Cold War Between YCP Leaders in Kurnool

కర్నూలు కోల్డ్ వార్... 

స్థానిక సమరంలో తారాస్థాయికి చేరుకున్న ఇంటిపోరు  కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్,జగన్ బంధువు ఎస్వీ మోహన్ రెడ్డి మధ్య ఇన్ సైడ్ వార్  రాజీనామా అస్త్రంతో అధిష్టానం పై తిరుగుబాటు చేసే యోచనలో హఫీజ్ ఖాన్ హఫీజ్ కి చెక్ పెట్టి నియోజికవర్గం లో పట్టు సాధించాలి అని ఎస్వీ విశ్వప్రయత్నాలు  మూలిగే నక్క పై తాటి కాయ పడ్డట్టు తయారైంది కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ పరిస్థితి.ఒక పక్క ఎన్ఆర్సి,ఎన్పిఆర్,సిఏఏ ల పై జగన్ వైఖరితో మైనార్టీలకు సమాధానం చెప్పుకోలేని పరిస్థితి లో ఉన్న హఫీజ్ ఖాన్ ని కష్టాలు వెంటాడుతున్నాయి.ఎన్నికల ముందు కండువా కప్పించుకున్న ఎస్వీ మోహన్ రెడ్డి నిద్రపట్టకుండా చేస్తున్నారు.పేరుకే ఎమ్మెల్యే నియోజికవర్గం లో ఏ పని జరగాలి అన్నా ఎస్వీ మోహన్ రెడ్డి ఆశీస్సులు ఉండాల్సిందే.మైనార్టీ వర్గాలకు చెందిన ఎమ్మెల్యే కావడమే నేను చేసుకున్న శాపమా అని ఎమ్మెల్యే కొంతమంది అధికారుల దగ్గర కన్నీటి పర్యంతం అయ్యారు అంటే ఎంత ఘోరమైన పరిస్థితులు ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు.కనీసం ఒక పెన్షన్,రేషన్ కార్డు ఇప్పించుకోలేని పరిస్థితి హఫీజ్ ఖాన్ ది. నియోజకవర్గం ఏ అభివృద్ధి కార్యక్రమం చెయ్యాలన్నా రెడ్డి గారు టిక్ పెట్టాల్సిందే.10 నెలలుగా నరక యాతన పడుతున్నా మీడియా ప్రతినిధులతో తన ఆవేదన వ్యక్తం చెయ్యడం తప్ప హఫీజ్ ఖాన్ చెయ్యగలిగింది ఏమి లేదు.మైనార్టీ నేతలు ,కార్యకర్తలు తప్ప మిగిలిన క్యాడర్ ఎమ్మెల్యే మొహం చూడాలి అంటేనే భయపడే పరిస్థితి.ఇప్పుడు వచ్చిన స్థానిక ఎన్నికలు హఫీజ్ ఖాన్ కి మరిన్ని కష్టాలు తెచ్చిపెట్టాయి.నేను గెలిస్తే మిమల్ని అన్ని విధాలా ఆదుకుంటా అని కింది స్థాయి నేతలకు హామీలు ఇచ్చిన హఫీజ్ ఖాన్ కి షాక్ తగిలింది.తాను పంపిన లిస్ట్ లో 90 శాతం పేర్లు మారిపోయి అత్యధిక సీట్లు ఎస్వీ మోహన్ రెడ్డి వర్గానికి దక్కడం ,బీ ఫార్మ్ లు కూడా ఆయనే ఇవ్వడంతో హఫీజ్ ఖాన్ కి నియోజికవర్గం లో మొహం చెల్లడం లేదు.దింతో మైనార్టీ వర్గాల్లో భవిష్యత్తు పార్టీ నాయకుడు అనుకున్న హఫీజ్ ఖాన్ చాప్టర్ కి త్వరలోనే ఎండ్ కార్డు పడటం నియోజికవర్గం పగ్గాలు పూర్తి స్థాయిలో ఎస్వీ కి దక్కడం ఖాయం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

nara lokesh slams cm ys jagan

'బాబు టైలర్స్‌... జగన్‌ టైలర్స్‌' అంటూ ఆసక్తికర కార్టూన్లు పోస్ట్ చేసిన నారా లోకేశ్

బీసీలపై జగన్‌ తీరుపై లోకేశ్‌ ఎద్దేవా వైఎస్‌ జగన్ గారు మంచి కటింగ్ మాస్టర్ చట్టబద్ధంగా బీసీలు అనుభవిస్తున్న 34 శాతం రిజర్వేషన్లను 10 శాతం కట్  34 శాతం రిజర్వేషన్లు పార్టీపరంగా అమలు చేస్తున్నాం అని కటింగ్   'బాబు టైలర్స్‌.. జగన్‌ టైలర్స్‌' అంటూ టీడీపీ నేత నారా లోకేశ్ ఆసక్తికర కార్టూన్లు పోస్ట్ చేశారు. బీసీ రిజర్వేషన్లపై జగన్‌ తీరును ఎద్దేవా చేశారు. కార్టూన్లలో టైలర్లుగా చంద్రబాబు, జగన్‌ కనపడుతున్నారు. దుస్తులు కుట్టించుకోవడానికి బీసీలు వచ్చినట్లు దీన్ని గీశారు. 'వైఎస్‌ జగన్ గారు మంచి కటింగ్ మాస్టర్. చట్టబద్ధంగా బీసీలు అనుభవిస్తున్న 34 శాతం రిజర్వేషన్లను 10 శాతం కట్ చేసి 24 శాతానికి తగ్గించారు. రాజకీయంగానూ, సామాజికంగానూ, ఆర్థికంగానూ బీసీలను దెబ్బతీస్తూ... ఇప్పుడు 34 శాతం రిజర్వేషన్లు పార్టీపరంగా అమలు చేస్తున్నాం అని కటింగ్ ఇస్తున్నారు' అని లోకేశ్‌ చెప్పారు.

cm ramesh meets amit shah

అమిత్ షా చర్యలు తీసుకుంటామని చెప్పారు: సీఎం రమేశ్

అమిత్ షాను కలిసిన బీజేపీ ఎంపీలు వైసీపీ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందన్న సీఎం రమేశ్ పోలీసులే నామినేషన్లు అడ్డుకుంటున్నారని ఆరోపణ ఏపీలో బీజేపీ నేతలపైనా, కార్యకర్తలపైనా దాడులు జరుగుతున్నాయంటూ బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ మండిపడ్డారు. ఏపీలో పరిస్థితులు అదుపులోకి రాకపోతే చర్యలు తీసుకుంటామని హోంమంత్రి అమిత్ షా చెప్పారని వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వం అన్యాయంగా వ్యవహరిస్తోందని, పోలీసులే నామినేషన్లను అడ్డుకుంటున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయని సీఎం రమేశ్ ఆరోపించారు. పోలీసుల వ్యవహారశైలిపై నిఘా ఉంటుందన్న విషయాన్ని పోలీసులు గ్రహించాలని హితవు పలికారు. కాగా, బీజేపీ ఎంపీలు సీఎం రమేశ్, టీజీ వెంకటేశ్, జీవీఎల్ నరసింహారావు తదితరులు ఇవాళ హోంమంత్రి అమిత్ షాను కలిసి లేఖను సమర్పించినట్టు తెలుస్తోంది.

Case filed against Asaduddin Owaisi

కోర్టు ఆదేశాల మేర‌కు ఒవైసీపై కేసు పెట్టిన పోలీసులు

ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై కేసు నమోదు చేశారు హైదరాబాద్ పోలీసులు. నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకు ఆయనపై ఓల్డ్‌ సిటీలోని మొగల్‌పుర పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అసదుద్దీన్ ఒవైసీతో పాటు.. ఎంఐఎం మాజీ ఎమ్మెల్యే వారిస్ పఠాన్‌పై కూడా కేసు ఫైల్ చేశారు. బహిరంగ సభల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు ఒవైసీపై చర్యలు తీసుకోవాలని దిల్లీకి చెందిన బీజేపీ నేత కపిల్ మిశ్రా నాంపల్లి కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై కేసు నమోదైంది. నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును నమోదు చేసినట్లుగా హైదరాబాద్ మొగల్‌పుర పోలీసులు వెల్లడించారు. కర్ణాటకలోకి ఓ సభలో అసద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని, ఇవి ఓ వర్గం వారిని రెచ్చగొట్టేవిగా ఉన్నందునే ఈ కేసును నమోదు చేసినట్లుగా వెల్లడించారు. ఇటీవల కర్ణాటకలో జరిగిన ఎన్‌ఆర్‌సీ, సీఏఏకు వ్యతిరేకంగా నిర్వహించిన బహిరంగ సభల్లో అసదుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్, భారత్, పాకిస్థాన్ తదితర అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఐపీసీ సెక్షన్ 153, 153 (a) 117 295-a, 120b కింద పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై విచారణ చేస్తున్నట్లుగా పోలీసులు వెల్లడించారు. సీఏఏ, ఎన్‌ఆర్సీకి వ్యతిరేకంగా జరుగుతోన్న ఆందోళన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు అసదుద్దీన్ ఒవైసీ. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తోన్న నిరసన కార్యక్రమాల్లో పాల్గొని ఆయన ప్రసంగాలు చేస్తున్నారు.

position of bjp in andhra pradesh

ఆంధ్ర లో బీజేపీ 'పంచ్' తంత్రం...

