money distribution in ap local elections

లోక‌ల్‌వార్‌లో డ‌బ్బే కీల‌కం! డ‌బ్బుఖ‌ర్చుపెట్టే స‌త్తా చూసే అభ్య‌ర్థి ఎంపిక‌చేశార‌ట‌!

మీ దగ్గర క్యాష్ ఎంతుంది? ఎంతున్నా. వారు చెప్పినంత ఉండాలి. అదికూడా ముందుగానే చూపించాలి. అప్పుడుగాని ఆ అభ్యర్ధి ఎన్నిక‌ల రేసులో ఉండరు. ఇదేంటని అనుమానం వ్యక్తం చేయకండి. ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు న‌డుస్తున్న ట్రెండ్ ఇదే. పోటీ చేయాలంటే ఈ స్ధాయిలోనే ప్రాథమిక స్క్రీనింగ్ జ‌రిగిందని కొందరు అభ్యర్ధులు వాపోతున్నారు. రాజకీయాల్లో డబ్బుల తర్వాతే ఏదైనా. సొమ్ములుంటే కొండమీద కోతైనా ఇట్టే వ‌చ్చేస్తోంది. స్థానిక సంస్ధలలో పోటీ చేయాలనుకుంటున్న వారికి ఆయా నియోజకవర్గ ఇన్ ఛార్జి ఆశీస్సులు ఆశీర్వచనాల‌తో పాటు విట‌మిన్ ఎం. షో చేయాల్సిందేన‌ట‌. ఏపీలో రాజకీయ పార్టీలు ఎత్తులు పైఎత్తులతో వ్యూహాల్లో నిమ‌గ్న‌మైయ్యారు. గెలుపే ల‌క్ష్యంగా అభ్య‌ర్థుల్ని ఎంపిక చేసుకున్నారు. పదేళ్ల తర్వాత పోటీ స్ధానిక ఎన్నికలు రావడంతో బరిలో నిలిచేందుకు ద్వితీయశ్రేణి నాయకులు ఆసక్తి గా ఎన్నిక‌ల బ‌రిలో దిగారు. దీంతో జాబితాను ఫైన‌ల్ చేయ‌డానికి ఇంఛార్జుల‌కు స‌ర్క‌స్ ఫీట్లు త‌ప్ప‌లేద‌ట‌. రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉండే విజయవాడ కార్పోరేషన్లో కాలు పెట్టేందుకు వైసీపీ శ్రేణులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో నగరంలో మూడు నియోజకవర్గాలలో అభ్యర్దుల ఎంపిక నేతలకు తలనొప్పిగా మారింది. పశ్చిమ నియోజకవర్గం నుంచి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అభ్యర్దులను ఫైన‌ల్ చేశారు. మరోవైపు సెంట్రల్ నియోజకవర్గం నుంచి కాస్తాంత గట్టిపోటీ ఉన్నా అభ్యర్దుల ఎంపిక విషయంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆచీతూచీ అడుగులు వెస్తున్నారు. పార్టీ పెద్దల నుంచి ఒత్తిడులు ఉన్నా సాధ్యమైనంత వరకు గెలిచేవారికే ప్రేయార్టీ ఇచ్చార‌ట‌. తూర్పు నియోజకవర్గంలో టిడీపీ గట్టిపోటీ ఇచ్చే అవకాశం ఉంది. దీంతో పార్టీ ఇంచార్జిగా ఉన్న దేవినేని అవినాష్ అభ్యర్దుల ఎంపికపై తీవ్రస్ధాయిలో కసరత్తు చేశారు. అభ్యర్ధితో పాటుగా క్యాష్ కూడా చూస్తున్నారు... కార్పోరేటర్ గా పోటీ చేయాలంటే 50 లక్షలు ఉండాల్సిందే. రిజర్వుడు నియోజకవర్గంలో అయితే 25 నుంచి 30 లక్షలట‌. ఆ మొత్తాన్ని తమ వ్యక్తులకు చూపించాలని, ఎన్నికల టైంలో మావారు చెప్పినట్లే చేయాలని కూడా హుకుం జారీచేస్తున్నారు. ఇది ఒక్క దేవినేని దొడ్డిలోనే కాదు. దాదాపు నాయకులంతా ఇదే ధోరణి అనుసరించారు. అయితే అవినాష్ అనుభవం తక్కువ కావడంతో సీక్రెట్ కాస్తా ఓపెన్ అయ్యింది. విజయవాడ కార్పోరేషన్ లో పరిస్ధితే కాదు... రాష్ట్రంలోని అన్ని పురపాలక సంఘాలలో పరిస్ధితి దాదాపు ఇలానే ఉంది. కౌన్సిలర్ అయితే 15 నుంచి 20 లక్షలు వరకు ఖర్చు అవుతుంది. జెడ్పీటీసీగా బరిలో నిలబడే అభ్యర్దికి 50 లక్షల వరకు రెడీ చేసుకోవాల్సిన పరిస్ధితి. ఎంపిటీసి, సర్పంచ్ లకు 10 లక్షల వరకు అవసరం ఉంటుందనే ఇండికేషన్స్ ఆయా పార్టీల నేతలు ఇచ్చారు. ముఖ్య‌మంత్రి మద్యం, నగదు పంపిణీకి చెక్ పెట్టాలని పంచాయతీ చట్టంలోనే మార్పులు తీసుకొచ్చారు. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు భిన్నంగా జరుగుతోందిని ఈ ఎన్నిక‌ల్లో డ‌బ్బు ఖ‌ర్చు పెట్టే తాహతు లేని నేత‌లు మండిప‌డుతున్నారు.

Greatness of Indian Culture

మైల విధానం నేటి ఐసోలేషన్ పరిమిత పద్ధతి ఒకటేనా?

అవునంటోంది భార‌తీయ స‌నాత‌న ధ‌ర్మం. మ‌న పూర్వీకులు అప్ప‌ట్లో చెప్పిన *మైల విధానం నేటి ఐసోలేషన్ పరిమిత పద్ధతి ఒకటే. సాంప్ర‌దాయ ప‌ద్ధ‌తిలో చెబితే చాదస్తం అన్నారు. ఇంగ్లీష్‌లో చెబితే మ‌న వాళ్ల‌కు బాగానే అర్థం అయింది. అదే మ‌న భార‌తీయ భారతీయత ఔన్నత్యం. అప్ప‌ట్లో పురుడు వచ్చినా ఎవరి ఇంట్లోనైనా మరణం సంభవించినా మైల పాటించ‌డం ఆచారంగా వుండేది. ఈ విధానం భారతీయ సనాతన ధర్మం. అయితే చ‌దువు ఎక్కువైయ్యే స‌రికి దానిని చాదస్తం లేదా మూఢనమ్మకం అంటూ కొట్టి పారేస్తున్నాం. అయితే క‌రోనా దెబ్బ‌కు అస‌లు విష‌యం బోధ‌ప‌డుతోంది. ఒక ఇంటిలో శిశువు జన్మిస్తే, ఆ సమయములో తల్లి గర్భము నుంచి కలుషిత వ్యర్ధాలు అనగా నెత్తురులాంటివి అనేకం వెలువడతాయ్. అవి వాతావరణములో అనేక హానికారక సూక్ష్మజీవులు(వైరస్) ఉత్పత్తికి దోహదం చేస్తాయి ఆ పరిసర ప్రదేశాలలో అంటే ఆ ఇంటిలో లేదా ఆ గదిలో. ఆ యజమానికి సంబంధించిన దగ్గరి (అన్నదమ్ముల కుటుంబాలు) బంధువులు పరామర్శకి వచ్చి అక్కడ ఉండి సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది. అటువంటి వారిని ఈ వైరస్ ఆశ్రయించే అవకాశం ఉంటుంది. సాధారణముగా వైరస్ జీవన ప్రమాణం 10 రోజులు. అందుకే 11వ రోజున ఆ వ్యక్తులందరూ పసుపు కలిపిన నీటితో సంపూర్ణ స్నానం చేస్తారు. అక్కడి వస్తువులన్నీ పసుపు(క్రిమి సంహారిణి) కలిపిన నీటితో శుద్ధి చేస్తారు. దీనినే పురిటి శుద్ధి అంటారు. అలాగే మరణం కారణముగా ఏర్పడే మైలతో మృత‌దేహం చుట్టూ క్షణాలలో చీమలు అపరిమితముగా గుమిగూడుతుంటాయ్. వాతావరణములో మార్పుల కారణముగా కనపడని సూక్ష్మజీవులు ఇంకెన్ని కోట్లలో ఆ ప్రదేశములో గుమిగూడతాయో చెప్పలేము. ఆ సమయములో ఆ ఇంటి పేరువారు, వారి కులం వారు అక్కడికి వచ్చి ఉంటారు. సూక్ష్మజీవులు జీవనప్రమాణం ఆధారంగా 11వ రోజు శుద్ధి స్నానం చేయమంది శాస్త్రం. పెండ్లి అయిన ఆడబడుచులను ఇత్యాది వారిని 4వ రోజున శుద్ధి స్నానం చేయమంది. కారణం వారు సాధారణముగా వారి వారి కుటుంబాల‌కు వెళ్ళిపోతారు. శవ దహనం తరువాత. అంటే వైరస్ వ్యాప్తి తగ్గుముఖం ఉండే స్థానాలకు తిరిగి వెళ్లిపోయేరు కాబట్టి 3 రోజులు మైలగా పరిగణిస్తారు. అదే విధముగా శవం ఉన్న సమయములో చుట్టుపక్కల వంట వంటి కార్యక్రమాలు నిషేధించి ఆ ప్రాంతము నుంచి శవం తొలగించిన తరువాత అక్కడి నివాసులు స్నానం చేసి వంట భోజన కార్యక్రమాలు చేపట్టమన్నారు. ఈ విధానాన్ని భారతీయ సనాతన ధర్మం మైల అన్నది. దీనినే ఇప్పటి శాస్త్రవిజ్ఞానం (సైన్స్) ఇమ్మ్యూనిటి అనే పేరుతో సూక్ష్మజీవ ప్రభావ రోగులను ఐసోలేషన్ ప్రాంతాలలో పెట్టి ఆరోగ్యవంతులకు దూరముగా పెడుతున్నారు. అది విష‌యం.

