త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకునేందుకు సిద్ధ‌మ‌వుతున్నారని పోలిటికల్ సర్కిల్స్ లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సినీ నటిగా రోజాకు తమిళనాడులో మంచి క్రేజ్‌ ఉంది. ఆ రాష్ట్రంలో రాజకీయాలు, సినీ రంగాన్ని వేరుచేసి చూడలేని పరిస్థితి ఉంటుంది. దీంతో తన సినీ గ్లామర్‌తోపాటు.. తన భర్త సెల్వమణి తమిళనాడుకు చెందిన వారు కావడంతో తమిళనాడు రాజ‌కీయాల్లో రాణిస్తానని రోజా కాన్ఫిడెంట్ గా ఉన్న‌ట్లు ఆమె స‌న్నిహితులు చెబుతున్నారు. రోజాకు తమిళ భాషపైనా మంచి ప‌ట్టుంది. దీంతో అక్క‌డి రాజకీయాల్లోకి ఏ పార్టీ నుంచి ఎంట్రీ ఇవ్వాల‌నే విష‌యంపై త‌న సన్నిహితులతో రోజా కొద్దికాలంగా చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ట్లు స‌మాచారం. ప్రస్తుతం తమిళనాడులో డీఎంకే అధికారంలో ఉంది. అవ‌కాశాన్ని బట్టి డీఎంకే లేదా హీరో విజ‌య్ పార్టీల‌లో ఏదో ఒక పార్టీ నుంచి ఆమె త‌మిళ రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇవ్వ‌డం ఖాయ‌మ‌న్న చ‌ర్చ న‌గరి నియోజ‌క‌వ‌ర్గంలో జోరుగా సాగుతోంది.    తెలుగు రాష్ట్రాల్లో హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన రోజా.. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో   1998లో తెలుగుదేశం నుంచి రాజ‌కీయ అరంగేట్రం చేశారు. ఆ పార్టీ తరఫున 2004, 2009 అసెంబ్లీ ఎన్నికల్లో నగరి, చంద్రగిరి నియోజకవర్గాల నుంచి రోజా పోటీ చేశారు. అయితే.. ఆ రెండు ఎన్నికల్లోనూ రోజా ఓడిపోయారు. తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు నాయుడు రోజాకు పార్టీలో పెద్ద‌పీట వేస్తూనే వ‌చ్చారు. కానీ, రోజా దూకుడు స్వ‌భావం కార‌ణంగా పార్టీలో ముఖ్య‌నేత‌ల నుంచి, క్యాడ‌ర్ నుంచి వ్య‌తిరేక‌త మూట‌గ‌ట్టుకున్నారు.  ఫ‌లితంగా ఆ తెలుగుదేశం పార్టీకి దూరమై 2009లో కాంగ్రెస్‌ పార్టీలో చేరిన ఆమె.. ఆ తర్వాత చోటుచేసుకున్న రాజ‌కీయ‌ పరిణామాల నేప‌థ్యంలో వైఎస్ జ‌గ‌న్ స్థాపించిన వైసీపీలో చేరారు. ఆ పార్టీ తరఫున 2014, 2019 ఎన్నికల్లో నగరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు.  2022 ఏప్రిల్ 11న జరిగిన మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో జగన్‌మోహన్ రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా రోజాకు అవ‌కాశం ద‌క్కింది. టూరిజం, క్రీడ‌ల శాఖ మంత్రిగా ఆమె బాధ్య‌త‌లు నిర్వ‌హించారు. అయితే, రెండోసారి ఎమ్మెల్యేగా విజ‌యం సాధించిన త‌రువాత‌.. రోజా వ్య‌వ‌హార‌శైలిలో పూర్తిగా మార్పు వ‌చ్చింది. దీంతో న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ నేత‌లు, క్యాడ‌ర్ నుంచి రోజా ప‌ట్ల వ్య‌తిరేక‌త పెల్లుబికింది.  2024 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో రోజాకు టికెట్ ఇవ్వొద్ద‌ంటూ నియోజ‌క‌వ‌ర్గంలోని ముఖ్య‌నేత‌లంతా ఏకతాటిపైకి వ‌చ్చి అధినేత జగన్ కు  ఫిర్యాదు చేశారు. అయినా అధిష్టానం రోజాకే టికెట్ కేటాయించ‌డంతో.. న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు రోజాను భారీ ఓట్ల తేడాతో ఓడించారు. సొంత పార్టీ నుంచి కూడా ఆమెకు ఇసుమంతైనా మద్దతు లభించ లేదు. రెండోసారి ఎమ్మెల్యేగా విజ‌యం సాధించిన త‌రువాత నియోజ‌క‌వ‌ర్గంలో రోజా పెద్ద ఎత్తున అవినీతి అక్ర‌మాల‌కు పాల్ప‌డిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. దీనికితోడు మంత్రి ప‌ద‌వికూడా ఉండటంతో ఆమె సోదరులు కుమారస్వామిరెడ్డి, రాంప్రసారెడ్డి ప్ర‌తీ ప‌నిలో లంచాలు, క‌మీష‌న్లు వ‌సూలు చేశార‌ని, ఫ‌లితంగా కోట్లాది రూపాయ‌ల ప్ర‌జా సొమ్మును రోజా దోచుకున్నార‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి. మంత్రి అయిన కొద్దినెల‌ల‌కే రోజా ఖ‌రీదైన కారును కొనుగోలు చేయ‌డం కూడా అప్పట్లో ఏపీ రాజ‌కీయాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. దీనికి తోడు వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన నాటినుంచి రోజా త‌న నోరును ఏనాడూ అదుపులో పెట్టుకోలేదు. చంద్ర‌బాబు, లోకేశ్‌, ప‌వ‌న్ క‌ల్యాణ్ ల‌పై  ఇష్ట‌మొచ్చిన‌ట్లు విమ‌ర్శ‌లు చేస్తూ వ‌చ్చారు. దీంతో రోజా పేరెత్తితే మ‌హిళ‌లు చీద‌రించుకునే ప‌రిస్థితి రాష్ట్రంలో ఏర్ప‌డింది. ఏపీలో వైసీపీ ఘోర ఓట‌మికి రోజా, కొడాలి నాని, పేర్ని నాని, జోగి ర‌మేశ్ వంటి నేత‌లుకూడా ఓ కార‌ణ‌మ‌ని చెప్పొచ్చు. దీంతో రోజా పేరెత్తితే వైసీపీ శ్రేణులు కూడా మండిప‌డే ప‌రిస్థితి ఏర్ప‌డింది. ప్ర‌స్తుతం అధిష్టానం పెద్ద‌లు, పార్టీ నేత‌లు సైతం రోజా ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు. రోజాలాంటి మ‌హిళ‌ పార్టీ నుంచి వెళ్లిపోవట‌మే మంచిద‌న్న భావ‌న‌కు అధిష్టానం సైతం వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. పార్టీ అధిష్టానం త‌న‌ప‌ట్ల విముఖ‌త చూపుతుంద‌నే విష‌యాన్ని ముందుగానే గ‌మ‌నించిన రోజా.. త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ని టాక్ న‌డుస్తోంది. వైసీపీ ఐదేళ్ల పాల‌న‌లో బీజేపీ, తెలుగుదేశం, జ‌న‌సేన పార్టీ నేత‌ల‌పై రోజా తీవ్ర‌స్థాయిలో విమ్శ‌లు చేశారు. దీంతో ఆ మూడు పార్టీల్లోనూ రోజాకు డోర్లు క్లోజ్ అయ్యాయి. వైసీపీ అధిష్టానం నుంచి ఆమెప‌ట్ల విముఖ‌త వ్య‌క్త‌మ‌వుతోంది. దీంతో త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇవ్వ‌ట‌మే బెట‌ర్ అనే భావ‌న‌కు రోజా వ‌చిన‌ట్లు న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గంలో టాక్ న‌డుస్తోంది.  అయితే అదేమంత ఈజీ కాదంటున్నారు పరిశీలకులు. రోజా రజనీకాంత్ పై చేసిన విమర్శల కారణంగా ఆ రాష్ట్రంలో ఆమె పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. సరే ఎలాగోలా ఆమె అక్కడ రాజకీయ ఎంట్రీ ఇచ్చి రాణిద్దామనుకున్నా.. ఇక్కడ ఆమె అవినీతిపై విచారణలో దోషిగా తేలితే ఇక ఆమె పొలిటికల్ డ్రీమ్స్ కు ఎండ్ కార్డ్ పడినట్లేనని చెబుతున్నారు.  అందుకే కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి రోజా ఏపీ రాజ‌కీయాల్లో పెద్ద‌గా క‌నిపించ‌డం లేదు. ఎక్క‌డా ఆమె రాజ‌కీయాల గురించి నోరెత్త‌డం లేదు. అయితే, రోజా మంత్రిగా ఉన్న స‌మ‌యంలో ఆడుదాం ఆంధ్ర పోటీల్లో అవినీతికి పాల్పడినట్లు విజయవాడకు చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదుపై  ప్రభుత్వం విచార‌ణ‌కు గ్రీన్‌ సిగ్న‌ల్ ఇచ్చింది. గత ప్రభుత్వంలో గ్రామీణ స్థాయి నుంచి క్రీడ లను ప్రోత్సహించాలని ఆడుదాం ఆంధ్రా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ క్రీడల నిర్వహణలో భాగం గా వంద కోట్ల రూపాయల స్కాం జరిగిందని గత కొంతకాలంగా విమర్శలు వినిపిస్తున్నాయి. ప్ర‌భుత్వ  విచార‌ణ‌లో రోజాపై ఆరోప‌ణ‌లు నిజ‌మేన‌ని తేలితే ఆమె క‌ట‌క‌టాల పాలుకావ‌డం ఖాయ‌మ‌న్న చ‌ర్చ జ‌రుగుతుంది. అదే జ‌రిగితే ఆమె త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాల‌న్న ప్ర‌య‌త్నాల‌కు బ్రేక్ ప‌డిన‌ట్లేన‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.

