ఆన్ లైన్ లో పరిశ్రమలకు అనుమతులు
కొత్తగా ఏర్పాటు కానున్న 12 వేలకు పైగా పరిశ్రమలు..
రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు రూ.2,04,000 కోట్లు..
15లక్షల మందికి ఉపాది అవకాశాలు..
ప్రపంచవ్యాప్తంగా దేశాలన్నింటినీ సంక్షోభంలో నెట్టేసింది కోవిద్ 19 వైరస్. దీన్ని చైనా తయారు చేసిందన్న కారణంగా చాలా బహుళజాతి సంస్థలు తమ కంపెనీలను చైనా నుంచి తొలగిస్తున్నాయి. మానవ వనరులు ఎక్కువగా ఉన్న మనదేశంలో తమ కంపెనీలు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. విదేశీ సంస్థలు ఆకర్షించే ప్రత్యేక ప్యాకేజీలను తెలంగాణ ప్రభుత్వం ఇవ్వడంతో అనేక ఫార్మా, ఫుడ్ ప్రాసెసింగ్, ఈ కామర్స్ సంస్థలు హైదరాబాద్ కేంద్రంగా చేసుకుని తమ ఉత్పత్తులను, సేవలను అందించడానికి ముందుకు వస్తున్నాయి. కరోనా వ్యాప్తి కారణంగా పరిశ్రమల ఏర్పాట్లు, అనుమతులు అన్ని ఆన్ లైన్ లోనే జరుగుతున్నాయి. ఇందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ-ఆఫీస్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రానికి రానున్న కొత్త పరిశ్రమల గురించిన వివరాలు ఇలా ఉన్నాయి.
అనేక అంతర్జాతీయ సంస్థలు తమ పరిశ్రమలను హైదరాబాద్ కేంద్రంగా చేసుకుని పనులు ప్రారంభించేందుకు దరఖాస్తు చేసుకున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.2,04,000 కోట్ల మేరకు పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి. 12,425 పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేశారు. ఇందులో ఎరోస్పేస్, డిఫెన్స్ కు సంబంధీంచిన అంతర్జాతీయ సంస్థలు 20 ఉన్నాయి. అయితే ఎరోస్పేస్ లో అత్యంత ప్రతిష్టాత్మకమైన 12 సంస్థలు హైదరాబాదు కేంద్రంగా చేసుకుని ఉత్పత్తులను ప్రారంభించేందుకు సిద్దమైయ్యాయి. అనుమతులు అందుకున్న వాటిలో 370 ఆహార ఉత్పత్తి పరిశ్రమలు, 169ఫార్మా కెమికల్, 165 ప్లాస్టిక్, రబ్బర్,195 ఆగ్రోబేస్, 166 గ్రాంటస్టోన్, 69 పేపర్ ప్రింటిగ్ 63 టెక్స్ టైల్స్ 117 సిమెంట్ పరిశ్రమలు ఉన్నాయి. బహుళజాతి సంస్థలు పరిశ్రమలైన ఐకీయా రూ.600క్నోతో ఇప్పటికే పనులు ప్రారంభించింది. రూ.200కోటతో జాండ్ జాన్సన్ పరిశ్రమ గజ్వేల్ లోని ముప్పిరెడ్డిపల్లిలో ఏర్పాటు చేసింది. ఈ పరిశ్రమలన్నీ తమ పనులను ప్రారంభిస్తే సుమారు 15 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. పరిశ్రమలకు అనుమతి కోరుతూ చైనా సంస్థలు కూడా కొన్ని దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. అయితే అనుమతులు ఇచ్చేముందు ఆయా సంస్థల గురించి పూర్తి సమాచారం సేకరిస్తున్నారు.