ఈ సీఎం.. ప‌దోత‌ర‌గ‌తి ప‌రీక్ష పేప‌ర్లు ఎత్తుకెళ్లిన దొంగ!

రాష్ట్ర ముఖ్యమంత్రి గతంలో ప‌దోత‌ర‌గ‌తి ప‌రీక్ష పేప‌ర్లు ఎత్తుకెళ్లిన దొంగ .. గతంలో చేసిన దొంగ బుద్ది ఆయనకు ఇంకా పోలేదు. ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా అలాంటి పనులే చేస్తున్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి మాట తప్పుతూ, పాలనలో వేసిన ప్రతి అడుగూ తప్పుతూ ఫేక్ ముఖ్యమంత్రి అనిపించుకుంటున్నారు... ఈ వ్యాఖ్యలు ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దేశించి.. ప్రతిపక్ష నాయకుడు చేసినవి.  ఆంధ్రప్రదేశ్ లో రాజధాని అమరావతిలో అసైన్డ్ భూముల వ్యవహారం రాజకీయ కాక రేపుతోంది. ఫేక్ కేసులు నమోదు చేశారంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు.  ఈ నేపథ్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఘాటు విమర్శలు చేశారు. పదో తరగతి పరీక్ష పేపర్లు ఎత్తుకెళ్లిపోయిన బుద్ధి జగన్ రెడ్డి ఇంకా మార్చుకోలేదని వ్యాఖ్యానించారు. అమరావతి రైతుల పేరుతో సీఐడీకి ఫేక్ ఫిర్యాదులు ఇచ్చి ఫేక్ సీఎం బిరుదు సార్థకం చేసుకున్నాడని ఎద్దేవా చేశారు. అమరావతి అసైన్డ్ భూముల అంశంపై దర్యాప్తు చేస్తున్న పోలీసులైనా నిజమైనవాళ్లా? లేక ఫేక్ సీఎం ఇచ్చిన ఫేక్ ఫిర్యాదుల్లాంటి ఫేక్ ఖాకీలా? అంటూ సెటైర్లు వేశారు అయ్యన్న పాత్రుడు.  "నాడు విపక్షంలో ఉన్నప్పుడు అమరావతి రాజధానికి అంగీకరించి, అధికారం చేపట్టాక కక్ష కట్టి మరీ అమరావతి అంతానికి కుట్రలు చేస్తున్నావు. వికేంద్రీకరణ పేరుతో నువ్వు చిమ్ముతున్న విద్వేషపు విషాన్ని టీడీపీ జనం ముందు ఉంచింది. ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా, ఎంత బెదిరింపులకు పాల్పడినా జగన్ రెడ్డి, ఆయన గ్యాంగ్ చెప్పేవన్నీ అవాస్తవాలేనని ప్రజలు కుండబద్దలు కొట్టారు. అసత్యప్రచారాలే పునాదులుగా నిర్మించుకున్న అధికారం కూలిపోయే రోజు దగ్గరపడింది" అంటూ సీఎం జగన్ పై అయ్యన్నపాత్రుడు విరుచుకుపడ్డారు.

స్వేరో ప్రవీణ్ కు షర్మిల సపోర్ట్? 

ఎవరితోనూ పొత్తు లుండవు. ఒంటరిగానే పోటీ చేస్తాం,  దేవుని దయతో విజయం సాధిస్తాం ... ఇది ఏ తెరాస నేతలో, బీజేపీ లేదా కాంగ్రెస్ నాయకులో, చేసిన ప్రకటన కాదు. ఇంకా పుట్టని, పేరైనా పెట్టని పార్టీ, నాయకురాలు  వైఎస్ షర్మిల వ్యక్తం చేసిన  విశ్వాసం. ఇది విశ్వాసమో మరొకటో, కానీ, ఆమె మాటతీరు, హావభావాలు, బాడీ లాంగ్వేజ్ గమనిస్తే, దేవుని బిడ్డగానే, దేవుని పేరునే ఆమె రాజకీయ ప్రస్థానం సాగుతోందని, ఆమె రాజకీయ అడుగులను గమనిస్తున్న సన్నిహితులు స్పష్టం చేస్తున్నారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, రాజన్న రాజ్యం పేరున ఏసు రాజ్య స్థాపనకోసమే ఆమె ఆరాటమని అర్థమవుతుంది.  వచ్చెనెల 9న లక్ష మందితో ఖమ్మంలో తలపెట్టిన సంకల్ప సభ ఏర్పాట్లను సమీక్షరించేందుకు  పది ఉమ్మడి జిల్లాల ముఖ్యనేతలతో ఆమె గురువారం లోటస్ పాండ్’లో సమావేశమయ్యారు.   ఈ సందర్భంగా సంకల్ప సభ వాల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె, ఒంటరి ప్రకటన చేశారు. అంతే కాదు  తెలంగాణ ప్రజలు రాజన్న రాజ్యం కోరుకుంటున్నారని చెప్పారు.అలాగే, ఎవరో పిలిస్తే, ఎవరికో పరోక్షంగా ప్రయోజనం చేకూర్చెందుకో, రాలేదని,స్పష్టం చేశారు. టీఆర్ఎస్ చెబితే వచ్చినవాళ్లం కాదని,  బీజేపీ అడిగితే వచ్చినవాళ్లం కాదని అన్నారు. పాదయాత్ర మొదలుపెట్టిన ఏప్రిల్ 9న తొలి అడుగు వేద్దామని షర్మిల అన్నారు. అదెలా ఉన్నా ఆమె వివాదాస్పద  ఐపీఎస్ అధికారి,  స్వేరో ప్రవీణ్ కుమార్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. స్వేరో ప్రవీణ్ కుమార్ ఎవరో ఏమిటో, ఎలాంటి కరుడుగట్టిన హిందూ వ్యతిరేకో వేరే చెప్పనక్కర లేదు. ఆయన తమ అధికారాన్ని, ప్రభుత్వ సంపూర్ణ సహకారాన్ని చక్కగా ఉపయోగించుకుంటూ, తెలంగాణలో క్రైస్తవ రాజ్య స్థాపనకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్న ట్రూ క్రిస్టియన్, నిజమైన క్రైస్తవుడుగా,  ఏసు బిడ్డగా క్రైస్తవ సమాజం ప్రసంసలు అందుకుంటున్నారు. అలాంటి ఏసు భక్తుని, షర్మిల సమర్ధించడం, ఆయన షర్మిలను సమర్ధించడం, ఆ ఇద్దరినీ  మరొక దొరగారు సమర్ధించడంలో ఆశ్చర్య పోవలసిన విషయం కానీ, అనుమానించవలసిన విశేషం గానీ ఏదీ లేదు. ఎక్కడున్నా క్రైస్తవులంతా ఒక్కటే,అందరి లక్షం ఒక్కటే, ఏసు రాజ్య స్థాపనే అందరి లక్ష్యం, పేరు మాత్రమే రాజన్న రాజ్యం ... స్వేరో ప్రవీణ్’కు మద్దతు తెలపడంతో షర్మిల తమ నిజ రూపాన్ని బయట పెట్టారు.  అయితే, షర్మిల సంకల్పానికి, సంకల్ప సభకు సభకు కోవిడ్ చిక్కులు ఏర్పడ్డాయి. ప్రజల ముందు పెద్ద ఎత్తున వచ్చేందుకు ఆమె చేస్తున్న ఏర్పాట్లకు అవాంతరాలు ఎదురవుతున్నాయి. లక్ష మందితో సభ నిర్వహణకు షర్మిల బృందం ఒకవైపు కసరత్తు చేస్తుంటే.. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేవలం 6వేల మందితో సభ నిర్వహించుకునేందుకు ఖమ్మం జిల్లా పోలీసులు అనుమతి ఇచ్చారు. అది కూడా కరోనా నిబంధనలు పాటిస్తూ సాయంత్రం 5 గంటల నుంచి 9 గంటలలోపే సభ నిర్వహించుకోవాలని సూచించారు. షర్మిల మాత్రం దేవుని మీద భారంవేసి అకేలా యతకు సిద్దమవుతున్నారు. మరో వంక ఆమె రాజకీయ సంకల్పం, ప్రస్థానం విషయంలో అనుమానాలు పూర్తిగా తొలిగి పోలేదు. ఆమె ఎంత గట్టిగా తెరాస రమ్మంటేనో ,వచ్చిన వాళ్ళం కాదు , బీజేపీ పిలిస్తేనో వచ్చిన వాళ్ళం కాదు అని చెప్పుకుంటే అంతగా అనుమానాలు బలపదుతున్నాయి.

