జీవన్ రెడ్డి ముఖ్య అనుచరుడి  మర్డర్ కేసులో  సంతోష్ అరెస్ట్

కాంగ్రెస్ ఎంఎల్ సి జీవన్ రెడ్డి ముఖ్య అను చరుడు గంగారెడ్డి హంతకుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. అందరూ అనుమానిస్తున్న సంతోష్ పోలీసులకు పట్టుబడ్డాడు. రెండు రోజుల క్రితం జగిత్యాలలో 58 ఏళ్ల గంగారెడ్డి హత్యకు గురయ్యాడు. హత్యను నిరసిస్తూ జీవన్ రెడ్డి జగిత్యాల బస్టాండ్ లో ధర్నా చేసిన సంగతి తెలిసిందే. తాను కాంగ్రెస్  పార్టీకి గుడ్ బై చెబుతానని మీడియా సమావేశంలో జీవన్ రెడ్డి ప్రకటించారు. జగిత్యాలలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఉందా అని జీవన్ రెడ్డి ముఖ్యమంత్రిని నిలదీశారు.  ఈ నేపథ్యంలో జగిత్యాల మర్డర్ పై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ గా తీసుకుంది. ఆధారాలను సేకరించిన పోలీసులకు సంతోష్ హత్యకు పాల్పడినట్లు  తేలింది. హంతకుడు  సంతోష్ అని  పోలీసులు ధృవీకరించారు. ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారు.  ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకోవడంతో సంతోష్ అరెస్టయ్యాడు అయితే జీవన్ రెడ్డి తన రాజీనామాను ఉపసంహరించుకున్నట్లు తెలుస్తోంది.

ఉత్తరాంధ్రకు దానా తుపాను ముప్పు

దానా తుపాను ఉత్తరాంధ్రకు పెనుముప్పుగా పరిణమించనుందా. తీవ్ర తుపానుగా మారిన దానా గురువారం (అక్టోబర్ 24) అర్ధరాత్రి లేదా శుక్రవారం (అక్టోబర్ 25) తెల్లవారు జామున ఒడిశాలోని పూరి, పశ్చిమబెంగాల్ లోని సాగర్ ద్వీపాలకు మధ్యలో తీరం దాటే అవకాశం ఉంది.  ఈ తుపాను ప్రభావంతో  ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తుపాను తీరం దాటే సమయంలో ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలలో గంటకు 120 కిలోమీటర్లకు మించిన వేగంతో పెనుగాలులు వీస్తాయనీ, పలు ప్రాంతాలలో 20 సెంటీమీలర్లకు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయనీ పేర్కొన్న భారత వాతావరణ శాఖ ఏపీకి కూడా భారీ వర్షాల ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది.  ముఖ్యంగా  ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం జిల్లాల్లో  అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.  భారీ వర్షాల నేపథ్యంలో కృష్ణపట్నం, నిజాంపట్నం, మచిలీపట్టణం, కాకినాడ, గంగవరం, విశాఖపట్టణం, కళింగపట్టణం పోర్టుకు రెండో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీచేశారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందనీ, మత్స్య కారులు చేపల వేటకు వెళ్లవద్దనీ హెచ్చరించింది.  దానా తుపాను నేపథ్యంలో గత రాత్రి 8 గంటల నుంచి నేటి ఉదయం 10 గంటల మధ్య ఈస్ట్రన్ సీల్దా డివిజన్‌లో 190 రైళ్లను రద్దు చేశారు. దక్షిణ మధ్య రైల్వేలోనూ 14 రైళ్లు రద్దయ్యాయి.

పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా లోకేష్ అమెరికా పర్యటన

ఆంధ్రప్రదేశ్ లో గత ఐదేళ్ల జగన్ పాలన పారిశ్రామిక రంగానికి చీకటి కాలంగా పరిణమించింది. ఒక్క పారిశ్రామిక రంగం అనేమిటి జగన్ హయాంలో ఆంధ్రప్రదేశ్ అన్ని విధాలుగా అధ:పాతాళానికి పడిపోయింది. రాజధాని అమరావతి నిర్వీర్యం అయిపోయింది. రాష్ట్రానికి జీవనాడి లాంటి పోలవరం నిలిచిపోయింది. వ్యవసాయం పడకేసింది. శాంతి భద్రతలు గాలిలో దీపంగా మారాయి. జనం భయం గుప్పిట్లో వణికిపోతూ కాలం గడిపారు. ఉద్యోగ, ఉపాధి కల్పన మాటే వినిపించలేదు. ఇదేమిటంటూ ఎవరైనా ప్రశ్నిస్తే జైళ్లు నోళ్లు తెరిచాయి. పరిశ్రమలు రాష్ట్రం నుంచి తరలిపోయాయి. సమాజంలోని అన్ని వర్గాలూ జగన్ ఐదేళ్ల హయాంలో కష్టాల కడలిలో కాలం గడిపారు.  రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం తిరిగి అధికార పగ్గాలు చేపట్టగానే.. కష్టాలు ఒక్కటొక్కటిగా వీడుతున్నాయి. రాష్ట్రం మళ్లీ ప్రగత పథంలో పరుగులు పెడుతోందన్న నమ్మకం కలిగింది. ఇక రాష్ట్ర ఆదాయానికీ, ప్రగతికీ, పురోభివృద్ధికీ, యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పనకూ అత్యంత కీలకమైన పారిశ్రామిక రంగం పుంజుకుంటోంది. గత ఐదేళ్లుగా రాష్ట్రంలో పడకేసిన పారిశ్రామిక రంగం ఇప్పుడిప్పుడే గాడిలో పడుతోంది. తరలిపోయిన పరిశ్రమలు ఒక్కొక్కటిగా రాష్ట్రానికి తరలి వస్తున్నాయి. ఇక మరిన్న పరిశ్రమలు, పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, మానవవనరుల అభివృద్ధి శాఖల మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటనకు శ్రీకారం చుట్టారు. శుక్రవారం (అక్టోబర్ 25) నుంచి వారం రోజుల పాటు ఆయన అమెరికాలో పర్యటించనున్నారు.  పెట్టుబడుల ఆకర్షణ ద్వారా పెద్దఎత్తున ఉద్యోగావకాశాలు  కల్పించి రాష్ట్రంలోని కోట్లాది మంది యువత ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడమే లక్ష్యంగా లోకేష్ పర్యటన సాగనుంది. అందులో భాగంగా ఈ నెల 29న లాస్‌వెగాస్‌లోని సీజర్స్ ప్యాలెస్‌లో ఐటి సర్వ్ అలయెన్స్ సంస్థ 'సినర్జీ' పేరుతో నిర్వహించే కీలక  వార్షిక సమావేశానికి మంత్రి లోకేశ్ ముఖ్య అతిథిగా హాజరు అవుతున్నారు. ఈ సమావేశానికి ఐటీ సేవల పరిశ్రమకు చెందిన 3 వేల చిన్న, మధ్య తరహా పారిశ్రామికవేత్తలు హాజరుకానున్నారు. సినర్జీ 2024 అనేది ముఖ్యంగా ఐటీలో ప్రభావవంతమైన పారిశ్రామికవేత్తలు, ఆవిష్కర్తలు, కీలక వాటాదారులు హాజరౌతారు.  అమెరికా మాజీ అధ్యక్షులు బుష్, బిల్ క్లింటన్, సెక్రటరీ హిల్లరీ క్లింటన్, స్టీవ్ ఫోర్బ్స్, కెవిన్ ఓ లియరీ వంటి  స్పీకర్లను సినర్జీ హోస్ట్ చేస్తుంది. ఇటువంటి సదస్సుకు ఏపీ ఐటి, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ల మంత్రిగా  పాలనలో సాంకేతికను జోడించి డిజిటల్ విధానాలను అమలు చేస్తున్న మంత్రి లోకేశ్‌ను విశిష్ట అతిథిగా  సినర్జీ ఆహ్వానించింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సాంకేతిక రంగాల్లో కీలక వ్యక్తిగా, డిజిటల్ ఆవిష్కరణలను ప్రోత్సహించడం, స్టార్టప్‌లకు మద్దతు ఇవ్వడంలో లోకేశ్ చొరవ... ఆర్థికాభివృద్ధిలో  కీలకంగా మారిందని గుర్తించిన సినర్జీ ప్రతినిథులు  పాలనలో సాంకేతికత పాత్ర, యువత, వ్యవస్థాపకుల సాధికారతపై   లోకేశ్ ను ప్రసంగించాల్సిందిగా కోరింది.    ఆ సదస్సులో పాల్గొనడమే కాకుండా లోకేష్ అమెరికా పర్యటనలో పలు సంస్థల ప్రతినిథులు, పెట్టుబడిదారులతో వరుస భేటీలు కానున్నారు. శుక్రవారం అక్టోబర్ 25) ఆయన శాన్ ఫ్రాన్సిస్కోలో ఒరాకిల్ ప్రతినిథులతో భేటీ అవుతారు.  అలాగే శనివారం (అక్టోబర్ 26)  పత్ర, సినర్జీస్, బోసన్, స్పాన్ ఐఓ, క్లారిటీ సంస్థల ప్రతినిధులతో భేటీ. అనంతరం భారత కాన్సులేట్ జనరల్ తో సమావేశం అవుతారు. ఆ తరువాత ఎడోబ్, స్కేలర్, జనరల్ అటమిక్స్ ప్రతినిధులతో చర్చలు జరుపుతారు. ఆ మరుసటి రోజు ఆదివారం అంటే అక్టోబర్ 27న ఆస్టిన్ లో పలు కంపెనీల ప్రతినిధులతో సమావేశం అవుతారు.  28న శాన్ ఫ్రాన్సిస్కోలో మైక్రోసాఫ్ట్ ప్రతినిధులతో సమావేశం అవుతారు. ఆ మరుసటి రోజు అంటే అక్టోబర్ 29న లాస్ వెగాస్ లో ఇటీ సర్వ్ సినర్జీ సదస్సులో ప్రసంగిస్తారు. అలాగే అమెజాన్, రేవాచర్, సేల్స్ ఫోర్స్, పెప్సికో ప్రతినిధులతో భేటీ అవుతారు. అక్టోబర్ 30న లాస్ వెగాస్ లోని గూగుల్ క్యాంపస్ ను సందర్శిస్తారు. అలాగే స్టార్టప్స్, ఎంటర్ పెన్యూర్స్ తో భేటీ అవుతారు. అక్టోబర్ 31న జార్జియాలోని శినిమౌంటేన్ లో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. నవంబర్ 1న న్యూయార్క్ లో పెట్టుబడి దారులతో సమావేశం అవుతారు.  ఆంధ్రప్రదేశ్ కు భారీ స్థాయిలో పెట్టుబడులు పరిశ్రమలను ఆకర్షించి రాష్ట్ర ప్రగతికి బాటలు వేయడమే తన పర్యటన లక్ష్యమని లోకేష్ చెప్పారు.   తన అమెరికా పర్యటనకు ఒక రోజు ముందు లోకేష్ దక్షిణ కొరియాకు చెందిన ఎగ్జిమ్ బ్యాంక్ ప్రతనిధులతో భేటీ అయ్యారు. సచివాలయంలోని తన ఛాంబర్ లో జరిగిన ఈ భేటీలో లోకేష్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి కోసం చేపట్టని చర్యలు, పరిశ్రమల స్థాపనకు ముందకు వచ్చే వారికి ఇస్తున్న రాయతీల గురించి వారికి వివరించారు.   లోకేష్ ప్రజంటేషన్ కు ముగ్ధులైన ఎగ్జిమ్ బ్యాంక్ ప్రతినిధులు రాష్ట్రంలో పెట్టుబడులకు అన్ని విధాలుగా సహకారం అందించేందుకు అంగీకరించారు.  