సికింద్రాబాద్ ప్యారడైజ్‌లో ఫైర్!

సికింద్రాబాద్ ప్యారడైజ్ హోటల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాంతో హోటల్ సిబ్బందితో పాటు కస్టమర్లు భయాందోళనకు గురయ్యారు. ఆహారం తీసుకుంటున్న కస్టమర్లు తినే ప్లేట్లను వదిలేసి బయటకి పరుగులు తీశారు. హోటల్ సిబ్బంది కూడా ఎక్కడి పనులను అక్కడ వదిలేసి బయటకి వచ్చేశారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు." ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రాణ హాని జరగలేదు. ఎవరూ గాయపడలేదు. వంటగది నుంచి భారీ ఎత్తున మంటలు వచ్చాయి. సిబ్బంది కూడా సకాలంలో స్పందించి మంటలను ఆర్పడానికి సహకరించారు’’ అని ఫైర్ సిబ్బంది తెలిపారు.

2029 ఎన్నికల్లో గెలుపే లక్ష్యం.. సునీల్ కనుగోలు కోసం జగన్ ఆరాటం?!

ఇటీవలి ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం పాలైంది. కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. దీంతో   వైసీపీ పూర్తిగా డీలా పడిపోయింది. తెలుగుదేశం కూటమి సునామీలో వైసీపీ  కొ ట్టుకుపోయింది. ఆ పార్టీ నేతలు పరాజయం తరువాత ఒక్కరొక్కరుగా జారుకుంటున్నారు. గెలిచిన ఎమ్మెల్యేలలోనూ అత్యధికులు జగన్ కు గుడ్ బై చెప్పేసి వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక అధికారంలో ఉన్నంత వరకూ విపక్షంపై నోరెట్టుకు పడిపోయి.. నానా హడావుడీ చేసిన నేతలంతా సైలెంట్ అయిపోయారు. అధికారంలో ఉన్న ఐదేళ్లూ జగన్ కు కళ్లూ, నోరూ, చెవులుగా వ్యవహరించిన సజ్జల కలికానికి కూడా కనిపించడం లేదు. దీంతో వచ్చే ఐదేళ్లలో వైసీపీ కనుమరుగౌతుందా అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.   తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో ప్రజారంజక పాలనతో జనానికి దగ్గరౌ తోంది. అదే సమయంలో రాష్ట్రంలో పూర్వ వైభవం కోసం కాంగ్రెస్ చెమటోడ్చి కష్టపడుతోంది. ఇటు వంటి పరిస్థితుల్లో జగన్ నేతృత్తంలో వైసీపీ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఈ తరుణంలోనే పార్టీనీ, తన పట్టును కాపాడుకునేందుకు జగన్ ఓ వ్యూహకర్తను నియమించుకోవాలని యోచిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 2019 ఎన్నికలలో వైసీపీ విజయానికి అప్పడు పార్టీకి ఎన్నికల స్ట్రాటజిస్టుగా పని చేసిన ప్రశాంత్ కిషోరే కర్త, కర్మ, క్రియా అని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి. అయితే 2024 ఎన్నికలకు ముందు జరిగిన పరిణామాలను బట్టి చూస్తే ప్రశాంత్ కిషోర్ ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీ కోసం పని చేసే అవకాశాలు లేవు. పైపెచ్చు ప్రశాంత్ కిశోర్ సొంతంగా రాజకీయపార్టీ పెట్టుకుని బీహార్ రాజకీయాలకు పరిమితమైపోయారు. ఇంకెంత మాత్రం ఎన్నికల వ్యూహకర్తగా వేరే పార్టీలకు పని చేసేది లేదని విస్పష్టంగా ప్రకటించేశారు. దీంతో జగన్ వైసీపీకి వ్యూహకర్తగా సునీల్ కనుగోలును నియమిం చుకోవాలని భావిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సునీల్ కనుగోలు సామాన్యమైన వ్యక్తి కాదు. కర్నాటక, తెలంగాణ అసెంబ్లీలకు గత ఏడాది జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ విజయం సాధించడం వెనుక ఉన్నది ఆయన వ్యూహాలే. ముఖ్యంగా తెలంగాణ ఎన్నికలలో కాంగ్రెస్ విజయం కోసం ఆయన చేసిన కృషి ఎన్నదగ్గది. అభ్యర్థుల ప్రకటన నుంచి విజయం వరకూ కాంగ్రెస్ ను నడిపించింది సునీల్ కనుగోల్ వ్యూహాలే.  ఏది ఎలా చేయాలో.. ఏ లెక్కన చేయాలో.. ఎలా చెప్తే ప్రజలు వింటారో వెనకుండి నడిపించింది ఆయనే.  నిజానికి ఈ ఎన్నికలకు ముందు సునీల్ కనుగోలు పేరు పెద్దగా ఎవరికీ తెలియదు. కాస్త రాజకీయ పరిజ్ఞానం ఉన్న వారికి.. కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం సునీల్ పేరు తెలిసింది.  ఇక తెలంగాణలో ఎన్నికల ఫలితాల తరువాత   తెలుగు రాష్ట్రాలలో సునీల్ కనుగోలు పరిచయం అక్కర్లేని పేరుగా మారిపోయింది.   