  * దిగుమతి నాయకులు, బిజినెస్ లీడర్లు, లాబీయిస్టులు కలిసి బీ జె పి ని ఎటు నడిపిస్తారో....  * ఇంతకీ స్థానిక సమరం లో సత్తా చూపించే ట్యాలెంట్ ఆ పార్టీకి ఉన్నట్టా, లేనట్టా....  * జి వి ఎల్ ఋతుపవనాల్లాంటి వారు... ఇలావచ్చి అలా పలకరించి, అటు నుంచి ఆటే మాయమైపోతారు  * సి ఎం రమేష్ లాబీ మాస్టర్ గా ఢిల్లీ లో ప్రసిద్ధులు.. నోకియా మాదిరి ఈయన కూడా కనెక్టింగ్ పీపుల్ నినాదాన్ని బలంగా నమ్మిన వారు  * సుజనా చౌదరి... గత్యంతరం లేని పరిస్థితుల్లో అమరావతి నినాదాన్ని భుజాన వేసుకుని చందమామ కథలో విక్రమార్కుడి మాదిరి ... వై ఎస్ ఆర్ సి పి లోని బేతాళుడి తో జగడమాడుతుంటారు  * టీ జీ వెంకటేష్.. అవసరార్ధ రాజకీయాల కు కేరాఫ్ అడ్రెస్ .... రాయలసీమ అనేది ఈయనకు ట్యాగ్ లైన్ ...దురదపుట్టినప్పుడు గోక్కోవటానికి ఉపయోగపడే ఆరో వేలుగా ఆయన ఆ నినాదాన్ని బాగా వాడేస్తారు..  * అంగ వంగ కళింగ రాజ్యాలను అవలీలగా గెలిచిన చక్రవర్తి, చివరకు ఆముదాలవలస లో ఓడిపోయినట్టు, రాష్ట్ర బీ జె పి అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ , చివరకు పవన్ కళ్యాణ్ తో కలిసి స్థానిక సమరం లో బీజేపీకి కాస్తో కూస్తో ఉన్న ఇమేజ్ ని పణం గాపెట్టే సాహసానికి ఒడిగట్టారు  ఆ ఐదుగురూ ఇంతకీ ఏమి చేస్తున్నట్టు..భారతీయ జనతా పార్టీ దిగుమతుల విభాగం నుంచి డంప్ అయిన జి వి ఎల్ నరసింహారావు , అలాగే తెలుగు దేశం నుంచి బీ జె పి లోకి దిగుమతి అయిన సుజనా చౌదరి, సి ఎం రమేష్, టీ జీ వెంకటేష్ , కాంగ్రెస్ లో నుంచి బీ జె పి లోకి షిఫ్ట్ అయిన  బీ జె పి అధ్యక్షుడు కన్నా లక్ష్మీ  నారాయణ కలిసి ఈ స్థానిక సమరం లో రాష్ట్రం మొత్తం మీద కనీసం ఒక్కొక్కరికి 50 చొప్పున 250 మంది ఎం పి టి సి లు, జెడ్ పీ టి సి లను  గెలిపించుకురాగలరా అనేది చాలా పెద్ద సందేహం గా కనిపిస్తోంది. ఎందుకంటే, నిన్ననే విజన్ డాక్యుమెంట్ ని కలిసి ఆవిష్కరించిన బీ జె పి , జన సేన కంబైన్ నేతలు , చాలా పెద్ద  దృశ్యాన్నే జనం ముందు ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. వై ఎస్ ఆర్ సి పి, తెలుగుదేశం పార్టీ లకు తామే ప్రత్యామ్నాయమన్నట్టు గా ప్రకటించుకున్న ఈ ఐదుగురిదీ  వాస్తవానికి తలో దారీ.. ఎవరు , ఎప్పుడు, ఎందుకు, ఎలా మాట్లాడతారో తెలీని గందర గోళం ....  జి వి ఎల్ నరసింహ రావు ది అయితే సొంత రాజ్యాంగం, పూర్తిగా పార్టీ రాష్ట్ర శాఖ తో  గానీ, లేదా బీ జె పి లో ఉన్నతెలుగుదేశం మాజీ లతో  కానీ ఈయనకు ఎలాంటి సంబంధాలు ఉండవు.  రాష్ట్రాన్ని ఎప్పుడైనా పలకరించడానికి రుతు పవనాల మాదిరి అలా చుట్టపు చూపు గా వచ్చేసి ,  ఇలా మాయమైపోయే  జి వి ఎల్ వ్యవస్థ ల గురించి రాష్ట్ర బీ జె పి లో ఎవరికీ ఎలాంటి క్లూలు ఉండవు. ఈయన దారి రహదారి. ఈయన వ్యవస్థ ఇలాఉంటే, బీ జె పి లో ఉంటూ కూడా ఇంకాతెలుగు దేశం ఎజెండా , జెండా రెండూ మోస్తున్నట్టు కనిపించే సుజనా చౌదరి ఒక్క అమరావతి అంశం మీద తప్పించి, ఇతరత్రా ఏదీ మాట్లాడటానికి ఎక్కువగాఇష్టపడరు. జీ వీ ఎల్ కు, సుజనా కూ క్షణం పడదు. ఆయన ఎడ్డెం అంటే ఈయన తెడ్డెం అనే రకం.. ఏ మాత్రం పొసగని,పొంతన లేని పరస్పర భిన్నమైన అభిప్రాయాలు గల వీరిద్దరూ ఉత్తర ధృవం, దక్షిణ ధృవం మాదిరి ఒకే పార్టీ లో ఉంటూ కూడా కామన్  ఎజెండా తో పని చేసిన దాఖలాలు ఇప్పటివరకూ అయితే లేవు.   ఇహ, సి ఎం రమేష్ గురించి వేరే చెప్పనక్కర్లేదు. ఆయన తన బిజినెస్ వ్యవహారాలను బీ జె పి తో ముడి కట్టేసి, ఏ పార్టీ లో ప్రయాణిస్తున్నాడో కూడా మర్చే పోయి, మొన్నటికి మొన్న పరిమళ్ నత్వాని ని జగన్ మోహన్ రెడ్డి దగ్గర ప్రవేశ పెట్టడం లో కీలక పాత్ర పోషించిన  ఘనుడు. గుర్తు చేస్తే కానీ తానూ బీ జె పి లో ఉన్నాననే విషయం గుర్తుండని ఈయన కు  బీ జె పి, జన సేన కలిసి పోటీ  చేస్తున్న విషయం తెలుసో లేదో అని కూడాపార్టీ శ్రేణులు గుసగుస లాడుకుంటున్నాయి.  ఇహ వీరందరినీ సమన్వయము చేసుకుని  ముందుకెళ్తున్నట్టు భావిస్తూ , బాహ్య ప్రపంచం ముందు ఆవిష్కృతమయ్యే  వ్యక్తి మరెవరో కాదు... సాక్షాత్తూ  రాష్ట్ర బీ జె పి అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ. ఈయన, పవన్ కళ్యాణ్ తో కలిసి ప్రయాణించటానికి అంతగాసుముఖం గా లేదు...కారణమేమిటంటే, చంద్రబాబు నాయుడు లాంటి యోధులతో పోరాడిన తన రాజకీయం , చివరకు ఇలా ఏ పూట ఎక్కడ ఉంటారో కూడా తెలీని పవన్ కళ్యాణ్ పార్టీతో కలిసి పని చేయాల్సిన దుస్థితికి దిగజారటమేమిటని  తరచూ తనలో తానె కుమిలి పోతున్నట్టు సమాచారం.  ఇహ, టీ జీ వెంకటేష్ అయితే మరీను..... రాయలసీమ నినాదాన్ని తన ట్యాగ్ లైన్ గాచేసుకుని కాలక్షేపం చేసేస్తూ... ప్రస్తుతానికి బీ జె పి లో నివసిస్తూ ....ఈ స్థానిక ఎన్నికల సమరం లో తన పాత్ర ఏమిటో కూడాతెలీకుండా జీవనం వెళ్లదీస్తున్నారు. మొత్తానికి ఈ పంచ పాండవులు స్థానిక సమరం లో తమ 'పంచ్ ' పవర్ ఏమిటో ఈ నెలాఖరు లోగా చుపిస్తారేమోననే బోలెడు , ఇంకా గంపెడాశతో బీ జె పి అభిమానులు ఆత్రంగా ఎదురు చూస్తున్నారు.

shocking news to hyderabad people

క‌రోనా మృతుడు ఐదురోజుల పాటు హైద‌రాబాద్‌లోనే ఉన్నాడ‌ట‌!

