modi mother hiraben hospitalised

మోడీ తల్లి హీరాబెన్ కు అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిక

ప్రధాని మోడీ తల్లి హీరాబెన్ మోడీ ఆసుపత్రిలో చేరారు. వందేళ్ల ఏళ్ల హీరాబెన్ ఆరోగ్యంక్షీణించడంతో ఆమెను హుటాహుటిన అహ్మాదాబాద్ లోని   యుఎన్ మెహతా ఆసుపత్రికి తరలించారు.    ప్రధాని సోదరుడు ప్రహ్లాద్ మోడీ, ఆయన కుటుంబసభ్యులు మైసూరు వద్ద మంగళవారం (డిసెంబర్ 27) జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఈ వార్త విని తీవ్ర ఆందోళనకు గురైన హీరాబెన్ మోడీ అస్వస్థతకు గురయ్యారు. ఇటీవలి గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో  మోడీ తన తల్లిని గాంధీనగర్ లోని స్వగృహంలో కలిశారు. జూన్ 18వ తేదీన ఆమె 100వ పుట్టినరోజు జరుపుకున్న సంగతి విదితమే. కాగా అస్వస్థతకు గురైన తన తల్లిని చూసేందుకు మోదీ అహ్మదాబాద్ కు వెళ్లనున్నారు. 

jagan to change yv subbareddy from ttd chairman post

ఈ బాబాయికీ పోటు తప్పదా?

తిరుమల శ్రీవారి సన్నిధి నుంచి వైవీ సుబ్బారెడ్డిని సాగనంపేందుకు వైకుంఠ ఏకదశి సాక్షిగా ముహుర్తం ఖరారు అయినట్లు వైసీపీ శ్రేణుల్లో గట్టిగా వినిపిస్తోంది.  కొత్త సంవత్సరం.. ఆ మరునాడే వైకుంఠ ఏకదశి రావడం.. దీంతో తిరుమల కొండపై భక్తులు పోటెత్తనున్నారు. ఈ నేపథ్యంలో కొండపై భక్తుల హడావుడి తగ్గగానే.. టీటీడీ బోర్డు చైర్మన్ పదవికీ వైవీ సుబ్బారెడ్డి రాజీనామా చేస్తారన్న ప్రచారం జరుగుతోంది.  సుబ్బారెడ్డి స్థానంలో  పల్నాడు జిల్లాకు చెందిన ఓ బీసీ నేతకు టీటీడీ చైర్మన్ పదవిని కట్టబెట్టాలని జగన్ ఒక నిర్ణయానికి వచ్చారనీ,  మఘమాసంలో..ఓ మంచి ముహూర్తంలో ఆయన పేరును ప్రకటిస్తారని వారు చెబుతున్నారు.   వైవీ సుబ్బారెడ్డి టీటీడీ  చైర్మన్ గానే కాక  వైసీపీ ఉత్తరాంధ్ర పార్టీ ఇన్‌చార్జ్‌గా కూడా ఉన్నారు.   వచ్చేది ఎన్నికల సీజన్ కావడంతో ఉత్తరాంధ్రలో పార్టీ బలోపేతానికి పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సి ఉందని... దాంతో వైవీ సుబ్బారెడ్డి.. ఉత్తరాంధ్రలో పాగా వేసి..   పార్టీ విజయం కోసం సుబ్బారెడ్డి పూర్తి స్థాయిలో కృషి చేయడం కోసమే ఆయనను టీటీడీ పదవి నుంచి జగన్ తప్పించాలని భావిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.   ఇంకోవైపు.. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు.. ఇటీవల తెలంగాణలోని ఖమ్మంలో నిర్వహించిన సభ సక్సెస్ అయిందని.. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరంలో నిర్వహించిన ఇదే ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం సైతం సూపర్ సక్సెస్ అయిందని.. ఈ రెండు చోట్ల చంద్రబాబు సారథ్యంలో జరిగిన సభలకు భారీగా ప్రజలు స్వచ్ఛందంగా తరలి వచ్చారని.. అలాంటి వేళ అధికారంలో ఉన్న వైసీపీ మరింత దూకుడుగా వ్యవహరించాల్సి ఉందని.... అందులో భాగంగానే ముఖ్యమంత్రి  జగన్... బాబాయి వైవీ సుబ్బారెడ్డిని టీటీడీ చైర్మన్ పదవి నుంచి తప్పించి.. ఉత్తరాంధ్ర వ్యవహారాలకే పరిమితం చేస్తారని పార్టీ వర్గాలు అంటున్నాయి.  అదీకాక గతంలో ఉత్తరాంధ్ర ఇన్ ఛార్జ్ బాధ్యతలు విజయసాయిరెడ్డి పర్యవేక్షించేవారు. .. కానీ ఆయనపై ఆరోపణలు వెల్లువెత్తడంతో.. వైవీ సుబ్బారెడ్డికి ఆ బాధ్యతలు కట్టబెట్టిన జగన్ ఇప్పుడు బాబాయ్ వైవీ సుబ్బారెడ్డిని ఉత్తరాంధ్రకే పరిమితం చేయాలని నిర్ణయించుకున్నారు.    అదే సమయంలో టీటీడీ బోర్డ్ చైర్మన్ పదవి బీసీ నాయకుడికి ఇవ్వాలని నిర్ణయించారు. దీని వల్ల బీసీ వర్గాలలో వైసీపీ పట్ల సానుకూలత వ్యక్తం అవ్వడానికి అవకాశాలున్నాయని జగన్ భావిస్తున్నారు.  