అటు వంటి సునీల్ కనుగోలును  వైసీపీ ఎన్నికల వ్యూహకర్తగా తెచ్చుకోవాలని జగన్ యోచిస్తున్నట్లు తెలు స్తోంది.  సొంతంగా పార్టీని గాడిలో పెట్టడం అసంభవమని భావిస్తున్న జగన్ సునీల్ కనుగోలు సహాయం తీసు కోవాలని భావిస్తున్నారు. ఇప్పటికే ఆయన అప్పాయింట్ మెంట్ కోసం ప్రయత్నిస్తున్నారని తెలు స్తోంది. అయితే సునీల్ కనుగోలు వ్యూహాలు పీకే వ్యూహాలకు పూర్తి భిన్నమైనవి. విధ్వంసం, కుట్రలు పీకే స్టైల్ అయితే వాస్తవాల ఆవిష్కరణ సునీల్ కనుగోలు స్టైల్. కర్నాటక, తెలంగాణ ఎన్నికలలో కాంగ్రెస్ గెలుపు వ్యూహాలను గమనిస్తే ఆ విషయం ఇట్టే అవగతమౌతుంది.  ఏపీలో 2019 ఎన్నికలలో జగన్ అధికారంలోకి రావడం కోసం ప్రశాంత్ కిశోర్  వైసీపీతో చేయించిన డ్రామాలు, దొంగ సర్వేలతో ప్రజలను బోల్తా కొట్టించడం, జగన్ తో పాదయాత్రలో చేయించిన ఫీట్లు, వివేకానందరెడ్డి హత్యను వైసీపీ ప్రచారానికి వాడుకోవడం, తండ్రి, బాబాయ్ మరణాలపై జగన్ తో చేయించిన యాక్టింగ్ ఇవన్నీ తెలుగు ప్రజలు అంత సులభంగా మర్చిపోయేవి కాదు. అందుకే పీకే అంత ఫేమస్ అయ్యారు. జగన్ ఆ ఎన్నికలలో విజయం సాధించి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే అటువంటి ఫీట్లకు, కుట్రలు, కుతంత్రాల వ్యూహాలకు   సునీల్ కనుగోలు  విరుద్ధం.  తెలంగాణ అసెంబ్లీకి గత ఏడాది జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ వ్యూహకర్తగా పని చేసిన సునీల్  కనుగోలు ఎక్కడా కాంగ్రెస్ పార్టీ నేతలను గెలుపుకోసం అడ్డదారులు తొక్కించలేదు. రాష్ట్రంలో కులం కుంపట్లు రగిలిం చలేదు. మతం మత్తులో ముంచలేదు. తెలంగాణ సెంటిమెంటుకు ఆస్కారం ఉన్నా దాని జోలికి  వెళ్ళలేదు. మత ప్రాతిపదికన చిచ్చు పెట్టి క్యాష్ చేసుకొనే ఛాన్స్ ఉన్నా ఆ ఊసే ఎత్తలేదు. ఏపీలో పీకే లాగా కోడికత్తుల్ని దించలేదు.. గొడ్డలితో గుండెపోట్లు రప్పించలేదు. చేసిందల్లా ఒక్కటే.. నిజాన్ని ప్రజ లకు అర్ధమయ్యేలా ఆవిష్కరించారు. అటువంటి సునీల్ కనుగోలు జగన్ పార్టీ కోసం పని చేస్తారా అంటే కచ్చితంగా చేయరు అనే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

తిరుమలలో ‘బంగారు కుటుంబం’

పూణెకి చెందిన నానా సాహెబ్ వాగ్‌చురే కుటుంబం మహారాష్ట్రలో అందరికీ పరిచయం వున్న సంపన్న కుటుంబం. ఈ కుటుంబంలోని ఇద్దరు సోదరులను ‘గోల్డెన్ గైస్’ అని పిలుస్తూ వుంటారు. ఈ కుటుంబానికి చెందిన వారు శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఒంటినిండా బంగారు ఆభరణాలు ధరించిన ఈ ఫ్యామిలీ.. శ్రీవారి దర్శనానికి వచ్చింది. పది గ్రాములు కాదు.. వంద గ్రాములు.. కాదు.. ఏకంగా వేల గ్రాముల్లో బంగారాన్ని ధరించి స్వామివారిని దర్శించుకుంది, చేతికి భారీ బంగారు కడియాలు, బ్రేస్‌లేట్లు, వేళ్లకు పెద్ద పెద్ద ఉంగరాలు, ఇక మెడలో అయితే అంతకుమించిన పెద్ద పెద్ద గోల్డ్‌ చైన్లు.. మొత్తంగా కిలోల కొద్దీ బంగారం ధరించి ఆ కుటుంబం శ్రీవారి దర్శనానికి వచ్చింది.  ఇద్దరు 10 కేజీల చొప్పున, మరొకరు 5 కేజీల చొప్పున దాదాపు 15 కోట్ల విలువైన బంగారం ధరించి శ్రీవారి దర్శనానికి వచ్చారు. దర్శనం అనంతరం బయట కు వచ్చిన ఆ గోల్డెన్ ఫ్యామిలీని చూసి అక్కడున్న భక్తులు.. నోటిన వేలు వేసుకున్నారు. ఒక నగల దుకాణమే తరలి వచ్చిందా అన్నట్టుగా ఆ ఫ్యామిలీ శ్రీవారి సన్నిధిలో స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచింది. దీంతో అక్కడున్న భక్తులు అబ్బో ఎంత బంగారమో అంటూ ఆశ్చర్యపోయారు. బంగారు నగల అలంకరణతో దగదగా మెరిసిపోతున్న ఆ ఫ్యామిలీతో సెల్ఫీ దిగేందుకు పోటీ పడ్డారు.  వాళ్ల ఒంటిపై మాత్రమే కాదు.. వారు వచ్చిన కారు కూడా గోల్డ్‌ కోటే. దీంతో వాళ్లు కారెక్కి వెళ్లేంత వరకు కూడా కనురెప్పలు మూయకుండా అలానే చూస్తూ ఉండిపోయారు భక్తులు. వారి రక్షణ కోసం సుమారు 15 మంది సెక్యూరిటీ సిబ్బంది రావడం విశేషం.