'కేర్' లో చికిత్స జ‌రిగింది. అయితే పర్యవేక్షించిన నర్సు ఐసోలేషన్‌లో వుంచారు. ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చిన ఈ సంఘ‌ట‌న హైద‌రాబాద్ వాసుల్ని వ‌ణికిస్తోంది. కరోనా వైరస్‌తో మృతి చెందిన వ్యక్తి ఐదు రోజులు పాటు హైదరాబాద్‌ పాతబస్తీలో ఉన్నారట‌. కర్ణాటకకు చెందిన 76 ఏళ్ల వృద్ధుడు కరోనా కారణంగా చనిపోయినట్లు నిర్ధారణ అయింది. ఆయనకు హైదరాబాద్‌లోని కేర్ హాస్పిటల్‌లో చికిత్స అందించగా ఆయన్ను పర్యవేక్షించిన నర్సును ప్ర‌స్తుతం ఐసోలేషన్‌లో ఉంచారు. దేశంలో తొలి కరోనా మరణం ఇదే కావడం గమనార్హం. ఉత్తర కర్ణాటకలోని కలబుర్గికి చెందిన ఆయన మార్చి 10న కరోనా లక్షణాలతో చనిపోయారు. ఆయనకు కోవిడ్ సోకినట్లు చనిపోయిన తర్వాత నిర్ధారించారు. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని కేర్ హాస్పిటల్లో చికిత్స పొందిన ఆయన.. డిశ్చార్జి అయిన కాసేపటికే చనిపోయారు. అంతకు ముందు నగరంలోని మరో రెండు హాస్పిటళ్లు ఆయన్ను అడ్మిట్ చేసుకోవడానికి నిరాకరించాయి. ‘‘శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడుతున్న కరోనా అనుమానితుడు హాస్పిటల్‌కు వచ్చాడు. ఐసోలేషన్‌లో ఉంచిన తర్వాత కరోనా చికిత్స అందిస్తున్న గాంధీ హాస్పిటల్‌కు తరలించాలని ఆయన్ను తీసుకొచ్చిన వారికి సూచించాం. కానీ ఆయన కుటుంబ సభ్యులు మా సూచనకు విరుద్ధంగా కలబుర్గి తీసుకెళ్లారు. కాగా కేర్ హాస్పిటల్ నుంచి అంబులెన్స్ బయల్దేరిన గంటకే ఆ పేషెంట్ చనిపోయాడు. కలబుర్గికి చెందిన వృద్ధుడు జనవరి 29న సౌదీ అరేబియాలోని మక్కా వెళ్లారు. ఫిబ్రవరి 29న హైదరాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఎయిర్‌పోర్టులో స్క్రీనింగ్ నిర్వహించగా ఆయనలో కరోనా లక్షణాలేవీ కనిపించలేదు. దీంతో హైదరాబాద్ నుంచి కలబుర్గి వెళ్లారు. మార్చి 5 నాటికి ఆయన అనారోగ్యానికి గురి కావడంతో కలబుర్గిలోని ఓ ప్రయివేట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. మరుసటి రోజు ఆయన ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. కరోనా సోకిందనే అనుమానంతో ఆయన శాంపిళ్లను సేకరించి బెంగళూరు పంపారు. కారణలేంటో తెలీదు కానీ మార్చి 9న ఆయన్ను హైదరాబాద్‌ తీసుకొచ్చి కేర్ హాస్పిటల్‌లో చేర్పించారు. మరుసటి రోజు కేర్ నుంచి తీసుకెళ్తుండగా.. కలబుర్గి వెళ్లే దార్లోనే ఆయన చనిపోయారు. కలబుర్గిలో ఆయన అంత్యక్రియలు జరిగాయి. బంజారాహిల్స్‌లోని కేర్ హాస్పిటల్ ఆయన్ను మూడు గంటలపాటు ఐసీయూలో ఉంచిందని.. తర్వాత గాంధీ హాస్పిటల్‌కు తీసుకెళ్లాలని సూచించిందని కర్ణాటక ప్రభుత్వం తెలిపింది. కలబుర్గిలో చనిపోయిన వృద్ధుడికి కరోనా పాజిటివ్ అని తేలిందని కర్ణాటక ప్రభుత్వం నిర్ధారించింది. కేర్ హాస్పిటల్‌ను సందర్శించిన ఆరోగ్యశాఖ అధికారులు అక్కడి పరిస్థితిని సమీక్షించారు. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా కరోనా పరీక్షల కోసం ఐదు ల్యాబ్‌లు ఏర్పాటు చేయగా.. మరో 60 ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ ఐసోలేషన్‌ వార్డులను ఏర్పాటు చేశారు. ఇందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ప్రతి జిల్లాలోని ప్రభుత్వాసుపత్రులు, వైద్య విధాన పరిషత్‌లలో కూడా ఐసోలేషన్‌ వార్డుల ఏర్పాటుకు అధికారులు చర్యలు చేపట్టారు. కరోనా అనుమానితుల వైద్య పరీక్షల రిపోర్టు వచ్చే వరకు అనుమానితులను డిశ్చార్జి చేయొద్దని ప్రభుత్వం అన్ని ఆస్పత్రులకు ఆదేశాలు జారీ చేసింది.

Kuldeep Sengar gets 10 years in jail

ఉన్నావ్ బాధితురాలి తండ్రి మృతి కేసులో బిజెపి మాజీ ఎమ్మెల్యేకు పదేళ్ల జైలు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2017 ఉన్నావ్ అత్యాచార ఘటనకు సంబంధించి మ‌రో కేసులో తీర్పు వెలువడింది. ఉన్నావో అత్యాచార బాధితురాలి తండ్రి మృతి కేసులో బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్‌దీప్ సింగ్ సెంగార్‌‌కు న్యాయస్థానం శిక్ష ఖరారుచేసింది. ఈ కేసులో సెంగార్‌తోపాటు మరో ఏడుగుర్ని ఢిల్లీ న్యాయస్థానం దోషులుగా నిర్ధారించింది. దోషులకు శిక్షలు ఖరారుచేసిన న్యాయస్థానం జరిమానా కూడా విధించింది. ఈ కేసులో సెంగార్‌కు పదేళ్ల జైలు శిక్ష, రూ.10 లక్షల జరిమానా చెల్లించాలని ఆదేశించింది. మిగతా దోషులకు పదేళ్ల శిక్షను విధిస్తూ తీర్పు వెలువరించింది. కాగా అత్యాచారం కేసులో ఇప్పటికే సెంగార్‌‌కు యావజ్జీవిత ఖైదు పడిన విషయం తెలిసిందే. బాధితుడిపై కుట్రపూరితంగా తప్పుడు కేసు పెట్టి, పోలీసులతో అరెస్ట్ చేయించారనడానికి విచారణలో పక్కగా సాక్ష్యాలు విచారణలో లభ్యమయ్యాయని కోర్టు వ్యాఖ్యానించింది. బాధితుడిని చంపాలని ఉద్దేశం నిందితుడికి లేకపోయినా, కానీ, అతడిపై దారుణంగా దాడిచేసి అతడి మరణానికి కారకులయ్యారని పేర్కొంది. పోలీసులు కూడా కనీస ఇంగిత జ్ఞానం లేకుండా అత్యంత పాశవికంగా కొట్టారు.. వైద్యులు కూడా మానవత్వం లేని మనుషుల్లా నిర్లక్ష్యం వహించారని న్యాయమూర్తి మండిపడ్డారు. గతేడాది జులైలో ఉన్నావ్ అత్యాచార బాధితురాలిపై హత్యాయత్నం జరిగింది. రాయ్‌బరేలీలోని కోర్టకు హాజరయ్యేందుకు వెళ్తున్న బాధితురాలిపై ఐదుగురు దాడిచేశారు. అనంతరం ఆమెపై కిరోసిన్ పోసి సజీవదహనానికి యత్నించారు. దీంతో 90 శాతం కాలిన గాయాలతో ఉన్న బాధితురాలిని చికిత్స కోసం తొలుత స్థానిక హాస్పిటల్‌లో చేర్పించారు. తర్వాత మెరుగైన వైద్యం కోసం లక్నో తరలించగా, పరిస్థితి విషమించడంతో న్యూఢిల్లీలోని సఫ్దర్జంగ్ హాస్పిటల్‌కు తరలించారు. అయితే, ఆమెను కాపాడటానికి వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. 40 గంటలు మృత్యువుతో పోరాడి తుది శ్వాస విడిచింది.

TTD To Screen Devotees With Thermal Guns

జ్వరం లేకుంటేనే తిరుమలకు.. భక్తులకు తిరుపతిలోనే థర్మల్ గన్ తో పరీక్షలు!

అలిపిరి, శ్రీవారిమెట్టు వద్ద థర్మల్ గన్స్ పరీక్షల అనంతరమే కొండపైకి అనుమతి తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం నిత్యమూ లక్షలాది మంది భక్తులు వచ్చి వెళుతుండే, తిరుమలకు కరోనా వైరస్ రాకుండా చూసేందుకు టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంది. అలిపిరి, శ్రీవారి మెట్టు తదితర ప్రాంతాల్లో థర్మల్ గన్ లను అందుబాటులో ఉంచింది. నేటి నుంచి కొండపైకి ఎక్కే ప్రతి ఒక్కరినీ ఈ గన్ తో పరీక్షిస్తారు. శరీరంలో జ్వర లక్షణాలు కనిపించక పోతేనే వారిని కొండపైకి అనుమతిస్తారు. ఒకవేళ సాధారణం కన్నా శరీర ఉష్ణోగ్రత అధికంగా ఉంటే, పక్కనే ఏర్పాటు చేసిన స్క్రీనింగ్ సెంటర్ లో తదుపరి పరీక్షలు నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. కాగా, తిరుమలలో శ్రీవారి రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారి సర్వ దర్శనం కోసం 11 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. వీరికి దర్శనం పూర్తయ్యేందుకు 5 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. టైమ్ స్లాట్ టోకెన్లు, దివ్య దర్శనం, రూ. 300 ప్రత్యేక దర్శనం భక్తులకు దర్శనానికి 3 గంటల సమయం పడుతోందని తెలిపారు. నిన్న గురువారం స్వామివారిని 61,652 మంది దర్శించుకోగా, 22,756 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ. 2.34 కోట్ల ఆదాయం లభించింది.

Senior Andhra Pradesh leaders quit TDP

వరుస షాక్ ల‌తో బెంబేలెత్తుతున్న టిడిపి!