వైసీపీకి మాజీ హోంమంత్రి సుచరిత గుడ్ బై.. పార్టీలో ఎవరైనా మిగులుతారా?

వైఎస్ తరచూ చెప్పే దేవుడి స్క్రిప్ట్ అంటే అర్ధం ఏమిటో ఇప్పుడిప్పుడే  జగన్ కు తెలుస్తోంది. అధికారం ఉందన్న అహంకారంతో అరాచకాలకు, దౌర్జన్యాలకు పాల్పడితే ఎంతటి వారైనా సరే కర్మ అనుభవించక తప్పదని అవగతమౌతోంది. జగన్ తో అంటకాగి, ఆయన కళ్లల్లో ఆనందం చూడటానికీ, ఆయన దృష్టిలో పడటానికీ ఇష్టారీతిగా వ్యవహరించి, అడ్డగోలుగా ప్రత్యర్థులపై అనుచిత విమర్శలు చేసి, దూషణలకు పాల్పడిన ఒక్కొక్కరికీ ఇప్పుడు బొమ్మ కనబడుతోంది. కాళ్ల కింద భూమి కదిలిపోతోంది. నోరెత్తడానికే భయంతో వణికి పోతున్న పరిస్థితి.  ఇటీవలి ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయాన్ని, పరాభవాన్ని ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. కనీసం విపక్ష హోదా కూడా లేకుండా కేవలం 11 స్థానాలతో ఆ పార్టీ దయనీయంగా మిగిలింది. ఈ ఓటమి తరువాత ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరుగా జగన్ తీరును విమర్శిస్తూ, తమ రాజకీయ భవిష్యత్ ను వెతుక్కుంటూ వైసీపీని వీడుతున్నారు. ఎన్నికలలో పరాజయం తరువాత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో మొదలైన వలసన పరంపర ఇప్పుడు ఉధృతమైంది. ఆ పార్టీలో జగన్ వినా ఎవరైనా ఉంటారా అన్న అనుమానాలు రాజకీయవర్గాలలో వ్యక్తం అవుతున్నాయంటూ జగన్ కు దూరం అవుతున్న వైసీపీ నేతల సంఖ్య ఎంత పెద్దగా ఉందో అర్ధమౌతుంది. ఇప్పటికే వైసీపీ క్యాడర్ చెల్లా చెదురైపోయింది. ఆ పార్టీ ఏదైనా కార్యక్రమానికి పిలుపునిస్తే కదలి వచ్చే కార్యకర్తలు కరవయ్యారు.  ఇక వైసీపీని వీడుతున్న నేతలలో పార్టీ అధికారంలో ఉన్నంత కాలం అత్యంత కీలకంగా వ్యవహరిం చిన, జగన్ కు అత్యంత ఆప్తులుగా గుర్తింపు పొందిన, నమ్మిన బంట్లుగా వ్యవహరించిన వారే ముందు వరుసలో ఉండటం ఆ పార్టీ దుస్థితిని తెలియజేస్తోంది.  జగన్ కు సమీప బంధువు, ఆయనకు వరుసకు మామ అయిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో మొదలైన ఈ వలసలు విరామం లేకుండా కొనసాగుతూనే ఉన్నాయి. బాలినేని కంటే ముందు కిలారు రోశయ్య వైసీపీని వీడారు. ఇక ఆ వరుసలో  సామినేని ఉదయబాను.. మోపిదేవి, బీదం మస్తానరావు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జాబితా కొండవీటి చాంతాడును మించిపోయేంత పొడుగు ఉంటుంది. తాజాగా బుధవారం మహిళా కమిషన్ మాజీ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ కార్యాలయానికి పంపారు. ఆ సందర్భంగా ఆమె  నేరుగా జగన్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. జగన్ కు బాధ్యత లేదనీ, ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి లేదనీ, రాజకీయం అంటే ఆయనకు వ్యాపారమనీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇక ఇప్పుుడు పార్టీ మారుతున్న వారి జాబితాలోకి మరో పేరు వచ్చి చేరింది. మాజీ మంత్రి మేకతోటి సుచరిత వైసీపీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నారని తెలుస్తోంది.  ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన సుచరిత రాజకీయాలకు కొత్తే అయినా.. జగన్ కు అత్యంత సన్నిహితంగా మెలగిన నేతల్లో  ఆమె ఒకరు.  జగన్ సీఎం కాగానే.. సుచరితకు హోంమంత్రి పదవి కట్టబెట్టారు.  అయితే  సజ్జలతో విభేదాల కారణంగా జగన్ తన కేబినెట్ ను విస్తరించిన సమయంలో ఆమె మంత్రి పదవి కోల్పోయారు. అప్పటి నుంచీ అసంతృప్తితోనే ఉన్న సుచరిత.. ఆ సమయంలో జగన్ పై, సజ్జలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.  జగన్ స్వయంగా పిలిచి బుజ్జగించడంతో అయిష్టంగానే పార్టీలో కొనసాగిన మేకతోటి సుచరిత.. ఇక ఇప్పుడు తన రాజకీయ భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకుని పార్టీ మారడానికే నిర్ణయించుకున్నారని ఆమె వర్గీయులు చెబుతున్నారు.  

వయనాడ్ నుంచి ప్రియాంక నామినేషన్ 

వయనాడ్ పార్లమెంటు నియోజకవర్గం గాంధీ కుటుంబానికి  ప్రతిష్టాత్మకం గత ఎన్నికల్లో  ఈ నియోజక వర్గం నుంచి గెలుపొందిన రాహుల్ గాంధీ రాజీనామా చేయడంతో మళ్లీ ఎన్నికలు అనివార్యమయ్యాయి రాయబరేలి నుంచి కూడా గెలుపొందిన రాహుల్ గాంధీ వయనాడ్ వదులుకున్నారు గాంధీ కుటుంబం నుంచి ప్రియాంకగాంధీకి కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది. బుధవారం ఆమె నామినేషన్ దాఖలు చేశారు భర్త రాబర్ట్ వద్రా, పిల్లలు నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు. కాంగ్రెస్ అగ్రనేతలు మల్లి ఖార్జున్ ఖర్గేతో బాటు పలువురు హాజరయ్యారు   .నామినేషన్ దాఖలు చేసే ముందు ప్రియాంక రోడ్ షో నిర్వహించారు. వయనాడ్ బిజెపి అభ్యర్థిగా నవ్య పోటీ చేస్తున్నారు 

అవినాష్.. కింకర్తవ్యం!?