నల్గొండలో వైద్యుల నిర్లక్ష్యం ...కుర్చీలోనే మహిళ ప్రసవం

ఆర్టీసీ బస్సులో ప్రసవం జరిగిన కొద్ది రోజుల్లో తెలంగాణలో ఓ మహిళ ఆస్పత్రి కుర్చీలోనే ప్రసవించింది. పురిటినొప్పులు ఎక్కువైన మహిళకు సకాలంలో ప్రసవం చేయడంలో  వైద్యులు నిర్లక్ష్యం చేశారు.  నల్లగొండ జిల్లాలోని ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో అమాన‌వీయ ఘ‌ట‌న‌ చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యంతో కుర్చీలోనే ఓ మహిళ ప్రసవించింది. నేరడుగొమ్మ మండలానికి చెందిన నల్లవెల్లి అశ్విని అనే గర్భిణి గురువారం రాత్రి పురిటినొప్పులతో జిల్లాలోని దేవరకొండ ప్రభుత్వ ఆసుప‌త్రికి వెళ్లారు. అయితే, అక్కడ వైద్యులు లేక‌పోవ‌డంతో నల్గొండ ప్రభుత్వ ఆసుప‌త్రికి తీసుకెళ్లాలని అక్కడి సిబ్బంది రిఫ‌ర్ చేశారు. దాంతో దేవరకొండ నుంచి అశ్వినిని ఆమె కుటుంబ స‌భ్యులు అంబులెన్స్‌లో నల్గొండ జిల్లా ఆసుప‌త్రికి తీసుకెళ్లారు. అక్క‌డికి వెళ్లిన త‌ర్వాత ఆసుప‌త్రి సిబ్బంది వారిని ఇక్కడికి ఎందుకు వ‌చ్చారంటూ దుర్భాష‌లాడారు. మూడో కాన్పు అంటున్నారు క‌నుక‌ దేవరకొండలోనే చేయించక ఇక్కడి దాక రావడం అవ‌స‌ర‌మా అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడారు. అక్క‌డ డాక్ట‌ర్లు లేర‌ని, అందుకే ఇక్క‌డికి తీసుకొచ్చామ‌ని కుటుంబ స‌భ్యులు చెప్పారు.  ఇక‌ అశ్వినిని నర్సులు బయట కుర్చీలోనే కూర్చోబెట్టారు. పాపం.. నొప్పులు వస్తున్నాయ‌ని చెప్పిన అక్క‌డి సిబ్బంది ఎవరూ ఆమెను పట్టించుకోలేదు. ఆసుప‌త్రి సిబ్బంది నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించ‌డంతో తీవ్ర నొప్పులతో అశ్విని కుర్చీలోనే ప్రసవించింది. దాంతో కుర్చీ కింద తీవ్ర రక్త స్రావమైంది. అప్పుడు న‌ర్సులు హడావుడిగా వచ్చి ఆమెపైనే ఆగ్రహం వ్యక్తం చేస్తూ లోపలికి తీసుకెళ్లారు. ప్రస్తుతం తల్లిబిడ్డ క్షేమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.  ఇలా త‌న భార్య ప‌ట్ల‌ నిర్లక్ష్యం వ‌హించిన వైద్యులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని భర్త ఆంజనేయులు కోరారు. అయితే, ఈ విషయం తెలుసుకున్న జిల్లా అదనపు కలెక్టర్ పూర్ణ చందర్ వెంట‌నే ఆసుప‌త్రికి వచ్చారు. అస‌లేం జ‌రిగిందో అక్క‌డి సిబ్బందిని, బాధితుల‌ను అడిగి వివరాలు తీసుకున్నారు. బాధ్యులపై త‌ప్ప‌కుండా చర్యలు తీసుకుంటామ‌ని తెలిపారు.  

పిన్నెల్లికి కండీషన్డ్ బెయిల్!

మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి  ఏపీ హై కోర్టుకండీషన్డ్  బెయిల్ మంజూరు చేసింది . ఈవీఎం ధ్వంసం సహా రెండు కేసుల్లోనూ  పిన్నెల్లికి బెయిల్ మంజూరైంది. ఏపీలో  మే 13వ తేదీన జరిగిన ఎన్నికల్లో ఈవీఎం  ధ్వంసం, హత్యయత్నం కేసులు నమోదయ్యాయి. దీంతో పిన్నెల్లిని పోలీసులు జూన్ లో అరెస్టు చేశారు. అప్పటి నుంచీ పిన్నెల్లి జైలులోనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పిన్నెల్లి బెయిలు కోసం హైకోర్టును ఆశ్రయించారు. పిన్నెల్లి బెయిలు పిటిషన్ పై గురువారం (ఆసగ్టు 22) వాద ప్రతివాదనలు విన్న హైకోర్టు రిజర్వ్ చేసిన తీర్పును శుక్రవారం (ఆగస్టు 23)  వెలువరించింది. హైకోర్టును ఆశ్రయించడానికి ముందు  జిల్లా కోర్టు పిన్నెల్లి బెయిల్ పిటిషన్ ను రెండు సార్లు కొట్టివేసిన సంగతి విదితమే. అధికారం ఉంది కదా అని ఇష్టారీతిగా చెలరేగిపోయిన మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.. ఇప్పుడు తీవ్ర ఫ్రస్ట్రేషన్ లో, డిప్రషన్ లో కూరుకుపోయారు. పల్నాడు పులిని అంటూ విర్రవీగిన ఆయన ఇప్పుడు పిల్లిలా మారిపోయారు.  నెల్లూరు జైలులో ఉన్న పిన్నెల్లి.. ఎలాంటి షరతులకైనా కట్టుబడి ఉంటాను బెయిలు మంజూరు చేయండి చాలు అంటూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే పిన్నెల్లికి హైకోర్టు షరతులతో కూడిన బెయిలు మంజూరు చేసింది. 

అనిల్ అంబానిపై సెబీ నిషేధం

ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీపై సెబీ ఐదేళ్ల పాటు నిషేధం విధించింది.  నిషేధంతో పాటు అనిల్ అంబానీకి పాతిక కోట్ల జరిమానా కూడా విధించింది.  అంతే కాకుండా  స్టాక్ ఎక్స్చేంజీలో లిస్ట్ అయిన ఏ కంపెనీలోనూ డెైరెక్టర్, కీ మేనేజిరియల్ పర్సనల్ సహా మరేఇతర పదవి చేపట్టకుండా ఆంక్షలు విధించింది. అలాగే రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ ను సెక్యూరిటీస్ మార్కెట్ నుంచి 6 నెలల పాటు తొలగిస్తున్నట్లు తెలిపింది. ఈ కంపెనీకి రూ. 6 లక్షల జరిమానా కూడా విధించింది. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ లో పనిచేసే కీలక అధికారుల సహకారంలో అనిల్ అంబానీ అక్రమంగా నిధులను మళ్లించినట్లు సెబీ  పేర్కొంది. ఈ నిధులను ఆయనకే చెందిన ఇతర కంపెనీలకు లోన్లుగా ఇచ్చినట్లు తెలిపింది.  ఇలాంటి రుణాలను నిలిపివేయాలని, కార్పొరేట్ రుణాలను క్రమం తప్పకుండా సమీక్షించాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ  అనిల్ అంబానీ  ట్టించుకోలేదని సెబీ వెల్లడించింది.   రిలయన్స్ హైసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ నుంచి మోసపూరితమైన విధానంలో రుణాలు తీసుకున్న లేదా లబ్ధి పొందిన 24 ఎంటిటీలపైనా నిషేధం విధిస్తున్నట్లు సెబీ పేర్కొంది.    రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ తో పాటు సెబీ బ్యాన్ చేసిన కంపెనీల జాబితాలో రిలయన్స్ యూనికార్న్ ఎంటర్ ప్రైజెస్ , రిలయన్స్ ఎక్స్చేంజ్ నెక్స్ట్, రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ లిమిటెడ్ , రిలయన్స్ క్లీన్ జెన్ లిమిటెడ్, రిలయన్స్ బిజినెస్ బ్రాడ్ కాస్ట్ న్యూస్ హోల్డింగ్స్ లిమిటెడ్, రిలయన్స్ బిగ్ ఎంటర్ టైన్ మెంట్ ప్రైవేట్ లిమిటెడ్కంపెనీలకు కూడా రూ. 25 కోట్ల చొప్పున జరిమానా విధించినట్లు సెబీ తెలిపింది. 2022 ఫిబ్రవరి లోనే రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్, అనిల్ అంబానీతో పాటు మరో ముగ్గురిపై  సెక్యూరిటిస్ మార్కెట్ నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు తాత్కాలికంగా నిషేధం విధిస్తున్నట్లు సెబీ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన సంగతి విదితమే. 