స్థానిక సంస్థల ఎన్నికల వేళ తెలుగు త‌మ్ముళ్లు సైకిల్ దిగి ఫ్యాన్ కింద‌కి వెళ్ళ‌డం అధినేత చంద్ర‌బాబుకు న‌చ్చ‌డం లేదు. రాష్ట్రంలో శరవేగంగా మారుతున్న రాజకీయ పరిణామాల్ని ఆయ‌న జీర్ణించుకోలేక‌పోతున్నారు. రాజ‌కీయ ఎత్తుగ‌డ‌ల‌తో అధికార వైసీపీ ప్రతిపక్ష పార్టీలోని కీలక నేతలను తమ వైపు తిప్పుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. టీడీపీకి పట్టున్న జిల్లాల్లో ఆ పార్టీని దెబ్బతీయడమే టార్గెట్‌గా పెట్టుకున్నట్లు తాజా రాజకీయ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ హవా రాష్ట్రమంతా కనిపించినా.. విశాఖలో మాత్రం టీడీపీ నాలుగు అసెంబ్లీ సీట్లను గెలుచుకుంది. ఇలాంటి చోట్ల టీడీపీని సంస్థాగతంగా దెబ్బకొట్టాలని, ఆ పార్టీలోని కీలక నేతలపై వైసీపీ గురిపెట్టింది. ఇందులో భాగంగానే.. మాజీ ఎమ్మెల్యే, టీడీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన త్వరలోనే వైసీపీ తీర్థం పుచ్చుకునే అవకాశం కనిపిస్తోంది. రెహమాన్, బాలరాజు, తైనాల, చింతలపూడి వెంకట్రామయ్య ఇప్పటికే వైసీపీ కండువా కప్పుకున్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన కనిగిరి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత కదిరి బాబూరావుకు పార్టీ కండువా కప్పి జగన్ ఆహ్వానించారు. అదే బాట‌లో టీడీపీ సీనియర్ నేత, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం కూడా ప‌య‌నించారు. అంత‌టితో ఆగ‌కుండా ప్రకాశం జిల్లాలో టీడీపీని బలహీన పరిచే పనుల్లో బిజీగా మారారు. మాజీ మంత్రి శిద్దా రాఘవరావు సహా పలువురు జిల్లా స్థాయి నేతలను, ద్వితీయ శ్రేణి నాయకులను తమ వెంట వైసీపీ లాగేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. దాంతో ప్రకాశంజిల్లాలో టీడీపీ ఖాళీ అయిపోతుందా అన్న సందేహాలు పెరుగుతున్నాయి. ఎమ్మెల్సీ పోతుల సునీత, మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు, ఎమ్మెల్యే కరణం బలరాం వైసీపీ గూటికి చేరిన నేపథ్యంలో మరికొంతమంది ముఖ్య నేతలు వైసిపి వైపు చూస్తున్నారనిపిస్తోంది. ప్రధానంగా కరణం బలరాంతో ప్రత్యేక అనుబంధం ఉన్న మరికొందరు నేతలు వైసీపీలో చేరేందుకు క్యూ కడుతున్నారనిపిస్తోంది. కడప జిల్లాలో పులివెందుల సతీష్ రెడ్డి, జమ్మలమడుగు రామసుబ్బారెడ్డి టీడీపీని వీడారు. కడప జిల్లాకు చెందిన మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి ఇదేవిధంగా చక్రం తిప్పుతున్నారు. దాంతో కడప జిల్లాలో టీడీపీకీ కీలకమైన నేతగా మైనారిటీ నేత సుబాన్ బాషాతో టీడీపీకి రాజీనామా చేయించి సుబాన్ బాషాతో పాటు ఆయన అనుచరులను డిప్యూటీ సీఎం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మరోవైపు కర్నూలు జిల్లా టీడీపీలో కీలక కుటుంబం నుంచి కీలక వ్యక్తి టీడీపీకి గుడ్ బ్ చెప్పారు. ఆయన వైసీపీలో చేరిక ఇంకా ఖరారు కానట్లు తెలుస్తోంది. ఇంకోవైపు తూర్పు గోదావరి జిల్లా అమలాపురం మున్సిపాలిటీ పరిధిలో ఆపరేషన్ ఆకర్ష చేపట్టారు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్. టీడీపీ నేతల ఇళ్లకు వెళ్లి మరి వైసీపీలో చేరాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు విశ్వరూప్. దాంతో పలువురు టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులు వైసిపిలోకి చేరారు. అమలాపురం మున్సిపల్ మాజీ చైర్మన్ యళ్ల సతీష్ టీడీపీ రాజీనామా చేసి, వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అనంతపురం జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్సీ శమంతకమణి, ఆమె కుమార్తె మాజీ ఎమ్మెల్యే యామిని బాల కూడా వైసీపీలోకి చేరేందుకు రంగం సిద్ధం చేస్తుకుంటున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. నాలుగైదు రోజులుగా తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి అధికార వైసీపీ గూటికి చేరుతున్న తెలుగు తమ్ముళ్ళ సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కదిరి బాబూరావుతో మొదలైన వలసల పరంపర కేఈ ప్రభాకర్ దాకా కొనసాగింది. అదే బాటలో మరికొందరున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.

Delhi govt bans IPL and other sports

ఐపీఎల్ తో పాటు ఎఫ్ 1 రేస్ కూడా రద్దు!

ఢిల్లీలో ఐపీఎల్ 13వ సీజన్ కు సంబంధించిన మ్యాచ్లను నిర్వహించకూడదని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఐపీఎల్ మ్యాచ్లతో పాటు మిగతా క్రీడా పోటీలపైన కూడా నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. స్టేడియంలో జనం పెద్ద సంఖ్యలో గూమిగూడే అవకాశం ఉండడంతో కరోనా వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలందరూ ఎంతో ఆసక్తిగా తిలకించే ఎఫ్ 1 రేస్ కూడా నిలిపివేయండంతో క్రీడాభిమానులు నిరాశకు గురవుతున్నారు. కేంద్ర క్రీడామంత్రిత్వశాఖ కరోనా వైరస్ మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సలహాను పాటించాలని, క్రీడా కార్యక్రమాలలో లార్జ్ గెదరింగ్(పెద్దఎత్తున ప్రజలు ఒకచోట హాజరవడం) నివారించాలని BCCIతో సహా అన్ని జాతీయ సమాఖ్యలను కోరింది. ఇప్పటికే ఐపీఎల్ ను వాయిదా వేయాలని,బెంగళూరులో ఐపీఎల్ మ్యాచ్ లకు ఆతిథ్యం ఇవ్వలేమని కేంద్రానికి కర్ణాటక ప్రభుత్వం లేఖ రాసింది. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఐపీఎల్ ను వాయిదా వేసుకోవాలని సూచించింది. మద్రాస్‌ హైకోర్టులోనూ వాయిదా కోరుతూ ఓ పిటిషన్‌ దాఖలైంది. ఇక శివసేన నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వం ఏకంగా ఐపీఎల్‌ టికెట్ల అమ్మకాలపై నిషేధం విధించింది. కరోనా వైరస్‌ భయంతో ఐపీఎల్‌ మ్యాచ్‌ల నిర్వహణకు పలు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కూడా వ్యతిరేకత పెరుగుతోంది. ''ఇన్నేళ్లుగా ప్రతీ వేసవిని ధనాధన్‌ మెరుపులతో అలరించిన ఈ లీగ్‌ ఇప్పుడైతే అటు స్పాన్సర్లని, ఫ్రాంచైజీలనే కాదు... ఇటు పాలకమండలినీ దడదడలాడిస్తోంది. ఈ నెల 14న జరిగే ఐపీఎల్‌ పాలకమండలి సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటామని బీసీసీఐ ప్రకటించినప్పటికీ.. బిజీ షెడ్యూలు వల్ల అటు వాయిదా వేయలేదు. ఇటు వేరే దేశంలో నిర్వహించనూ లేరు. ఎన్నికల సందర్భంగా 2009, 2014లలో విదేశాల్లో నిర్వహించింది. కానీ.. ఇప్పుడున్న 'కరోనా మహమ్మారి' దృష్ట్యా ఏ దేశం నిర్వహణకు సిద్ధంగా లేదు.

union govt seek a report from ap governor over the law and order situation in ap

ఏపీ శాంతి భ‌ద్ర‌త‌ల‌పై కేంద్రం ఆరా!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో శాంతిభ‌ద్ర‌త‌ల ప‌రిస్థితిపై నివేదిక‌ను అంద‌జెయ్యాల‌ని గ‌వ‌ర్న‌ర్‌ను కేంద్ర హోంశాఖ కోరింది. డీజీపీని హైకోర్టుకు పిలిచి ప్ర‌శ్నించ‌డం, స్థానిక ఎన్నిక‌ల సంద‌ర్భంలో రాష్ట్రంలో జ‌రుగుతున్న గొడ‌వ‌ల నేప‌థ్యంలో వాస్త‌వ ప‌రిస్థితుల‌పై నివేదిక పంప‌మ‌ని కేంద్ర ప్ర‌భుత్వం గ‌వ‌ర్న‌ర్‌ను సూచించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను చేజిక్కించుకోవాలని భావిస్తున్న వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా బీభత్సం సృష్టిస్తోందని ప్ర‌తిప‌క్షాలు ఆరోపిస్తున్నాయి. ఇప్ప‌టికే రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాలు, దౌర్జన్యాలపై గవర్నర్‌ను రెండు మూడుసార్లు కలిసి ఫిర్యాదు చేశామని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు చెబుతున్నారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేశారని యనమల ఆరోపిస్తున్నారు. అంతే కాదు ఒక వ్యూహం ప్రకారం వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలను కవ్వించి తెలుగుదేశం పార్టీ నేత‌లు వీడియోలు తీస్తున్నారు. ఇలా వీడియోలు తీయడం వల్లే గొడవలు జరుగుతున్నాయ‌ని అధికార ప‌క్షం అంటోంది. ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడడానికి ముందు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన పార్టీ నేతలతో పలుమార్లు టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించి కొన్ని టిప్స్ ఇచ్చార‌ట‌. వైఎస్సార్‌సీపీ శ్రేణుల కదలికలను మొబైల్‌ ఫోన్లలో వీడియోలు తీయాలని ఆదేశించారు. దీంతో టీడీపీ కార్యకర్తలు వీడియోలు తీయడంతో గొడవలు జరుగుతున్నాయి. చిన్నపాటి వాగ్వాదాలు, గొడవలు జరిగితే చిత్రీకరించి తమకు పంపాలని టీడీపీ రాష్ట్ర కార్యాలయం నుంచి సూచనలు వచ్చాయి. ఆ వీడియోలను ఎన్నికల కమిషనర్‌ ట్విట్టర్‌ ఎకౌంట్లో పెట్టి దాన్నే ఫిర్యాదుగా తీసుకోవాలని కోరాలని టీడీపీ నాయకత్వం పేర్కొంది. వీడియోలను అనుకూలంగా మలచుకుని సోషల్‌ మీడియాలో వైరల్‌ చేయాలని టీడీపీ క్యాడర్‌కు సూచనలు అందినట్లు సమాచారం. టీడీపీ కార్యకర్తలు ఎక్కడికక్కడ వీడియోలు తీస్తుండడంతో వైఎస్సార్‌సీపీ నాయకులు అడ్డుకుంటున్నారు. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం సదుం గ్రామంలో టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్‌సీపీ నేతలను వీడియోలు తీస్తూ రెచ్చగొట్టడంతో గొడవ జరిగింది. ఈ ఘటనకు కొనసాగింపుగానే అదే నియోజకవర్గంలోని పులిచర్లలోనూ ఘర్షణ రేగింది. వీడియో తీయడం వల్లే పుంగనూరు నియోజకవర్గంలో గొడవ జరగ్గా, చంద్రబాబు ఆ గొడవనే పదేపదే ప్రస్తావించడం గమనార్హం. వీడియోలు తీస్తూ, కామెంట్లు చేస్తూ రెచ్చగొట్టడం, ఆ తర్వాత జరిగే గొడవలను వీడియోలు తీయడమే కొందరు పనిగా పెట్టుకున్నట్లు తెలిసింది. మాచర్లలోనూ టీడీపీ నాయకులు వీడియోలు తీసి హడావుడి చేయడం వల్లే గొడవ పెరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. స్థానిక ఎన్నిక‌ల సంద‌ర్భంగా రాష్ట్రంలో నెల‌కొన్న ప‌రిస్థితుల‌పై గ‌వ‌ర్న‌ర్ కేంద్రానికి ఎలాంటి నివేదిక పంప‌నున్నార‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది.