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డిని జగన్ అధికారంలో ఉన్నంత కాలం జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చారు. ఆయనపై ఈగ కూడా వాలకుండా తన అధికారాన్ని పూర్తి స్థాయిలో వాడేశారు. కోర్టులు ఆయన అరెస్టుకు ఎలాంటి అభ్యంతరాలూ వ్యక్తం చేయకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సమయంలో ఆయన అరెస్టే తరువాయి అన్న పరిస్థితుల్లో కూడా జగన్ ఆయనకు రక్షణ కవచంలా నిలబడ్డారు. ఒక దశలో ఆయనను అరెస్టు చేయడానికి సీబీఐ అన్ని ఏర్పాట్లూ చేసింది. సినీ ఫక్కీలో కర్నూలు వరకూ ఛేజ్ చేసింది. అయినా అరెస్టు చేయలేకపోయింది. ఇలా ఎందుకు జరిగిందంటే అందుకు కారణం అప్పటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అని అప్పట్లో అంతా భావించిన పరిస్థితి. వివేకా హత్య కేసులో కీలక పరిణామం అనివార్యం అనిపించిన ప్రతి సందర్భంలోనూ జగన్ తన కార్యక్రమాలన్నీ రద్దు చేసుకుని హస్తిన పర్యటనకు వెళ్లేవారు. ఆయన హస్తినలో ఏం చక్రం తిప్పేవారో కానీ.. అరెస్టు తథ్యం అన్న పరిస్థితి నుంచి అవినాష్ సునాయాసంగా బయటపడేవారు.  ఇప్పుడు జగన్ అధికారంలో లేరు. హస్తినలో ఆయన పరపతీ పూర్తిగా అడుగంటింది. ఇప్పుడు ఇక అవినాష్ రెడ్డి పరిస్థితి ఏమిటి?  ఆయన అరెస్టు అనివార్యమేనా, అయితే ఎప్పుడు అరెస్టౌతారు. అసలు వివేకా హత్య కేసు విచారణ ఎప్పుడు ట్రాక్ మీదకు వస్తుంది? అన్న ప్రశ్నలు రాజకీయవర్గాలలోనే కాదు.. జన బాహుల్యంలో  కూడా వినిపిస్తున్నాయి. అటువంటి పరిస్థితుల్లో తెలంగాణ హైకోర్టులో అవినాష్ రెడ్డికి చుక్కెదురైందన్న వార్త ఆయన అరెస్టుకు రంగం సిద్ధమైనట్లేనన్న చర్చకు తెరతీసింది.  ఇంతకూ ఏం జరిగిందంటూ వివేకా హత్య కేసులో నిందితులుగా యాంటిసిపేటరీ బెయిలుపై ఉన్న అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కరరెడ్డిలు తమ బెయిలు కండీషన్లు సడలించాలని కోరుతూ తెలంగాణ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను ఆ కోర్టు కొట్టివేసింది. తాము విదేశీ పర్యటనక వెళ్లేందుకు వీలుగా బెయిలు కండీషన్లు సడలించాలని వారు పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 26వ తేదీ నుంచి నవంబర్ 2 వరకూ తాము జపాన్ పర్యటనకు వెళ్లేందుకు అనుమతివ్వాలని కోరారు. ఆ పిటిషన్ నువిచారించిన తెలంగాణ హైకోర్టు.. విదేశీ పర్యటనకు వెళ్లాలంటే సీబీఐ కోర్టును ఆశ్రయించి అనుమతి తెచ్చుకోవాలని కోర్లు తీర్పు చెప్పింది. దీంతో తెలంగాణ హైకోర్టులో అవినాష్ రెడ్డికి చుక్కెదురైంది. ఆయన సీబీఐ కోర్టును ఆశ్రయించినా అక్కడ ఆయనకు సానుకూల తీర్పు వచ్చే అవకాశాలు ఇసుమంతైనా లేవని న్యాయ నిపుణులు అంటున్నారు. వివేకా హత్య కేసులో దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులపైనే ఎదురు కేసులు పెట్టి, వారిపై దాడులు చేసిన చరిత్ర ఉన్న నేపథ్యంలో అవినాష్ రెడ్డి విదేశీ పర్యటనకు సీబీఐ గట్టిగా అభ్యంతరం చెబుతుందని అంటున్నారు.  తెలంగాణ హైకోర్టులో తన అభ్యర్థన తిరస్కరణకు గురి కావడంతో  అవినాష్ రెడ్డికి ఇక దారులన్నీ మూసుకుపోయినట్లేనని అంటున్నారు. 

కుటుంబ నియంత్రణ వద్దంటున్న దక్షిణాది నేతలు.. ఎందుకో తెలుసా?

'ఒకరూ ఇద్దరు కాదు, ముగ్గురైతే ముద్దు' ఇది ఎవరో చెప్పిన మాట కాదు. సాక్షాత్తూ ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలున్నవారు మాత్రమే అర్హులు అయ్యేలా  చట్టం తెస్తామంటున్నారు.  తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా ఎక్కువ మంది పిల్లల్ని కనాలంటూ ప్రజలకు పిలుపునిస్తున్నారు. కుటుంబ నియంత్రణ అనే మాట మరచిపోమంటున్నారు.  చంద్రబాబు అయితే గతంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన కుటుంబ నియంత్రణను పాటించడంలో ముందున్న దక్షాణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరిగిందని పదేళ్ల కిందటే అన్నారు.  ఒక్కరు లేక ఇద్దరు చాలు అన్న నినాదాన్ని పక్కన పెట్టేసి ఎక్కువ మంది పిల్లలను కనండి అన్న పిలుపూ పదేళ్ల కిందటే ఇచ్చారు.  ఇప్పుడు చంద్రబాబుకు మద్దతుగా స్టాలిన్  ముందుకు వచ్చారు.  ఇద్దరూ కూడా తమతమ రాష్ట్రాలలో జనాభా పెరగాలని కోరుకుంటున్నారు.  ఇందుకు కారణం లేకపోలేదు. జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల విభజన జరుగుతుంది. నియోజకవర్గాల విభజనలో కుటుంబ నియంత్రణను కచ్చితంగా పాటింది, జనాభా పెరుగుదల నియంత్రణకు దోహదపడిన దక్షిణాది రాష్ట్రాలు నియోజకవర్గాల పునర్విభజనలో గణనీయంగా నష్టపోనున్నాయి. భారీగా నియోజకవర్గాలను కోల్పోనున్నాయి.  ఎందుకంటే.. ఉత్తరాదిలో జనాభా పెరుగుదల రేటు దక్షిణాదిలో కంటే ఎక్కువగా ఉంది.  జనాభా ప్రాతిపదికన జరిగే నియోజకవర్గాల  నియోజకవర్గాల విభజనతో ఉత్తరాది రాష్ట్రాలలో లోక్ సభ స్థానాలు పెరుగుతాయి. ఆ మేరకు దక్షిణాదిలో తగ్గిపోతాయి. అంటే దక్షిణాది వాయిస్ వీక్ అవుతుంది. ఇప్పటికే దక్షిణాది పట్ల కేంద్రం చిన్న చూపు చూస్తోందన్న భావన దక్షిణాది రాష్ట్రాలలో బలంగా వ్యక్ం అవుతోంది. నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాదికి జనాభా తక్కువగా ఉన్న కారణంగా నష్టం జరుగుతుందన్న విషయంలో 2011 జనాభా లెక్కల సమయంలో బయటపడింది.  ఉత్తరాది,దక్షిణాది ల మధ్య జనాభా పెరుగుదల రేటులో వత్యాసం ఉండటానికి కారణం  కుటుంబనియంత్రణ దక్షిణాది రాష్ట్రాలలో ఖచ్చితంగా,సమర్దవంతంగా అమలుచేయడమేనని తేలింది.  ఒకప్పుడు "ఇద్దరైతే ముద్దు..ఆపై వద్దు" ఒక్కరు లేదా ఇద్దరు చాలు అనే కుటుంబనియంత్రణ నినాదం జనంలోకి బలంగా వెళ్లింది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలలో ప్రజలు అందుకు కట్టుబడ్డారు.   తమ ఆర్ధిక పరిస్థితి మేరకు చిన్న కుటుంబం, చింతలు లేని కుటుంబం అని భావించి కుటుంబ నియంత్రణను కచ్చితంగా పాటించారు.  . పిల్లల చదువులకు అధిక ప్రాధాన్యత ఇచ్చే దక్షిణాది కుటుంబాలు ఒకరిద్దరు పిల్లలో సరి పెట్టుకుని పిల్లల చదువులకు ఎలాంటి ఆటంకాలూ, ఆర్థిక సమస్యలూ ఎదురు కాకుండా చూసుకున్నారు.  ఎందుకంటే ప్రైవేటీకరణతో విద్య, వైద్యం చాలా ఖరీదుగా మారిపోయాయి.  పిల్లల ఎల్కేజీ చదువుకే లక్షలు ఖర్చుపెట్టాల్సిన పరిస్థితి, చిన్నపాటి జ్వరానికే వేలాది రూపాయల చమురు వదిలే పరిస్థితి వచ్చింది. దీంతో దక్షిణాది రాష్ట్రాల ప్రజలు చిన్న కుటుంబాలే మేలని తలపోసి కుటుంబనియంత్రణ వైపే మొగ్గు చూపాయి. అయితే ఉత్తరాదిలో ప్రజలు మాత్రం అందుకు భిన్నంగా కుటుంబ నియంత్రణపై పెద్దగా దృష్టి పెట్టలేదు. దీంతో జనాభా పెరుగుదల విషయంలో దక్షిణాది ఉత్తరాది మధ్య భారీ అంతరం ఏర్పడింది.  సాధారణంగా కేంద్ర ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా జనాభా నియంత్రణకు దోహదపడిన దక్షిణాది రాష్ట్రాలకు మేలు జరిగేలా చర్యలు ఉంటాయి. కానీ జనాభా నియంత్రణను పాటించిన దక్షిణాదికి అన్యాయం జరిగేలా ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజన జరుగుతోంది. అదే మాదిరిగా కేంద్రం నిధుల కేటాయింపులు ఉంటున్నాయి. అంటే ఎక్కువ జనాభా ఉంది కనుక ఎక్కువ నియోజకవర్గాలు ఉత్తరాదికి. జనాభా ఎక్కువగా ఉండటం వల్ల పేదరికం ఎక్కువగా ఉంది.. అందుకు కేటాయింపులలో అధిక భాగం ఉత్తరాదికే అన్నట్లుగా పరిస్థితి ఉంది.  అంటే జనాభానియంత్రణకు దోహదపడిన కారణంగా దక్షిణాదికి తీరని నిష్టం జరుగుతోంది. అందుకే  దక్షిణాది నేతలు కుటుంబ నియంత్రణ వద్దంటున్నారు. ఎక్కువ మంది పిల్లలు ఉంటేనే స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీకి అర్హత అంటున్నారు. పౌరుని సగటు కుటుంబ ఆదాయం 5వేల నుంచి11వేలరూపాయలకు పెరిగింది.అలాగే సగటు వ్యయం 5వేల నుంచి 12వేల రూపాయలకు పెరిగింది.తెలుగురాష్ట్రాలలో అత్యధిక కుటుంబాలు గ్రామాల్లో నివసిస్తున్నారు. అలాగే మరో కారణమేంటంటే ప్రస్తుతం దేశంలో యువత జనాభా ఎక్కువగా ఉంది. అయితే ఈ పరిస్థితి రానున్న 30ఏళ్లలో  పూర్తిగా మారిపోతుంది. మూడు దశాబ్దాల తరువాత దేశంలో వృద్ధుల జనాభా అధికమౌతుంది.  అందుకని ఇప్పుడు జనాభా రేటు పెరాగాల్సిఉంది.అప్పుడే మన దేశం రాబోయే 30ఏళ్లలో కూడా యువత అధికంగా ఉన్న దేశంగా నిలువగలుగుతుంది. యువత అధికంగా ఉంటేనే దేశం అభివృద్ధి పథంలో పరుగులెత్తే అవకాశం ఉంటుంది. అందుకే ఉభయతారకంగా ఉంటుందని చంద్రబాబు, స్టాలిన్ వంటి నేతలు ఎక్కువ మంది పిల్లల్ని కనండి, దేశ పురోభివృద్ధిలో బాగస్వాములు కండి అంటూ ప్రజలకు పిలుపునిస్తున్నారు. 