బాధితులకు జగన్ రాబందు పరామర్శ!

అచ్యుతాపురం సెజ్ ప్రమాదంలో గాయపడిన అనేకమంది అనకాపల్లిలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తీవ్రగాయాలకు గురైన వాళ్ళందరూ బాధతో మూలుగుతున్నారు. వాళ్ళని ఆ పరిస్థితిలో చూసిన కుటుంబ సభ్యులు కన్నీరు పెట్టుకుంటున్నారు. ఇంతలో ఏదో హడావిడి... అన్నొచ్చాడు.. అన్నొచ్చాడు.. అని అరుపులు. అప్పుడు అక్కడకి ప్రవేశించాడు సదరు అన్న.. ఆ అన్న ఎవరో కాదు.. రాజకీయ రాబందు, శవరాజకీయాల ఎక్స్.పర్ట్ జగనన్న. ఈయనగారు లోపలకి రావడం రావడమే షిక్కటి షిరునవ్వుతో వచ్చాడు. మంచాల మీద బాధతో మూలుగుతున్నవాళ్ళ దగ్గరకి వెళ్ళి కిలకిలా నవ్వుతూ పలకరించాడు. కన్నీరుమున్నీరు అవుతున్న బంధువులను ‘హాయ్.. హవ్వార్యూ.. పార్టీ బాగా జరుగుతోందా’ అన్నట్టుగా నవ్వుతూ పలకరించాడు. అక్కడ జగన్ పరిస్థితి ఎలా వుందంటే, తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వాళ్ళని పరామర్శించడానికి వచ్చినట్టుగా లేదు. టెన్త్ క్లాస్ ఎగ్జామ్ పూర్తయిన తర్వాత సెలవులకి మేనమామ ఇంటికి వెళ్ళి, అక్కడున్న మరదలిని చూసి సిగ్గుపడుతున్న కుర్రాడిలా వుంది. ఆ షిక్కటి షిరునవ్వేంటో... ఆ సిగ్గుపడటం ఏంటో... ‘జగన్‌కి మెంటల్’ అని ఎవరైనా అంటే, ‘తప్పు.. అలా అనకూడదు’ అని వారించేవారికి కూడా డౌట్ వచ్చేలా జగన్ పరిస్థితి వుంది. మొత్తమ్మీద క్షతగాత్రులు, క్షతగాత్రుల బంధువులు ఈ నవ్వుల నత్తిపకోడీని చూసి బిత్తరపోయారు. ‘పరామర్శ’ అనే ఈ నవ్వుల ప్రహసనం ముగిసిన తర్వాత ఎప్పట్లాగే ఈ శవాన్వేషకుడు జగన్ మీడియా ముందుకు వచ్చి తనదైన శైలిలో చెత్తవాగుడంతా వాగాడు. అసలు విషయాన్ని వదిలేసి, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆ పథకంలో విఫలమైంది... ఈ పథకంలో విఫలమైంది అంటూ సంబంధం లేని టాపిక్‌ని అక్కడ వాంతులు చేసుకుని, ఆ తర్వాత అందరికీ తన షిక్కటి షిరునవ్వుతో నమస్కారాలు పెట్టుకుంటూ, ‘హమ్మయ్య.. నా శవాల ఆకలి తీరింది’ అని మనసులో అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. 

పిల్లి దారికి అడ్డం వస్తే ఏమౌతుంది ?

