స్వేరో ప్రవీణ్ కు షర్మిల సపోర్ట్?
ఎవరితోనూ పొత్తు లుండవు. ఒంటరిగానే పోటీ చేస్తాం, దేవుని దయతో విజయం సాధిస్తాం ... ఇది ఏ తెరాస నేతలో, బీజేపీ లేదా కాంగ్రెస్ నాయకులో, చేసిన ప్రకటన కాదు. ఇంకా పుట్టని, పేరైనా పెట్టని పార్టీ, నాయకురాలు వైఎస్ షర్మిల వ్యక్తం చేసిన విశ్వాసం. ఇది విశ్వాసమో మరొకటో, కానీ, ఆమె మాటతీరు, హావభావాలు, బాడీ లాంగ్వేజ్ గమనిస్తే, దేవుని బిడ్డగానే, దేవుని పేరునే ఆమె రాజకీయ ప్రస్థానం సాగుతోందని, ఆమె రాజకీయ అడుగులను గమనిస్తున్న సన్నిహితులు స్పష్టం చేస్తున్నారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, రాజన్న రాజ్యం పేరున ఏసు రాజ్య స్థాపనకోసమే ఆమె ఆరాటమని అర్థమవుతుంది.
వచ్చెనెల 9న లక్ష మందితో ఖమ్మంలో తలపెట్టిన సంకల్ప సభ ఏర్పాట్లను సమీక్షరించేందుకు పది ఉమ్మడి జిల్లాల ముఖ్యనేతలతో ఆమె గురువారం లోటస్ పాండ్’లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సంకల్ప సభ వాల్ పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె, ఒంటరి ప్రకటన చేశారు. అంతే కాదు తెలంగాణ ప్రజలు రాజన్న రాజ్యం కోరుకుంటున్నారని చెప్పారు.అలాగే, ఎవరో పిలిస్తే, ఎవరికో పరోక్షంగా ప్రయోజనం చేకూర్చెందుకో, రాలేదని,స్పష్టం చేశారు. టీఆర్ఎస్ చెబితే వచ్చినవాళ్లం కాదని, బీజేపీ అడిగితే వచ్చినవాళ్లం కాదని అన్నారు. పాదయాత్ర మొదలుపెట్టిన ఏప్రిల్ 9న తొలి అడుగు వేద్దామని షర్మిల అన్నారు.
అదెలా ఉన్నా ఆమె వివాదాస్పద ఐపీఎస్ అధికారి, స్వేరో ప్రవీణ్ కుమార్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. స్వేరో ప్రవీణ్ కుమార్ ఎవరో ఏమిటో, ఎలాంటి కరుడుగట్టిన హిందూ వ్యతిరేకో వేరే చెప్పనక్కర లేదు. ఆయన తమ అధికారాన్ని, ప్రభుత్వ సంపూర్ణ సహకారాన్ని చక్కగా ఉపయోగించుకుంటూ, తెలంగాణలో క్రైస్తవ రాజ్య స్థాపనకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్న ట్రూ క్రిస్టియన్, నిజమైన క్రైస్తవుడుగా, ఏసు బిడ్డగా క్రైస్తవ సమాజం ప్రసంసలు అందుకుంటున్నారు. అలాంటి ఏసు భక్తుని, షర్మిల సమర్ధించడం, ఆయన షర్మిలను సమర్ధించడం, ఆ ఇద్దరినీ మరొక దొరగారు సమర్ధించడంలో ఆశ్చర్య పోవలసిన విషయం కానీ, అనుమానించవలసిన విశేషం గానీ ఏదీ లేదు. ఎక్కడున్నా క్రైస్తవులంతా ఒక్కటే,అందరి లక్షం ఒక్కటే, ఏసు రాజ్య స్థాపనే అందరి లక్ష్యం, పేరు మాత్రమే రాజన్న రాజ్యం ... స్వేరో ప్రవీణ్’కు మద్దతు తెలపడంతో షర్మిల తమ నిజ రూపాన్ని బయట పెట్టారు.
అయితే, షర్మిల సంకల్పానికి, సంకల్ప సభకు సభకు కోవిడ్ చిక్కులు ఏర్పడ్డాయి. ప్రజల ముందు పెద్ద ఎత్తున వచ్చేందుకు ఆమె చేస్తున్న ఏర్పాట్లకు అవాంతరాలు ఎదురవుతున్నాయి. లక్ష మందితో సభ నిర్వహణకు షర్మిల బృందం ఒకవైపు కసరత్తు చేస్తుంటే.. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేవలం 6వేల మందితో సభ నిర్వహించుకునేందుకు ఖమ్మం జిల్లా పోలీసులు అనుమతి ఇచ్చారు. అది కూడా కరోనా నిబంధనలు పాటిస్తూ సాయంత్రం 5 గంటల నుంచి 9 గంటలలోపే సభ నిర్వహించుకోవాలని సూచించారు.
షర్మిల మాత్రం దేవుని మీద భారంవేసి అకేలా యతకు సిద్దమవుతున్నారు. మరో వంక ఆమె రాజకీయ సంకల్పం, ప్రస్థానం విషయంలో అనుమానాలు పూర్తిగా తొలిగి పోలేదు. ఆమె ఎంత గట్టిగా తెరాస రమ్మంటేనో ,వచ్చిన వాళ్ళం కాదు , బీజేపీ పిలిస్తేనో వచ్చిన వాళ్ళం కాదు అని చెప్పుకుంటే అంతగా అనుమానాలు బలపదుతున్నాయి.