కేసీఆర్ పై మంత్రి మల్లారెడ్డి హాట్ కామెంట్స్ 

సంచలన కామెంట్లతో రాజకీయ కాక పుట్టించే తెలంగాణ మంత్రి మల్లారెడ్డి.. మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. సీఎం కేసీఆర్ ప్రధానమంత్రి కావాలని కోరుకున్నారు. కేసీఆర్ ప్రధాని అయితే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినట్లే దేశాన్ని కూడా ప్రగతిపథంలోకి తీసుకెళ్తారని చెప్పారు. కేసీఆర్ ప్రధానమంత్రి అయితే ప్రజలకు సమస్యలే ఉండవని పేర్కొన్నారు. దేశ చరిత్ర మారిపోతుందని మల్లారెడ్డి జ్యోస్యం చెప్పారు.  అసెంబ్లీలో మాట్లాడిన మల్లారెడ్డి.. కేంద్ర సర్కార్ విధానాలపై విమర్శలు చేస్తూ ఈ కామెంట్లు చేశారు. కేంద్రప్రభుత్వం, రాష్ట్రంలోని ప్రతిపక్షాలపై ఆయన ఘాటు విమర్శలు చేశారు. 70 ఏళ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్‌తో పాటు బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వాలు ఎలాంటి అభివృద్ధి చేయలేదని ఆరోపించారు. ప్రైవేటీకరణ పేరుతో కేంద్ర ప్రభుత్వం కార్మికులను రోడ్డున పడేస్తోందని మల్లారెడ్డి మండిపడ్డారు.  ఇటీవల రాష్ట్రంలో సీఎంగా మంత్రి కేటీఆర్ ప్రకటించాలని టీఆర్‌ఎస్ శ్రేణులతో పాటు కేబినెట్‌లోని మంత్రులు ముక్తకంఠంతో నినదించారు. ఈ నినాదంలో చేసిన వారిలో మల్లారెడ్డి ముందువరుసలో ఉన్నారు. ఇప్పుడు ఏకంగా సీఎం కేసీఆర్‌ను ప్రధానమంత్రిగా చూడాలని చెప్పడంతో ఆయన మాటలు చర్చగా మారాయి. తన వ్యాఖ్యల ద్వారా  కేటీఆర్ ను సీఎం చేయాలని మంత్రి మల్లారెడ్డి చెప్పకనే చెప్పారని అంటున్నారు. 

వాణీదేవి.. ఐరన్ లెగ్?

గొడ్డొచ్చిన వేళ.. పిల్లొచ్చిన వేళ.. దేనికైనా టైమ్ బాగుండాలంటారు. లేదంటే, మంచి జరగదనేది ఆ నానుడి. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ వాణీదేవి విషయంలోనూ అలాంటి చర్చే జరుగుతోంది. ఇదేమీ సీరియస్ పొలిటికల్ డిస్కషన్ కాకపోయినా.. కొంత వెటకారమే అయినా.. వారు చెప్పే కారణాలు ఆసక్తికరంగా ఉన్నాయి. అవేంటో వింటే.. అవునుకదా? నిజమేకదా? అనిపిస్తున్నాయి.  అతికష్టం మీద ఎమ్మెల్సీగా గెలుపొందారు టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవి. ఊహించని విజయంతో గులాబీ శ్రేణుల్లో సంబరాలు మొదలయ్యాయి. తెలంగాణ భవన్‌లో ఓ రేంజ్‌లో సెలబ్రేషన్స్ జరిగాయి. తీన్మార్ డ్యాన్సులతో కార్యకర్తల్లో ఉత్సాహం నిండింది. బాణాసంచా పేలుళ్లతో సంబరాలు అంబరాన్నంటాయి. అదే సమయంలో, బాణాసంచా పేలుడుతో తెలంగాణ భవన్‌లో అగ్నిప్రమాదం జరిగింది. నిప్పురవ్వలు ఎగిసిపడి.. పందిరి తగలబడింది. ఎమ్మెల్సీగా వాణీదేవి ఎన్నికవగానే.. తెలంగాణ భవన్‌లో అగ్ని ప్రమాదం జరగడం కీడంటూ కొందరు వ్యాఖ్యానించారు. టపాసులు కాల్చినప్పుడు ఇలాంటివి కామన్ అంటూ మరికొందరు తీసి పడేశారు. దీంతో.. అప్పుడా విషయాన్ని అంతా లైట్ తీసుకున్నారు. కానీ.... గురువారం ఎమ్మెల్సీగా మండలికి వచ్చారు వాణీదేవి. ఆమె వచ్చిన కారు ప్రమాదానికి గురవడం కలకలం రేపింది.  అసెంబ్లీ గేట్‌ నెంబర్‌ 8ని కారు ఢీకొట్టింది. ఆ సమయంలో వాణీదేవి కారులో లేరు. కారును పార్కింగ్‌ చేస్తుండగా అదుపు తప్పిన సమీపంలోని గేటుపైకి దూసుకెళ్లింది. కారు టైరు పేలిపోయింది. ప్రమాద సమయంలో కారును ఎమ్మెల్సీ గన్‌మెన్‌ నడిపారు. కారు టైరు పేలి పెద్ద శబ్ధం రావడంతో అంతా ఉలిక్కిపడ్డారు.  ఎమ్మెల్సీగా గెలిచిన రోజు తెలంగాణలో అగ్ని ప్రమాదం. మండలికి వచ్చిన రోజు కారు ప్రమాదం. ఈ రెండు ఘటనలతో ఎమ్మెల్సీ వాణీదేవి ఐరన్ లెగ్గా? అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు కొందరు. రెండు కీలకమైన రోజుల్లో.. రెండు ప్రమాదాలు జరగడం యాధృచ్చికమా? లేక, కీడా? అని అనుమానిస్తున్నారు. రెండు దుర్ఘటనలకు వాణీదేవికి లింక్ ఉండటంతో.. మేడమ్‌ది ఐరన్ లెగ్ అంటూ చర్చించుకుంటున్నారు టీఆర్ఎస్ కార్యకర్తలు. ఇలాంటి ప్రచారాన్ని కొట్టి పారేస్తున్నారు మరికొందరు హేతువాదులైన పార్టీ శ్రేణులు.

సెకండ్ వేవ్ హర్రర్.. 100డేస్ అలర్ట్

దేశంలో కరోనా సెకండ్ వేవ్. ఇందులో ఎలాంటి అనుమానం అవసరం లేదంటోంది ఓ సంస్థ. ఈ సెకండ్ వేవ్ దాదాపు 100 రోజులు ఉంటుందని తెలిపింది. ఏప్రిల్, మే నెలల్లో కేసుల సంఖ్య మరింత పెరుగుతుందని తెలిపింది. ఏప్రిల్ 15 తర్వాత వైరస్ తీవ్రత తారాస్థాయికి చేరుతుందని చెప్పింది. సెకండ్ వేవ్‌లో దేశ వ్యాప్తంగా 25లక్షల మంది వైరస్ బారిన పడే ఛాన్స్ ఉందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నివేదిక అంచనా వేసింది. ఫస్ట్ వేవ్ కన్నా సెకండ్ వేవ్‌లో తీవ్రత ఎక్కువగా ఉంటుందని హెచ్చరించింది. అయితే ప్రస్తుతం మన దేశంలో వ్యాక్సిన్ అందుబాటులో ఉండటం వల్ల పరిస్థితిలో మార్పు ఉండవచ్చునని తెలిపింది. లాక్‌డౌన్, కంటైన్మెంట్ జోన్లతో అంతగా ప్రయోజనం ఉండదని.. కరోనా కట్టడికి వ్యాక్సినేషనే సరైన మార్గమని ఎస్బీఐ అభిప్రాయపడింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 34లక్షల డోసులు పంపిణీ చేస్తున్నారు. వీటిని రోజుకు 45లక్షలకు పెంచినా.. 45ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ అందించాలంటే మరో 4 నెలల సమయం పడుతుందని తెలిపింది.  మరోవైపు దేశంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరాల ప్రకారం.. గురువారం 53,476 కొత్త కేసులు వచ్చాయి. రెండు రోజుల్లోనే కొవిడ్ కేసుల సంఖ్య లక్ష దాటేసింది. ఈ ఏడాది ఇప్పటి వరకు ఒక రోజులో ఇంత ఎక్కువగా కేసులు నమోదవడం ఇదే తొలిసారి. 