హజ్మత్ భాయ్: అబ్ మై  ఆఫీస్ కో నికల్ రూం. ఖుదాపీస్  హజ్మత్ భాయ్ భార్య:  ఖుదాఫీస్  హజ్మత్ భాయ్  ప్రయివేటు ఉద్యోగం చేస్తున్నాడు. భార్యకు చెప్పి ఆఫీసుకు బయలు దేరాడు. అప్పుడు దారికి అడ్డంగా పిల్లి వచ్చింది హజ్మత్ భాయ్  భార్య:  అజీ ఆప్ జరా ఆయియే  రాస్తే మే బిల్లీ ఆయీ అదే సమయంలో అక్కడ్నుంచి మౌలానా వెళుతున్నాడు. హజ్మత్ భాయ్ ను చూసి తన తక్రీర్ ( ప్రవచనం)ప్రారంభించాడు. మౌలానా: దేఖో యే ఆఖీదా కైసా హై బిల్లీ సామ్నే సే గయీ రస్తా బదల్  దేరా  అరే నక్కోరే భయ్  ఆజ్ కామ్ నై బన్తా   కతే .  అరే హజ్మత్ భాయ్   బిల్లీకే ఉపర్ అఖీదా హై అల్లాకే కలామ్ పే అఖీదా నయ్యే. కౌన్ లాయే యే పురానీ బాతే  . సబ్ బేకార్ బాతే హై . రసూల్ అల్లాకీ  బాత్ పర్ జరా భరోసా కరో . ఫిర్ అమల్ కరో . బేకార్ బాతో పే అఖీదా హై . గమ్మత్ కీ బాత్ హై ...    ‘‘మ‌నిషి అయినా లేదా జంతువు అయినా ఏడుపు అనేది సహజమైన ప్రక్రియ. భావోద్వేగంలో లేదా ఏదైనా శారీరక సమస్య ఉన్నప్పుడు కన్నీటి గ్రంధులు చురుకుగా మారతాయి. ఏడుపు అనేది నెగటివ్ ఎనర్జీకి సంబంధించిన అంశ‌మే. ఒక వ్యక్తి ఏడుస్తుంటే అది ఎట్టి పరిస్థితుల్లోనూ మంచిది కాదు. జంతువు ఏడుపును వ్యక్తపరచదు. అందుకే దాని చేష్ట‌ల‌ను బట్టి అది ఇబ్బందుల్లో ఉన్న‌ద‌ని మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మ‌నం పిల్లి ఏడుపు గురించి తెలుసుకుందాం. పిల్లి ఏడుపు గురించి చాలా క‌థ‌నాలు వినిపిస్తాయి. పిల్లి ఎందుకు ఏడుస్తుంద‌నే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లులను ఎవ‌రైనా పెంచుకునేంద‌కు వారి ఇంటికి తీసుకువ‌స్తే అది తన కుటుంబం నుండి విడిపోయినందుకు ఏడుస్తుంద‌ట‌. అది ఆ ఇంటిలోనివారితో క‌లిసిపోవ‌డానికి సమయం పడుతుంది. ఈలోపు అది ఒంటరితనంలో కుమిలిపోతూ ఏడుస్తుంద‌ట‌. అటువంటి ప‌రిస్థితి ఎదురైన‌ప్పుడు పిల్లి ఒత్తిడిలో కూరుకుపోతుంది. జంతువులు, మొక్కలు అనారోగ్యానికి గురవుతాయి. అయితే మ‌నిషి తన సమస్యను పదాలతో కమ్యూనికేట్ చేస్తాడు. అయితే జంతువు ఏడ‌వ‌డం ద్వారా తన సమస్యను వ్య‌క్తం చేస్తుంది. పిల్లి కూడా ఏడుస్తూ తన బాధను చెప్పుకోవడానికి ప్రయత్నిస్తుంది. వృద్ధాప్యంలో మనుషుల మాదిరిగానే జంతువులలో కూడా శారీరక సమస్యలు పెరుగుతాయి. పిల్లులు వృద్ధాప్యం కారణంగా ఇబ్బందుల‌ను ఎదుర్కొంటాయి. అందుకే అవి ఏడుస్తుంటాయి. గర్భం దాల్చిన పిల్లుల శరీరంలో అనేక మార్పులు కనిపిస్తాయి. ఆ మార్పులను ఎదుర్కోవడంలో పిల్లులు ఇబ్బంది పడతాయి. ఈ కారణంగా, ఆది ఉద్విగ్నతకు గురై ఏడుస్తుంది. పిల్లలు ఆక‌లితో ఉన్న‌ప్పుడు ఏడుస్తాయి. పిల్లులు నిజంగా రాత్రిపూట ఎక్కువగా ఏడుస్తాయా? అనే ప్ర‌శ్న‌కు నిపుణులు సమాధానమిచ్చారు. పిల్లి ఒంట‌రిత‌నానికి గురైన‌ప్పుడు ఏడుస్తుందని తెలిపారు. పిల్లి ఏడుపు ప్రతికూల శక్తిని సృష్టిస్తుందని కొంద‌రు నమ్ముతారు. కుటుంబానికి ఇది ఏమాత్రం మంచిది కాద‌ని చెబుతారు. తంత్ర-మంత్ర అభ్యాసకులు పిల్లిని నెగిటివ్ శక్తికి చిహ్నంగా భావిస్తారు. పిల్లి ఏడ్చినట్లయితే ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయని చెప్పేవారు కూడా ఉన్నారు. భవిష్యత్తులో జరగబోయే సంఘటనలను పిల్లి ముందే త‌న ఏడుపు ద్వారా చెబుతుంద‌ని కూడా అంటారు. అయితే సైన్స్‌ని నమ్మేవాళ్లు ఇలాంటి న‌మ్మకాల‌ను కొట్టిపారేస్తారు’’ అని మౌలానా వివరించారు.  ఔరేక్ బాత్ కాలీ బిల్లీ కా కౌఫ్ లోగోంమే గలత్ ఫైమీ హై.  ఇన్సానోమే జో రంగ్ హై జాన్వర్ మే బీ హై. అల్లాకీ మర్జీ హై యే. సమ్జో మేరే బడే భాయ్ ..  మౌలానా చెప్పిన మాటలు హజ్మత్ బాయ్ ను ఆలోచింప జేసాయి.  - బదనపల్లి శ్రీనివాసాచారి

మరికొద్ది రోజుల్లో బట్టబయలు కాబోతున్న తమ్మినేని నకిలీ డిగ్రీ సర్టిఫికెట్ బాగోతం!?