ఒకటీ రెండూ కాదు.. ఐదు గిన్నిస్ రికార్డులు.. డ్రోన్ షో గ్రాండ్ సక్సెస్!

జగన్ ఐదేళ్ల అరాచక పాలన రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అధోగతికి తీసుకు వెళ్లింది. ఆయన ఏలుబడిలో రాష్ట్రంలో ఏ వర్గమూ సంతోషంగా లేదు. అంతటా దోపిడీ, దౌర్జన్యం రాజ్యమేలాయి. పారిశ్రామిక రంగం కుదేలైంది. ఆంధ్రప్రదేశ్ జీవనాడి లాంటి పోలవరం నిర్మాణం పడకేసింది. రాజధాని అమరావతి శిథిలావస్థకు చేరింది. అసలు అమరావతి రాజధానే కాదు.. రాష్ట్రానికి మూడు రాజధానులు ఉంటాయంటూ జగన్ రాష్ట్రాన్ని రాజధాని లేని రాష్ట్రంగా మార్చేశారు. ఆయన కేబినెట్ లో సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ అయితే అమరావతిని శ్మశానంతో పోల్చారు. రాష్ట్ర రాజధానికి భూములిచ్చిన  రైతులు నానా ఇబ్బందులూ పడ్డారు. రాజధాని కోసం ఎలుగెత్తిన పాపానికి కేసుల్లో ఇరుక్కున్నారు. లాఠీ దెబ్బలు తిన్నారు, జైలు పాలయ్యారు. అవమానాలు ఎదుర్కొన్నారు. ఐదేళ్ల పాటు రోడ్డెక్కి అలుపెరుగని, విరామంలేని పోరాటం చేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి నాయకత్వంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కొలువుదీరింది.  అమరావతి ఫీనిక్స్ పక్షిలా ఎగసింది. శిథిల స్థితి నుంచి పునరుజ్జీవం పొందింది. అమరావతి పనులు వేగంగా సాగుతున్నాయి. మూడేళ్ల కాల వ్యవధిలో అమరావతి నిర్మాణం పూర్తి చేయాలని చంద్రబాబు ఆదేశిస్తే, మునిసిపల్ మంత్రి పొంగూరు నారాయణ మూడేళ్లలో అమరావతి పూర్తి అవుతుందని ప్రకటించారు. అటువంటి అమరావతి నగరం ఇప్పుడు ఆధునిక సాంకేతికకు విశ్వనగరంగా మారుతోంది. ఆ అడుగులు మంగళవారం (అక్టోబర్ 22) నుంచి ప్రారంభమైన డ్రోన్ సమ్మిట్ ద్వారా ఘనంగా పడ్డాయి. మంగళగిరి సీకే కన్వెన్షన్ లో కేంద్ర పౌర విమాన‌యాన శాఖ‌, ఏపీ డ్రోన్స్ కార్పొరేష‌న్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన అమ‌రావ‌తి డ్రోన్ స‌మ్మిట్‌ను కేంద్ర పౌర విమాన‌యాన శాఖ మంత్రి కింజ‌రాపు రామ్మోహ‌న్ నాయుడు, రాష్ట్ర మౌలిక వ‌స‌తులు, పెట్టుబ‌డుల శాఖ మంత్రివ‌ర్యులు బీసీ జ‌నార్ధ‌న్ రెడ్డి త‌దిత‌రుల‌తో క‌లిసి సీఎం చంద్రబాబు ప్రారంభించారు.  భవిష్యత్ ను ముందే చూడటం.. అందుకు అనుగుణంగా కార్యాచరణ చేపట్టడం చంద్రబాబు విధానం. ఆయన దార్శనికత తెలుగుయువతకు ఐటీ రంగంలో అపార అవకాశాలను సృష్టించింది. ఔను 1995లో ఆయన ఐటీ గురించి మాట్లాడితే ఎగతాళి చేశారు. యువతకు అపార ఉపాధి, ఉద్యోగ అవకాశాలను ఐటీ సృష్టిస్తుందంటే కంప్యూటర్లు కూడు పెడతాయా, ఫోన్లు బతుకుతెరువు చూపుతాయా అని ఎగతాళి చేశారు అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఆయన హైదరాబాద్ ను ఐటీలో అగ్రగామిగా నిలబెట్టారు. ఏకంగా హైటెక్ సిటీ సైబరాబాద్ నగరాన్నే నిర్మించారు. ఇప్పుడు ప్రంపచ స్థాయి ఐటీ కంపెనీలకు హైదరాబాద్ కేంద్రంగా ఉంది. అంతేనే లక్షల మంది తెలుగు యువకులు ఐటీ రంగంలో నిపుణులు, నిష్ణాతులుగా మారి ఉన్నతోద్యోగాలు చేస్తున్నారు.  ఇప్పుడు భవిష్యత్ డ్రోన్స్ దే.  ఇటీవల విజయవాడను వరదలు ముంచెత్తనప్పుడు వరద బాధితులకు ఎలాంటి వృధా లేకుండా నాణ్యమైన ఆహారాన్ని సకాలంలో అందించడానికి డ్రోన్లను వినియోగించిన సంగతి తెలిసిందే. వరద బాధితులకు ఆహారం అందించడానికి దేశంలోనే తొలి సారిగా డ్రెన్లను వినియోగించారు. ఆ దార్శనికత, ఆ సమయస్ఫూర్తి చంద్రబాబుదే. ఇక వరద తగ్గుముఖం పట్టిన తరువాత బురద, చెత్త తొలగించేందుకు కూడా డ్రోన్లను వినియోగించారు. డ్రోన్ల ద్వారా ఏయే ప్రాంతాలలో చెత్త పేరుకుపోయి ఉందో స్పష్టమైన సమాచారాన్ని తెలుసుకుని యుద్ధ ప్రాతిపదికన దానిని తొలగించారు. ఏ రకంగా చూసుకున్నా డ్రోన్లు భవిష్యత్ లో గేమ్ ఛేంజర్లే. వ్యవసాయం, మౌలిక సదుపాయాల కల్పన వంటి వాటిలో కూడా భవిష్యత్ లో డ్రోన్ల వినియోగం పెరుగుతుంది.    ఆ భవిష్యత్ ను ఇప్పుడే దర్శించేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అమరావతి డ్రోన్ సమ్మిట్ ద్వారా దాన్ని ప్రజలకు కళ్లకు కట్టినట్లు చూపారు. ఈ డ్రోన్ సమ్మిట్ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ను సాధించింది. ఒకే రోజు ఒకే కార్యక్రమం  ఏకంగా ఐదు వరల్డ్ రికార్డులను సొంతం చేసుకుందంటే అది మామూలు విషయం కాదు. ఇక మంగళవారం (అక్టోబర్ 22) రాత్రి విజయవాడ పున్నమిఘాట్ వద్ద జరిగిన డ్రోన్ షో నిజంగా ఒక విజువల్ వండర్. ఒకే సారి 5500 డ్రోన్లు ఆకాసంలోకి చేసిన విన్యాసాలు ఒక అద్భుతం.     ఇక ఈ డ్రోన్ షో  లార్జెస్ట్ ప్లానెట్ ఫార్మేషన్ , నదీతీరంలొ లార్జెస్ట్ ల్యాండ్ మార్క్ సృష్టిలార్జెస్ట్ ప్లేన్ ఫార్మేషన్   డ్రోన్ల ద్వారా అతిపెద్ద జాతీయ జెండా ప్రదర్శనఏరియల్ లోగో లతో ఐదు రికార్డులను అమరావతి డ్రోన్ షో సృష్టించింది. ఇక ఈ డ్రోన్ సమ్మిట్ వేదికగా చంద్రబాబు తనను తాను డ్రోన్ ఇండస్ట్రీకి బ్రాండ్ అంబాసిడర్ గా ప్రకటించుకున్నారు. ఓర్వకల్లు ఇండస్ట్రియల్ పార్కులో 300 ఎకరాలు కేటాయించనున్నట్లు చెప్పారు. అక్కడ డ్రోన్ హబ్ ఏర్పటు చేయనున్నట్లు ప్రకటించారు. డ్రోన్ మాన్యుఫాక్చరింగ్ కు కేంద్రం సహాయాన్ని కోరారు.  పాతికేళ్ల కిందట ప్రతి కుటుంబంలోనూ ఒక ఐటీ  వ్యక్తి ఉండాలని ఆకాంక్షించాననీ, ఆ ఆకాంక్ష నెరవేరిందనీ, ఇప్పుడు ప్రతి కుటుంబంలోనూ ఒక వ్యాపారవేత్త, స్టార్టప్ కంపెనీ ఉండాలన్నది తన ఆకాంక్షగా చంద్రబాబు చెప్పారు.  టెక్నాల‌జీ, గ్లోబ‌ల్ స‌ర్వీసెస్‌లో  భారత్ నంబర్ వన్ గా నిలపాలన్నదే తన లక్ష్యమని చంద్రబాబు పేర్కొన్నారు. మొత్తం మీద అమరావతి డ్రోన్ సమ్మిట్ ద్వారా ప్రపంచం దృష్టి ఆంధ్రప్రదేశ్ వైపు మళ్లేలా చేయడంలో చంద్రబాబు వంద శాతం సక్సెస్ అయ్యారు.