ఏడాదిగా 30 మంది.. కూతురుతో తల్లి.. ఛీ ఛీ.. 

అమ్మాయి పై అత్యా..చారం. ఒకరు ఇద్దరు కాదు ఏకంగా 30 మంది కామా*ధులు. ఒకటి, రెండు రోజులు కాదు, ఏకంగా ఏడాది పాటు అత్యాచార* చేశారు. డబ్బు మైకంలో పడి కట్టుకున్న ఆ దారుణానికి సహకరించింది ఎవరో కాదు.  ఓ కసాయి తల్లి. మొగుడిని వదిలేసింది. జల్సాల కోసం సంవత్సరం పాటు ఆ అమ్మాయికి  నరక వేదన చూపించింది. అమ్మాయి కన్నీళ్లను చూసి కూడా కరగలేదు ఆ కసాయి తల్లీ హృదయం. తన కూతురి  జీవితాన్ని అంధకారం చేయడానికి ఆస్కార్ రేంజ్ లో నటించింది. చివరికి బాలిక ఫిర్యాదు తో ఆ కసాయి తల్లి చేతికి సంకెళ్లు పడ్డాయి.  ఉత్తర కర్ణాటక నుంచి కూతురుతో వచ్చిన ఓ మహిళ తనను భర్త వదిలేశాడని అందుకే తన సోదరి కుమార్తెతో శృంగేరికి వచ్చానంది. ఆ సమయంలోనే ఓ వ్యక్తితో వివాహమైనా.. కొంతకాలానికే అతడితో సంబంధం తెంచుకుంది. అప్పటి నుండి కొత్త నాటకానికి తెర తీసింది తన కూతుర్ని. తన సోదరి కుమార్తె అని కొందరికి,  తన భర్తకు అతని మొదటి భార్యకు పుట్టిన సంతానమని మరికొందరికి ఆ బాలిక గురించి చెబుతూ వచ్చింది. ఏడాదిగా తనపై 30 మంది అత్యాచార* చేస్తున్నారంటూ బాలిక ఫిర్యాదు చేయడంతో ఒక్కసారిగా అన్ని వివరాలు వెలుగులోకి వచ్చాయి. పినతల్లిగా చెప్పుకొనే ఆ మహిళ కన్నతల్లేనని.. డబ్బు కోసం కూతురితో వ్యభిచార* చేయిస్తోందని విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి బాలిక ఫిర్యాదు ఆధారంగా ఇప్పటికే 30 మంది కామాంధుల్ని అరెస్టు చేశారు. కేసు దర్యాప్తును కొనసాగించే కొద్దీ అనూహ్య సంఘటనలు వెలుగులోకి వస్తున్నట్లు పోలీసులు తెలిపారు.  

నేనే సీఎం.. సింహం సింగిల్‌గానే..

తెలంగాణలో అధికారంలోకి వచ్చేది తామేనని.. తానే సీఎంనని వైఎస్ షర్మిల ప్రకటించారు. తెలంగాణ ప్రజలు రాజన్న రాజ్యం కోరుకుంటున్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఎవరితో పొత్తు ఉండదని స్పష్టం చేశారు షర్మిల. టీఆర్ఎస్ చెబితేనో, బీజేపీ అడిగితేనో వచ్చిన వాళ్లం కాదంటూ క్లారిటీ ఇచ్చారు. ఏప్రిల్ 9న పాదయాత్రతో తొలి అడుగు వేద్దామన్నారు షర్మిల. పార్టీ ఏర్పాటుపై వైఎస్ షర్మిల ముమ్మర కసరత్తు చేస్తున్నారు. పది ఉమ్మడి జిల్లాల ముఖ్యనేతలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా 'సంకల్ప సభ' వాల్ పోస్టర్‌ను విడుదల చేశారు.  ఏప్రిల్ 9న, లక్ష మందితో ఖమ్మంలో తలపెట్టిన షర్మిల సభకు కొవిడ్ కారణంగా ఇబ్బందులు వస్తున్నాయి. కరోనా కేసులు పెరుగుతుండటంతో కేవలం 6వేల మందితో సభ నిర్వహించుకునేందుకు ఖమ్మం జిల్లా పోలీసులు అనుమతి ఇచ్చారు. అది కూడా కరోనా నిబంధనలు పాటిస్తూ సాయంత్రం 5 గంటల నుంచి 9 గంటలలోపే సభ జరపాలని కండీషన్ పెట్టారు. దీంతో.. సభ నిర్వహణపై ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై షర్మిల మరింత కసరత్తు చేస్తున్నారు. 

జనం కోసం జగ్గారెడ్డి ధర్నా

ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆందోళనకు దిగారు. సంగారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం నిధులు కేటాయించాలని కోరుతూ నిరసన చేపట్టారు. సంగారెడ్డికి మెడికల్‌ కాలేజీ  మంజూరు చేయాలని, నియోజకవర్గ అభివృద్ధికి వెయ్యి కోట్లు కేటాయించాలని, పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని లోయర్‌ ట్యాంక్‌బండ్‌ అంబేద్కర్‌ విగ్రహం దగ్గర తన కుమార్తె జయారెడ్డితో కలిసి నిరసన తెలిపారు. అంబేడ్కర్‌ విగ్రహం నుంచి అసెంబ్లీ వరకు పాదయాత్ర చేశారు.  నియోజకవర్గ సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడే అవకాశం రాకపోవడంతో ట్యాంక్‌ బండ్‌ అంబేడ్కర్‌ విగ్రహం నుంచి అసెంబ్లీ వరకు పాదయాత్ర చేశానన్నారు జగ్గారెడ్డి. నియోజవర్గ అభివృద్ధికి 2వేల కోట్లు ఇవ్వాలని అడిగితే సర్కారు నుంచి స్పందన లేదు. అసెంబ్లీలో మాట్లాడేందుకు మా పార్టీకి కొంచెం సమయం ఇచ్చి మైక్‌ కట్‌ చేస్తున్నారని మండిపడ్డారు. సంగారెడ్డిలో మెడికల్‌ కాలేజీ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపితే సిద్దిపేటకు తరలించారని ఆరోపించారు. 2013లో 5వేల మందికి ఇళ్ల స్థలాలు ఇస్తే.. టీఆర్ఎస్ సర్కారు వచ్చాక వారిని అక్కడి నుంచి ఖాళీ చేయించారని తప్పుబట్టారు. నియోజకవర్గంలో 40వేల మంది పేదలు ఇళ్లు లేక ఇబ్బంది పడుతుంటే.. వారందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వమంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా సర్కారు స్పందించి సంగారెడ్డి నియోజకవర్గ సమస్యలు పరిష్కరించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి డిమాండ్‌ చేశారు.  

ఉందిలే మండేకాలం..  