Political Heat in kurnool district YSRCP

వైఎస్సార్సిపిలో భగ్గుమంటున్న వర్గ విభేదాలు

వైఎస్సార్సిపి లో ఎస్సి నాయకులు థర్డ్ గ్రేడ్ నాయకులుగా మిగిలిపోవాల్సిందేనా...? వైఎస్సార్సిపి కి గుడ్ బై చెప్పే ఆలోచనలో నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్డర్... ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజీకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయం... 151 సీట్లు గెలిచి 10 నెలలు కాకముందే వైకాపా ఎస్సి నాయకుల్లో పార్టీ పట్ల తీవ్ర వ్యతిరేఖత ఏర్పడుతుంది.స్థానిక ఎన్నికల నేసథ్యంలో పార్టీలో వర్గ విభేదాలు తారా స్థాయికి చేరుకున్నాయి.ఏకంగా ఎమ్మెల్యేలు రాజీనామాలకు సిద్ధం అవుతున్నట్టు సమాచారం.రెడ్డి నాయకుల ఆధిపత్య పోరులో ఎస్సి నాయకులు నలిగిపోతున్నారు.కర్నూలు జిల్లా నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్ధర్ పరిస్థితి అధ్వాన స్థితికి చేరుకుంది.ఆర్ధర్ ని నమ్ముకున్న నాయకులు,కార్యకర్తలను అధిష్ఠానం నీచంగా చూడటం,కనీస గౌరవం కూడా ఇవ్వకపోవడంతో ఆయన రాజకీయాలనే వదులుకోవాలి అనే ఆలోచనకి వచ్చారు.రెడ్డి నాయకుడు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి కాళ్ళ కింద 10 నెలల నుండి నలిగిపోతూ కక్క లేక,మింగ లేక నలిగిపోయారు ఆర్డర్,ఆయన అనుచరులు.కనీసం స్థానిక సంస్థల ఎన్నికల్లో అయినా తన వర్గానికి న్యాయం జరుగుతుంది అని భావించి మరోసారి అవమానపడ్డారు.తన వర్గానికి న్యాయం జరగలేదు కనీసం భీ-ఫార్మ్ ఇచ్చే అధికారం కూడా ఎమ్మెల్యేకి లేదు అని బైరెడ్డి సిద్దార్థ రెడ్డి హుక్కుమ్ జారీ చేసారు.ఎమ్మెల్యే పక్కనే ఉన్నా భీ-ఫార్మ్ లు మాత్రం బైరెడ్డి సిద్దార్థ రెడ్డి చేతుల మీదుగా ఇచ్చి ఆర్ధర్ ని ఘోరంగా అవమానించి పంపారు.ఇంత కాలం నియోజికవర్గంలో పేరుకి మాత్రమే ఎమ్మెల్యే అభివృద్ధి కార్యక్రమాలు,సంక్షేమ కార్యక్రమాల అమలు ఇలా ఏ కార్యక్రమంలో కూడా ప్రోటోకాల్ ఉండదు.అన్ని బైరెడ్డి ప్రారంభిస్తారు.   కనీసం కొన్ని కార్యక్రమాలకు సమాచారం కూడా ఇవ్వరు.ఇప్పుడు కనీసం 10 శాతం సీట్లు కూడా తన వర్గానికి ఇప్పుంచుకోలేని నిస్సహాయ స్థితికి దిగజారిపోయారు ఎమ్మెల్యే ఆర్డర్.దింతో ఇంతకాలం జగనన్న ఉన్నారు,అయన వింటారు అని నమ్మకం పెట్టుకున్న ఆర్ధర్ కి స్థానిక ఎన్నికల నేపథ్యంలో అసలు విషయం తెలిసింది.జరిగే ప్రతి చర్య అధిష్టానం కి తెలిసే జరుగుతుంది అని గ్రహించిన ఆర్ధర్ ఇక రాజీకీయాలకు,ఎమ్మెల్యే పదవికి గుడ్ బై చెప్పాలని డిసైడ్ అయ్యారు.దీనికి ప్రధాన కారణం నమ్ముకున్న కార్యకర్తలకు కనీస న్యాయం కూడా చేయలేకపోవడం వారి ముందు ఆర్ధర్ మొహం చెల్లకపోవడం వలన ఫైనల్ గా రాజీనామా నిర్ణయం తీసుకున్నారు.

Roja Vs Peddireddy

రోజా రెడ్డి వెర్సెస్ పెద్ది రెడ్డి

చిత్తూరు జిల్లాలో ప్రచ్ఛన్న యుద్ధం రోజా రెడ్డి కి చెక్ పెడుతున్న పెద్ది రెడ్డి మంత్రి పదవి పై కన్నేసిన రోజా రోజా మంత్రి అయితే సుధీర్ఘ కాలం కాపాడుకున్న పెద్దరికం పోతుంది అనే భయంలో పెద్ది రెడ్డి గాలి వానలా మొదలైన రోజా రెడ్డి ,పెద్ది రెడ్డి ప్రచ్చన్న యుద్ధం తుఫాను గా మారుతుంది.జిల్లా లో ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుంది.జగనన్న గెలిస్తే చెల్లమ్మకు మంత్రి పదవి గ్యారెంటీ అనుకున్నారంతా.కానీ చెల్లెమ్మకు మంత్రి పదవి దక్కకుండా పెద్ది రెడ్డి చాకచక్యంగా చక్రం తిప్పారు.చెల్లెమ్మ అలిగి కొన్ని రోజులు బయటకు రావడం కూడా మానేసి జబర్దస్త్ కి పరిమితం అయ్యారు.ఏపిఐఐసి పదవి తీసుకోవడం ఇష్టం లేకపోయినా సన్నిహితుల సలహాతో పదవి స్వీకారం చేసినా ఆ పదవి పట్ల ఆమె ఎప్పుడు శ్రద్ద చూపడం లేదు.ఒక పక్క కోరుకున్న పదవి దక్కలేదు అని ఆవేదన మరో పక్క నియోజికవర్గంలో అంతర్గత పోరు ఆమెకు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.నియోజికవర్గంలో ఒక చోటా నాయకుడి జన్మదిన వేడుకులకు హాజరవ్వొద్దని ఎమ్మెల్యే రోజా కార్యకర్తలకు వార్నింగ్ ఇచ్చే పరిస్థితి వచ్చింది అంటే జిల్లాలో పెద్ది రెడ్డి ప్రాభవం ఎంత ఉందొ అర్ధం చేసుకోవచ్చు.ఆఖరికి సొంత నియోజికవర్గంలో పర్యటించడానికి లేదంటూ పెద్ది రెడ్డి వర్గం ఆమె కాన్వాయ్ కి అడ్డుపడే పరిస్థితి వచ్చింది అంటే ఎంత దారుణమైన పరిస్థితి,జబర్దస్త్ కష్టాలు రోజాను వెంటాడుతున్నాయో అర్ధం చేసుకోవచ్చు.     ఈ సమయంలో మండలి రద్దు రోజాలో కొత్త ఆశలు రేకెత్తించాయి.రెండు మంత్రి పదవులు ఖాళీ అవ్వడం,రేసులో రోజా పేరు మీడియా లో రావడంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో తన సత్తా నిరూపించుకొని మంత్రి పీఠం దక్కించుకోవాలని రోజా రెడ్డి ఆలోచన.మరి పెద్ది రెడ్డి ఊరికే చూస్తూ కూర్చుంటారా?జిల్లాలో మరో పవర్ సెంటర్ అనే ఆలోచనే రాకూడదు ఆయనకి.వెంటనే రంగంలోకి దిగి నగరి లో తన వర్గానికే మెజారిటీ సీట్లు ఇప్పించుకునే పనిలో పడ్డారు.ఈ లోపు లేడీ సెంటిమెంట్ వాడి రోజా కార్చిన కన్నీటికి అధిష్టానం కాస్త తగ్గి కొంత భాగం సీట్లు ఆమె వర్గానికి వచ్చేలా చేసారు.ఇప్పుడు పెద్ది రెడ్డి వర్గం దీనికి విరుగుడు వేసింది.ఈ నియోజికవర్గంలోకి రోజా హవా జీరో చెయ్యాలని తద్వారా ఆమె మంత్రి పదవి ఆశల పై నీళ్లు చల్లాలని పెద్ది రెడ్డి ఫిక్స్ అయ్యారు.అందుకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు సైలెంట్ గా ఓట్లు గుద్ది రోజా ని జీరో చెయ్యాలని ఆర్డర్ వేసారు పెద్దిరెడ్డి.ఇప్పుడు ఎం చెయ్యాలో దిక్కుతోచని స్థితిలో రోజా పెద్ది రెడ్డి ని ఎదుర్కునే శక్తి లేక ఢీలా పడ్డారు.

