కరోనా తాకిడికి విలవిలలాడుతున్న ఏపీ.. విశాఖ సరి కొత్త రికార్డ్
కరోనా మహమ్మారి దెబ్బకు ఏపీ విలవిలలాడుతోంది. గడిచిన 24 గంటల్లో ఏకంగా 6,045 మందికి కరోనా సోకినట్లు ఏపీ వైద్యఆరోగ్యశాఖ తెలిపింది. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికం విశాఖ జిల్లా లోనే ఉన్నాయి. ఇంతకు ముందు ఎప్పుడు లేనంతగా ఏకంగా 1049 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. తాజా కేసులతో ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 64,713కి చేరింది. గడిచిన 24 గంటల్లో 65 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 823కి చేరింది.
కొత్తగా నమోదైన కేసుల్లో జిల్లాల వారీగా చూస్తే అనంతపురంలో 325, చిత్తూరు 345, తూర్పు గోదావరి 891, పశ్చిమగోదావరి జిల్లాలో 672, గుంటూరు 842, కర్నూలు 678, కడప 229, కృష్ణా 151, నెల్లూరు 327, ప్రకాశం 177, శ్రీకాకుళం 252, విజయనగరం 107 కేసులు నమోదయ్యాయి.