No Documents Needed For NPR

ధ్రువపత్రాలు అవసరం లేదట‌! ఎన్పీఆర్‌పై అనుమానాలొద్దంటున్న‌ అమిత్ షా

కోవిడ్‌ కన్నా ప్రమాదకరమైన మత వైరస్‌(కమ్యూనల్‌ వైరస్‌)ను బీజేపీ వ్యాప్తి చేస్తోందని, దీని వల్ల ప్రజాస్వామ్యానికి పెను ప్రమాద‌మంటూ రాజ్య‌స‌భ‌లో చర్చను ప్రారంభిస్తూ కాంగ్రెస్‌ సభ్యుడు కపిల్‌ సిబల్‌ వ్యాఖ్యానించడం స‌భ‌లో హీట్ పుట్టించింది. అధికార ప్ర‌తిప‌క్ష‌స‌భ్యుల వాదోప‌వాదాల మ‌ధ్య హోం శాఖా మంత్రి అమితాష్ ఎన్పీఆర్‌పై వివ‌ర‌ణ ఇచ్చారు. జాతీయ జనాభా పట్టిక(నేషనల్‌ పాపులేషన్‌ రిజిస్టర్‌-ఎన్పీఆర్‌)పై ఆందోళన అవసరం లేదని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా స్పష్టం చేశారు. ఎన్పీఆర్‌ను అప్‌డేట్‌ చేసే కార్యక్రమంలో ఏ పౌరుడి వివరాలను 'అనుమానాస్పద(డౌట్‌ఫుల్‌- డీ)' కేటగిరీలో చేర్చబోమని తెలిపారు. అలాగే, తమ పౌరసత్వాన్ని నిరూపించుకునే ఏ ధ్రువ పత్రాలను కూడా పౌరులు ఇవ్వాల్సిన అవసరం లేదని వివరణ ఇచ్చారు. ఎన్పీఆర్‌ ప్రశ్నావళిలో తల్లిదండ్రుల నివాసానికి సంబంధించిన ప్రశ్నలపై తలెత్తిన అనుమానాలను నివృత్తి చేస్తూ.. పౌరులు తమ వద్ద లేని సమాచారాన్ని కచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. సీఏఏపై గానీ, ఎన్పీఆర్‌పై కానీ మైనారిటీలు ఎలాంటి సందేహాలు పెట్టుకోవద్దన్నారు. ఎన్పీఆర్‌కు సంబంధించిన అనుమానాల నివృత్తికి విపక్ష నేతల బృందం తనను కలవొచ్చని సూచించారు. పౌరసత్వాన్ని రద్దు చేసే ఏ సెక్షన్‌ కూడా పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)లో లేదని మరోసారి స్పష్టం చేశారు. కులం, మతం, రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా ఢిల్లీ అల్లర్ల దోషులను చట్టం ముందు నిలుపుతామని పునరుద్ఘాటించారు. పౌరసత్వ సవరణ చట్టం పార్లమెంటు ఆమోదం పొందిన తరువాత కొందరు ఆ చట్టాన్ని వ్యతిరేకిస్తూ చేసిన విద్వేష ప్రసంగాల కారణంగానే ఢిల్లీ హింసాకాండ చోటు చేసుకుందని షా పేర్కొన్నారు. ప్రభుత్వమే హింసాకాండకు పురిగొల్పిందన్న ఆరోపణలపై స్పందిస్తూ.. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన అమెరికా అధ్యక్షుడు దేశంలో పర్యటిస్తున్న వేళ ఏ ప్రభుత్వమైనా అలా చేస్తుందా? అని ప్రశ్నించారు. ఢిల్లీ హింసాకాండ వెనుక పెద్ద కుట్ర ఉందని, విదేశీ నిధులను దీనికి ఉపయోగించారని ఆరోపించారు. 'ఢిల్లీ అల్లర్లను మత కలహాలనడం హాస్యాస్పదం. ఇవి ముందే ప్లాన్‌ చేసుకున్న ఊచకోత' అని ఓవైసీ వ్యాఖ్యానించారు. 'ఫైజాన్‌ ముస్లిం అయినంత మాత్రాన ఆయన ప్రాణం విలువ అంకిత్‌ ప్రాణం విలువ కన్నా తక్కువ కాబోదు. మొత్తం హింసాకాండపై నిష్పాక్షిక దర్యాప్తు జరగాలి' అని ఆయన కోరారు. ఢిల్లీ హింసాకాండకు పాల్పడినవారిని చట్టం ముందు నిలిపేందుకు నిష్పక్షపాత దర్యాప్తు జరగాలని ఎంఐఎం నేత అసదుద్దీన్‌ ఓవైసీ డిమాండ్‌ చేశారు. దేశ ఆత్మని కాపాడాలని ఓవైసీ హిందువులను కోరారు. దాదాపు 1,100 మంది ముస్లింలను అక్రమంగా నిర్బంధించారన్నారు. అల్లర్లను అదుపు చేయడంలో పోలీసుల తీరును తప్పుబట్టిన ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్‌ మురళీధర్‌ను బదిలీ చేయడంలో ఎలాంటి కుట్ర లేదని, ఆ బదిలీ అంతకుముందు, సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫారసుల ఆధారంగానే జరిగిందని వివరణ ఇచ్చారు.

corona deaths in world

127 దేశాల్లో కరోనా విలయం తాండ‌వం 4,973 మంది మృతి

ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి వణికిస్తోంది. 127 దేశాలకు కరోనా వైరస్ సోకిందింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ మృతుల సంఖ్య 4 వేల 972కి చేరింది. 1 లక్షా, 34 వేల 558 మంది కరోనా బాధితులు ఉన్నారు. 5 వేల 994 మందికి సీరియస్ గా ఉంది. భారత్ లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. క్రమంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. కరోనా వైరస్ ను ప్రపంచ మహమ్మారిగా డబ్ల్యూహెచ్ వో అనౌన్స్ చేసింది. దీంతో భారత్ లోని అని రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. కరోనా మరింత వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటున్నాయి. భారత్‌లో తొలి కరోనా మృతి నమోదైంది. కర్ణాటకకు చెందిన 76ఏళ్ల మహమ్మద్ హుస్సేన్ ప్రాణాంతక కరోనా వైరస్ బారిన ప‌డి మ‌ర‌ణించారు. తొలి మరణం. భారత్‌లో నమోదైన తొలి కరోనా మృతి. ముంబైకి చెందిన 26ఏళ్ల యువకుడు బెంగళూరులోని గూగుల్ ఆఫీసులో జాబ్ చేస్తున్నాడు. గత ఫిబ్రవరి 23న తన భార్యతో కలిసి గ్రీస్ దేశానికి హనీమూన్‌కు వెళ్లాడు. హనీమూన్ నుంచి మార్చి 6న ముంబైకి తిరిగొచ్చారు. మార్చి 8న ముంబై నుంచి బెంగళూరు చేరుకున్నారు. ఈ క్రమంలో అతడికి టెస్టులు నిర్వహించగా కోవిడ్19 పాజిటీవ్‌గా తేలినట్లు గూగుల్ ఇండియా ప్రతినిధి ఒకరు వెల్లడించారు. హనీమూన్ నుంచి తిరిగొచ్చిన ఆ టెకీ మార్చి 9న తిరిగి బెంగళూరు ఆఫీసుకు వెళ్లారు. ఈ క్రమంలో ఆ టెకీకి కరోనా వైరస్ లక్షాలున్నట్లు గుర్తించామని, దీంతో ఇతర ఉద్యోగులపై దీని ప్రభావం పడకుండా ఆయనను జయనగర్ జనరల్ హాస్పిటల్‌కు తరలించి ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. కరోనా వైరస్‌పై సమాచారం అందించేందుకు తెలంగాణ హెల్ప్‌లైన్ నెంబర్ - 104 ఆంధ్రప్రదేశ్‌ హెల్ప్‌లైన్‌ నెంబర్‌ - 0866 2410978. 1. శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, తిరుపతి. 2. ఆంధ్ర మెడికల్ కాలేజీ, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్. 3. జిఎంసి, అనంతపురం, ఆంధ్రప్రదేశ్ ఈ ఆసుపత్రులు కరోనా వైరస్ పరీక్ష అందుబాటులో వున్నాయి.