TDP Chief Chandrababu Naidu

చంద్రబాబుకు ‘అది’ కూడా మిగలదా?

40 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నాను, మూడు సార్లు ముఖ్యమంత్రిగా, అనేక దఫాలు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసాను.. అని పదే పదే చెప్పుకుంటున్న చంద్రబాబునాయుడికి ప్రస్తుతం ప్రజలిచ్చిన ప్రతిపక్ష నాయకుడు అనే హోదా కూడా లేకుండా చేసేందుకు పావులు కదుపుతోంది అధికార పక్షం. అన్నీ అనుకున్నట్టు జరిగితే బహుశా త్వరలోనే అది జరిగే అవకాశం ఉంటుంది. చంద్రబాబునాయుడికి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్ష హోదా పోతే ఇప్పుడు ఆయనకు ఉన్న కొన్ని సౌకర్యాలు తీసేస్తారు. ఇది 40 ఏళ్ళుగా ఏపీ రాజకీయాల్లో చక్రం తిప్పిన చంద్రబాబుకు తీరని అవమానంగా మిగలుతుంది. తెలుగుదేశం పార్టీ గత ఎన్నికలలో కేవలం 23 స్థానాలలో గెలిచింది. గెలిచిన నాటి నుంచి ఈ తొమ్మిది నెలల్లో ముగ్గురు ఎమ్మెల్యేలు వెళ్లిపోయారు. వల్లభనేని వంశి, మద్దాలి గిరి, కరణం బలరాంలు పార్టీ వదలి జగన్ పంచన చేరారు.   శాసనసభ్యత్వాలు మాత్రం వారు అంటిపెట్టుకునే ఉన్నారు. వాస్తవంగా తమ పార్టీలో చేరాలంటే ఎదుటి పక్షం వారు పదవులకు రాజీనామా చేసి రావాలని అలాగైతేనే పార్టీలో చేర్చుకుంటామని ముఖ్యమంత్రి జగన్ ప్రమాణ స్వీకారం రోజునే చెప్పారు. గత అసెంబ్లీలో తమ పార్టీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు తన పార్టీలో కలుపుకున్నాడని, అందువల్ల ఈ ఎన్నికల్లో ఆ పార్టీని దేవుడు కేవలం 23 మంది మాత్రమే గెలిచేలా చేశాడని చెప్పిన జగన్ ఆ తర్వాత తనకు పెట్టుకున్నాను అని చెప్పిన నిబంధనను సడలించుకున్నారు. దేవుడే రాసాడన్న స్క్రిప్టుకు కొద్దిపాటి మార్పులు చేసి ముగ్గురిని అనధికారికంగా తన పార్టీలో చేర్చేసుకున్నారు. అయితే ఇప్పుడు తాజాగా దేవుడి స్క్రిప్టును పూర్తిగా మార్చేసేందుకు జగన్ నిశ్చయించుకున్నట్టు స్పష్టంగా కనపడుతోంది. తెలుగుదేశం పార్టీ నుంచి తమ పార్టీలో చేరేందుకు వేచి ఉన్న కనీసం 10 మంది ఎమ్మెల్యేలకు కండువా కప్పేస్తే చాలని.. ఆయన భావిస్తున్నారు.     ఇందులో భాగంగానే ముందుగా కరణం బలరాంను చేర్చుకున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి సుమారుగా 10 మంది ఎమ్మెల్యేలు రావడానికి సిద్ధంగా ఉన్నప్పుడు అడ్డు చెప్పడం సరి కాదని జగన్ తాజాగా నిర్ణయించారు. తెలంగాణలో ఏ విధంగా అయితే జరిగిందో అదే విధంగా ఇక్కడ కూడా రెండింట మూడు వంతుల మంది ఎమ్మెల్యేలు గోడ దూకిన తర్వాత వారిని వైసిపిలో విలీనం చేసేసుకోవాలనే పథకాన్ని అమలు చేస్తున్నారు. అవసరమైనంత మంది ఎమ్మెల్యేలు వచ్చిన తర్వాత తెలుగుదేశం శాసనసభా పక్షాన్ని వైసిపిలో విలీనం చేస్తారు. ఇప్పటికే శాసన మండలి రద్దు చేసి తెలుగుదేశం పార్టీని చావు దెబ్బ కొట్టిన జగన్ ఇప్పుడు అన్ని జిల్లాలలో తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులను చేర్చుకునే పనిలో ఉన్నారు. జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు వచ్చేసిన తర్వాత ఇక తెలుగుదేశం పని ఖతం అయినట్లే అనే పరిస్థితి రాగానే ఎమ్మెల్యేలకు గేట్లు ఎత్తుతారు. ఆ చివరి స్ర్టోక్ తో తెలుగుదేశం పార్టీకి ప్రతిపక్ష హోదా పోతుంది. చంద్రబాబును రాష్ట్రంలో జీరో గా మిగల్చాలనేది అదికార పక్షం వ్యూహం.

Telangana Govt hikes property tax

తెలంగాణాలో ఆస్తి పన్ను... కరెంటు ఛార్జీలూ పెంచుతార‌ట‌!

విద్యుత్‌ పంపిణీ సంస్థలు బతకాలంటే ఛార్జీలు పెంచక తప్పదంటున్నారు సి.ఎం. కేసీఆర్‌. ఇదే సమయంలో పేదలకు భారం లేకుండా విద్యుత్‌ ఛార్జీలు పెంచుతార‌ట‌. 24 గంటలు కోతలు కరెంటు ఇస్తున్నప్పుడు ఛార్జీల పెంపు తప్పదు. పన్నులు చెల్లించే స్తోమత ఉన్న వారికే పన్ను పెంపు వర్తించేలా చూస్తాం అని చెబుతున్నారు సి.ఎం.సార్‌. లే అవుట్‌ల అనుమతులు కలెక్టర్లకు తప్ప మరెవరికి లేదు. ఇంటి కొలతలు ఆ యజమానులే అందిస్తారు. దీని ప్రకారమే పన్ను విధింపు ఉంటుంది. ఒకవేళ ఇందులో అక్రమాలు జరిగితే ఇరవై ఐదు రెట్లు ఎక్కువ జరిమానా విధిస్తాం. రూ.లక్ష అక్రమం జరిగితే, రూ.25 లక్షల జరిమానా వేస్తాం. పంచాయతీలు, మున్సిపాలిటీలు మరింత అభివృద్ధి చెందాలంటే ఆస్తి పన్ను పెంపు తప్పదని తేల్చి చెప్పారు. ఆరు నూరైనా కొత్తగా తెచ్చిన నూతన పంచాయతీరాజ్‌ చట్టాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేసి తీరుతామని పునరుద్ఘాటించారు. ప్రజాప్రతినిధులకు విధులు, బాధ్యతలను స్పష్టంగా చెబుతూ ఈ చట్టం తెచ్చినట్లు తెలిపారు. ఒకవేళ ఇందులో ఆలసత్వం ప్రదర్శిస్తే ప్రజాప్రతినిధులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. పాలనలో ప్రజల భాగస్వామ్యం కోసం స్టాండింగ్‌ కమిటీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కొత్త పంచాయతీరాజ్‌ చట్టం ద్వారా అనేక సంస్కరణలు తీసుకొచ్చినట్లు చెప్పారు. 2020-21 ఏడాదిలో 23 కోట్లకుపైగా మొక్కలను నాటనున్నట్లు తెలిపారు. పల్లెప్రగతి పర్యవేక్షణ కోసం సీనియర్‌ అధికారులను నియమించినట్లు వెల్లడించారు. 45 మంది ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్‌ అధికారులతో కమిటీలను ఏర్పాటు చేసినట్లు సీఎం పేర్కొన్నారు.     గ్రామ పంచాయతీలకు ప్రతి నెలా తప్పకుండా నిధులు విడుదల చేస్తాం. రాష్ట్రంలో 500 జనాభా ఉన్న గ్రామ పంచాయతీలు 20 వరకూ ఉన్నాయి. వీటిలోనూ ఐదేళ్లలో రూ.40 లక్షలు వస్తాయి. గ్రామాల అభివృద్ధి కోసం ఎంతో మంది దాతలు విరాళాలు ఇస్తున్నారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా దమ్మన్నపేకు చెందిన కామిడి నర్సింహారెడ్డి రూ.25 కోట్ల విరాళం ఇచ్చారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సర్పంచుల పదవులు పోతాయి. గెలిచిన ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పని చేయాలి’’ అని కేసీఆర్ హెచ్చరించారు.