వర్షాకాలం, చలికాలం అయితే తట్టుకోవచ్చు గానీ , ఎండాకాలం వచ్చిందంటే బయటికి వెళ్లాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచిస్తాం. ప్రజల్లో సంవత్సరంలో ఎప్పుడు లేని ఆందోళన  ఎండాకాలంలో మొదలవుతుంది. ఏ మార్చిలో అయినా కొంచం సుర్రు మనిపించే ఎండ.. ఈ మార్చు స్టార్టింగ్లో కొంచం బుంగమూతి పెట్టిన బుట్టబొమ్మలా ఉన్న. బుంగమూతి వదిలి శివాంగి వేషం వేస్తూ చమటలు పట్టిస్తోంది. మార్చి భానుడు మనపై ఎండ బాణం సంధిస్తుంటే.. ఇక  ఏప్రిల్, మే నెలల గురించి తలుచుకుంటే చలి జ్వరం పుడుతుంది. ఇంజన్, మెటీరాలజికల్ డిపార్టుమెంట్ ఎసెస్మేషన్ ప్రకారం గతంతో పోలిస్తే ఈసారి దేశం మొత్తం ఎండలు భారీగా ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. ఓ వైపు కరోనా, మరో వైపు బయటికి వెళ్లకపోతే నడవని బతుకు బండి, మరోవైపు ఈ మూడు నెలలు మనతో ఉండే  మండే ఎండ.  ఏం చేయాలో అర్థం కాక ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.  ఈసారి తెలుగు రాష్ట్రాల్లో సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదు కానున్నట్లు సమాచారం. గత ఏడాదితో పోలిస్తే 0.71 నుంచి ఒక డిగ్రీ ఎక్కువగా ఉండనున్నాయని ఐఎండీ తెలిపింది. ఈసారి ఎండలతోపాటు వేడి గాలుల ప్రభావం చాల ఎక్కువగా ఉంటుందని  సమాచారం. కోర్ హీట్ వేవ్ జోన్‌గా పిలిచే ప్రాంతాల్లో ఎక్కువగా వడగాల్పులు వీస్తాయని తెలియవచ్చింది.  ఆఫీస్ కి వెళ్లే వాళ్ళు అయితే కొంచం పర్లేదు. చక్కగా ఏసీలో కూర్చుని వర్క్ చేసుకుంటారు. రోడ్డు మీద ఉన్న వ్యాపారుల పరిస్థితి ఆలోచిస్తే మరి దారుణంగా ఉంటుందని చెప్పాలి. ఏదేమైనా ఎండ కాలం వెళ్లే వరకు కొంచం జాగ్రత్తగా ఉండండి. 

సీఎం జగన్ రాజీనామాకు వైసీపీ నేతల డిమాండ్!

సీఎం జగన్‌ రాజీనామా చేయాలని వైసీపీ నేతలే డిమాండ్ చేస్తారన్న భయం ముఖ్యమంత్రికి పట్టుకుంది. వైసీపీ ఎంపీలే పరోక్షంగా సీబీఐ కేసులంటూ జగన్‌ను విమర్శిస్తున్నారు. ఏపీకి చెందిన వ్యక్తి నుంచి గంగవరం పోర్టును గుజరాత్ కంపెనీకి అమ్ముకున్నారు. రాష్ట్రంలో 3 కోట్ల మెట్రిక్ టన్నుల ఇసుకను ప్రైవేటుగా అమ్ముకుంటున్నారు. ఇలా సీఎం జగన్ మీద సంచలన ఆరోపణలు చేశారు వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు.    పలువురు వేసిన ముళ్ల కంచె దాటి ఎన్వీ రమణ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కాబోతున్నారన్నారు ఎంపీ రఘురామకృష్ణరాజు. ఎన్ని అడ్డంకులెదురైనా ఆయన ఏప్రిల్ 24న ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమన్నారు. ‘‘హైకోర్టు సింగిల్ జడ్జి నిమ్మగడ్డకు వ్యతిరేకంగా తీర్పు ఇస్తే రాజీనామా చేయాలన్న మా పార్టీ మంత్రులు..  సుప్రీంకోర్టులో ప్రస్తుతం సీఎంకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది కాబట్టి..  మా పార్టీ నేతలు సీఎం రాజీనామా అడుగుతారేమో అన్న భయం పట్టుకుందన్నారు.  నేను సీబీఐ విచారణ నుంచి తప్పుకుంటున్నానని మా పార్టీ నేతలు మాట్లాడుతున్నారని చెప్పారు.  ప్రతీ శుక్రవారం ఏదో కార్యక్రమం పెట్టుకుని సీబీఐ విచారణకు వెళ్లకుండా ఉంటున్న మా సీఎంను.. మా ఎంపీలే పరోక్షంగా నా పేరుమీద ఆయనను విమర్శిస్తున్నారనే బాధకలుగుతుంది’’ అని రఘురామకృష్ణరాజు అన్నారు. రాష్టంలో 5 కోట్ల మెట్రిక్ టన్నుల ఇసుక డిమాండ్ ఉండగా.. కేవలం 2 కోట్ల డిమాండ్ చూపించి, మిగతా 3 కోట్ల మెట్రిక్ టన్నుల ఇసుకను ప్రైవేటుగా అమ్మకునేలా పని చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీకి చెందిన ఓ వ్యక్తి నుంచి గంగవరం పోర్టును గుజరాత్ కంపెనీకి అమ్ముకుంటే భాదగా ఉందన్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఈ రాష్ట్రాన్ని ఎలా బయటకు తీసుకు వస్తారు? అని జగన్‌ను ప్రశ్నించారు. అదాని, అంబానీలకు రాష్ట్రాన్ని అప్పగిస్తారేమోనన్న అనుమానం కలుగుతుందన్నారు వైసీపీ ఎంపీ  రఘురామకృష్ణరాజు.  

అమ్మను తిట్టి.. అన్నం పెట్టి.. మృత్యువాత 

తప్పు చేసిన వాడిని ఆ దేవుడే శిక్షిస్తాడు అనే మాట తరచు వింటుంటాం.. కానీ ఈ సంఘటన చూశాక అది నిజమనే  అనుకుంటాం. కొన్ని తప్పులకు సంవత్సరాలైనా శిక్షలు పడవు. కొన్నీ తప్పులకు వెంటనే శిక్షలు పడుతుంటాయి. రోజురోజుకు జనాలకు నోటి దురుసు ఎక్కువ అవుతుంది.. అలా నోటి దురుసు ఉన్న కానిస్టేబుల్ కి ఏమైంది ఒక్కసారి మీరే చూడండి..  ఖాకీలైన  కామన్ మ్యాన్ అయినా.. ఖద్దరు వేసేవాళ్ళైనా  మందు మందే వేస్తే ఢిల్లీ రాజకీయాల నుండి మొదలుకుని.. గల్లీ వరకు మాట్లాడుకుంటారు.  అక్కడి వరకు మాట్లాడుకుంటే అందరికి మంచిదే.. కానీ మద్యం మత్తులో ఇంట్లో వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడితే ఎలా ఉంటుంది. చీము నెత్తురు ఉన్న ఏ మగాడికైనా రక్తం మరుగుతుంది.. ఆ తర్వాత గొడవ మొదలవుతుంది.  ముగ్గురు కానిస్టేబుల్స్ మందు పార్టీ చేసుకున్నారు. ఆ విందులో తోటి కానిస్టేబుల్ పట్ల మరో కానిస్టేబుల్ నోరు జారాడు. దీంతో జరిగిన తప్పిదాన్ని క్షమాపణ కోరాలనుకున్నాడు. చివరికి  హెడ్ కానిస్టేబుల్ బకెట్ తన్నేశాడు.  నిజామాబాద్ జిల్లాలో జరిగిన ఈ ఘటన జరిగింది. వివ‌రాలు ఇలా ఉన్నాయి. నిర్మల్ జిల్లా బైంసా మండలం గ్రామానికి చెందిన సత్యపాల్ రెడ్డి నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి పోలీస్ బెటాలియన్ లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నారు. డిచ్ ప‌ల్లి బెటాలియన్ లో స‌త్యపాల్ రెడ్డి, సంతోష్ తో పాటు మరో ఇద్దరు కలిసి విందు చేసుకున్నారు. మద్యం తాగుతున్న సమయంలో సంతోష్ తల్లిని సత్యపాల్ రెడ్డి దూషించారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.  అయితే సంతోష్ త‌ల్లికి క్షమాపణలు చెప్పేందుకు సత్యపాల్ రెడ్డి బెటాలియన్ నుంచి రాత్రి 10 గంటల సమయంలో నందిపేట్ మండలం సిద్ధాపూర్ గ్రామానికి ద్విచ‌క్ర వాహ‌నం పై బయలుదేరాడు.. సిద్ధాపూర్ కు చేరుకున్న సత్యపాల్ రెడ్డి  ’మద్యం మత్తులో వాగాను తనను క్షమించమని సంతోష్ తల్లికి కోరాడు. తప్పయిపోయిందని  క్షమించమ్మా‘ అని వేడుకున్నాడు. ఎంతైనా తల్లి మనసు కదా  ఆ తల్లి కూడా సంతోషంగా క్షమించింది. బోజ‌నం కూడా పెట్టింది. భోజనం చేసి  అక్కడి నుంచి  సత్యపాల్ రెడ్డి బయల్దేరాడు. తన  ఫోన్ స్విచాఫ్ రావడంతో ఆనుమానం వ‌చ్చి తోటి కానిస్టేబుల్ స‌త్యపాల్ ను వెతుక్కుంటూ వ‌చ్చారు.. బుధవారం వేకువజామున సత్యపాల్ రెడ్డి బైక్ మాచర్ల శివారులోని రోడ్డు పక్కన ప‌డివుంది. అయితే రోడ్డు పక్కనే వ్యవసాయ బావి ఉండడంతో వారు డ‌య‌ల్ 100కు సమాచారం అందించారు. ఆర్మూర్ పోలీసులు  ఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సహాయంతో వ్యవసాయ బావిలో గాలించగా సత్యపాల్ రెడ్డి మృతదేహం లభించింది. ఘ‌ట‌న‌ స్థలంలో బైక్ అదుపు త‌ప్పిన ఆధారాలు కనిపించడంతో.  సత్యపాల్ రెడ్డి బైక్ అదుపుతప్పి  పక్కనే ఉన్న వ్యవసాయ బావిలో పడి మృతి చెంది ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. సత్యపాల్ రెడ్డి మృతిపై అనుమానాలు ఉన్నట్లు కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ తెలిపారు. మృతుడికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. 