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం చదువు కొన్నారా? చదువుకున్నారా? అన్న విషయం త్వరలో తేలిపోనుంది. వాస్తవానికి రాజకీయాలలో రాణించాలంటే, ఉన్నత పదవులను నిర్వహించాలంటే చదువుతో సంబంధం లేదు. పంచాయతీ బోర్డు సభ్యుడికైనా, ప్రధానికైనా కూడా విద్యార్హతలు మస్ట్ ఏమీ కాదు. అక్షరాస్యతతో సంబంధం లేకుండా ఎన్నికలలో పోటీ చేయవచ్చు. ప్రజలు ఓటేసి గెలిపిస్తే చాలు ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి, ముఖ్యమంత్రి, ప్రధాని ఇలా ఏ పదవి అయినా పొందే అవకాశం ఉంటుంది. పదవులకు చదువులు, డిగ్రీలు అవసరం లేదు. అయినా కూడా రాజకీయ నాయకుల విద్యార్హతల విషయంలో తరచూ వివాదాలు తలెత్తుతూనే ఉన్నాయి.    ప్రధాని నరేంద్ర మోడీ డిగ్రీలపై వివాదం తెలిసిందే.  మోడీ విద్యార్హతలు, డిగ్రీలకు సంబంధించిన సమాచారం కోసం సమాచార హక్కు చట్టం కింద   ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్  ప్రయత్నించి విఫలమయ్యారు పబ్లిక్ డొమైన్ లో ఉన్న సమాచారాన్ని పదే పదే అడిగి సమాచార కమిషన్ సమయాన్ని వృధా చేస్తున్నారని భావించిన న్యాయస్థానం అరవింద్ కేజ్రీవాల్‌ కు పాతికవేల రూపాయల జరిమానా విధించింది. ఇక కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ సహా పలువురు ముఖ్య నేతలకు సంబందించిన విద్యార్హతల విషయంలోనూ వివాదాలు, విచారణలు జరిగాయి. జరుగుతున్నాయి. ఆ జాబితాలో  ఆంధ్ర ప్రదేశ్ మాజీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని  సీతారాం కూడా ఉన్నారు.   తమ్మినేని సీతారాం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ గా ఉన్న సమయంలోనే ఆయన నకిలీ డిగ్రి సర్టిఫికెట్ కొనుగోలు చేసినట్లుగా తెలంగాణ తెలుగుదేశం నేతలు ఆరోపించారు. అప్పట్లో ఆధారాలతో సహా వారు చేసిన ఆరోపణ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో  సంచలనంగా సృష్టించాయి. తమ్మినేని సీతారాం డిట్రీ చదవలేదు.. చదవకుండానే  హైదరాబాద్‌లోని ఒక న్యాయ కళాశాలలో నకిలీ డిగ్రీ సర్టిఫికేట్ తో న్యాయశాస్త్రం విద్యార్ధిగా  చేరారు. ఈ అంశంపై ఆర్టీఐ చట్టం ద్వారా తెలంగాణ  తెలుగుదేశం నేత నర్సిరెడ్డి వివరాలు సేకరించారు.  తీగ లాగితే డొంక కదిలిందన్న చందంగా, తమ్మినేని సీతారాం  విద్యార్హతలు ఏమిటన్న వివరాలు తెలుసుకుంటే అసలు విషయం బయట పడిందని తెలంగాణ టీడీపీ నేతలు అప్పట్లో పేర్కొన్నారు. తమ్మినేని డిగ్రీ చదవలేదు, కానీ, చదివినట్లుగా ఒక నకిలీ సర్టిఫికేట్ సంపాదించారు. ఆ నకిలీ సర్టిఫికేట్ అర్హతగా  లా కాలేజీలో ప్రవేశం పొందారు. ప్రవేశ దరఖాస్తుకు  ఆ నకిలీ సర్టిఫికేట్ జతచేసి  లా కళాశాలలో ప్రవేశం పొందారు. ఆయన ఏ స్టడీ సెంటర్లలో అయితే డిగ్రీ చేసినట్లు చూపించారో, ఆ స్టడీ సర్కిల్లో ఆయన  చదవ లేదని వెరిఫికేషన్ లో తేలిందని..  డిగ్రీ సర్టిఫికెట్‌లో చెప్పిన హాల్ టిక్కెట్ నెంబర్ కూడా లేదని నర్సిరెడ్డి చెబుతున్నారు. దీనిపై సమగ్ర విచారణ చేయాలని… నకిలీ డిగ్రీ సృష్టించి ఉంటే.. ఆయనపై చర్యలు తీసుకోవాలని అప్పట్లోనే నర్సిరెడ్డి డిమాండ్ చేశారు.    వాస్తవానికి తమ్మినేని సీతారాం డిగ్రీ చదవక పోయినా ఆయన స్పీకర్ కావడానికి ఎటువంటి అవరోధం ఉండదు. ఆయన ఎమ్మెల్యేగా ఎన్నిక కావడానికి ఎటువంటి ఆటంకం ఉండదే. అయితే వివాదం ఏమిటంటే ఆయన తన ఎన్నికల అఫిడవిట్ లో  తప్పుడు సమాచారం ఇచ్చారన్నదే. తమ్మినేని ఎన్నికల అఫిడవిట్ లో పొందుపరిచింది తప్పుడు డిగ్రీ సర్టిఫికెట్ అని తేలితే మాత్రం ఆరేళ్ల పాటు ఎన్నికలలో పోటీ చేసేందుకు వీలు లేకుండా అనర్హత వేటు పడుతుంది.   ఆమదాలవలస మాజీ ఎమ్మెల్యే తమ్మినేని సీతారాం   డిగ్రీ నకిలీ సర్టిఫికెట్ తో హైదరాబాదు, ఎల్బీనగర్ లో గల మహాత్మా గాంధీ  లా కాలేజీలో మూడు సంవత్సరాల లా డిగ్రీ అడ్మిషన్ పొందారంటూ 2022లోనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇందుకు సంబంధించి రాష్ట్రపతికి కూడా ఫిర్యాదు అందింది. దానిపై రాష్ట్రపతి కార్యాలయం నుంచి అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తమ్మినేని సీతారాం నకిలీ డిగ్రీ సర్టిఫికెట్ పై విచారణ చేయాల్సిందిగా లేఖ కూడా వచ్చింది. అయితే అప్పటి వైసీపీ ప్రభుత్వం స్పందించలేదు. ఇప్పుడు రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి అధికారంలో ఉంది. దీంతో తమ్మినేని నకిలీ డిగ్రీ సర్టిఫికెట్, అందుకు సంబంధించిన అన్ని ఆధారాలతో సహా రాష్ట్రపతి కార్యాలయం నుంచి విచారణ జరపాల్సిందిగా అప్పటి ప్రభుత్వ సీఎస్ కు వచ్చిన లేఖను పొందుపరిచి ప్రస్తుత సీఎస్ నీరభ్ కుమార్ కు  అముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్, శ్రీకాకుళం జిల్లా తూర్పు కాపు సాధికార కమిటీ కన్వీనర్ పల్లి సురేష్ లు తాజాగా  ఫిర్యాదు చేశారు. దీంతో మాజీ స్పీకర్  తమ్మినేని సీతారాం నకిలీ డిగ్రీ వ్యవహారంపై   విచారణ జరగనుంది. ఆయన చదువు కొన్నారా, చదువుకున్నారా అన్నది త్వరలో బయటపడనున్నది.  

తెల్ల రేషన్ కార్డుదారులకు జనవరి నుంచి సన్నబియ్యం!

తెలంగాణలో తెల్ల రేషన్ కార్డుదారులకు వచ్చే ఏడాది జనవరి నుంచి సన్నబియ్యం పంపిణీ కానున్నది. ఈ విషయాన్ని  మంత్రి   ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా వెల్లడించారు.   పౌరసరఫరాల శాఖకు పై మంత్రి గురువారం (ఆగస్టు 22) సమీక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుదారులందరికీ నాణ్యమైన బియ్యం అందించడమే లక్ష్యంగా జనవరి నుంచి సన్న బియ్యం పంపిణీ చేయనున్నట్లు  వెల్లడించారు.   రాష్ట్రవ్యాప్తంగా డిమాండ్లు నెరవేరేలా చూసేందుకు అవసరమైన చోట సబ్సిడీ ధరలకు గోధుమలను సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. రేషన్ డీలర్ల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించి వారికి ప్రోత్సాహకాలు అందజేస్తుందన్నారు.   ప్రజాపంపిణీ వ్యవస్థ (పీడీఎస్‌) బియ్యాన్ని పక్కదారి పట్టిస్తే సహించేది లేదని, డీలర్‌షిప్‌ రద్దు చేస్తామని మంత్రి హెచ్చరించారు. పీడీఎస్ బియ్యం అక్రమ వ్యాపారం జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారును ఆదేశించారు. అలాగే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1,629 రేషన్‌ డీలర్ల భర్తీకి చర్యలు చేపట్టాలని సూచించారు. హాస్టళ్లు, అంగన్వాడీ కేంద్రాలలో భోజనంలో నాణ్యత ఉండాలని.. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంలోనూ నాణ్యత పాటించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులకు దిశా నిర్దేశం చేశారు. 

ఒకే వేదికపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు!