Coronavirus

భ్రష్టు పట్టిన వ్యవస్థలో కరోనా మార్పు తెస్తుందా?

కరోనా! నో షేక్ హాండ్! సంస్కారంతో కూడిన నమస్కారం నేర్పింది! కరోనా సంగతి తెలీదు గానీ చేతులు శుభ్రంగా కడుక్కోండ్రా అంటే యూనిసెఫ్ చెప్పినా నవ్వి తీసి పారేసాం! ఇపుడు చేతులు సబ్బులరిగేలా సానిటైజర్లు ఐపోయేలా కడగడంతో మిగిలిన రోగాలు ఆమడ దూరానికి వెళ్లి పోయాయి! అల్లం వెల్లుల్లి శొంఠి మిరియాల గొప్పతనం తెలిసొచ్చింది! మన చారు చైనా వాళ్లు తాగుతున్నారు! పురుగుల మందు లాంటి కూల్ డ్రింకుల జోరు తగ్గింది! AC లు మానేయడంతో కరెంటు బిల్లు జేబుకు చిల్లు పడ్డం లేదు! రైళ్లలో బస్సుల్లో అనవసర ప్రయాణాలు తగ్గి పోవడంతో అవసరమైన వాల్లకి సీట్లు దొరుకుతున్నాయి! ఇంటి పట్టునే ఉండండం తో ఇంట్లో వాళ్లతో మాట్లాడ్డం పెరిగింది బంధాలు బల పడుతున్నాయి! తాగే నీళ్ల నుండి వేసుకునే జోళ్ల వరకు జాగ్రత్తలు తీసుకుంటున్నాం! ఏమౌతుందిలే అన్న తెంపరితనం కనుమరుగైంది! అనవసర తిరుగుళ్లు లేవ్! దుబారా ఖర్చుల్లేవ్! హోళీ రోజు పసుపూ కుంకుమతో సున్నితంగా కానిచ్చారు! హమ్మో లేదంటే గ్రీజు ఆయిలూ కోడిగుడ్లూ నానా ఛండాల మయ్యేది! మ‌న‌మే కాదు ప్ర‌పంచం మొత్తంలో మార్పు క‌నిపిస్తోంది. రోమ్ లో చర్చిలు మూసేసారు, ఇరాన్ మసీదుల్లో సామూహిక ప్రార్థనలు లేవు, ఆంక్షలు, ఇండియాలో దేవాలయాల్లోకి 28రోజుల నిబంధన కొందరికి పెట్టారు. దేవుని ప్రార్థనలకు కూడా అందరినీ ఒకచోట గుమికూడవద్దు అంటున్నారు.     కరోనా తరువాత... ముందు ప్రతీరోజు కుల, రాజకీయ, మత ద్వేషప్రచారం, తద్వారా వచ్చే ఆందోళననుంచి, గాభరానుంచి మీ మనసుకి ప్రశాంతత, ఆరోగ్యానికి స్వస్థత చేకూరుతుంది. ప్రార్ధనలతో అన్ని రోగాలు పోతాయనేవారు వూహన్ ఎందుకువెళ్లి ప్రజలను ఎందుకు కాపాడటంలేదు? అందరూ ఏకమై ముందు పర్యావరణాన్ని కాపాడండి. పర్యావరణ రక్షణ చేస్తే, కరోనా కన్నా భయంకరమైనవి మున్ముందు రాకుండా పర్యావరణము మిమ్మల్ని కాపాడుతుంది.

Power bill

క‌రెంట్ బిల్ దోపిడీ! చేతివాటం ప్ర‌ద‌ర్శిస్తున్న విద్యుత్ శాఖ‌

విద్యుత్ శాఖ ఉద్యోగులు 30రోజులకు బిల్ తీయాలి. కానీ 30 రోజుల తరువాత 31 నుండి 40 రోజులవరకు బిల్లులు కొట్టి ఇస్తున్నారు.100 యూనిట్స్ స్లాబ్ వరకు యూనిట్ కి 3.60 రూపాయలు. (ఒక్కొక్క యూనిట్ కాస్ట్.). 2 రోజులు delay చేయడం వల్ల 2 రోజులలో 6 యూనిట్స్ తో కలిపి 106 యూనిట్స్ వొచ్చింది. అంటే అప్పుడు 101 యూనిట్స్ దాటితే పర్ యూనిట్ ధర 6.90 రూపాయలు. ఇక్క‌డే వుంది టెక్నిక్‌. ప్ర‌జ‌లు అన‌వ‌స‌రంగా అంటే మూడు రూపాయ‌ల 60 పైస‌ల స్లాబ్ నుంచి ఆరు రూపాయ‌ల తొంభై పైస‌ల స్లాబ్‌లో బ‌ల‌వంతంగా చేరాల్సి వ‌స్తోంది. లెక్క ఇలా వుంటోంది. కేవ‌లం రెండు రోజులు ఆల‌స్యంగా బిల్ రీడింగ్ చేయ‌డం వ‌ల్ల 6.90 రూపాయల లెక్క ప్రకారం కట్టాలి. అప్పుడు 101 × 6.90 = 690 కట్టవలసి వస్తుంది. 100 యూనిట్స్ కు 390/-, తేడా 690-390=300 అదనం. ఇదే ప్ర‌స్తుతం జ‌రుగుతోంది. AE, DE & SE levelలో వొస్తున్న అదేశాలనుసరంగా బిల్లింగ్ ఇలా లేట్ గా తీసి అదనంగా డబ్బులు కట్టేలా చేస్తున్నారు. ఈ మోసం ప్రతి నెల జరుగుతుంది. జ‌నం నోరు మూసుకొని బిల్లులు కడుతున్నారు. ప్రజా సంఘాల నాయకులు దీనిపై ఆలోచించడం లేదు.

jana gana 2021

పక్కాగా జనగణన! దేశ‌వ్యాప్తంగా శిక్ష‌ణా కార్య‌క్ర‌మాలు

భారతదేశ జనగణన 2021కు సంబంధించి జనగణన అధికారులకు ఇళ్ల జాబితా, ఇళ్ల గణన జాతీయ జనాభా రిజిస్టర్‌(ఎన్‌పీఆర్‌) నవీకరణపై శిక్షణ కార్యక్రమాలు జ‌రుగుతున్నాయి. దేశ అభివృద్ధి ప్రణాళికలు రూపొందించటానికి జనాభా లెక్కలే కీలకమని, జనగణన 2021ని సమర్థంగా నిర్వహించాలని గుంటూరు జిల్లా కలెక్టర్‌ ఐ.శామ్యూల్‌ ఆనంద్‌ కుమార్‌ తెలిపారు. జనాభా లెక్కల ఆధారంగానే స్టాట్యుటరీ, నాన్‌ స్టాట్యుటరీ పనుల ప్రణాళికలు రూపొందిస్తారు. జనాభా వృద్ధి జనాభా లెక్కల ద్వారా తెలుస్తుందని, పట్టణం, గ్రామం, వార్డు స్థాయి వరకు సమాచారం సేకరించే అతిపెద్ద కార్యక్రమం.   జనాభా గణన 2021 మొదటి దశ ఏప్రిల్‌ 1 నుంచి సెప్టెంబర్‌ 30 వరకు జరుగుతుంది. ఇళ్ల జాబితా సేకరణ సమయంలో ఎన్‌పీఆర్‌ డేటా బేస్‌ నవీకరణకు సంబంధించి ప్రభుత్వం నిర్దేశించిన ప్రశ్నలను స్నేహపూర్వకంగా అడుగుతారు. ప్రజలు అందించిన వివరాలను నిర్ధరించడానికి ఎటువంటి ధ్రువీకరణ పత్రాలను అడ‌గ‌రు. ఈ మేరకు భారత ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయాయి.  

Cold War Between YCP Leaders in Kurnool

కర్నూలు కోల్డ్ వార్... 