రాజీనామాపై తేల్చండి.. స్పీకర్‌ను కలిసిన గంటా

రాజీనామా ఆమోదించుకోవడంపై టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు దూకుడు పెంచారు. శ్రీకాకుళం జిల్లాలో స్పీకర్ తమ్మినేని సీతారాంను కలిశారు. తన రాజీనామా లేఖను ఆమోదించాలని కోరారు. గంటా అభ్యర్థనను విన్న స్పీకర్.. వారం రోజుల్లో అమరావతి వెళ్లి పరిశీలిస్తానని స్పీకర్ తమ్మినేని చెప్పారు.  స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిరసిస్తూ టీడీపీకి చెందిన విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఇప్పటికే తన పదవికి రాజీనామా చేశారు. మొదట చేసిన రాజీనామా స్పీకర్ ఫార్మాట్‌లో లేకపోవడంతో, మరోసారి స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా లేఖను తమ్మినేని సీతారంకు పంపించారు. అయితే, గంటా రాజీనామాపై స్పీకర్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం గంటా రాజీనామా స్పీకర్ పరిశీలనలో ఉంది. అందుకే, తన రాజీనామాను ఆమోదించాలంటూ స్పీకర్‌ను కలిసి విన్నవించారు గంటా. రాజీనామాల ద్వారానే కేంద్రంపై రాజకీయ ఒత్తిడి పెరుగుతుందన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గేదాకా ఉద్యమాన్ని విరమించేది లేదన్నారు గంటా శ్రీనివాసరావు.

వైష్ణో దేవికి 1800 కేజీల గోల్డ్  

జమ్ము కశ్మీర్‌లోని ప్రముఖ వైష్ణోదేవి దేవాలయానికి గత 20  ఏళ్లలో 1,800 కేజీల బంగారం విరాళంగా వచ్చిందని సమాచారహక్కు చట్టం ద్వారా తెలిసింది. బంగారంతోపాటు 4,700 కిలోల వెండి, రూ.2000 కోట్ల నగదు ఆలయానికి అందాయని వెల్లడైంది. సామాజిక కార్యకర్త హేమంత్‌ గునియా స.హ చట్టం కింద చేసిన దరఖాస్తు ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వర్షాకాలం రానున్న తరుణంలో  ఆలయ బోర్డు ఈ డబ్బును సందర్శకులకు  వసతులు కల్పించేందుకు ఉపయోగించాలి. ఈ ఆదాయాన్ని ప్రభుత్వ పాఠశాలల నిర్మాణానికి కూడా ఉపయోగించవచ్చు’ అని హేమంత్‌ గునియా తెలిపారు. ఆలయానికి భక్తుల తాకిడి గతేడాది భారీగా తగ్గిందని ఆర్టీఐ దరఖాస్తు ద్వారా తెలిసింది. కరోనా కారణంగా 2020లో కేవలం 17 లక్షల మందే ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శించారు అని తెలిపింది. .     

ఎయిర్‌పోర్టు.. భూములకు పోటు?

కర్నూలు జిల్లా ఓర్వకల్లులో విమానాశ్రయం. జాతికి అంకితం చేసిన సీఎం జగన్. ఎయిర్‌పోర్టుకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు. 1,008 ఎకరాల్లో.. 153కోట్లతో రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా నిర్మించింది. ప్రారంభోత్సవానికి కేంద్ర ఏవియేషన్ శాఖ తరఫున ఎవరూ హాజరుకాలేదు. కేంద్ర ప్రమేయం లేకుండా కర్నూలులో ఎయిర్‌పోర్టు కట్టడమేంటి? ఏదో తేడాగా ఉందంటున్నాయి ప్రతిపక్షాలు. ప్రస్తుతం ప్రభుత్వ ఖజానా ఖాళీ. అవసరం ఉన్నా లేకపోయినా ఇబ్బడిముబ్బడిగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకే సొమ్ములు లేవు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వడమూ కష్టమవుతోంది. ఇలాంటి ఆర్థిక సంక్లిష్ట పరిస్థితుల్లో హడావుడిగా ఎయిర్‌పోర్టు నిర్మించడం వెనక వేరే మతలబు ఉందంటున్నారు. న్యాయ రాజధాని కర్నూలు నుంచి ఇతర రాష్ట్రాలకు రాకపోకలు సాగేలా ఓర్వకల్లు విమానాశ్రయం ఉపయోగపడుతుందన్నారు జగన్. ఇంకా మూడు రాజధానుల వివాదం కొలిక్కిరానే లేదు. కర్నూలులో న్యాయ రాజధానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. కోర్టు తరలింపు ప్రక్రియపైనా నిషేధం కొనసాగుతోంది. ఆలూలేదు సూలూ లేదు.. ఇంకా న్యాయ రాజధాని నిర్మాణమే జరగలేదు.. అలాంటిది అప్పుడే ఇంత అర్జెంట్‌గా ఎయిర్‌పోర్ట్ రెడీ చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు. కర్నూలుకు సమీపంలోనే ఒకవైపు బెంగళూరు విమానాశ్రయం, మరోవైపు శంషాబాద్ ఎయిర్‌పోర్టు.. మధ్యలో ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుతో పనేంటి? అంటే, విమానాశ్రయం ముసుగులో భూముల వ్యాపారం చేసేందుకే ఇదంతా చేస్తున్నారనేది ప్రతిపక్షాల ఆరోపణ.  వెయ్యి ఎకరాల్లో విమానాశ్రయం అనగానే కర్నూలు చుట్టూ భూముల ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఓర్వకల్లు సమీప ప్రాంతాల్లో ప్రభుత్వ భూములూ భారీగా ఉన్నాయి. ఎయిర్‌పోర్టు రావడంతో ప్రభుత్వ స్థలాల ధరలూ పెరిగాయి. ఇలా ధరలు పెంచేసి.. ఆ తర్వాత భూములు అమ్మేసి.. భారీగా ఆదాయం దండుకోవాలనేది సర్కారు కుతంత్రమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అటు, ప్రభుత్వ భూములతో పాటు ప్రైవేటు స్థలాల ధరలూ ఆకాశాన్నంటుతున్నాయి. అయితే, ఆ భూములన్నీ ఇప్పటికే వైసీపీ నేతల ఆధీనంలో ఉన్నాయని.. తమ వారికి మేలు చేసేందుకే విమానాశ్రయం తీసుకొచ్చారని చెబుతున్నారు. ఇలా, ప్రభుత్వ, ప్రైవేటు భూముల ధరలు పెంచేసి.. ఆ తర్వాత వాటిని అమ్మేసేందుకే.. ఇంత హడావుడిగా ఓర్వకల్లు విమానాశ్రయాన్ని రెడీ చేశారని అంటున్నాయి విపక్షాలు. 