KE Prabhakar Resigns to TDP

టీడీపీకి మరో దెబ్బ.. కేఈ ప్రభాకర్ రాజీనామా

స్థానిక ఎన్నికల్లో అనుచరులకు అన్యాయం టికెట్ల కేటాయింపులో ప్రాధాన్యం దక్కలేదని అసంతృప్తి తెలుగుదేశం పార్టీని వీడిన కేఈ కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కేఈ ప్రభాకర్, పార్టీకి రాజీనామా చేశారు. నేడు తన అనుచరులతో సమావేశమైన ఆయన రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో తన అనుచరులకు టికెట్ల కేటాయింపులో తీవ్ర అన్యాయం జరిగిందని భావిస్తున్న ఆయన, తెలుగుదేశం పార్టీని వీడటమే మంచిదన్న నిర్ణయానికి వచ్చేశారని, అందుకే రాజీనామా చేశారని ఆయన వర్గీయులు చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీపై ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, ముఖ్యంగా తనకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న ఆగ్రహం ఆయనలో నెలకొనివుందని అంటున్నారు. కాగా, కేఈ ప్రభాకర్ ఏ పార్టీలో చేరనున్నారన్న విషయమై ఇంకా స్పష్టమైన సమాచారం లేదు. కొందరు వైసీపీలో చేరుతారని, మరికొందరు బీజేపీలోకి వెళతారని ఊహాగానాలు చేస్తున్నారు.

kalvakuntla kavitha political future in dilemma

కల్వకుంట్ల కవిత భవిష్యత్ ఏమిటి?

మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. నిన్నటి వరకూ కవితను రాజ్యసభకు పంపించనున్నారని, జాతీయ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించనున్నారని పలు కథనాలు వచ్చాయి. రెండు రాజ్యసభ స్థానాల్లో ఒకటి కవితకు ఖాయమని పార్టీ వర్గాలతో పాటు రాజకీయ విశ్లేషకులు కూడా వెల్లడించారు. దీంతో త్వరలోనే కవిత జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పనున్నట్లు అందరూ ఊహించారు. కానీ కేసీఆర్ నిర్ణయంతో పార్టీ కేడర్ ఒక్కసారి ఉలిక్కిపడింది. రాజ్యసభ రెండుస్థానాలు ఇతరులకు ఇవ్వడంపై కవితను కేసీఆర్ ఏం చేయాలనుకున్నారనేది సర్వత్రా చర్చానీయాంశంగా మారింది. కవితకు పార్టీ పగ్గాలు అప్పగిస్తారా? లేదా ఉద్దేశపూరకంగానే ఖాళీగా ఉంచుతున్నారా? టిఆర్ ఎస్‌లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్‌. నిజామాబాద్ పార్లమెంటు స్థానం నుంచి ఓడిపోయినప్పటి నుంచి కవిత పార్టీలోగానీ, ప్రభుత్వ కార్యక్రమాల్లోగానీ కీలకంగా వ్యవహరించడం లేదు. దూరంగా ఉంటున్నారు. ఓటమి నుంచి కవిత తేరుకోవడం లేదని అనుకున్నారు. కానీ పార్లమెంటు ఎన్నికలు పూర్తయి 10 నెలలు గడుస్తున్నప్పటికీ కవిత మౌనం వీడకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. మున్సిపల్ ఎన్నికల ముందు కవిత అమెరికాకు వెళ్లారు. ఆ ఎన్నికల్లో తమ అనుచరులకు టిక్కెట్లు దక్కలేదని, వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని అమెరికా వెళ్లారని అప్పట్లో పలు కథనాలు వచ్చాయి. కవిత విషయంలో కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంపై జాగృతి కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. తాజాగా కవితకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి కట్టబెడుతారా అనే కొత్త ప్రచారం ప్రారంభ‌మైంది. ప్రస్తుతం నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయింది. రాష్ట్రవ్యాప్తంగా 90శాతం స్థానిక సంస్థలను టీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది కాబ‌ట్టి దీంతో నిజామాబాద్ స్థానాన్ని ఈజీగా గెలిచే అవకాశాలున్నాయి. ఆ స్థానం కూడా కేసీఆర్ డిక్లేర్ చేయకుండా పెండింగులో ఉంచారు. ఎమ్మెల్సీగా గెలిచి మంత్రి పదవి కట్టబెట్టనున్నారా? అనే విషయంలో కూడా స్పష్టత లేదని పార్టీ కేడర్ గుసగుసలాడుకుంటున్నారు. ఇక‌ ఎమ్మెల్సీ కూడా ఇవ్వకపోతే కవిత భవిష్యత్ ప్రశ్నార్థక‌మే. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ జాగృతి సంస్థ కూడా సమర్థవంతంగా పనిచేసింది. జాగృతి తరపున కవిత, బతుకమ్మ వంటి కార్యక్రమాలను నిర్వహించి తెలంగాణ సంస్కృతిని చాటారు. ప్ర‌స్తుతం జాగృతి కార్యకర్తలను టీఆర్ఎస్ పార్టీ పట్టించుకోవడం లేదట‌. కవిత సైన్యాన్ని లెక్కచేయపోతే.. ఇక మామూలు నాయకుల పరిస్థితి ఏంటని పలువురు ముక్కున వేలేసుకుంటున్నారు. కేసీఆర్ కుటుంబంలో ఆధిపత్య పోరు నడుస్తున్నదని, తనయుడు కేటీఆర్ ను అందలం ఎక్కిస్తూ కవితను పట్టించుకోవడం లేదనే వాదనలు కూడా లేకపోలేవు. దీంతో తన తండ్రితో తనకు ప్రాధాన్యత ఉన్న పోస్టు కట్టబెట్టాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది. కేటీఆర్ కు ముఖ్యమంత్రి పదవి ఇస్తే తనకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలని గత కొంత కాలం నుంచి డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది. దీనిపై కేసీఆర్ ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నట్లు సమాచారం. కవితకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వడం కేసీఆర్ ఇష్టం లేదనే వాదనలు కూడా వస్తున్నాయి. దీంతో పార్టీ, ప్రభుత్వంలోగానీ కవితకు ఎలాంటి పోస్టు ఇవ్వనున్నారో ప్రశ్నార్థకంగా మారింది.

సంపదలో 'అయోధ్య' ను దాటని 'పరిమళం'...

రాజ్యసభ అఫిడవిట్లలో ఉట్టిపడిన వై ఎస్ ఆర్ సి పి అభ్యర్థుల 'లక్ష్మీ కళ'  ఇచ్చుకున్నోడు ఈగ....పుచ్చుకున్నోడు పులి అని సామెత. ఇక్కడ ఇచ్చుకున్నది జగన్ మోహన్ రెడ్డి అయితే, పుచ్చుకున్న ఆ ఇద్దరూ కూడా నిజంగా పులులేనండోయ్.. కాకపోతే నిజం పులులు కాదు.. సంపదలో పులులు. జగన్ మోహన్ రెడ్డి రాజ్యసభ కు పంపుతున్న పరిమళ్ నత్వానీ , అయోధ్య రామిరెడ్డి ఇద్దరూ కూడా ... తమ అఫిడవిట్లలో పేర్కొన్న వివరాలు చూసినా, చదివినా ఎవరికైనా కళ్ళు తిరిగిపోతాయి. కాపోతే, ఆ ఇద్దరిలో అయోధ్యరామి రెడ్డి సంపదే, పరిమళ్ నత్వాని సంపద కన్నా ఎక్కువ.  ఈ అఫిడవిట్ల ప్రకారం పరిమళ్‌ నత్వాని కన్నా అయోధ్యరామిరెడ్డి అత్యధిక ఆస్తులున్నాయి. ఆయన స్థిర, చరాస్తులన్నీ కలిపి 2,377 కోట్ల రూపాయలు దాటిపోయాయి. తనకు మొత్తం 2,376 కోట్ల రూపాయలు చరాస్తి ఉందని,55 లక్షల రూపాయల విలువైన వ్యవసాయ భూమి ఉందని, నివాస గృహాల విలువ 17.55 కోట్లని ఆయన పేర్కొన్నారు. అప్పులు 61 కోట్ల రూపాయలు ఉన్నట్లు తెలిపారు. అయోధ్య రామిరెడ్డి భార్య పేరిట చరాస్తి 128.72 కోట్లు, స్థిరాస్తి 13 కోట్లు, వ్యవసాయేతర భూమి విలువ 26 కోట్లు, నివాస గృహాల ద్వారా ఆస్తి 41 కోట్లు ఉన్నాయని, అప్పులు 93 కోట్లు ఉన్నాయని పేర్కొన్నారు. కుమార్తె పేరున మరో 13 కోట్ల రూపాయల చరాస్తి ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. రెండవ స్థానంలో నిలిచిన పరిమళ్ నత్వాని తన ఆస్తుల విలువను నాలుగు వందల కోట్ల రూపాయలుగా అఫిడవిట్లో పేర్కొన్నారు. ఆయన చరాస్తి 180 కోట్లు, స్థిరాస్తి 179 కోట్లు, బరగారం, రంగురాళ్ల విలువ 1.35 కోట్లు, ఇతర భూమి 6.50 కోట్ల రూపాయలు, 1.65 కోట్ల రూపాయల విలువైన భవనాలు ఉన్నట్లు ప్రకటిరచారు. 203 కోట్ల అప్పులు ఉన్నట్లు పేర్కొన్నారు. తన భార్య పేరిట చరాస్తి 21.25 కోట్లు, స్థిరాస్తి 15 కోట్లు, బంగారం, రంగురాళ్లు కలిపి 5.71 కోట్లు ఉన్నట్లు తెలిపారు. అలాగే ఆమె పేరిట అప్పులు ఆరు కోట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. ఏది ఏమైనా, తెలుగు దేశం పార్టీ లోగడ రాజ్య సభ కు పంపిన ధనికుల స్థాయికి తగ్గకుండా, తన పార్టీ నుంచి కూడా జగన్ సారు ఓ మోస్తరు ధనికులనే ప్రస్తుతం రాజ్యసభ కు పంపుతున్నారు. దీని ద్వారా ....పైసలున్న వారికి ఏ గవర్నమెంట్ లో అయినా పదవులు దొరుకుతాయనే భరోసా అయితే లభించింది.