బండి సంజయ్ కు కెటీఆర్ లీగల్  నోటీసులు 

కేంద్ర మంత్రి బండి సంజయ్ పరువు నష్టం నోటీసులు అందుకున్నారు మాజీ మంత్రి కెటీఆర్ ఆయనకు లీగల్ నోటీసులు పంపించారు. తన ప్రతిష్టకు భంగం వాటిల్లే విధంగా బండి సంజయ్ వ్యాఖ్యలు చేసినట్లు కెటీఆర్  ఆరోపించారు  . మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం కేసు వేసిన కెటీఆర్ తాజాగా కేంద్రమంత్రిపై పరువు నష్టం కేసు వేయనున్నట్లు నోటీసులు జారీ చేశారు . ఈ  నోటీసుకు వారం రోజులలోపు సమాధానం ఇవ్వాలని, క్షమాపణ కోరాలని కెటీఆర్ నోటీసులో పేర్కొన్నారు గత పదేళ్లుగా బిజెపితో రాసుకుని, పూసుకుని తిరిగిన బిఆర్ఎస్ కేంద్రమంత్రిపై  నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశమైంది.  తన చెల్లెలు తీహార్ జైలులో ఉన్నప్పుడు కూడా బిఆర్ఎస్ ఢిల్లీ పెద్దలతో సత్సంబంధాలు కొనసాగించింది.తీహార్ జైలు నుంచి బెయిల్ పై విడుదలయ్యాక ఏకంగా కేంద్రమంత్రిపై పరువు కేసు వేస్తానని నోటీసులు ఇవ్వడం వెనక బిఆర్ఎస్ వ్యూహం ఏమిటి అనేది బోధపడటం లేదు అయితే కెటీఆర్ లీగల్ నోటీసులకు భయపడేది లేదని బండి సంజయ్ వివరణ ఇచ్చారు తాటాకు చప్పుళ్లకు బెదిరేది లేదన్నారు బిఆర్ఎస్ బిజెపిలో విలీనం చేయాలని ఢిల్లీ పెద్దలు కండిషన్ పెట్టారు 

దండుకోవడం, లాక్కోవడంలో జగన్ కు తన పర బేధం లేదు!?

మా ఇంటికొస్తే ఏం తెస్తావు.. మీ ఇంటికొస్తే ఏమిస్తావు అనే రకం జగన్. ఆయనకు తీసుకోవడమే తప్ప ఇవ్వడం తెలియదు. అయితే ఆ తీసుకోవడం కూడా వాళ్లు ఇస్తే పుచ్చుకోవడంలా కాకుండా.. బలవంతంగా లాగేసుకోవడమంటే మరీ ఇష్టం. తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలో ఉన్నంత కాలం ఆయన అధికారాన్ని అడ్డుపెట్టుకుని దండుకోవడం అన్న విషయంలో ఆరితేరిపోయిన జగన్ ఆ తరువాత తాను  ముఖ్యమంత్రి అయిన తరువాత కూడా అదే పంథాలో సాగారు. అలా దండుకునే విషయంలో ఆయనకు తనాపరా బేధం ఉన్నట్లు కనిపించదు. అందుకే ఆస్తుల కోసం, షేర్ల కోసం తల్లి, చెల్లిపై కూడా కోర్టులో కేసులు వేశారు.  ఇప్పడు ఒక పక్క జగన్ చెల్లి షర్మిలతో సయోధ్య కోసం తండ్రి ఆస్తులలో ఆమెకు రావలసిన వాటాను ఆమెకు ఇచ్చేందుకు సిద్ధపడ్డారనీ, ఈ మేరకు కర్నాటక ఉప ముఖ్యమంత్రి, వైఎస్ కుటుంబానికి సన్నిహితుడు అయిన శివకుమార్ ద్వారా మధ్యవర్తిత్వం నెరిపారనీ, ఆస్తుల పంపకానికి డీల్ కూడా కుదిరిపోయినట్లేననీ వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి.  సరిగ్గా అదే సమయంలో  తల్లినీ, చెల్లినీ ఆస్తుల కోసం, షేర్ల కోసం జగన్ కోర్టుకు లాగారన్న విషయం వెలుగులోకి వచ్చింది. తాను పెట్టిన దాదాపు సూట్ కేస్ కంపెనీ లాంటి ఓ కంపెనీలో షేర్ల కోసం జగన్ తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలపై కంపెనీ లా ట్రైబ్యునల్ లో కేసు వేశారు. జగ్ ఈ కేసు సెప్టెంబర్ లోనే వేసినా  ఆ విషయం బయటకు తెలియలేదు. ఇప్పుడు ఈ కేసు నవంబర్ లో విచారణకు రానున్న నేపథ్యంలో బయటపడింది.    వైఎస్ అధికరారంలో ఉన్నప్పుడు జగన్ రెడ్డి సరస్వతి పవర్ అనే కంపెనీని కాగితాలపై స్థాపించేసి పల్నాడులో ఆ కంపెనీ పేరు మీద కారు చౌకగా భూములు కొనుగోలు చేశారు. అప్పట్లో ఆ కంపెనీలో తల్లి విజయమ్మ, కుమార్తె షర్మిలకు కొన్ని షేర్లు కేటాయించారు. ఇప్పుడు ఆ షేర్ల కోసమే జగన్ కంపెనీలా ట్రైబ్యునల్ లో తల్లి, చెల్లికి వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేశారు. తాను తల్లి విజయమ్మ కు కేటాయించిన షేర్లను ఆమె చెల్లి షర్మిలకు కేటాయించిందనీ, అలా కేటాయించడం అక్రమమనీ పేర్కొంటూ తన షేర్లు తనకు ఇచ్చేయాలంటూ ట్రైబ్యునల్ ను ఆశ్రయించారు.  ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే జగన్ సహ పిటిషనర్ గా భారతి కూడా ఉన్నారు.   ఈ కేసు విషయం వెలుగులోకి రావడంతో జగన్ షర్మిలతో చేస్తున్న రాయబేరాలు, ఆస్తిపంపకాలకు సిద్ధం అవ్వడం వెనుక కూడా ఏదైనా మతలబు ఉందా? కేవలం రాజకీయంగా క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడేందుకు, తనపై షర్మిల విమర్శల బాణాలు గుప్పించకుండా ఆపి.. ఆ సంధికాలంలో కాంగ్రెస్ తో డీల్ పూర్తి చేసుకునే ప్రణాళిక ఉందా అన్న అనుమానాలు రాజకీయవర్గాలలో వ్యక్తం అవుతున్నాయి. మొత్తం మీద జగన్ తల్లి, చెల్లిపై షేర్ల కోసం ట్రైబ్యునల్ లో వేసిన పిటిషన్ జగన్ ప్రతిష్ఠను మరింత దిగజార్చింది. వైఎస్ మరణం నుంచి ఇప్పటి వరకూ జగన్ కు అండగా నిలుస్తూ వచ్చిన వైఎస్ అభిమానులు సైతం జగన్ పై  తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. 

సమాజం పట్ల బాధ్యత లేని జగన్.. వాసిరెడ్డి పద్మ ఫైర్

రాష్ట్రంలో వైసీపీ అధాకారంలో ఉన్నంత కాలం తమంత వారు లేరన్నట్లుగా విర్రవీగిన నేతలు.. పార్టీ  అధికారం కోల్పోయిన తరువాత వైసీపీ నుంచి ఒక్కరొక్కరుగా నేతలు వెళ్లిపోతున్నారు. అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో జగన్ భజన వినా మరేం లేనట్లుగా వ్యవహరించిన వారు కూడా ఇప్పుడు వైసీపీకో దండం.. జగన్ కు వంద దండాలు అన్నట్లుగా పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారు.   ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు ఇలా వైసీపీకి గుడ్ బై చెప్పేసిన వారి సంఖ్య పెద్దగానే ఉంది. ఇప్పుడ తాజాగా తాజాగా మరో సీనియర్ మహిళా నేత, మాజీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ కూడా వైసీపీకి రాజీనామా చేసేశారు. ఆమె పార్టీ వీడటానికి పలు కారణాలున్నప్పటికీ, తాను ఆశించిన జగ్గయ్యపేట నియోజకవర్గ ఇన్ చార్జ్ పదవి దక్కనందుకేనని ఆమె సన్నిహితులు అంటున్నారు.  జగన్ హయాంలో మహిళా కమిషన్ చైర్ పర్సన్ హోదా వెలగబెట్టిన వాసిరెడ్డి పద్మ.. జగన్ కళ్లల్లో ఆనందం చూడడానికి అన్నట్లు ఇష్టారీతిగా వ్యవహరించారు. ఏకంగా పవన్ కల్యాణ్ కే మహిళా కమిషన్ ముందు హాజరు కావాలంటూ సమన్లు జారీ చేశారు. స్థాయిని మరిచి మరీ చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.  అయితే ఒక సారి జగన్ అధికారం కోల్పోయిన తరువాత  వాసిరెడ్డి పద్మ పెద్దగా ఎక్కడా కనిపించలేదు. వినిపించలేదు.  పార్టీ కార్యక్రమాల విషయంలో కూడా అంటీముట్టనట్టే ఉంటున్నారు. ఎన్నికలకు ముందు ఆమె మహిళా కమిషన్ చైర్ పర్సన్ పదవికి రాజీనామా చేశారు. జగ్గయ్య పేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆశించారు. ఆ టికెట్టు దక్కుతుందన్నధీమాతోనే మహిళా కమిషన్ చైర్ పర్సన్ పదవికి రాజీనామా చేశారు. అయితే వ్రతం చెడ్డా ఫలం దక్కనట్లు ఆమెకు జగ్గయ్యపేట నుంచి పోటీ చేసే అవకాశాన్ని జగన్ ఇవ్వలేదు. అప్పటి నుంచీ వాసిరెడ్డి పద్మలో అసంతృప్తి పేరుకుపోయిందని పార్టీ వర్గాలే అంటున్నాయి. ఇక ఇప్పుడు జగ్గయ్య పేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదభాను పార్టీకి రాజీనామా చేసి జనసేన గూటికి చేరడంతో.. కనీసం నియోజకవర్గ ఇన్ చార్జ్ పదవైనా దక్కుతుందని ఆశించిన వాసిరెడ్డి  పద్మ అది కూడా దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తికి లోనయ్యారని, అందుకే రాజీనామా నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.     గతంలో జగ్గయ్యపేట నుంచి పోటీ చేయడానికి టికెట్ దక్కక అసంతృప్తి చెంది మహిళా కమిషన్ చైర్ పర్సన్ పదవిని రాజీనామాతో వదులుకున్న సమయంలో జగన్ పై వీసమెత్తు విమర్శ కూడా చేయని పవాసిరెడ్డి పద్మ ఇప్పుడు పార్టీకి రాజీనామా చేసే సమయంలో మాత్రం తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాజకీయం అంటే వ్యాపారం  కాదని జగన్ తెలుసుకోవాలని హితవు చెప్పారు. పార్టీని నడిపించడంలో జగన్‌కు బాధ్యత లేదని, పరిపాలన అంటే పెత్తనం కాదని జగన్ తెలుసుకోవాలని అన్నారు. అసలు జగన్ కు సమాజం పట్లే బాధ్యత లేదని దుయ్యబట్టారు.  