ముఖ్యమంత్రి కి సుప్రీం ‘ఛీ’వాట్లు

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, సుప్రీం కోర్టు న్యాయమూర్తి, జస్టిస్ ఎన్వీ రమణ పై చేసిన ఫిర్యాదును, సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి, గత సంవత్సరం అక్టోబర్ 6 వ తేదీన, జస్టిస్ ఎన్వీ రమణతో పాటుగా, ఆంధ్ర ప్రదేశ్ హై కోర్టు న్యాయమూర్తుల పై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఎబాబ్డేకు ఫిర్యాదు చేశారు. అందులో జగన్మోహన రెడ్డి, జస్టిస్ రమణ కుటుంబ సభ్యులు అమరావతి భూములకు సంబంధించి అవకతవకలకు పాల్పడ్డారని, అదే విధంగా రాష్ట్ర హై కోర్టు న్యాయమూర్తులు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు ఇచ్చేలా జస్టిస్ ఎన్వీ రమణ వారిని ప్రభావితం చేస్తున్నారని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి ఫిర్యాదును అంతర్గత నిబంధనల ప్రకారం సమూలంగా పరీక్షించిన న్యాయస్థానం, ఫిర్యాదును కొట్టివేసిందని సుప్రీం కోర్టు బుధవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. జగన్మోహన్ రెడ్డి తమ ఫిర్యాదులో జస్టిస్ ఎన్వీ రమణ ఇతర న్యాయమూర్తులపై చేసిన ఆరోపణలు, పూర్తిగా నిరాధారమైననవి, అల్పమైనవి, తుచ్చమైనవి, అసత్యమైనవి న్యాయస్థానం చాలా తీవ్రంగా ముఖ్యమంత్రి దురుద్దేశాలను ఎండగట్టింది. అంతేకాదు, జగన్మోహన రెడ్డి న్యాయవ్యవస్థను బెదిరించేందుకు ఉద్దేశపూర్వకంగా నిరాధారమైన ఆరోపణలు చేశారని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. న్యాయవ్యవస్థను బెదిరించే ప్రయత్నం చేయడమంటే సామాన్య మైన విషయం కాదు. అదీకాక, జస్టిస్ రమణ పై జగన్మోహన్ రెడ్డి ఫిర్యాదుకున్న నేపధ్యాన్ని గమనిస్తే, అనేక అవినీతి కేసుల్లో ముద్దాయిగా ఉన్నఆయన, ఎదో తెలియని భయంతో ఆరోపణలు చేశారన్న అభిప్రాయం సహజంగానే ఎవరికైనా కలుగుతుంది. జగన్మోహన్ రెడ్డిపై ఇంచుమించుగా ఓ డజన్ వరకు క్రిమినల్ కేసులు, సిబిఐ, ఈడీ విచారణలో ఉన్నాయి. ఆయన జైలు జీవితం అనుభవించారు. అయన ఆస్తులను జప్తు చేయడం జరిగింది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. మరోవంక జగన్మోహన్ రెడ్డి ఫిర్యాదుకు కొద్ది రోజుల ముందు, జస్టిస్ ఎన్వీ రమణ సారధ్యంలోని ధర్మాసనం, న్యాయవ్యవస్థ పట్ల ప్రజలలో విశ్వాసం పెంచేందుకు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీలు ఇతర ప్రజాప్రతినిధులపై సుదీర్ఘకాలంగా పెండింగ్’లో ఉన్న క్రిమినల్ కేసుల విచారణను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించింది. జస్టిస్ ఎన్వీ రమణ అదేశాలే, జగన్ రెడ్డి, ఫిర్యాదుకు మూలకారణమని చాలామంది భావిస్తున్నారు. అలాగే, న్యాయమూర్తి కాకముందు, న్యాయవాదిగా ఎన్వీ రమణకు మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగా చంద్రబాబుతో తమకున్న వైరం కారణంగాను జస్టిస్ రమణపై జగన్ రెడ్డి ఫిర్యాదు చేసి ఉండవచ్చునని అంటున్నారు. అయితే ఇప్పుడు ఆయన ఎందుకు ఫిర్యాదు చేశారన్నది కాదు.ప్రధాన న్యాయమూర్తి ప్రకటన ప్రకారం న్యాయవ్యవస్థను భయపెట్టే ఉద్దేశంతో న్యాయమూర్తులపై, ప్రధాన న్యాయమూర్తి కానున్న జస్టిస్ ఎన్వీ రమణ పై నిరాధారమైన ఆరోపణలు చేసిన వ్యక్తిపై సర్వోనంత నాయస్థానం ఎందుకు చర్యలు తీసుకోలేదు అనేది, అనేకమందికి కలుగు తున్న అనుమానం.ఫిర్యాదు చేసిన వ్యక్తి కీలక పదివిలో ఉన్నారు. ఆయన ఫిర్యాదు చేసింది సమాన్య వ్యక్తి పై కాదు. కొద్ది రోజుల్లో భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టన్నున్న న్యాయమూర్తి పై ఆయన అసాధారణ రీతిలో ఫిర్యాదు చేశారు. అయన చేసిన ఫిర్యదు దురుద్దేశ పూరితం అయినప్పుడు న్యాయస్థానం చర్యలు తీసుకుంటుంది ఎవరైనా భావిస్తారు. అలాంటిది ఏమీ లేక పోతే, సామాన్యులకు చాలా సందేహలు కలుగుతాయి. అలాగే, అనేక క్రిమినల్ కేసులు ఎదుర్కుంటూ, ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తి, న్యాయవ్యవస్థపై చేసిన ఫిర్యాదు, పూర్తిగా అసత్యం, నిరాధారం, అన్నిట్నీ మించి ఉద్దేసపూర్వకంగా చేసిన ఫిర్యాదుగా సర్వోన్నత న్యాయస్థానం నిరూపించిన తర్వాత అయిన ఏమి చేయాలి? కనీసం న్యాయస్థానానికి బహిరంగ క్షమాపణలు చెప్పాలి, తప్పోప్పుకుని, పదవికి రాజీనామ చేయాలి... కానీ, నవ్విపోదురు గాక నాకేటి సిగ్గను కుని తుడిచేసుకుపోతే.. అది ఆయనకేమో కానీ, ఆయన పదవికి మాత్రం అవమానం.