స్థానిక సమరంలో తారాస్థాయికి చేరుకున్న ఇంటిపోరు  కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్,జగన్ బంధువు ఎస్వీ మోహన్ రెడ్డి మధ్య ఇన్ సైడ్ వార్  రాజీనామా అస్త్రంతో అధిష్టానం పై తిరుగుబాటు చేసే యోచనలో హఫీజ్ ఖాన్ హఫీజ్ కి చెక్ పెట్టి నియోజికవర్గం లో పట్టు సాధించాలి అని ఎస్వీ విశ్వప్రయత్నాలు  మూలిగే నక్క పై తాటి కాయ పడ్డట్టు తయారైంది కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ పరిస్థితి.ఒక పక్క ఎన్ఆర్సి,ఎన్పిఆర్,సిఏఏ ల పై జగన్ వైఖరితో మైనార్టీలకు సమాధానం చెప్పుకోలేని పరిస్థితి లో ఉన్న హఫీజ్ ఖాన్ ని కష్టాలు వెంటాడుతున్నాయి.ఎన్నికల ముందు కండువా కప్పించుకున్న ఎస్వీ మోహన్ రెడ్డి నిద్రపట్టకుండా చేస్తున్నారు.పేరుకే ఎమ్మెల్యే నియోజికవర్గం లో ఏ పని జరగాలి అన్నా ఎస్వీ మోహన్ రెడ్డి ఆశీస్సులు ఉండాల్సిందే.మైనార్టీ వర్గాలకు చెందిన ఎమ్మెల్యే కావడమే నేను చేసుకున్న శాపమా అని ఎమ్మెల్యే కొంతమంది అధికారుల దగ్గర కన్నీటి పర్యంతం అయ్యారు అంటే ఎంత ఘోరమైన పరిస్థితులు ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు.కనీసం ఒక పెన్షన్,రేషన్ కార్డు ఇప్పించుకోలేని పరిస్థితి హఫీజ్ ఖాన్ ది. నియోజకవర్గం ఏ అభివృద్ధి కార్యక్రమం చెయ్యాలన్నా రెడ్డి గారు టిక్ పెట్టాల్సిందే.10 నెలలుగా నరక యాతన పడుతున్నా మీడియా ప్రతినిధులతో తన ఆవేదన వ్యక్తం చెయ్యడం తప్ప హఫీజ్ ఖాన్ చెయ్యగలిగింది ఏమి లేదు.మైనార్టీ నేతలు ,కార్యకర్తలు తప్ప మిగిలిన క్యాడర్ ఎమ్మెల్యే మొహం చూడాలి అంటేనే భయపడే పరిస్థితి.ఇప్పుడు వచ్చిన స్థానిక ఎన్నికలు హఫీజ్ ఖాన్ కి మరిన్ని కష్టాలు తెచ్చిపెట్టాయి.నేను గెలిస్తే మిమల్ని అన్ని విధాలా ఆదుకుంటా అని కింది స్థాయి నేతలకు హామీలు ఇచ్చిన హఫీజ్ ఖాన్ కి షాక్ తగిలింది.తాను పంపిన లిస్ట్ లో 90 శాతం పేర్లు మారిపోయి అత్యధిక సీట్లు ఎస్వీ మోహన్ రెడ్డి వర్గానికి దక్కడం ,బీ ఫార్మ్ లు కూడా ఆయనే ఇవ్వడంతో హఫీజ్ ఖాన్ కి నియోజికవర్గం లో మొహం చెల్లడం లేదు.దింతో మైనార్టీ వర్గాల్లో భవిష్యత్తు పార్టీ నాయకుడు అనుకున్న హఫీజ్ ఖాన్ చాప్టర్ కి త్వరలోనే ఎండ్ కార్డు పడటం నియోజికవర్గం పగ్గాలు పూర్తి స్థాయిలో ఎస్వీ కి దక్కడం ఖాయం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

nara lokesh slams cm ys jagan

'బాబు టైలర్స్‌... జగన్‌ టైలర్స్‌' అంటూ ఆసక్తికర కార్టూన్లు పోస్ట్ చేసిన నారా లోకేశ్

బీసీలపై జగన్‌ తీరుపై లోకేశ్‌ ఎద్దేవా వైఎస్‌ జగన్ గారు మంచి కటింగ్ మాస్టర్ చట్టబద్ధంగా బీసీలు అనుభవిస్తున్న 34 శాతం రిజర్వేషన్లను 10 శాతం కట్  34 శాతం రిజర్వేషన్లు పార్టీపరంగా అమలు చేస్తున్నాం అని కటింగ్   'బాబు టైలర్స్‌.. జగన్‌ టైలర్స్‌' అంటూ టీడీపీ నేత నారా లోకేశ్ ఆసక్తికర కార్టూన్లు పోస్ట్ చేశారు. బీసీ రిజర్వేషన్లపై జగన్‌ తీరును ఎద్దేవా చేశారు. కార్టూన్లలో టైలర్లుగా చంద్రబాబు, జగన్‌ కనపడుతున్నారు. దుస్తులు కుట్టించుకోవడానికి బీసీలు వచ్చినట్లు దీన్ని గీశారు. 'వైఎస్‌ జగన్ గారు మంచి కటింగ్ మాస్టర్. చట్టబద్ధంగా బీసీలు అనుభవిస్తున్న 34 శాతం రిజర్వేషన్లను 10 శాతం కట్ చేసి 24 శాతానికి తగ్గించారు. రాజకీయంగానూ, సామాజికంగానూ, ఆర్థికంగానూ బీసీలను దెబ్బతీస్తూ... ఇప్పుడు 34 శాతం రిజర్వేషన్లు పార్టీపరంగా అమలు చేస్తున్నాం అని కటింగ్ ఇస్తున్నారు' అని లోకేశ్‌ చెప్పారు.

cm ramesh meets amit shah

అమిత్ షా చర్యలు తీసుకుంటామని చెప్పారు: సీఎం రమేశ్

అమిత్ షాను కలిసిన బీజేపీ ఎంపీలు వైసీపీ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందన్న సీఎం రమేశ్ పోలీసులే నామినేషన్లు అడ్డుకుంటున్నారని ఆరోపణ ఏపీలో బీజేపీ నేతలపైనా, కార్యకర్తలపైనా దాడులు జరుగుతున్నాయంటూ బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ మండిపడ్డారు. ఏపీలో పరిస్థితులు అదుపులోకి రాకపోతే చర్యలు తీసుకుంటామని హోంమంత్రి అమిత్ షా చెప్పారని వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వం అన్యాయంగా వ్యవహరిస్తోందని, పోలీసులే నామినేషన్లను అడ్డుకుంటున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయని సీఎం రమేశ్ ఆరోపించారు. పోలీసుల వ్యవహారశైలిపై నిఘా ఉంటుందన్న విషయాన్ని పోలీసులు గ్రహించాలని హితవు పలికారు. కాగా, బీజేపీ ఎంపీలు సీఎం రమేశ్, టీజీ వెంకటేశ్, జీవీఎల్ నరసింహారావు తదితరులు ఇవాళ హోంమంత్రి అమిత్ షాను కలిసి లేఖను సమర్పించినట్టు తెలుస్తోంది.

Case filed against Asaduddin Owaisi

కోర్టు ఆదేశాల మేర‌కు ఒవైసీపై కేసు పెట్టిన పోలీసులు

ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై కేసు నమోదు చేశారు హైదరాబాద్ పోలీసులు. నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకు ఆయనపై ఓల్డ్‌ సిటీలోని మొగల్‌పుర పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అసదుద్దీన్ ఒవైసీతో పాటు.. ఎంఐఎం మాజీ ఎమ్మెల్యే వారిస్ పఠాన్‌పై కూడా కేసు ఫైల్ చేశారు. బహిరంగ సభల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు ఒవైసీపై చర్యలు తీసుకోవాలని దిల్లీకి చెందిన బీజేపీ నేత కపిల్ మిశ్రా నాంపల్లి కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై కేసు నమోదైంది. నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును నమోదు చేసినట్లుగా హైదరాబాద్ మొగల్‌పుర పోలీసులు వెల్లడించారు. కర్ణాటకలోకి ఓ సభలో అసద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని, ఇవి ఓ వర్గం వారిని రెచ్చగొట్టేవిగా ఉన్నందునే ఈ కేసును నమోదు చేసినట్లుగా వెల్లడించారు. ఇటీవల కర్ణాటకలో జరిగిన ఎన్‌ఆర్‌సీ, సీఏఏకు వ్యతిరేకంగా నిర్వహించిన బహిరంగ సభల్లో అసదుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్, భారత్, పాకిస్థాన్ తదితర అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఐపీసీ సెక్షన్ 153, 153 (a) 117 295-a, 120b కింద పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై విచారణ చేస్తున్నట్లుగా పోలీసులు వెల్లడించారు. సీఏఏ, ఎన్‌ఆర్సీకి వ్యతిరేకంగా జరుగుతోన్న ఆందోళన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు అసదుద్దీన్ ఒవైసీ. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తోన్న నిరసన కార్యక్రమాల్లో పాల్గొని ఆయన ప్రసంగాలు చేస్తున్నారు.

position of bjp in andhra pradesh

ఆంధ్ర లో బీజేపీ 'పంచ్' తంత్రం...