వైసీపీకి మరో షాక్ ... వాసిరెడ్డి పద్మ రాజీనామా

వైఎస్సార్ కాంగ్రెస్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి.  ఆ పార్టీకి మాజీ మహిళా కమిషన్ చైర్ పర్సన్  వాసిరెడ్డి పద్మ రాజీనామా చేశారు . ఆ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు,ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలు   మాజీ మంత్రులు ,  మాజీలు ఒక్కొక్కరు రాజీనామా చేస్తున్నారు. తాజాగా ఫైర్ బ్రాండ్ పేరు ఉన్న వాసిరెడ్డి పద్మ రాజీనామా చేశారు . ఎన్నికల తర్వాత వాసిరెడ్డి ఎక్కడ కనిపించలేదు    వాసిరెడ్డి గత ఎన్నికల్లో జగ్గయ్య పేట సీటు ఆశించి భంగపడ్డారు. జగ్గయ్య పేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను జనసేన పార్టీలో చేరడంతో జగ్గయ్య పేట ఇన్ చార్జి పదవి ఆశించిన  వాసిరెడ్డికి చుక్కెదురైంది. ఈ నేపథ్యంలో తన్నీరు నాగేశ్వరరావు జగ్గయ్య పేట ఇన్ చార్జిగా నియమిస్తూ వైఎస్ జగన్ ఆదేశాలు ఇవ్వడంతో వాసిరెడ్డి మనస్థాపానికి గురయ్యారు.   దీంతో తన రాజీనామా లేఖను జగన్ కు పంపారు. 

జగన్ కాళ్ల బేరాలు.. కాంగ్రెస్ నుంచి ఛీత్కారాలు!

వైసీపీ అధినేత, మాజీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి ఇబ్బందులు మొద‌ల‌య్యాయి. అధికారంలో కొన‌సాగిన ఐదేళ్లు త‌న ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రించిన జ‌గ‌న్‌కు.. ఇప్పుడిప్ప‌డే జ్ఞానోద‌యం అవుతున్న‌ట్లు ప్ర‌స్తుత ప‌రిణామాలను చూస్తే అర్థ‌మ‌వుతోంది. అధికారం మ‌త్తులో జ‌గ‌న్‌, ఆయ‌న అనుచరులు రెచ్చిపోయారు. ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌ల‌పైనేకాక‌.. ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించిన వారిపై అక్ర‌మ కేసులు బ‌నాయించి జైళ్ల‌కు పంపించారు. 2019 ఎన్నిక‌ల్లో త‌న గెలుపులో కీల‌క భూమిక పోషించిన కుటుంబ స‌భ్యుల‌ను సైతం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత జ‌గన్ దూరం చేసుకున్నాడు. ఇటీవ‌ల ఎన్నిక‌ల్లో ఘోర ఓట‌మి త‌రువాత జ‌గ‌న్ పాత కేసుల‌తో పాటు.. అధికారంలో ఉన్న స‌మ‌ యంలో  పాల్పడిన అవినీతి అక్ర‌మాల‌ కేసులు కూడా రెడీగా ఉన్నాయి. దీంతో త్వ‌ర‌లో జ‌గ‌న్, వైసీపీలోని ముఖ్య‌నేత‌లు జైలుకెళ్ల‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే గ‌డిచిన‌ ఐదేళ్ల కాలంలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని రెచ్చిపోయిన వైసీపీ నేత‌ల‌పై కూట‌మి ప్ర‌భుత్వం కొర‌డా ఝుళిపిస్తోంది. గ‌తంలో జ‌గ‌న్ ఏం చేసినా కేంద్రంలోని బీజేపీ పెద్ద‌లు అండ‌గా ఉంటూ వ‌చ్చారు. ప్ర‌స్తుతం ఏపీలో చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్ పార్టీల‌తో బీజేపీ పొత్తులో ఉంది. దీంతో జ‌గ‌న్ ఏకాకి అయ్యారు. ఈ క్ర‌మంలో కాంగ్రెస్ పార్టీకి ద‌గ్గ‌ర‌య్యేందుకు జ‌గ‌న్ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.   రాజ‌కీయాల్లో శాశ్వ‌త మిత్రులు, శాశ్వ‌త శ‌త్రులు ఉండ‌రు. ఎప్ప‌టిక‌ప్పుడు మారుతున్న రాజ‌కీయ ప‌రిణామాలను బ‌ట్టి పార్టీల మ‌ధ్య పొత్తులు, నేత‌ల మ‌ధ్య సంబంధాలు మారుతుంటాయి. ప్ర‌స్తుతం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కూడా అదే సూత్రాన్ని ఫాలో అవుతున్న‌ట్లు క‌నిపిస్తోంది. ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌రువాత ఒట‌రి అయిన జ‌గ‌న్‌.. జాతీయ స్థాయిలో ప‌లుకుబ‌డి ఉండాలంటే ఏదో ఒక జాతీయ పార్టీతో సంఖ్య‌త‌తో ఉండాల‌ని భావిస్తున్నారు. ఇన్నాళ్లు బీజేపీ జ‌గ‌న్ కు మ‌ద్ద‌తుగా నిల‌వ‌గా.. జ‌గ‌న్ ఐదేళ్ల అరాచ‌క పాల‌న‌ను చూసి ఆ పార్టీ తెలుగుదేశం, జ‌న‌సేనతో పొత్తు పెట్టుకొని ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వంలో భాగ‌స్వామిగా ఉంది. దీంతో జ‌గ‌న్ కు కాంగ్రెస్ పార్టీ మ‌ద్ద‌తు అనివార్య‌మైంది. గ‌తంలో కాంగ్రెస్ పార్టీతో ఎట్టి ప‌రిస్థితుల్లో క‌లిసేది లేద‌ని జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి  పలుమార్లు చెప్పారు. అంతేకాక‌.. సోనియా, రాహుల్ గాంధీపై వైసీపీ నేతలు విమ‌ర్శ‌లు  కూడా చేశారు. సింహం సింగిల్ గా వస్తుంది. జగన్ మోహన్ రెడ్డికి పొత్తులూ మద్దతులూ అవసరం లేదని విర్రవీగారు. కానీ  ప్ర‌స్తుతం కాంగ్రెస్ తో క‌ల‌వాల్సిన ప‌రిస్థితి జ‌గ‌న్ కు ఏర్ప‌డింది. దీంతో ఆమేర‌కు జ‌గ‌న్‌ మంత‌నాలు చేస్తున్నారు. కాంగ్రెస్  పార్టీతో దోస్తీ చేయాలంటే ముందుగా చెల్లెలు ష‌ర్మిల‌తో విబేధాల‌కు స్వ‌స్తి చెప్పాల్సిన ప‌రిస్థితి. ప్ర‌స్తుతం ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షురాలిగా ష‌ర్మిల ఉన్నారు. షర్మిల  ఎన్నిక‌ల స‌మ‌యంలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఐదేళ్ల అరాచ‌క పాల‌న‌ను ప్ర‌జ‌ల్లో తీవ్ర స్థాయిలో ఎండ‌గ‌ట్టారు. జ‌గ‌న్ పార్టీకి కేవలం 11 సీట్లు మాత్ర‌మే రావ‌డానికి ష‌ర్మిల కూడా ఓ కార‌ణమ‌ని చెప్పడానికి సందేహించాల్సిన ప‌నిలేదు.  వైఎస్ఆర్ మ‌ర‌ణం త‌రువాత కాంగ్రెస్ పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి జ‌గ‌న్  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. అప్ప‌టి నుంచి జ‌గ‌న్ వెంట ఆయ‌న త‌ల్లి విజ‌య‌మ్మ‌, చెల్లెలు వైఎస్ ష‌ర్మిల ఉన్నారు. 2014 ఎన్నిక‌ల్లో వైసీపీ పార్టీకి మ‌ద్ద‌తుగా ష‌ర్మిల విస్తృత ప్ర‌చారం చేశారు. జ‌గ‌న్ జైలుకెళ్లిన స‌మ‌యంలో పాద‌యాత్ర‌  చేశారు. 2019 ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ గెలుపులో ష‌ర్మిల కీల‌క భూమిక పోషించారు. తండ్రి మ‌ర‌ణం త‌రువాత జ‌గ‌న్‌కు అండ‌గా ష‌ర్మిల నిల‌బ‌డ్డారు. అయితే, అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ష‌ర్మిల‌ను జ‌గ‌న్ పూర్తిగా విస్మ‌రించారు. వాస్త‌వానికి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి బ‌తికిఉన్న స‌మ‌యంలో త‌న ఆస్తిలో ష‌ర్మిళ‌కుకూడా స‌మాన వాటా ఉండాల‌ని ప‌లుసార్లు ప్ర‌స్తావించారు. జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ష‌ర్మిలకు వాటా ఇచ్చేది లేద‌ని చెప్ప‌డంతోపాటు.. ఆమెను పార్టీ నుంచి ప‌క్క‌కు త‌ప్పించారు. ష‌ర్మిల‌తోపాటు త‌ల్లి విజ‌య‌మ్మ‌ సైతం పార్టీకి దూరం అయ్యారు. ఆ త‌రువాత కొద్దికాలం తెలంగాణ రాజ‌కీయాల్లో కొన‌సాగిన ష‌ర్మిల‌.. ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలిగా ఏపీ రాజ‌కీయాల్లో  ఎంట్రీ ఇచ్చారు. ఎన్నిక‌ల ముందు వైఎస్ జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై ష‌ర్మిల తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు చేశారు. ఐదేళ్ల వైసీపీ ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త‌తోపాటు.. ష‌ర్మిల జ‌గ‌న్ గురించి చెప్పిన నిజాల‌ను ప్ర‌జ‌లు బ‌లంగా న‌మ్మారు. దీంతో వైసీపీ అధికారం కోల్పోవ‌డంతోపాటు.. క‌నీసం ప్ర‌తిప‌క్ష హోదాకూడా నిల‌బెట్టుకోలేక పోయింది. అధికారం కోల్పోవ‌డంతో ఎదుర‌వుతున్న ఇబ్బందుల నుంచి కొంతైనా త‌ప్పించుకునేందుకు కాంగ్రెస్ పార్టీతో దోస్తీకి జ‌గ‌న్ తాప‌త్ర‌య ప‌డుతున్నారు. బెంగ‌ళూరు వేదిక‌గా కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత, క‌ర్ణాట‌క డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్ ద్వారా జ‌గ‌న్ కాంగ్రెస్ పార్టీ పెద్ద‌ల‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. అయితే, ష‌ర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షురాలిగా ఉండ‌టంతో ఆమెతో ఉన్న విబేధాల‌కు స్వ‌స్తి చెప్పేందుకు జ‌గ‌న్ సిద్ధ‌మైన‌ట్లు తెలుస్తోంది. ష‌ర్మిల వ‌ద్ద‌కు కాళ్ల‌ బేరానికి వ‌చ్చి ఆమెకు తండ్రి ఆస్తిలో  రావాల్సిన వాటాను ఇచ్చేందుకు జ‌గ‌న్ ఒప్పుకున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. కాంగ్రెస్ పార్టీతో దోస్తీకోసం అన్నిఅడ్డంకుల‌ను తొల‌గించుకోవాల‌ని జ‌గ‌న్ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.  అయితే, కాంగ్రెస్ జాతీయ నాయ‌క‌త్వం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని న‌మ్మే ప‌రిస్థితుల్లో లేదు. జ‌గ‌న్ తీరుప‌ట్ల వేచి చూసే ధోర‌ణిలో రాహుల్‌, సోనియా ఉన్న‌ట్లు తెలుస్తోంది. అసలు జగన్ ను కలుపుకునే విషయంలో కాంగ్రెస్ లో మెజారిటీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు. అందుకే జగన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా కాంగ్రెస్ తటపటాయిస్తోంది. వాస్తవానికి జ‌గ‌న్ తో దోస్తీకి రాహుల్ గాంధీ స‌సేమీరా అంటున్న‌ట్లు స‌మాచారం. దీనికి ప్ర‌ధాన కార‌ణం  వైసీపీ ఐదేళ్ల పాల‌న‌లో జ‌గ‌న్ అరాచ‌క పాల‌న సాగించ‌డ‌మే. ఎలాంటి త‌ప్పు చేయ‌ని చంద్ర‌బాబును జైళ్లో పెట్ట‌డంతోపాటు, సొంత చెల్లి ష‌ర్మిల‌ను జ‌గ‌న్ ఇబ్బందుల‌కు గురిచేయ‌డాన్ని రాహుల్ తీవ్రంగా ప‌రిగ‌ణిస్తున్న‌ట్లు కాంగ్రెస్ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. రాహ‌ల్ గాంధీ ధోర‌ణి చూస్తుంటే ఇప్ప‌ట్లో కాంగ్రెస్ పార్టీకి జ‌గ‌న్ ద‌గ్గ‌ర‌య్యే అవ‌కాశాలు లేవ‌నే విష‌యాన్ని   వైసీపీ నేత‌లు చెబుతున్నారు. మొత్తానికి ఓట‌మి త‌రువాత ఎవ‌రితో ఎలా ఉండాల‌నే విష‌యం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి బోధప‌డింద‌ని ఏపీ రాజ‌కీయాల్లో  చ‌ర్చ జ‌రుగుతుంది.