lokesh padayatra yuvagalam

యువగళం.. లోకేష్ పాదయాత్ర

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కుప్పం టు ఇచ్చాపురం పాదయాత్రకు ముహూర్తం, పేరు ఫిక్స్ అయిపోయాయి. జనవరి 27న ప్రారంభం కానున్న పాదయాత్రకు యువగళం అని నామకరణం చేశారు.    400 రోజుల పాటు నాలుగు వేల కిలోమీటర్లు సాగే లోకేష్ పాదయాత్రలో  వంద నియోజకవర్గాలు కవర్ చేస్తారు. ఇందుకు అనుగుణంగా రూట్‌ మ్యాప్‌ రెడీ అయ్యింది. లోకేష్ తన పాదయాత్రలో యువత, మహిళలు, రైతులతోపాటు అన్ని వర్గాల ప్రజలతో మమేకమై వారి   సమస్యలు తెలుసుకోవడం పరిష్కార మార్గాలు సూచించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. యువగళం పేర లోకేష్  పాదయాత్ర వివరాలను ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం అధ్యక్షుడు  అచ్చెన్నాయుడు. ప్రకటించారు. పాదయాత్ర లోగో ఆవిష్కరించారు. లోకేష్ పాదయాత్ర చేస్తారంటూ గత చాలా కాలంగా  ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే .  నిరుద్యోగం, యువత ఎదుర్కొంటున్న సమస్యలే ప్రధాన అంశాలుగా లోకేష్ యాత్ర సాగనుంది. మహిళలు, రైతుల సమస్యల పట్ల ప్రజల్లో చైతన్యం తెచ్చేలా ప్రణాళిక రూపొందించనున్నారు. యువతను పెద్దఎత్తున భాగస్వామ్యం చేసేలా లోకేష్ పాదయాత్ర ముందుకు సాగుతుందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. కాగా తన పాదయాత్ర జనవరి 27 నుంచి ప్రారంభమౌతుందని నవంబర్ లోనే లోకేష్ ప్రకటించారు. వచ్చే ఎన్నకలలో తాను పోటీ చేయదలచిన మంగళగిరి నియోజకవర్గంలో మీడియా సమావేశం పెట్టి మరీ గతనవంబర్ లో తన పాదయాత్ర తేదీ ప్రకటించారు. ఈ పాదయాత్ర కారణంగా తాను కొంత కాలం నియోజకవర్గానికి దూరంగా ఉంటాననీ, అందుకే మంగళగిరి బాధ్యతలను కార్యకర్తలకు అప్పగిస్తున్నట్లు చెప్పారు. ఇంత కాలం తండ్రి, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడి నీడలోనే రాజకీయంగా ఎదిగినా ఇప్పుడు.. పూర్తిగా పరిణితి చెందిన నేతగా లోకేష్ ప్రజలతో మమేకం కానున్నారు.  అయితే..అయితే అది అంత సునాయాసంగా మాత్రం జరగలేదు. రాజకీయాలలో తొలి అడుగులు వేసే సమయంలోనే రాజకీయ ప్రత్యర్థులు ఆయన వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. బాడీ షేమింగ్ చేశారు. ఆహారం, ఆహార్యంపై ఎగతాళి చేశారు. పప్పు అన్నారు. అడుగడుగునా విమర్శలు చేశారు. అయితే అన్నిటినీ తట్టుకుని తనదైన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకుని లోకేష్ ఇప్పుడు ప్రత్యర్థులకు సింహస్వప్నంగా ఎదిగారనడంలో సందేహం లేదు.   ఇప్పుడు ఈ పాదయాత్ర యువతలో ఉత్తేజాన్ని నింపడంతో పాటు.. సీనియర్లు కూడా బద్ధకాన్ని వదుల్చుకుని పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనేందుకు దోహదపడుతుందని అంటున్నారు. 