  * దిగుమతి నాయకులు, బిజినెస్ లీడర్లు, లాబీయిస్టులు కలిసి బీ జె పి ని ఎటు నడిపిస్తారో....  * ఇంతకీ స్థానిక సమరం లో సత్తా చూపించే ట్యాలెంట్ ఆ పార్టీకి ఉన్నట్టా, లేనట్టా....  * జి వి ఎల్ ఋతుపవనాల్లాంటి వారు... ఇలావచ్చి అలా పలకరించి, అటు నుంచి ఆటే మాయమైపోతారు  * సి ఎం రమేష్ లాబీ మాస్టర్ గా ఢిల్లీ లో ప్రసిద్ధులు.. నోకియా మాదిరి ఈయన కూడా కనెక్టింగ్ పీపుల్ నినాదాన్ని బలంగా నమ్మిన వారు  * సుజనా చౌదరి... గత్యంతరం లేని పరిస్థితుల్లో అమరావతి నినాదాన్ని భుజాన వేసుకుని చందమామ కథలో విక్రమార్కుడి మాదిరి ... వై ఎస్ ఆర్ సి పి లోని బేతాళుడి తో జగడమాడుతుంటారు  * టీ జీ వెంకటేష్.. అవసరార్ధ రాజకీయాల కు కేరాఫ్ అడ్రెస్ .... రాయలసీమ అనేది ఈయనకు ట్యాగ్ లైన్ ...దురదపుట్టినప్పుడు గోక్కోవటానికి ఉపయోగపడే ఆరో వేలుగా ఆయన ఆ నినాదాన్ని బాగా వాడేస్తారు..  * అంగ వంగ కళింగ రాజ్యాలను అవలీలగా గెలిచిన చక్రవర్తి, చివరకు ఆముదాలవలస లో ఓడిపోయినట్టు, రాష్ట్ర బీ జె పి అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ , చివరకు పవన్ కళ్యాణ్ తో కలిసి స్థానిక సమరం లో బీజేపీకి కాస్తో కూస్తో ఉన్న ఇమేజ్ ని పణం గాపెట్టే సాహసానికి ఒడిగట్టారు  ఆ ఐదుగురూ ఇంతకీ ఏమి చేస్తున్నట్టు..భారతీయ జనతా పార్టీ దిగుమతుల విభాగం నుంచి డంప్ అయిన జి వి ఎల్ నరసింహారావు , అలాగే తెలుగు దేశం నుంచి బీ జె పి లోకి దిగుమతి అయిన సుజనా చౌదరి, సి ఎం రమేష్, టీ జీ వెంకటేష్ , కాంగ్రెస్ లో నుంచి బీ జె పి లోకి షిఫ్ట్ అయిన  బీ జె పి అధ్యక్షుడు కన్నా లక్ష్మీ  నారాయణ కలిసి ఈ స్థానిక సమరం లో రాష్ట్రం మొత్తం మీద కనీసం ఒక్కొక్కరికి 50 చొప్పున 250 మంది ఎం పి టి సి లు, జెడ్ పీ టి సి లను  గెలిపించుకురాగలరా అనేది చాలా పెద్ద సందేహం గా కనిపిస్తోంది. ఎందుకంటే, నిన్ననే విజన్ డాక్యుమెంట్ ని కలిసి ఆవిష్కరించిన బీ జె పి , జన సేన కంబైన్ నేతలు , చాలా పెద్ద  దృశ్యాన్నే జనం ముందు ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. వై ఎస్ ఆర్ సి పి, తెలుగుదేశం పార్టీ లకు తామే ప్రత్యామ్నాయమన్నట్టు గా ప్రకటించుకున్న ఈ ఐదుగురిదీ  వాస్తవానికి తలో దారీ.. ఎవరు , ఎప్పుడు, ఎందుకు, ఎలా మాట్లాడతారో తెలీని గందర గోళం ....  జి వి ఎల్ నరసింహ రావు ది అయితే సొంత రాజ్యాంగం, పూర్తిగా పార్టీ రాష్ట్ర శాఖ తో  గానీ, లేదా బీ జె పి లో ఉన్నతెలుగుదేశం మాజీ లతో  కానీ ఈయనకు ఎలాంటి సంబంధాలు ఉండవు.  రాష్ట్రాన్ని ఎప్పుడైనా పలకరించడానికి రుతు పవనాల మాదిరి అలా చుట్టపు చూపు గా వచ్చేసి ,  ఇలా మాయమైపోయే  జి వి ఎల్ వ్యవస్థ ల గురించి రాష్ట్ర బీ జె పి లో ఎవరికీ ఎలాంటి క్లూలు ఉండవు. ఈయన దారి రహదారి. ఈయన వ్యవస్థ ఇలాఉంటే, బీ జె పి లో ఉంటూ కూడా ఇంకాతెలుగు దేశం ఎజెండా , జెండా రెండూ మోస్తున్నట్టు కనిపించే సుజనా చౌదరి ఒక్క అమరావతి అంశం మీద తప్పించి, ఇతరత్రా ఏదీ మాట్లాడటానికి ఎక్కువగాఇష్టపడరు. జీ వీ ఎల్ కు, సుజనా కూ క్షణం పడదు. ఆయన ఎడ్డెం అంటే ఈయన తెడ్డెం అనే రకం.. ఏ మాత్రం పొసగని,పొంతన లేని పరస్పర భిన్నమైన అభిప్రాయాలు గల వీరిద్దరూ ఉత్తర ధృవం, దక్షిణ ధృవం మాదిరి ఒకే పార్టీ లో ఉంటూ కూడా కామన్  ఎజెండా తో పని చేసిన దాఖలాలు ఇప్పటివరకూ అయితే లేవు.   ఇహ, సి ఎం రమేష్ గురించి వేరే చెప్పనక్కర్లేదు. ఆయన తన బిజినెస్ వ్యవహారాలను బీ జె పి తో ముడి కట్టేసి, ఏ పార్టీ లో ప్రయాణిస్తున్నాడో కూడా మర్చే పోయి, మొన్నటికి మొన్న పరిమళ్ నత్వాని ని జగన్ మోహన్ రెడ్డి దగ్గర ప్రవేశ పెట్టడం లో కీలక పాత్ర పోషించిన  ఘనుడు. గుర్తు చేస్తే కానీ తానూ బీ జె పి లో ఉన్నాననే విషయం గుర్తుండని ఈయన కు  బీ జె పి, జన సేన కలిసి పోటీ  చేస్తున్న విషయం తెలుసో లేదో అని కూడాపార్టీ శ్రేణులు గుసగుస లాడుకుంటున్నాయి.  ఇహ వీరందరినీ సమన్వయము చేసుకుని  ముందుకెళ్తున్నట్టు భావిస్తూ , బాహ్య ప్రపంచం ముందు ఆవిష్కృతమయ్యే  వ్యక్తి మరెవరో కాదు... సాక్షాత్తూ  రాష్ట్ర బీ జె పి అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ. ఈయన, పవన్ కళ్యాణ్ తో కలిసి ప్రయాణించటానికి అంతగాసుముఖం గా లేదు...కారణమేమిటంటే, చంద్రబాబు నాయుడు లాంటి యోధులతో పోరాడిన తన రాజకీయం , చివరకు ఇలా ఏ పూట ఎక్కడ ఉంటారో కూడా తెలీని పవన్ కళ్యాణ్ పార్టీతో కలిసి పని చేయాల్సిన దుస్థితికి దిగజారటమేమిటని  తరచూ తనలో తానె కుమిలి పోతున్నట్టు సమాచారం.  ఇహ, టీ జీ వెంకటేష్ అయితే మరీను..... రాయలసీమ నినాదాన్ని తన ట్యాగ్ లైన్ గాచేసుకుని కాలక్షేపం చేసేస్తూ... ప్రస్తుతానికి బీ జె పి లో నివసిస్తూ ....ఈ స్థానిక ఎన్నికల సమరం లో తన పాత్ర ఏమిటో కూడాతెలీకుండా జీవనం వెళ్లదీస్తున్నారు. మొత్తానికి ఈ పంచ పాండవులు స్థానిక సమరం లో తమ 'పంచ్ ' పవర్ ఏమిటో ఈ నెలాఖరు లోగా చుపిస్తారేమోననే బోలెడు , ఇంకా గంపెడాశతో బీ జె పి అభిమానులు ఆత్రంగా ఎదురు చూస్తున్నారు.

shocking news to hyderabad people

క‌రోనా మృతుడు ఐదురోజుల పాటు హైద‌రాబాద్‌లోనే ఉన్నాడ‌ట‌!