ఎన్నికల కోసమేనా.. హోదా చర్చ

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని ఇంకా ఎవరైనా అనుకుంటున్నారా, ఆశిస్తున్నారా, అంటే లేదు. సామాన్య ప్రజలనుంచి పార్లమెంట్ సభ్యుల వరకు అందరికీ, ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రానికి హోదా రాదన్న నిజం తెలుసు. అయినా పార్లమెంట్’లోపల వెలుపల, ముఖ్యంగా మీడియాలో హోదా పై చర్చ జోరుగా సాగుతోంది, ఎందుకు, అంటే, అదే రాజకీయం. ఎన్నికల సమయంలో సెంటిమెంట్స్ ను సొమ్ము చేసుకోవడం, రాజకీయ పార్టీలు అలవాటుగా మలచు కున్నాయి. ఇటీవల తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎప్పుడో మూలన పడిన ఐటీఐఆర్, ఖాజీపేట కోచ్ ఫ్యాక్టరీ అంశాలను తెరాస తెర మీదకు తీసుకువచ్చింది. ఎన్నికల క్రతువు ముగిసన వెంటనే ఆ అంశాలు పక్కకు పోయాయి. ఇప్పుడు ఏపీలో జరుగ్తునండి కూడా అదే. తిరుపతి లోక్ సభ స్థానానికి ఉప ఎన్నిక జరుగతున్న నేపధ్యంలోనే హోదా అంశాన్ని మళ్ళీ తెర మీదకు తీసుకు వచ్చే ప్రయత్నం అటు రాజకీయ పార్టీలు, ఇటు మీడియా చేస్తున్నాయి. కేవలం ఉప ఎన్నికలో ప్రయోజనం కోసం మాత్రమే హోదా అంశాన్ని మళ్ళీ చర్చకు తెస్తున్నారని, వేరే చెప్పనక్కరలేదు. ఇందులో భాగంగానే,లోక్ సభలో తెలుగు దేశం పార్టీ సభ్యుడు కింజారపు రామ్మోహన నాయుడు హోదాఅంశాన్ని ప్రస్తావించారు కేంద్ర ప్రభుత్వం స్టాండర్డ్ రిప్లై ఇచ్చింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధ్యం కాదని మరో మారు తెగేసి చెప్పింది. రామ్మోహననాయుడు ప్రశ్నకు హోం శాఖ సహాయ మంత్రి నిద్యానంద రాయ్, ఎప్పటిలానే, 14 ఆర్థిక సంఘాన్ని అడ్డుపెట్టుకుని, ఆర్థిక సంఘం హోదాకు ఎప్పుడొనే మంగళం పాడేసిందని, ఇక పై ఏ రాష్ట్రానికీ, ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని అరుణ జైట్లీ, నిర్మలా సీతారామాన్, సహా అనేక మంది కేంద్ర మంత్రులు గతంలో చెప్పిన సమదానాన్నే, మళ్ళీ మరో మరు రీప్లే చేశారు. నిజానికి,హోదా ముగిసిన అధ్యాయమని ఎప్పుడోనే చెప్పిన కేంద్ర ప్రభుత్వం అప్పటినుంచి ఇప్పటి వరకు ఎవరు ఎన్ని విధాల అడిగినా అదే సమాధానం ఇస్తోంది.అయినా ఆంధ్ర ప్రదేశ్ అధికార, ప్రతిపక్ష పార్టీల ఎంపీలు అవసరం చిక్కిన ప్రతి సంవత్సరంలోనూ హోదా ప్రస్తావన చేస్తూనే ఉన్నారు. ఒక్క హోదా విషయంలోనే కాదు, విభజన హామీలకు సంబందించిన ఇతరత్రా అంశాలను కూడా అడగడం కాదనిపించుకోవడం,కాదంటే, తాజాగా నిద్యానంద రాయి చెప్పినట్లుగా ఇచ్చినవేవో ఇచ్చాం, ఇవ్వవలసినవి ఏవో ఇస్తాం, ఈలోగా, ఉభయ తెలుగు రాష్ట్రాలు చర్చించుకుని ఇచ్చి పుచ్చుకోవడాలు పూర్తి చేసుకోవడాలు కానిచ్చుకోండని కేంద్రం ఎప్పటికప్పుడు చేతులు కడిగేసుకుంటోంది. ఇప్పుడు కూడా అదే పని చేసింది. అయినా రాష్ట్ర రాజకీయాలలో ప్రధాన ప్రత్యర్ధి పార్టీలు రెండూ కూడా హోదాను అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తూనే ఉన్నాయి. అది కూడా కేవలం ఎన్నికల సమయంలో, ఒక తురుపు ముక్కగా వాడుకుంటున్నాయి. నిజానికి హోదా విషయంలో కానీ, ఇతరత్రా రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కానీ, అధికార, ప్రతిపక్ష పార్టీలకు పెద్దగాపట్టింపు లేదు. రాజకీయాలకు ఇచ్చిన ప్రాధాన్యత రాష్ట్ర రాజకీయాలకు ఇవ్వక పోవడం వల్లనే, ఈ పరిస్థితి వచ్చిందని అందరికీ తెలుసు. అయినా, ఎన్నికలు రాగానే, హోదా, గుర్తుకువస్తోంది. రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీల మధ్య రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కనీసపాటి సయోధ్యత లేక పోవడం కూడా అందుకో ప్రధాన కారణం.ఇప్పుదు కాదు, విభజనకు ముందు నుంచి కూడా ఆంధ్ర ప్రాంత రాజకీయ పార్టీల ధోరణి, ఎడ్డెమంటే తెడ్డెమన్నట్లే సాగుతోంది. రాష్ట్ర విభజన తర్వాత పరిస్థితి గురుంచి వేరే చెప్పనక్కర లేదు. రాష్ట్రాన్ని పాలించిన, పాలిస్తున్న ప్రాంతీయ పార్టీలి టీడీపీ , వైసీపీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి కనిపిస్తూనే ఉంది. మంచి చెడులు, విచక్షణ లేకుండా ఒకరు అవునన్నది ఇంకొకరు కాదనడం, ఒకరు కాదన్నది ఇంకొకరు అవుననడం చూస్తూనే ఉన్నాం. నిజానికి, సాకేతికంగా చూస్తే, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ముగిసిన అధ్యాయం అని కేంద్రం చెప్పడం కాదు, టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే కేంద్ర ప్రభుత్వం హోదాకు ప్రత్యాన్మాయంగా ప్రతిపాదించిన ప్రత్యేక ప్యాకేజికి ఆమోదం తెలుపుతూ శాసన సభ తీర్మానం చేసింది.ఆ తీర్మానంతోనే హోదా కథ ముగిసింది. బయట లోపలా ఎవరైనా ఏదైనా మాట్లడ వచ్చును, కానీ, అసెంబ్లీ తీర్మానమే ఫైనల్, అదే శాసనం.ఆ తీర్మానం ఆధారంగానే కేంద్ర ప్రభుత్వం కానీ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కానీ, హోదా ముగిసిన అధ్యాయమని చెప్పగలుగుతున్నాయి. ఇప్పటికైనా, హోదా కాకపోయినా, కనీసం విభజన చట్టంలోని ఇతర హామీలు అయినా అమలుకావాలంటే, రాష్ట్ర రాజకీయాలలో కీలక పాత్రను పోషిస్తున్న వైసీపీ, టీడీపీ, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కౌరవ, పాండవులు లాగా, ఉమ్మడి వ్యూహంతో ముందుకు వెళితే ఏదైనా ప్రయోజనం చేకూరుతుంది.