ప్రపంచ దేశాలతో ఏపీ పోటీ.. నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో    నారా లోకేష్ అత్యంత కీలకంగా మారారు. తండ్రిని మించిన తనయుడిగా పార్టీ సీనియర్లు సైతం ఆయనను ప్రస్తుతిస్తున్నారు. ఇదే లోకేష్ పాదయాత్రకు ముందు ప్రత్యర్థుల ట్రోలింగ్ కు కేంద్రంగా ఉండేవారు. లోకేష్ అడుగేస్తే ట్రోల్, మాట్లాడితే ట్రోల్, మౌనంగా ఉంటే ట్రోల్ అన్నట్లుగా పరిస్థితి ఉండేది. అయితు ఆయన యువగళం పాదయాత్రతో ఒక్క సారిగా పరిస్థితి మారిపోయింది. లోకేష్ ను విమర్శించాలంటే ప్రత్యర్థులు ఒకటికి పది సార్లు ఆలోచించాల్సి వస్తోంది. లోకేష్ యువగళం పాదయాత్రతో  పొలిటికల్ గా పరిణితి చెందిన నేతగా మేకోవర్ అయ్యారు. జగన్ సర్కార్ వైఫల్యాలనూ, ఆయన హయాంలో అనుసరించిన కక్ష పూరిత వైఖరిని పాదయాత్రలోనే కాదు ఇప్పుడు మంత్రిగా కూడా గట్టిగా ఎండగడుతున్నారు.   అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రణాళికల రూపకల్పనలో క్రియాశీలంగా, కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆయన మాట సూటిగా ఉంటుంది. ఎలాంటి సుత్తీ లేకుండా నేరుగా చెప్పదలచుకున్నది చెబుతారు. చేయదలచుకున్నది చేస్తారు. మాట ఇస్తే తిరుగుండదన్ననమ్మకాన్ని ఆయన ప్రజాబాహుల్యంలో కలిగించారు.  అయితే నారా లోకేష్ ఈ స్థాయికి ఎదగగలిగారంటే అందుకు ఆయన చేసిన కఠోర శ్రమ, సెల్ఫ్ డిసిప్లిన్ కారణం. రాజకీయంగా తొలి అడుగు వేయకుండానే, తండ్రి చాటు బిడ్డగా ఉన్న సమయంలోనే ప్రత్యర్థులు ఆయనను టార్గెట్ చేశారు. వ్యక్తిత్వ హననమే లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. ఆయన ఆహార్యాన్ని, భాషను, యాసను గేలి చేశారు. బాడీ షేమింగ్ చేశారు. ఆయన ఆహారపు అలవాట్లపై సెటైర్లు గుప్పించారు. ఇది, అది అని కాదు పరిధులు దాటి తూలనాడారు. అయితే స్థిత ప్రజ్ణతతో లోకేష్ వారి విమర్శలకూ, ఎగతాళికి, హేళనకు తన పని తీరుతోనే సమాధానం చెప్పారు.  ముందుగా తన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ తో మొదలు పెట్టిన లోకేష్.. తనతు తాను పూర్తిగా మేకోవర్ చేసుకున్నారు. అత్యంత ప్రజాదరణ కలిగిన నేతల్లో ఒకరిగా ఎదిగారు.  అదే సమయంలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలలో ప్రత్యర్థులు సైతం ఔరా అనేలా పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం కలలు కనండి.. వాటిని సాకారం చేసుకోవడానికి ప్రయత్నించండి అని యువతకు పిలుపు నిచ్చారు. లోకేష్ రాష్ట్రాన్ని ప్రపంచ దేశాల సరసన నిలపాలన్న కలను సాకారం చేసుకునేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో థింక్ గ్లోబల్లీ యాక్ట్ లోకల్లీ అనే వారు. ఇప్పుడాయన నినాదం థింక్ గ్లోబల్లీ యాక్ట్ గ్లోబల్లీగా మారింది. అందుకు తగ్గట్టుగానే లోకేష్ దేశంలోని రాష్ట్రాలతో కాదు.. ఆంధ్రప్రదేశ్ పోటీ ప్రపంచ దేశాలతో అని చాటుతున్నారు.  ఐటి, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో కే ప్రపంచ దేశాలతో  పోటీపడుతున్నామని ఉద్ఘాటిస్తున్నారు.  ఇండియన్ సెల్యులర్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) ప్రతినిధులతో మంత్రి లోకేష్ న్యూడిల్లీలో సోమవారం(అక్టోబర్ 21)  సమావేశమయ్యారు.  ఆంధ్రప్రదేశ్ ను ఎలక్ట్రానిక్స్ హబ్ గా మార్చడానికి చేపడుతున్న చర్యలు, రాష్ట్రంలో నెలకొన్నఅనుకూలతలపై పరిశ్రమదారులకు మంత్రి లోకేష్ వివరించారు.  దేశంలో పేరెన్నిగన్న పరిశ్రమదారులతో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటుచేశామని, తరచూ వారితో సమావేశమై   విధానపరమైన సమస్యలు, సవాళ్లను అధిగమించడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాష్ట్రంలో రాబోయే అయిదేళ్లలో 20లక్షల ఉద్యోగాలు సాధించడంలో ఐటి, ఎలక్ట్రానిక్ రంగాలు కీలకపాత్ర పోషిస్తాయన్నారు. ఆ పరిశ్రమల కోసం  టైలర్ మేడ్ పాలసీలను రూపొందిస్తామని అన్నారు.  ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు దేశంలోనే అత్యంత సులభతరమైన ఇండస్ట్రీ ఫ్రెండ్లీ పాలసీలను అమలు చేస్తోంది, అన్నిరకాల పరిశ్రమలకు అనువైన ఎకో సిస్టమ్ ఏర్పాటుచేస్తున్నాం. ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బజినెస్ అనే నినాదంతో  ముందుకు సాగుతున్నామని లోకేష్ చెప్పారు. 4వసారి ముఖ్య మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న చంద్రబాబు నాయుడు దూరదృష్టి గల నాయకత్వంలో అభివృద్ధి దిశగా ఏపీ వేగంగా ముందుకు సాగుతోంది. పరిశ్రమలకు వేగవంతమైన అనుమతుల కోసం ఈడీబీని పునరుద్ధరించాం, సరైన ప్రాతిపాదనలతో వచ్చేవారికి తగిన ప్రోత్సాహకాలను అందించడానికి సిద్ధంగా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్‌ను ఇన్నోవేషన్, టెక్నాలజీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పవర్‌హౌస్‌గా మార్చడంపై దృష్టి సారించాం. ముఖ్యంగా విశాఖపట్నాన్ని ఐటి పవర్ హౌస్ గా, అంతర్జాతీయ ఎఐ రాజధానిగా తీర్చిదిద్దడానికి కృతనిశ్చయంతో ఉన్నాం. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధికి ఎఐ, ఎమర్జింగ్ టెక్నాలజీస్ యూనివర్సిటీ, డేటా సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి లోకేష్‌ తెలిపారు.  