'కేర్' లో చికిత్స జ‌రిగింది. అయితే పర్యవేక్షించిన నర్సు ఐసోలేషన్‌లో వుంచారు. ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చిన ఈ సంఘ‌ట‌న హైద‌రాబాద్ వాసుల్ని వ‌ణికిస్తోంది. కరోనా వైరస్‌తో మృతి చెందిన వ్యక్తి ఐదు రోజులు పాటు హైదరాబాద్‌ పాతబస్తీలో ఉన్నారట‌. కర్ణాటకకు చెందిన 76 ఏళ్ల వృద్ధుడు కరోనా కారణంగా చనిపోయినట్లు నిర్ధారణ అయింది. ఆయనకు హైదరాబాద్‌లోని కేర్ హాస్పిటల్‌లో చికిత్స అందించగా ఆయన్ను పర్యవేక్షించిన నర్సును ప్ర‌స్తుతం ఐసోలేషన్‌లో ఉంచారు. దేశంలో తొలి కరోనా మరణం ఇదే కావడం గమనార్హం. ఉత్తర కర్ణాటకలోని కలబుర్గికి చెందిన ఆయన మార్చి 10న కరోనా లక్షణాలతో చనిపోయారు. ఆయనకు కోవిడ్ సోకినట్లు చనిపోయిన తర్వాత నిర్ధారించారు. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని కేర్ హాస్పిటల్లో చికిత్స పొందిన ఆయన.. డిశ్చార్జి అయిన కాసేపటికే చనిపోయారు. అంతకు ముందు నగరంలోని మరో రెండు హాస్పిటళ్లు ఆయన్ను అడ్మిట్ చేసుకోవడానికి నిరాకరించాయి. ‘‘శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడుతున్న కరోనా అనుమానితుడు హాస్పిటల్‌కు వచ్చాడు. ఐసోలేషన్‌లో ఉంచిన తర్వాత కరోనా చికిత్స అందిస్తున్న గాంధీ హాస్పిటల్‌కు తరలించాలని ఆయన్ను తీసుకొచ్చిన వారికి సూచించాం. కానీ ఆయన కుటుంబ సభ్యులు మా సూచనకు విరుద్ధంగా కలబుర్గి తీసుకెళ్లారు. కాగా కేర్ హాస్పిటల్ నుంచి అంబులెన్స్ బయల్దేరిన గంటకే ఆ పేషెంట్ చనిపోయాడు. కలబుర్గికి చెందిన వృద్ధుడు జనవరి 29న సౌదీ అరేబియాలోని మక్కా వెళ్లారు. ఫిబ్రవరి 29న హైదరాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఎయిర్‌పోర్టులో స్క్రీనింగ్ నిర్వహించగా ఆయనలో కరోనా లక్షణాలేవీ కనిపించలేదు. దీంతో హైదరాబాద్ నుంచి కలబుర్గి వెళ్లారు. మార్చి 5 నాటికి ఆయన అనారోగ్యానికి గురి కావడంతో కలబుర్గిలోని ఓ ప్రయివేట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. మరుసటి రోజు ఆయన ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. కరోనా సోకిందనే అనుమానంతో ఆయన శాంపిళ్లను సేకరించి బెంగళూరు పంపారు. కారణలేంటో తెలీదు కానీ మార్చి 9న ఆయన్ను హైదరాబాద్‌ తీసుకొచ్చి కేర్ హాస్పిటల్‌లో చేర్పించారు. మరుసటి రోజు కేర్ నుంచి తీసుకెళ్తుండగా.. కలబుర్గి వెళ్లే దార్లోనే ఆయన చనిపోయారు. కలబుర్గిలో ఆయన అంత్యక్రియలు జరిగాయి. బంజారాహిల్స్‌లోని కేర్ హాస్పిటల్ ఆయన్ను మూడు గంటలపాటు ఐసీయూలో ఉంచిందని.. తర్వాత గాంధీ హాస్పిటల్‌కు తీసుకెళ్లాలని సూచించిందని కర్ణాటక ప్రభుత్వం తెలిపింది. కలబుర్గిలో చనిపోయిన వృద్ధుడికి కరోనా పాజిటివ్ అని తేలిందని కర్ణాటక ప్రభుత్వం నిర్ధారించింది. కేర్ హాస్పిటల్‌ను సందర్శించిన ఆరోగ్యశాఖ అధికారులు అక్కడి పరిస్థితిని సమీక్షించారు. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా కరోనా పరీక్షల కోసం ఐదు ల్యాబ్‌లు ఏర్పాటు చేయగా.. మరో 60 ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ ఐసోలేషన్‌ వార్డులను ఏర్పాటు చేశారు. ఇందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ప్రతి జిల్లాలోని ప్రభుత్వాసుపత్రులు, వైద్య విధాన పరిషత్‌లలో కూడా ఐసోలేషన్‌ వార్డుల ఏర్పాటుకు అధికారులు చర్యలు చేపట్టారు. కరోనా అనుమానితుల వైద్య పరీక్షల రిపోర్టు వచ్చే వరకు అనుమానితులను డిశ్చార్జి చేయొద్దని ప్రభుత్వం అన్ని ఆస్పత్రులకు ఆదేశాలు జారీ చేసింది.

ఉన్నావ్ బాధితురాలి తండ్రి మృతి కేసులో బిజెపి మాజీ ఎమ్మెల్యేకు పదేళ్ల జైలు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2017 ఉన్నావ్ అత్యాచార ఘటనకు సంబంధించి మ‌రో కేసులో తీర్పు వెలువడింది. ఉన్నావో అత్యాచార బాధితురాలి తండ్రి మృతి కేసులో బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్‌దీప్ సింగ్ సెంగార్‌‌కు న్యాయస్థానం శిక్ష ఖరారుచేసింది. ఈ కేసులో సెంగార్‌తోపాటు మరో ఏడుగుర్ని ఢిల్లీ న్యాయస్థానం దోషులుగా నిర్ధారించింది. దోషులకు శిక్షలు ఖరారుచేసిన న్యాయస్థానం జరిమానా కూడా విధించింది. ఈ కేసులో సెంగార్‌కు పదేళ్ల జైలు శిక్ష, రూ.10 లక్షల జరిమానా చెల్లించాలని ఆదేశించింది. మిగతా దోషులకు పదేళ్ల శిక్షను విధిస్తూ తీర్పు వెలువరించింది. కాగా అత్యాచారం కేసులో ఇప్పటికే సెంగార్‌‌కు యావజ్జీవిత ఖైదు పడిన విషయం తెలిసిందే. బాధితుడిపై కుట్రపూరితంగా తప్పుడు కేసు పెట్టి, పోలీసులతో అరెస్ట్ చేయించారనడానికి విచారణలో పక్కగా సాక్ష్యాలు విచారణలో లభ్యమయ్యాయని కోర్టు వ్యాఖ్యానించింది. బాధితుడిని చంపాలని ఉద్దేశం నిందితుడికి లేకపోయినా, కానీ, అతడిపై దారుణంగా దాడిచేసి అతడి మరణానికి కారకులయ్యారని పేర్కొంది. పోలీసులు కూడా కనీస ఇంగిత జ్ఞానం లేకుండా అత్యంత పాశవికంగా కొట్టారు.. వైద్యులు కూడా మానవత్వం లేని మనుషుల్లా నిర్లక్ష్యం వహించారని న్యాయమూర్తి మండిపడ్డారు. గతేడాది జులైలో ఉన్నావ్ అత్యాచార బాధితురాలిపై హత్యాయత్నం జరిగింది. రాయ్‌బరేలీలోని కోర్టకు హాజరయ్యేందుకు వెళ్తున్న బాధితురాలిపై ఐదుగురు దాడిచేశారు. అనంతరం ఆమెపై కిరోసిన్ పోసి సజీవదహనానికి యత్నించారు. దీంతో 90 శాతం కాలిన గాయాలతో ఉన్న బాధితురాలిని చికిత్స కోసం తొలుత స్థానిక హాస్పిటల్‌లో చేర్పించారు. తర్వాత మెరుగైన వైద్యం కోసం లక్నో తరలించగా, పరిస్థితి విషమించడంతో న్యూఢిల్లీలోని సఫ్దర్జంగ్ హాస్పిటల్‌కు తరలించారు. అయితే, ఆమెను కాపాడటానికి వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. 40 గంటలు మృత్యువుతో పోరాడి తుది శ్వాస విడిచింది.

జ్వరం లేకుంటేనే తిరుమలకు.. భక్తులకు తిరుపతిలోనే థర్మల్ గన్ తో పరీక్షలు!

అలిపిరి, శ్రీవారిమెట్టు వద్ద థర్మల్ గన్స్ పరీక్షల అనంతరమే కొండపైకి అనుమతి తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం నిత్యమూ లక్షలాది మంది భక్తులు వచ్చి వెళుతుండే, తిరుమలకు కరోనా వైరస్ రాకుండా చూసేందుకు టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంది. అలిపిరి, శ్రీవారి మెట్టు తదితర ప్రాంతాల్లో థర్మల్ గన్ లను అందుబాటులో ఉంచింది. నేటి నుంచి కొండపైకి ఎక్కే ప్రతి ఒక్కరినీ ఈ గన్ తో పరీక్షిస్తారు. శరీరంలో జ్వర లక్షణాలు కనిపించక పోతేనే వారిని కొండపైకి అనుమతిస్తారు. ఒకవేళ సాధారణం కన్నా శరీర ఉష్ణోగ్రత అధికంగా ఉంటే, పక్కనే ఏర్పాటు చేసిన స్క్రీనింగ్ సెంటర్ లో తదుపరి పరీక్షలు నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. కాగా, తిరుమలలో శ్రీవారి రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారి సర్వ దర్శనం కోసం 11 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. వీరికి దర్శనం పూర్తయ్యేందుకు 5 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. టైమ్ స్లాట్ టోకెన్లు, దివ్య దర్శనం, రూ. 300 ప్రత్యేక దర్శనం భక్తులకు దర్శనానికి 3 గంటల సమయం పడుతోందని తెలిపారు. నిన్న గురువారం స్వామివారిని 61,652 మంది దర్శించుకోగా, 22,756 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ. 2.34 కోట్ల ఆదాయం లభించింది.