ఓయూలో ఉద్రిక్తత.. స్టూడెంట్స్ ఆందోళన

ఉస్మానియా యూనివర్సిటీ ఉద్రిక్తంగా మారింది. విద్యార్థులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు. వర్సిటీ సిబ్బందితో గొడవ పడుతున్నారు. పోలీసులు వచ్చినా పట్టు వీడటం లేదు. ఇంతకి ఓయూ విద్యార్థుల ఆందోళనకు కారణం ఏంటో తెలుసా? స్టూడెంట్స్ ఆందోళన ఏ ఉద్యమం కోసమో, ఉద్యోగాల కోసమో కాదు. హాస్టల్ కోసం. అవును, తమను హాస్టల్స్‌లో ఉండనీయాలంటూ విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. యూనివర్సిటీని ఉద్రిక్తంగా మార్చేశారు.   కరోనా విజృంభిస్తున్న కారణంగా తెలంగాణ‌ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యాసంస్థ‌లు బంద్. ఆ మేరకు ప్రభుత్వం ఉత్తర్వ్యులు జారీ చేసింది. అందులో భాగంగా ఓయూలో కాలేజీలు, హాస్టళ్లు, క్యాంటీన్లు మూసేస్తున్నారు వర్సిటీ అధికారులు. అయితే.. ఈ నిర్ణయాన్ని విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికిప్పుడు హాస్టల్స్ క్లోజ్ చేస్తే తాము ఎక్కడికి వెళ్లాలంటూ ప్రశ్నిస్తున్నారు. క్యాంటిన్స్ మూసేస్తే తమ పరిస్థితి ఏంటంటూ నిలదీస్తున్నారు. అందుకే, కాలేజీలు మూసినా పర్వాలేదు కానీ, హాస్టల్స్, క్యాంటీన్స్ బంద్ చేస్తే ఊరుకునేది లేదని గొడవ చేస్తున్నారు. హాస్టల్ గదులను ఖాళీ చేయించేందుకు అధికారులు ప్రయత్నిస్తే.. అందుకు విద్యార్థులు సహకరించడం లేదు. ఓయూ సిబ్బంది చర్యలకు నిరసనగా విద్యార్థి సంఘాలు వర్సిటీలో ఆందోళ‌న‌కు దిగాయి.  కరోనా కేసులు పెరుగుతున్నందున ప్రభుత్వ ఆదేశాల మేరకు హాస్టల్స్, మెస్ క్లోజ్ చేస్తున్నామని అందుకు స్టూడెంట్స్ సహకరించాలని అధికారులు కోరుతున్నారు. విద్యార్థులు మాత్రం అందుకు ఒప్పుకునేది లేదని, హాస్టల్స్‌లోనే ఉంటామంటూ పట్టుబడుతున్నారు. హైదరాబాద్‌లో ప్రైవేట్ హాస్టల్స్ యధావిధిగా నడుస్తున్నా పట్టించుకోవడం లేదు కానీ, పేద విద్యార్థులు ఉండే ఉస్మానియా హాస్టల్స్‌ను మాత్రం బలవంతంగా మూసి వేయడం ఏంటని నిలదీస్తున్నారు. బార్లు, వైన్లు, మాళ్లు, థియేటర్లలో లేని కరోనా రూల్స్.. ఓయూ హాస్టల్స్‌కే వర్తిస్తాయా? అంటూ విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. విద్యార్థుల ఆందోళనతో పోలీసులు క్యాంపస్‌కు వచ్చి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. 

చెత్త కోసం.. అతను సైతం.. 

ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని అనుకుంటే తప్పు. మన సమస్యల కోసం మనమే గళం విప్పాలి. కానీ కొందరు మాత్రం అలా అనుకోరు ఆ సమస్య ఏదైనా దానిపైన వారి సంతకం ఉండాలనుకుంటారు . వ్యక్తులు అలాంటి వారే సమస్యలపై తన నినాదపు గళాలు వినిపిస్తారు. తాజాగా హైదరాబాద్ లో ఓ కార్పొరేటర్ భర్త స్థానికంగా ఉన్న సమస్యపై తన స్థానికులతో కలిసి తన గళం వినిపించారు. సమస్య పరిష్కారానికి మార్గం వేశారు.   బేగంపేట లో పారిశుధ్య సమస్య తీవ్రంగా ఉంది.. చెత్త కుప్పలు తొలగించడం లేదు.. ఓట్లు వేసి గెలిపిస్తే సమస్యను పట్టించుకోరా అంటూ రెండు రోజుల క్రితం పాదయాత్రకు వచ్చిన సోమాజిగూడ కార్పొరేటర్‌, అధికారులపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేటర్‌ డిప్యూటీ కమిషనర్‌తో కలిసి మంగళవారం బీఎస్‌ మక్తాలో పర్యటించారు. వారం రోజులుగా చెత్త తొలగించకపోవడంతో డంపింగ్‌ యార్డుగా మారిందని డిప్యూటీ కమిషనర్‌కు వారు వివరించడంతో సమస్య తీరినట్టే అనుకున్నారు. ఆ ప్రాంతానికి కార్పొరేటర్‌ భర్త వనం శ్రీనివా‌స్‌యాదవ్‌ తన అనుచరులతో వెళ్లి అక్కడే ఉన్న  చెత్త మధ్యలో స్టూల్‌ వేసుకుని అక్కడే కూర్చొని నిరసన తెలిపారు. ఎమ్మెల్యే దానం నాగేందర్‌తోపాటు జీహెచ్‌ఎంసీ అధికారులకు విషయం చేరింది. కార్పొరేటర్‌ భర్త శ్రీనివా్‌సయాదవ్‌ ఎంఎస్‌ మక్తాలో నిరసన తెలుపుతున్నారనే విషయం సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అయింది. స్పందించిన శానిటేషన్‌ అధికారులు బుధవారం మధ్యాహ్నం చెత్తను తొలగించారు. ఖైరతాబాద్‌ నియోజకవర్గంలోని పలు డివిజన్లలో కూడా శానిటేషన్‌ సమస్య తీవ్రంగా ఉందని. కరోనా విజృంభిస్తున్న తరుణంలో  జీహెచ్‌ఎంసీ   అధికారులు ఇలా అంటి ముట్టనట్లు ఉండడం సరి కాదని ఆయన అన్నారు

అబద్దం.. అంతా అబద్దం.. అసైన్డ్ భూముల కేసులో సంచలనం

అమరావతి అసైన్డ్ భూముల కేసులో అనేక తప్పిదాలు. ప్రతిపక్ష నేత చంద్రబాబును ఇరికించేందకు చేయని కుట్రంటూ లేదు. సీఐడీకి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చేసిన ఫిర్యాదులో ఉన్న కందా పావని, ఈపూరి సుబ్బయ్య, అద్దేపల్లి సాంబశివరావు తదితరులు సంచలన విషయాలు బయటపెట్టారు. తాము ఆ కేసు పెట్టలేదంటూ తేల్చి చెప్పారు. విచారణ పేరుతో తమ వద్దకు కొందరు వచ్చారని, భూమి అమ్మారా లేదా అని నిర్ధారించుకుంటున్నామంటూ సంతకాలు పెట్టించుకున్నారన్నారు. తాను ఓసీ అని చెప్పారు. భూమి తాము అమ్ముకున్నామని నిర్ధారిస్తున్నామంటే సంతకం చేశామన్నారు. దాన్ని కేసుగా నమోదు చేశారని చెప్పారు. కేసు కోసం అంటే అసలు తాము సంతకాలే పెట్టేవాళ్ళం కాదన్నారు కందా పావని.  సీఐడీ వాళ్లు వచ్చారు. మీరు పొలం ఇచ్చారా అని అడిగితే అమ్మినట్టు చెప్పామన్నారు అద్దెపల్లి సాంబశివరావు. కొన్నాయన తనకు మళ్లీ భూమి ఇవ్వలేదని, పార్టీ అంశమే తమ దగ్గరకు రాలేదన్నారు. బలవంతంగా లాక్కురన్న మాటలేదన్నారు. బలవంతంగా లాక్కున్నారా అని అడిగారు. అదేమీ లేదని చెప్పామని, కొన్నవాళ్లు ఇస్తారేమోనని అడిగామని, కానీ ఇవ్వలేదన్నారు. తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో కూడా జరిగిందే చెప్పామన్నారు సాంబశివరావు. వీరికి సంబంధించిన వీడియోలను టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర బయటపెట్టారు. అసైన్డ్ భూముల కేసులో వైసీపీ సర్కార్‌ కుట్రలకు పాల్పడిందని నరేంద్ర ఆరోపించారు. మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిపై.. రక్తకన్నీరు నాగభూషణాన్ని మించి నటిస్తున్నారని, అసైన్డ్ భూములుల విషయంలో ఆయన నటనకు ఆస్కార్‌ను మించిన అవార్డులు ఇవ్వొచ్చని ఎద్దేవా చేశారు. ఆళ్ల రామకృష్ణా రెడ్డి చేసిన ఫిర్యాదులో పేర్కొన్న కందా పావని, అద్దెపల్లి సాంబశివరావు తదితరులకు మాయమాటలు చెప్పి సంతకాలు సేకరించారంటూ వీడియోలను ధూళిపాళ్ల బయటపెట్టారు. జగన్ బృందం తప్పుడు సాక్ష్యాలు సృష్టించిందన్నారు. ఆర్కే ఫిర్యాదులో పేర్కొన్నట్లు ఎస్సీలు ఎవరు లేరని, బాధితులు లేరని ఆయన తెలిపారు. సీఐడీ యంత్రాంగంలో ఉన్నవారు వైసీపీ కార్యకర్తల కంటే ఎక్కువ పని చేస్తున్నారని విమర్శించారు ధూళిపాళ్ల నరేంద్ర.