jagan keep distance with uncle

మేనమామనూ జగన్ దూరం పెట్టేశారా ..?

ఏపీ సీఎం జగన్ కు ఒక్కరొక్కరుగా కుటుంబ సభ్యులు, ఆత్మీయులూ దూరం అవుతున్నారు. తండ్రి వైఎస్ మరణానంతరం జగన్ కు అన్ని విధాలుగా అండగా ఉండి, ఆయన జైలుకు వెళ్లిన సమయంలో వైసీపీ పార్టీని భుజాలపై మోసి.. జగన్ అధికారంలోకి రావడానికి, ముఖ్యమంత్రి కావడానికి అన్ని విధాలుగా సహకరించిన వారు ఒక్కరొక్కరుగా దూరం అవుతున్నారు. వైఎస్ వివేకా హత్య కేసు విషయంలో విభేదించిన సొంత బాబాయ్ కుమార్తె డాక్టర్ సునీత, ఆ తరువాత   తల్లి విజయమ్మ, సోదరి షర్మిల జగన్ కు దూరం అయ్యారు. ఇప్పుడు తాజాగా జగన్ కు స్వయాన మేనమామ.. అంటే తల్లి విజయమ్మకు సోదరుడు అయిన పోచిమరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి కూడా జగన్ కు దూరం అయ్యారు. జగన్ కు మేనమామ అయినా రవీంద్రనాథ్ రెడ్డి వైఎస్ రాజశేఖరరెడ్డికి అత్యంత సన్నిహితుడిగా మెలిగారు. అలాగే ఆయన పెరిగింది దాదాపుగా వైఎస్ వద్దే అని చెబుతారు. మొదటి నుంచీ కూడా రవీంద్రనాథ్ రెడ్డి వైఎస్ కుటుంబంతోనే ఉన్నారు. దీంతో ఆయన  తనకంటే వయసులో చిన్నవాడైన జగన్ కు  దాదాపుగా కేర్ టేకర్ గా   వ్యవహరించారని చెబుతారు. ఆ కారణంగానే ఇప్పటి వరకు వైసీపీలో రవీంద్రనాథ్ రెడ్డి కీలకంగా వ్యవహరిస్తూ వచ్చారు. అలాగే ఇప్పటి వరకూ కమలాపురం నియోజకవర్గంలోనే కాకుండా, సీఎం సొంత జిల్లా అయిన కడప జిల్లాలో రవీంద్రనాథ్ రెడ్డి హవా కొనసాగుతూ వచ్చింది.   అయితే ఇప్పుడు ఇదంతా గతం. ఎందుకంటే ఇప్పుడు జగన్ మేనమామకు పార్టీలో ఇసుమంతైనా ప్రాధాన్యత లేకుండా పోయింది. అసలు సీఎం జగన్ తన మేనమామ ముఖం చూసేందుకు కూడా ఇష్టపడటం లేదనీ, ఇరువురి మధ్యా మాటా మంతీ లేదనీ వైసీపీ వర్గాలే చెబుతున్నాయి. జగన్ ముఖ్యమంత్రి కావడానికి తమ శక్తివంచన లేకుండా పాటుపడిన వారంతా ఇప్పుడు ఆయనకు దూరం అవుతున్నారు. సొంత కుటుంబంలోనే విభేదాల కుంపటి రాజుకుంది. జగన్ సోదరి అన్నతో విభేదించి తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పేర సొంత పార్టీ ఏర్పాటు చేసుకుంటే.. తల్లి విజయమ్మ జగన్ ను కాదని, వైసీపీ గౌరవాధ్యక్షురాలి పదవికి రాజీనామా చేసి, ఆ పార్టీతో తెగతెంపులు చేసుకుని మరీ తన కుమార్తెకు తోడుగా వైఎస్సార్టీపీ వ్యవహారాలలో తలమునకలై ఉన్నారు. జగన్ సంగతి మనకెందుకు అని మీడియా ప్రశ్నలకు ఏపీ సీఎంతో తమకు సంబంధం లేదని చెప్పకనే చెప్పారు. వారిరువురూ జగన్ కు దూరం జరిగినా మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి మాత్రం ఇటీవలి కాలం వరకూ జగన్ కే మద్దతుగా నిలిచారు.  మేనమామగా ఉన్న చనువుతో  రవీంద్రనాథ్ రెడ్డి  అవకాశం దొరికిన ప్రతి సందర్బంలోనే సోదరి షర్మిలతో విభేదాలెందుకు అంటూ ఆమెతో సామరస్యం కుదిర్చేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. అయితే ఇది రుచించని జగన్ ఆయనను దూరం పెట్టారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎదురు పడినా కనీసం పలకరించకపోవడం, అప్పాయింట్ మెంట్ సైతం నిరాకరిస్తుండటంతో రవీంద్రనాథ్ రెడ్డికి విషయం బోధపడి జగన్ కు దూరం జరిగారని అంటున్నారు. ఇటీవల జగన్ కడప జిల్లా పర్యటనకు రవీంద్రనాథ్ రెడ్డి హాజరయ్యారు. అయినా జగన్ ఆయనను పట్టించు కోలేదనీ, ఎదురుపడిన సమయంలో కూడా ముఖం తిప్పుకుని పక్కకు వెళ్లిపోయారనీ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. కడప జిల్లాలో ఇప్పుడు సీఎం జగన్, రవీంధ్రనాథ్ రెడ్డిల మధ్య పెరిగిన దూరంపైనే హాట్ హాట్ చర్చ నడుస్తున్నది. ఎంత సీఎం అయినా కడప జిల్లాలో వైసీపీ పట్టు నిలవాలంటే కనీసం ఎన్నికల నాటికైనా జగన్ కుటుంబ సభ్యులతో సామరస్యం పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు. ఇప్పటికే కుటుంబ సభ్యులను దూరం పెట్టిన జగన్ తీరుపై జిల్లాలో వైఎస్ అభిమానుల్లో అసంతృప్తి వ్యక్తమౌతోందనీ, వైఎస్ వివేకా హత్య, షర్మిల, విజయమ్మలనూ దూరం పెట్టడంతో పాటు ఇప్పుడు మేనమామను సైతం దూరం చేసుకోవడంపై కడప జల్లాలో జగన్ తీరు పట్ల వ్యతిరేకత గూడుకట్టుకుందని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. 