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరో సారి భేటీ కానున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలు ఆదివారం (ఆగస్టు 25) ఒకే వేదికపైకి రానున్నారు. శాంతి సరోవర్ ద్విదశాబ్ది వార్షికోత్సవంలో ఇరువురు నేతలూ పాల్గొననున్నారు.  అంటే నెలన్నర   వ్యవధిలో  తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇరువురూ రెండో సారి ముఖాముఖి చర్చలు జరిపే అవకాశం ఉంది.   ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జులై నెలలో భేటీ అయిన సంగతి విదితమే. విభజన సమస్యలపై పరిష్కారం కోసం గత నెలలో ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య భేటీ జరిగింది. విభజన సమస్యలపై చర్చకు ఏపీ సీఎం చంద్రబాబు ప్రతిపాదించడం..  రేవంత్ రెడ్డి వెంటనే అంగీకరించడంతో  వీరిద్దరి మధ్య భేటీ సుహృద్భావ వాతావరణంలో జరిగింది. గత నెల ఆరో తేదీన హైదరాబాద్‌లోని ప్రజాభవన్ వేదికగా జరిగిన ఈ భేటీలో రెండు రాష్ట్రాలకు చెందిన మంత్రులు, ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. విభజన సమస్యలపై చర్చించారు. సమస్యల పరిష్కారం కోసం కమిటీలు వేయాలని నిర్ణయం తీసుకున్నారు. మంత్రులతో ఒక కమిటీని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల స్థాయిలో మరో కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే గంజాయి సరఫరాను అడ్డుకునేందుకు చర్యలు తీసుకోవాలని కూడా ఆ భేటీ సందర్భంగా రెండు ప్రభుత్వాలు నిర్ణయించాయి.   జులై ఆరో తేదీ భేటీ తర్వాత ఈ నెల 25న మరో సారి ఇరువురు ముఖ్యమంత్రులూ ఎదురుప డుతున్నారు. హైదరాబాద్ వేదికగా జరిగే శాంతి సరోవర్ ద్విదశాబ్ది ఉత్సవాలలో ఇరువురూ పాల్గొంటు న్నారు. అధికారికంగా ఇరువురి మధ్యా చర్చలు జరుగుతాయన్న సమాచారం లేకపోయినప్పటికీ, ఒకే వేదికపై ఎదురుపడిన సందర్భంగా ఇరువురూ విభజన సమస్యల పరిష్కారంపైనే మాట్లాడుకునే అవకాశం ఉంది. అంటే గత నెల 6న జరిగిన భేటీకి కొనసాగింపుగానే చర్చలు ఉంటాయనీ, ఈ భేటీతో విభజన సమస్యల పరిష్కారం దిశగా మరో ముందడుగు పడుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వారాంతం సమీపిస్తుండటంతో తిరుమలేశుని దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. గురువారం (ఆగస్టు 22) శ్రీవారిని మొత్తం 63 వేల 202 మంది దర్శించుకున్నారు. వారిలో 34 వేల 57 మంది తలనీలాలు సమర్పించుకున్నారు . శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 4 కోట్ల 37 లక్షల రూపాయలు వచ్చింది. ఇకు శుక్రవారం (ఆగస్టు 23) భక్తుల రద్దీ మరింత పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం ఎదురు చూస్తున్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయాయి. భక్తుల క్యూలైన్ టీబీసీ వర్ూ సాగింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలకు పైగా సమయం పడుతోంది. 

పతనం అంచున కడప వైసీపీ.. అవినాష్‌తో జగన్‌కి చెడిందా?

అవినాష్ రెడ్డి దూరం జరిగారా? జగన్ దూరం పెట్టారా?.. కడపలో ఏం జరుగుతోంది? ఇటీవలి ఎన్నికలలో  చరిత్ర ఎరుగని అపజయాన్ని  సొంతం చేసుకున్న వైసీపీ.. ఇప్పుడు కడప జెడ్పీని కూడా కోల్పోబోతోందా?  ఐదేళ్లు అధికారంలో ఉన్న జగన్ తన అరాచక, అస్తవ్యస్థ పాలనతో ప్రజావ్యతిరేకత, ఆగ్రహాన్నీ మూటగట్టుకోవడమే ఘోర పరాజయానికి కారణం. జగన్ పై, వైసీపీపై ప్రజాగ్రహం ప్రాతాలకు అతీతంగా వ్యక్తం అయ్యింది. వైసీపీకి కంచుకోటలాంటి రాయలసీమలో కూడా ఆ పార్టీ పునాదులు కదిలిపోయాయి. చివరికి సొంత జిల్లా కడపలోనూ వైసీపీకి దిమ్మతిరిగే ఫలితాలే వచ్చాయి.  జగన్ సొంత జిల్లా కడపలో వైసీపీ ఇప్పుడు ఎదురీదుతోంది.  ఇటీవలి ఎన్నికలలో కడపలో సత్తా చాటిన తెలుగుదేశం ఇప్పుడు  జడ్పీ పీఠంపై కన్నేసింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలు మునిసిపాలిటీలు, కార్పొరేషన్లు, పంచాయతీలలో వైసీపీ ఖాళీ అయిపోయింది. చివరికి కడప జెడ్పీ కూడా చేజారిపోతే ఆబోరు దక్కదని భావించిన జగన్   కడప జడ్పీటీసీలతో సమావేశం అయ్యారు.  కడపలో పార్టీ బలోపేతానికి అంటూ సొంత మేనమామ రవీంద్రనాథ్ రెడ్డికి  కడప జిల్లా వైసీపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు.   జగన్ నిర్ణయం పార్టీ వర్గాలను విస్మయపరిచింది. ఇప్పటి వరకూ కపడ జిల్లాకు సంబంధించినంత వరకూ పార్టీ వ్యవహారాలన్నీ ఎంపీ అవినాష్ రెడ్డేవరకు కడప వ్యవహారాలన్నీ ఎంపీ అవినాష్ రెడ్డి చూసుకునేవారు. అయితే ఇటీవలి ఎన్నికలలో పార్టీ పరాజయం పాలై, అధికారం కోల్పోయిన తరువాత నుంచీ అవినాష్ రెడ్డి పార్టీ వ్యవహారాలను పట్టించుకోవడం లేదు. ఇదే విషయంగా కడప జిల్లా వైసీపీ వర్గాలు ఒకింత ఆగ్రహంతో కూడా ఉన్నాయి. అయినా పార్టీ అధికారం కోల్పోవడంతో అవినాష్ రెడ్డి కేసుల భయంతో వణికిపోతూ పార్టీ కార్యక్రమాలకే కాదు, కడప జిల్లాకే దూరంగా ఉంటున్నారని అంటున్నారు. ముఖ్యంగా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో పూర్తిగా ఇరుక్కున్న ఆయన అరెస్టు తప్పదన్న ఆందఓళనలో  రాజకీయంగా పూర్తిగా ఇన్ యాక్టివ్ అయ్యారని చెబుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో అవినాష్ రెడ్డికి ధైర్యం చెప్పి పోలిటికల్ గా యాక్టివ్ చేయాల్సిన జగన్ అందుకు భిన్నంగా అవినాష్ ను పక్కన పెట్టి సొంత మేనమాకకు కడప జిల్లా పగ్గాలు అప్పగించడం ఇప్పుడు రాజకీయవర్గాలలో  చర్చనీయాంశంగా మారింది.  జగన్ కు అవినాష్ రెడ్డి దూరం జరిగారా? లేక అవినాష్ ను ఇంకా వెనకేసుకు వస్తే బాబాయ్ హత్య కేసు తన మెడకు చుట్టుకుంటుందన్న భయంతో జగన్ కూడా అవినాష్ ను దూరం పెడుతున్నారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అలాగే జిల్లాలో షర్మిల హవాను తగ్గించడంలో భాగంగా వ్యూహాత్మకంగా జగన్ రవీంద్రనాథ్ రెడ్డికి జిల్లా పార్టీ పగ్గాలు అప్పగించారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే తల్లి విజయమ్మ సహా పలువురు వైఎస్ కుటుంబీకులు షర్మిలకు బాసటగా నిలిచారు. ఈ నేపథ్యంలో మేనమామకు జిల్లా పార్టీ పగ్గాలు అప్పగించడం ద్వారా షర్మిలకు మద్దతుగా విజయమ్మ బహిరంగ ప్రకటనలకు దూరంగా ఉంటారన్నది జగన్ వ్యూహంగా పరిశీలకులు చెబుతున్నారు. మొత్తం మీద కడప జిల్లాలో వైసీపీకి గడ్డు పరిస్థితులు నెలకొన్నాయనడానికి పార్టీ జిల్లా పగ్గాలు రవీంద్రనాథ్ కు అప్పగించడమే నిదర్శనమని చెబుతున్నారు.