ప్రజల నడ్డి విరిచే అంకెల గారడీ బ‌డ్జెట్‌!

బంగారు తెలంగాణ భ్రమల్లో జనాన్ని ముంచెత్తి రాష్ట్రాన్ని అప్పుల ఊబిగా మార్చేయడం మినహా రాష్ట్ర ఆర్థిక స్థితిని సరిదిద్దడానికీ, వనరుల సక్రమ వినియోగానికీ, పేదల దీనస్థితిని తొలగించడానికి చేపట్టిన చర్యలేమీ ఈ బ‌డ్జెట్‌లో లేవు. అవధులు లేని హామీలతో ప్రజలను నిరంతరం మభ్యపెట్టే కేసీఆర్‌ సర్కారు ఎత్తుగడలో భాగంగానే అంకెల గారడీ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ను తీర్చిదిద్దారు. రాష్ట్రం ఏర్పడితే.. అన్ని వర్గాల అభివృద్ధి సాధ్యమవుతుం దనీ, సంపదను పెంచడమే కాదు, పంచడమూ జరుగుతుందనీ ఎంతగానో ఆశించిన ప్రజలకు ఈ బడ్జెట్లన్నీ నిరాశనే మిగిల్చాయి. ప్రణాళికలు, పథకాలు, ప్రకటనలు, నిధులు, వ్యూహాలు.. అన్నీ కాగితాలకూ, అంచనాలకూ, అంకెలకే పరిమితమ వుతున్నాయి తప్ప కార్యాచరణకు నోచుకోవడంలేదు. ప్రజలపై పన్నుపోటు ఎంతగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మనమంతా పరివర్తనా సూత్రాన్ని అంగీకరించా లంటూ ఎడ్మండ్‌ బర్క్‌ను ఆర్థికమంత్రి ఉటంకించారు. నిజమే ఈ పరివర్తన ఏమిటి? రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చడమా? వ్యవసా యాన్ని నీరుగార్చి రైతులను ఆత్మహత్యలకు గురిచేయడమా? గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, కుల వృత్తులను పరిరక్షించడం లక్ష్యంగా ఈ బడ్జెట్‌ రూపకల్పన జరిగినట్లు చెప్పిన మాటలు వినసొంపు గానే ఉన్నాయి. పల్లెల పరిపుష్టతకు ప్రాణాధారమైన వ్యవసాయం గాలిలో దీపంగా మారింది. రైతు జీవితం తెగిన గాలిపటమైంది. నేషనల్‌ క్రైమ్‌ బ్యూరో నివేదిక ప్రకారం రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణది దేశంలోనే రెండో స్థానం. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత 2750మంది రైతులు ఆత్మహత్య చేసుకొంటే సర్కారు మాత్రం 340 ఆత్మహత్యలే జరిగినట్లు చెబుతూ కేవలం 40మందికే పరిహారం ఇచ్చింది. అసలు రైతుల బతుకులపై ప్రభుత్వ వైఖరి ఏమిటి? ఈ బడ్జెట్‌లో వ్యవసాయానికి రూ.5,942.97కోట్లు కేటాయించినా.. ఖర్చుచేసేది ఎంత అన్న ప్రశ్న తలెత్తుతున్నది. గత బడ్జెట్లలో నీటి ప్రాజెక్టులకు 25వేలకోట్లు కేటాయించి, 10వేలకోట్లు ఖర్చు చేశారు. ప్రాజెక్టుల కన్నా ప్రచారానికే ఎక్కువ నిష్ఫత్తిలో దుర్వినియోగం చేస్తున్న ఘనత ఈ సర్కార్‌ది. అధికారం చేపట్టి మూడేళ్లు కావస్తున్నా ఏ ఒక్క ప్రాజెక్టును నిర్దిష్టంగా పూర్తిచేయలేదు. 2013-14లో 49,23,003 హెక్టార్లలో సాగు ఉండగా, 2015-16లో 41,74,532 హెక్టార్లలోనే సాగైనట్లు ప్రభుత్వ నివేదికలే చెబుతున్నాయి. సాగు ఎందుకు తగ్గింది? ఆర్థిక సర్వే లెక్కల ప్రకారం తెలంగాణలో 2013-14లో వచ్చిన చిన్న మధ్య తరహా పరిశ్రమలు 6,844 కాగా, 2015-16లో కేవలం 3,779 మాత్రమే వచ్చాయి. పెట్టుబడులు రాక కూడా మూడువేల కోట్ల నుంచి పదిహేను వందల కోట్లకు తగ్గింది. పారిశ్రామికాభివృద్ధిరేటు గ్రాఫ్‌ పడిపోయిన విషయం సర్వే స్పష్టంగా వెల్లడించింది. ఈ ఏడాది టీఎస్‌ ఐపాస్‌ కింద 3,325 పరిశ్రమలకు అనుమతులిచ్చారు. కాబట్టి అవన్నీ వచ్చినట్లుగా భావించాలంటున్నారు. రూ.51,358 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లుగా ఊహించుకొంటూ రెండు లక్షలకు పైగా ఉద్యోగాలు వచ్చేసినట్లు ప్రకటిస్తున్నారు. ఇవన్నీ అంచనాలు మాత్రమేనని ఆర్థిక సర్వే చెప్పింది. మిషన్‌ భగీరథ, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లకు అయ్యే ఖర్చును బడ్జెట్‌లో చూపించలేదు. రైతుల ఆత్మహత్యల సమస్యకు పరిష్కారం చూపలేదు. ప్రయివేటు అప్పులు, పెట్టుబడి ఖర్చులు, విత్తన సమస్యలు, మద్దతు ధర వంటి సమస్యలే అన్నదాతల ఆత్మహత్యలకు దారి తీస్తున్నాయి. ఈ అంశాలపై టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దృష్టిపెట్టిన సంకేతాలేవీ ఈ బడ్జెట్‌లో కనిపించడంలేదు. రాష్ట్రంలో అత్యధిక మందికి అత్యవసర మైన ఈ అంశాలను బడ్జెట్‌ పూర్తిగా విస్మరించింది. పారిశ్రామిక సంక్షోభం నేపథ్యంలో ఉపాధి సమస్య వేధిస్తోంది. రెక్కాడితే కాని డొక్కాడని బతుకులు దినదినగండంగా కాలం వెళ్లదీస్తున్నాయి. మద్యం మహమ్మారి పేదల ప్రాణాలను ఆబగా హరిస్తోంది. వీటిని పరిష్కరించే యోచన లేకుండా కలగూరగంపగా తయారుచేసిన ఈ బడ్డెట్‌తో ముందుముందు అప్పులు, పన్నులు, విద్యుత్‌ భారాలు ప్రజల నడ్డి విరిచేస్తాయని చెప్పకతప్పదు.

స్థానిక ఎన్నిక‌లు శైలజానాథ్ కు ప‌రీక్షే!