వరుస షాక్ ల‌తో బెంబేలెత్తుతున్న టిడిపి!

స్థానిక సంస్థల ఎన్నికల వేళ తెలుగు త‌మ్ముళ్లు సైకిల్ దిగి ఫ్యాన్ కింద‌కి వెళ్ళ‌డం అధినేత చంద్ర‌బాబుకు న‌చ్చ‌డం లేదు. రాష్ట్రంలో శరవేగంగా మారుతున్న రాజకీయ పరిణామాల్ని ఆయ‌న జీర్ణించుకోలేక‌పోతున్నారు. రాజ‌కీయ ఎత్తుగ‌డ‌ల‌తో అధికార వైసీపీ ప్రతిపక్ష పార్టీలోని కీలక నేతలను తమ వైపు తిప్పుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. టీడీపీకి పట్టున్న జిల్లాల్లో ఆ పార్టీని దెబ్బతీయడమే టార్గెట్‌గా పెట్టుకున్నట్లు తాజా రాజకీయ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ హవా రాష్ట్రమంతా కనిపించినా.. విశాఖలో మాత్రం టీడీపీ నాలుగు అసెంబ్లీ సీట్లను గెలుచుకుంది. ఇలాంటి చోట్ల టీడీపీని సంస్థాగతంగా దెబ్బకొట్టాలని, ఆ పార్టీలోని కీలక నేతలపై వైసీపీ గురిపెట్టింది. ఇందులో భాగంగానే.. మాజీ ఎమ్మెల్యే, టీడీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన త్వరలోనే వైసీపీ తీర్థం పుచ్చుకునే అవకాశం కనిపిస్తోంది. రెహమాన్, బాలరాజు, తైనాల, చింతలపూడి వెంకట్రామయ్య ఇప్పటికే వైసీపీ కండువా కప్పుకున్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన కనిగిరి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత కదిరి బాబూరావుకు పార్టీ కండువా కప్పి జగన్ ఆహ్వానించారు. అదే బాట‌లో టీడీపీ సీనియర్ నేత, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం కూడా ప‌య‌నించారు. అంత‌టితో ఆగ‌కుండా ప్రకాశం జిల్లాలో టీడీపీని బలహీన పరిచే పనుల్లో బిజీగా మారారు. మాజీ మంత్రి శిద్దా రాఘవరావు సహా పలువురు జిల్లా స్థాయి నేతలను, ద్వితీయ శ్రేణి నాయకులను తమ వెంట వైసీపీ లాగేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. దాంతో ప్రకాశంజిల్లాలో టీడీపీ ఖాళీ అయిపోతుందా అన్న సందేహాలు పెరుగుతున్నాయి. ఎమ్మెల్సీ పోతుల సునీత, మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు, ఎమ్మెల్యే కరణం బలరాం వైసీపీ గూటికి చేరిన నేపథ్యంలో మరికొంతమంది ముఖ్య నేతలు వైసిపి వైపు చూస్తున్నారనిపిస్తోంది. ప్రధానంగా కరణం బలరాంతో ప్రత్యేక అనుబంధం ఉన్న మరికొందరు నేతలు వైసీపీలో చేరేందుకు క్యూ కడుతున్నారనిపిస్తోంది. కడప జిల్లాలో పులివెందుల సతీష్ రెడ్డి, జమ్మలమడుగు రామసుబ్బారెడ్డి టీడీపీని వీడారు. కడప జిల్లాకు చెందిన మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి ఇదేవిధంగా చక్రం తిప్పుతున్నారు. దాంతో కడప జిల్లాలో టీడీపీకీ కీలకమైన నేతగా మైనారిటీ నేత సుబాన్ బాషాతో టీడీపీకి రాజీనామా చేయించి సుబాన్ బాషాతో పాటు ఆయన అనుచరులను డిప్యూటీ సీఎం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మరోవైపు కర్నూలు జిల్లా టీడీపీలో కీలక కుటుంబం నుంచి కీలక వ్యక్తి టీడీపీకి గుడ్ బ్ చెప్పారు. ఆయన వైసీపీలో చేరిక ఇంకా ఖరారు కానట్లు తెలుస్తోంది. ఇంకోవైపు తూర్పు గోదావరి జిల్లా అమలాపురం మున్సిపాలిటీ పరిధిలో ఆపరేషన్ ఆకర్ష చేపట్టారు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్. టీడీపీ నేతల ఇళ్లకు వెళ్లి మరి వైసీపీలో చేరాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు విశ్వరూప్. దాంతో పలువురు టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులు వైసిపిలోకి చేరారు. అమలాపురం మున్సిపల్ మాజీ చైర్మన్ యళ్ల సతీష్ టీడీపీ రాజీనామా చేసి, వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అనంతపురం జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్సీ శమంతకమణి, ఆమె కుమార్తె మాజీ ఎమ్మెల్యే యామిని బాల కూడా వైసీపీలోకి చేరేందుకు రంగం సిద్ధం చేస్తుకుంటున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. నాలుగైదు రోజులుగా తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి అధికార వైసీపీ గూటికి చేరుతున్న తెలుగు తమ్ముళ్ళ సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కదిరి బాబూరావుతో మొదలైన వలసల పరంపర కేఈ ప్రభాకర్ దాకా కొనసాగింది. అదే బాటలో మరికొందరున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.

ఐపీఎల్ తో పాటు ఎఫ్ 1 రేస్ కూడా రద్దు!

ఢిల్లీలో ఐపీఎల్ 13వ సీజన్ కు సంబంధించిన మ్యాచ్లను నిర్వహించకూడదని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఐపీఎల్ మ్యాచ్లతో పాటు మిగతా క్రీడా పోటీలపైన కూడా నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. స్టేడియంలో జనం పెద్ద సంఖ్యలో గూమిగూడే అవకాశం ఉండడంతో కరోనా వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలందరూ ఎంతో ఆసక్తిగా తిలకించే ఎఫ్ 1 రేస్ కూడా నిలిపివేయండంతో క్రీడాభిమానులు నిరాశకు గురవుతున్నారు. కేంద్ర క్రీడామంత్రిత్వశాఖ కరోనా వైరస్ మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సలహాను పాటించాలని, క్రీడా కార్యక్రమాలలో లార్జ్ గెదరింగ్(పెద్దఎత్తున ప్రజలు ఒకచోట హాజరవడం) నివారించాలని BCCIతో సహా అన్ని జాతీయ సమాఖ్యలను కోరింది. ఇప్పటికే ఐపీఎల్ ను వాయిదా వేయాలని,బెంగళూరులో ఐపీఎల్ మ్యాచ్ లకు ఆతిథ్యం ఇవ్వలేమని కేంద్రానికి కర్ణాటక ప్రభుత్వం లేఖ రాసింది. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఐపీఎల్ ను వాయిదా వేసుకోవాలని సూచించింది. మద్రాస్‌ హైకోర్టులోనూ వాయిదా కోరుతూ ఓ పిటిషన్‌ దాఖలైంది. ఇక శివసేన నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వం ఏకంగా ఐపీఎల్‌ టికెట్ల అమ్మకాలపై నిషేధం విధించింది. కరోనా వైరస్‌ భయంతో ఐపీఎల్‌ మ్యాచ్‌ల నిర్వహణకు పలు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కూడా వ్యతిరేకత పెరుగుతోంది. ''ఇన్నేళ్లుగా ప్రతీ వేసవిని ధనాధన్‌ మెరుపులతో అలరించిన ఈ లీగ్‌ ఇప్పుడైతే అటు స్పాన్సర్లని, ఫ్రాంచైజీలనే కాదు... ఇటు పాలకమండలినీ దడదడలాడిస్తోంది. ఈ నెల 14న జరిగే ఐపీఎల్‌ పాలకమండలి సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటామని బీసీసీఐ ప్రకటించినప్పటికీ.. బిజీ షెడ్యూలు వల్ల అటు వాయిదా వేయలేదు. ఇటు వేరే దేశంలో నిర్వహించనూ లేరు. ఎన్నికల సందర్భంగా 2009, 2014లలో విదేశాల్లో నిర్వహించింది. కానీ.. ఇప్పుడున్న 'కరోనా మహమ్మారి' దృష్ట్యా ఏ దేశం నిర్వహణకు సిద్ధంగా లేదు.