బర్రెలక్కపై ట్రోలింగ్స్ 

గత బిఆర్ ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని ఆరోపిస్తూ బర్రెలక్క   గత ఎన్నికల్లో కొల్పాపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు కాంగ్రెస్ అధికారంలో వచ్చాక నాగర్ కర్నూల్  పార్లమెంటు ఎన్నికల్లో కూడా పోటీ చేసి పరాజయం చెందిన  సంగతి తెలిసిందే.  పదేళ్ల తర్వాత గ్రూప్ 1 పరీక్షలు  జరుగుతున్నాయి. జీవో 29 రద్దు చేయాలని  నిరుద్యోగులు డిమాండ్ చేసిన నేపథ్యంలో  బర్రెలక్క సోషల్ మీడియాలో రీల్స్ చేస్తుంది. పార్ల మెంటు ఎన్నికల తర్వాత ఆమె వివాహం చేసుకుని సెటిలైపోయింది. తనను తాను ఝాన్సి , చాకలి ఐలమ్మ అని చెప్పుకున్న బర్రెలక్క గత అసెంబ్లీ ఎన్నికల్లో ఫేమస్ అయ్యారు. సెలబ్రీలు, ప్రముఖు వ్యక్తులు ఆమెకు సపోర్ట్ చేశారు. నిరుద్యోగుల కోసం ప్రాణాలర్పిస్తానని చెప్పుకున్న బర్రెలక్క అలియాస్ శిరీష ఇలా మోసం చేయడం పట్ల పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణలో మూడు రోజుల పాటు వానలే వానలు

తెలుగు రాష్ట్రాలను వర్షాలు వదలడం లేదు. అక్టోబర్ 3వ వారంలో కూడా భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాలు అల్లాడిపోతున్నాయి. భారీ వర్షాల కారణంగా అనంతపురం జిల్లా ముంపునకు గురైంది. పండమేరు వాగు ఉప్పొంగి ప్రవహించడంతో కాలనీలకు కాలనీలు ముంపునకు గురయ్యాయి. ముంపు బాధితులు కట్టుబట్టలతో బతుకు జీవుడా అంటూ ఇళ్ల నుంచి బయట పడ్డారు. అనంతపురం, బెంగళూరు జాతీయ రహదారిపై భారీగా వరద నీరు ప్రవహించడంతో గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించిపోయింది. మరో రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. కాగా తెలంగాణకు కూడా మంగళ వారం నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాల ముప్పు ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, వరంగల్ జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ ఆ  జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.  

మహా ఎన్నికలు.. 99 మందితో అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించిన బీజేపీ

మహా ఎన్నికల సమరంలో పార్టీ తరఫున అభ్యర్థులుగా పోటీ చేసే 99 మందితో బీజేపీ తొలి జాబితాను విడుదల చేసింది. రాష్ట్ర అసెంబ్లీలో 289 స్థానాలు ఉన్నాయి. ఎన్నికలకు సరిగ్గా నెల రోజుల వ్యవధి ఉంది. దీంతో అభ్యర్థుల ఎంపీకపై బీజేపీ దృష్టి సారించింది. సుదీర్ఘ కసరత్తు తరువాత తొలి జాబితాను విడుదల చేసింది.  పార్టీ సీనియర్ నేత, ఉప ముఖ్యమంత్రి ఫడ్నవీస్  నాగసూర్ సౌత్ వెస్ట్ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. అలాగే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ బావన్ కులే కామఠీ నియోజకవర్గం నుంచి మాజీ సీఎం శ్రీజయ చవాన్  భోకర్ నియోజకవర్గం నుంచి పోటీలోకి దిగనున్నారు.  రాష్ట్రంలోని మొత్తం 388 స్థానాలకు గాను బీజేపీ 151 స్థానాలలో పోటీ చేస్తున్నది. మిగిలిన స్థానాలను మిత్రపక్షాలైన షిండే శివసేన, అజిత్ పవార్ ఎన్సీపీ వర్గాలకు కేటాయించింది.  ఈసారి మహారాష్ట్ర ఎన్నికల్లో  అధికార బీజేపీ నేతృత్వంలో ‘‘మహాయుతి’’ కూటమి, కాంగ్రెస్ నేతృత్వంలోని ‘‘మహావికాస్ అఘాడీ’’ కూటమి మధ్య పోటీ ఉంది. మహాయుతిలో బీజేపీ-షిండే శివసేన-అజిత్ పవార్ ఎన్సీపీలు ఉండగా.. మహావికాస్ కూటమిలో కాంగ్రెస్- ఉద్ధవ్ ఠాక్రే శివసేన- శరద్ పవార్ ఎన్సీపీ ఉన్నాయి. మరోవైపు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మహావికాస్ కూటమి ఇప్పటికే సీట్ల సర్దుబాటుపై ఓ అవగాహనకు వచ్చింది.  త్వరలోనే ఈ కూటమి పార్టీలు కూడా  అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్నాయి. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఒకే విడతలో వచ్చే నెల 20న జరుగుతాయి. ఫలితాలు అదే నెల 23న వెలువడతాయి.  2019లో జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. దీంతో కాంగ్రెస్, ఎన్సీపీతో కలిసి శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. అయితే 2021లో శివసేన నుంచి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలో  మెజార్టీ ఎమ్మెల్యేలు బయటకు వచ్చి బీజేపీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దీంతో షిండే ముఖ్యమంత్రిగా, దేవేంద్ర ఫడ్నవీస్ ఉపముఖ్యమంత్రిగా బీజేపీ కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. ఆ తరువాత కొంత కాలానికి   ఎన్సీపీ నుంచి కూడా అజిత్ పవార్ నేతృత్వంలోని ఎమ్మెల్యేలు   ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి షిండే ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు. దీంతో అజిత్ పవార్‌కు డిప్యూటీ సీఎంగా అవకాశం కల్పించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఈసారి రెండు కూటములకూ ప్రతిష్ఠాత్మకంగా మారాయి.  ప్రజలు ఏ కూటమి పట్టం కడతారో తెలియాలంటే నవంబర్ 23వ తేదీ వరకు ఆగాల్సిందే.

వైపీఎస్ లు, అయ్యాఎస్ లకు ఇక గడ్డుకాలమే!

జగన్‌ హయాంలో అరాచకాలు సృష్టించిన వైసీపీ గూండాలకు, వారికి సహకరించిన ‘వైపీఎస్‌’ అధికారులకు,అయ్యాఎస్ అధికారులకు ఉచ్చు బిగుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో తాము చేసిన తప్పిదాలకు రాజ్యాంగ ఉల్లంఘనలకు ఇప్పుడు మూల్యం చెల్లించుకోవలసిన పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. అటువంటి అధికారుల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. వైసీపీ నేతల తప్పులకు సంబంధించి పక్కా ఆధారాలు సేకరించి చర్యలు తీసుకునే దిశగా సీఎం చంద్రబాబు పోలీసులను నడిపిస్తున్నారు. ఫలితంగా వైసీపీ జమానాలో అడ్డగోలుగా రెచ్చిపోయి, ఇష్టారీతిగా వ్యవహరించిన వారిలో ఆందోళన, భయం వ్యక్తం అవుతున్నాయి. అలాగే వైసీపీ నేతలకు వంత పాడిన ఐపీఎస్ లు పోస్టింగుకు కూడా నోచుకోకుండా ఎప్పుడేం జరుగుతుందా అన్న భయంతో వణికి పోతున్నారు.  వైసీపీ ప్రభుత్వంలో అప్పటి నరసాపురం ఎంపీ, ప్రస్తుత ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజును రాత్రికి రాత్రి హైదరాబాద్‌ నుంచి తీసుకొచ్చి సీఐడీ కార్యాలయంలో చిత్రహింసలకు గురిచేశారు. ఈ వ్యవహారంలో తనను వేధించి, హింసించిన ఐపీఎస్‌ అధికారి పీవీ సునీల్‌ కుమార్‌, వ్యూహరచన చేసిన పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు, అమలు చేసిన అడిషనల్‌ ఎస్పీ విజయ్‌పాల్‌పై గుంటూరు ఎస్పీకి రఘురామ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ముగ్గురిపై కేసు నమోదు చేసిన గుంటూరు పోలీసులు హత్యాయత్నం సెక్షన్లు పెట్టారు. అయితే నిందితులు సీనియర్‌ ఐపీఎ్‌సలు కావడం, అదనపు ఎస్పీ స్థాయిలో పనిచేసిన విజయ్‌పాల్‌ దర్యాప్తు అధికారికి సహకరించక పోవడంతో కేసు నీరుగారి పోతోందన్న భావన వ్యక్తమైంది. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం పోలీసు ఉన్నతాధికారులతో సమీక్షించి కేసు దర్యాప్తు బాధ్యతలను ప్రకాశం జిల్లా ఎస్పీగా పనిచేస్తున్న దామోదర్‌కు అప్పగించింది. దీంతో విజయ్‌పాల్‌ నోరు విప్పక తప్పని పరిస్థితి ఏర్పడనుంది. పాల్‌ నోరు విప్పితే ఎవరెవరు కుట్ర చేశారు? ఎవరు అమలు చేశారు? తదితర విషయాలన్నీ వెలుగులోకి వస్తాయి.