క‌నీసం పోటీ చేయ‌డానికి కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థుల కరవు అయిపోయార‌ట‌. ఈ నేప‌థ్యంల్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కోవడం పీసీసీ చీఫ్‌ డాక్టర్‌ ఎస్‌ శైల‌జ‌నాథ్‌కు పెద్ద పరీక్షగా మారింది. ఈ ఎన్నికల్లో అస‌లు మార్కులు పడతాయా? కనీసం పాసవుతారా? అనేదీ కష్టంగానే వుంది. గ్రామ, మండల, పట్టణాల్లో కేడర్‌ పూర్తిగా బలహీన పడటంతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్‌లోని అన్ని సీట్లలో పోటీకి దిగడం ఆ పార్టీకి పెద్ద సమస్యగా మారింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్‌ స్థానాలకు నాయకత్వం ఒత్తిడితో మొక్కుబడిగానే అభ్యర్థులు బరిలోకి దిగారు. అన్ని స్థానాలకూ అభ్యర్థులు కరవయ్యారు. జెడ్పీటీసీ, మున్సిపల్‌ స్థానాల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్‌కు ఎన్ని సీట్లు వస్తాయనేదీ నేతలు గట్టిగా చెప్పలేక పోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సమరంలో ప్రధాన పోటీ వైసీపీ, టీడీపీ మధ్యే కొనసాగుతోంది. ఈ ప్రధాన పార్టీలకు కాంగ్రెస్‌ పోటీ ఇచ్చే పరిస్థితులు రాష్ట్రంలో ఎక్కడా కన్పించడం లేదు. జనరల్‌తోపాటు రిజర్వుడు స్థానాల్లో కాంగ్రెస్‌కు బలమైన అభ్యర్థులు కరవయ్యారు. రాష్ట్ర విభజనతో కాంగ్రెస్‌కు రాష్ట్రంలో కోలుకోలేని దెబ్బ తగిలింది. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఒక్క ఎమ్మెల్యే, ఒక్క ఎంపీ సీటును సైతం సాధించలేక పోయింది. ప్రస్తుతం జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ దాదాపుగా ఇదే పరిస్థితి పునరావృతం కానుంది. పీసీసీ చీఫ్‌లు మారినా పార్టీ శ్రేణుల్ని ఆకర్షించే స్థాయిలో కాంగ్రెస్‌ నాయకత్వం లేకపోవడం పెద్ద మైనస్‌ని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. కేంద్రంలోను, రాష్ట్రంలోను వరుస వారీగా కాంగ్రెస్‌ అధికారాన్ని కోల్పోవడంతో కాంగ్రెస్‌ కేడర్‌ నిరుత్సాహంగా ఉంది. వైసీపీ, టీడీపీ అభ్యర్థులకు దీటుగా పోటీ చేసేందుకు కాంగ్రెస్‌ అభ్యర్థులు వెనుకంజ వేస్తున్నారు. కేవలం నామినేషన్లు వేసి ప్రచారానికే వారంతా పరిమితమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకువస్తామంటూ ప్రగల్భాలు పలికిన వైసీపీ, టీడీపీ ఇప్పుడు ఎందుకు మౌనం వహిస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ నిల‌దీస్తోంది.రాష్ట్రం అభివృద్ది చెందాలంటే ప్రత్యేక హోదాయే ఇవ్వాల్సిందే. కేంద్రంలో ప్రధాని మోడీ, రాష్ట్రంలో సీఎం జగన్‌లు ప్రధాన సమస్యలు వదిలేసి ఎంటర్‌టైన్‌మెంట్‌ చూపిస్తున్నారట‌. ప్రజలకు కొన్ని సంక్షేమ పథకాలు అమలు చేసి, మాయమాటలతో రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తోందంటూ కాంగ్రెస్ పార్టీ ప్ర‌చారం చేస్తోంది. ఏపీకి ప్రత్యేక హోదా కోసం రాజకీయ పార్టీలు పోరాడాలన్నారు. పార్లమెంటులో పెద్ద సంఖ్యలో ఎంపీలను కలిగి ఉండి వైసీపీ ప్రత్యేక హోదాపై నోరు మెదపడం లేదంటూ పీసీసీ చీఫ్‌ డాక్టర్‌ ఎస్‌.శైలజనాథ్ ఓట్లు అడుక్కుంటున్నారు. ఈ ఎన్నికల్లో కొన్ని స్థానాలైనా గెలిచి పట్టు సాధించాలనే వ్యూహంతో కాంగ్రెస్ పార్టీ ఆశ‌గా వుంది.

కరణం తనయుడు, డొక్కా కుమార్తెలకు జెడ్ పీ పీఠాలు...

  సభ్య సమాజానికి క్లియర్ మెసేజ్ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి మ్యాచ్ ఫిక్స్ అయిపొయింది... ఇంకా ప్రమాణ స్వీకారాలె తరువాయి.. ప్రకాశం జిల్లా పరిషత్ చైర్మన్ గా కరణం బలరామ కృష్ణ మూర్తి తనయుడు కరణం వెంకటేష్, అలాగే పక్కనే ఉన్న గుంటూరు జిల్లా పరిషత్ చైర్మన్ గా డొక్కా మాణిక్య వర ప్రసాద్ కుమార్తె ల పేర్లు దాదాపుగా ఖరారు అయిపోయాయి. అంటే, ఇదంతా క్విడ్ ప్రో కో నేనా అని ఎవరికైనా సందేహాలు కలిగితే, అలాంటి వాటికి జవాబులు ఉండవు. పార్టీ విధానాలు నచ్చి వెళ్లిన కరణం కుటుంబం, అలాగే డొక్కా కుటుంబాల తక్షణ రాజకీయ అవసరాలు తీర్చే కల్పతరువుగా వై ఎస్ ఆర్ సి పి అధినేత జగన్ మోహన్ రెడ్డి వారికి కనిపించి ఉండవచ్చు. అంచేత, ఇందులో మనం కరణం, డొక్కా ఫ్యామిలీ ల రాజకీయ అవసరాలు, ప్రాధమ్యాల గురించి ఇక్కడ ప్రస్తావన చేస్తే, వారు హర్ట్ అవ్వొచ్చు. అంచేత, అందరూ కూడా ఈ ఎపిసోడ్ ను కేవలం ఒక పాజిటివ్ దృక్పథం తోనే చదవాలనేది , చూడాలనేది ఆ రెండు రాజకీయ కుటుంబాల ఆకాంక్ష. అయితే, ఈ విషయం లో డొక్కా మాణిక్ వర ప్రసాద్ అభిప్రాయం మాత్రం మరోలా ఉంది.   ఆయన కుమార్తె సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్న కారణంగా ప్రస్తుతానికైతే అటువంటి ఉద్దేశం లేదని, ఒక వేళ పార్టీ అధినేత నిర్ణయం తీసుకుంటే మాత్రం తప్పని సరిగా తన కుమార్తె బరి లో నిలబడుతుందని ఆయన తన సన్నిహితుల దగ్గర చెపుతూ వస్తున్నారు. బీ టెక్ తో పాటు, తండ్రి మాదిరే న్యాయ శాస్త్రం అభ్యసించిన -డొక్కా మాణిక్ వర ప్రసాద్ కుమార్తె ఒక వేళ బరిలో నిలబడితే, నిజం గా డొక్కా ఫ్యామిలీకి పునరావాసం దొరికినట్టే. తెలుగుదేశం పార్టీ లో ఉన్నప్పుడు కూడా -డొక్కా సాత్వికంగా నే వ్యవహరించేవారు. అదే సామాజిక వర్గానికి చెందిన వార్ల రామయ్య ప్రదర్శించే దూకుడు -డొక్కా ఎప్పుడూ ప్రదర్శించ లేదు.   ఈ విషయాలు పక్కన పెడితే, విలువల తో కూడిన రాజకీయాలు చేస్తామని నినదిస్తూ కొత్త తరం ఓటర్లను ఆకట్టుకున్న జగన్ మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఫార్ములా నే అనుసరిస్తూ రావటం అందరినీ విస్మయపరుస్తోంది. అప్పట్లో వై ఎస్ ఆర్ సి పి కి చెందిన ఎం ఎల్ ఏ లు, వారి కుటుంబ సభ్యులను టోకున తెలుగు దేశం లోకి తరలించిన చంద్రబాబు వైఖరినే, జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు అవలంబిస్తున్నారు. అటువంటి చర్యల కారణం గా చంద్రబాబు తర్వాతి రోజుల్లో ఏ రకంగా నష్ట పోయారో..ఇటీవలి వరుస వలసలు చుస్తే మనకి విషయం ఇట్టే బోధపడుతుంది. కడప జిల్లా ఖాళీ అయిపోయి దిగాలుగా ఉన్న తెలుగుదేశం పరిస్థితి, రాబోయే రోజుల్లో వై ఎస్ ఆర్ సి పి కి వచ్చినా ఆశ్చర్య పోనక్కర్లేదు. ‘మేం విలువలతో కూడిన రాజకీయాలు చేస్తాం. ఎవరైనా సరే వైసీపీలోకి రావాలంటే ఖచ్చితంగా పార్టీకి, పదవులకు రాజీనామా చేసి రావాల్సిందే. ’ ఇదీ అసెంబ్లీ సాక్షిగా సీఎం జగన్ చేసిన ప్రకటన. అప్పట్లో జగన్ ప్రకటనను చూసిన వారంతా శభాష్ అన్నారు. కానీ ఆ ప్రకటన చేసిన కొద్ది రోజులకే రాజకీయం మారిపోయింది.     గురువారం నాడు తాడేపల్లిలో కరణం బలరామ్ దగ్గర ఉండి తన కొడుకు కరణం వెంకటేష్ ను వైసీపీలో చేర్చారు. ఆయన కూడా ఎక్కడా మొహమాటపడకుండా తాను ఎందుకు వైసీపీకి దగ్గర అవుతున్నదీ మీడియా సాక్షిగా చెప్పారు. అందరూ చెప్పినట్లే చీరాల అభివృద్ధి కోసమే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ఇంకా విచిత్రం ఏమిటంటే మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఓ అడుగు ముందుకు వేసి టీడీపీలో కరణం బలరామ్ కు అన్యాయం జరిగిందని..కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యత ఇఛ్చి కరణం లాంటి వాళ్ళను పక్కన పెట్టారని వాపోయారు. అధికారికంగా కరణం బాలరామ్ కు కండువా కప్పితే ఎమ్మెల్యే పదవి పోతుందనే కారణంగానే ‘ఈ విలువలతో కూడిన రాజకీయ మార్గాన్ని’ ఎంచుకున్నట్లు కన్పిస్తోందనే విషయం స్పష్టం అవుతోంది.   వైసీపీ నేతలు జగన్ కండువా కప్పలేదు కాబట్టి కరణం బలరామ్ రాజీనామా చేయాల్సిన అవసరం లేదని వాదించవచ్చు. ఓకే. కానీ కళ్ల ముందు ఏమి జరుగుతుందో అందరూ చూస్తున్నారు. అదే చంద్రబాబునాయుడు అధికారంలో ఉండగా వైసీపీ ఎమ్మెల్యేకు నేరుగా పసుపు కండువాలు కప్పే పార్టీలో చేర్చుకున్నారు. ఇలా ఫిరాయించిన వారిపై చర్యలు తీసుకోవాలని వైసీపీ ఫిర్యాదులు చేస్తే స్పీకర్ తో వాటిని సంవత్సరాల తరబడి పక్కన పెట్టించారు. ఈ ఫిరాయింపులతో చంద్రబాబు ఎంత అప్రతిష్ట తెచ్చుకున్నదీ అందరికీ తెలుసు. ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి కూడా చంద్రబాబు నాయుడు ఫార్ములా ని యాజ్ ఇటీజ్ గా అమలు చేస్తే, సభ్య సమాజానికి ఏమి సందేశం ఇస్తున్నట్టు అనుకోవాలి.