cag reveals center anarchy in debts

అప్పుల్లో కేంద్రం అరాచకత్వం.. కాగ్ నివేదికలో తేటతెల్లం

తప్పులెన్ను వారు తమ తప్పులెరుగరయా అన్నారు యోగి వేమన.. ఆయన మాటలను తు.చ. తప్పకుండా పాటిస్తోంది కేంద్రంలోని మోడీ సర్కార్. రాష్ట్రాల అప్పులపై విమర్శలు గుప్పిస్తూ.. తాను మత్రం విచ్చల విడిగా అప్పులు చేసేస్తోంది. ఎదుటి వారికి చెప్పేందుకు మాత్రమే నీతులు అన్న తీరులో వ్యవహరిస్తోంది. గత కొంత కాలంగా కేంద్రం రాష్ట్రాల అప్పులపై కేంద్రం తీవ్రంగా పరిగణిస్తూ.. పరిమితి మించి అప్పులు చేయకుండా నియంత్రిస్తోంది. అదే సమయంలో తాను మాత్రం యథేచ్ఛగా ఎలాంటి నియంత్రణా లేకుండా అప్పులతో పబ్బం గడిపేసుకుంటోంది. అయితే కేంద్రం నిర్వాకాన్ని కాగ్ బట్టబయలు చేసింది. రాష్ట్రాల అప్పులపై ఒంటి కాలిపై లేస్తూ విమర్శలు గుప్పిస్తున్న కేంద్రం తాను మాత్రం పరిమితులంటూ లేకుండా ఎడా పెడా అప్పులు చేసేస్తోంది. దేశాన్ని అప్పుల కుప్పగా మార్చేసింది.    ఎఫ్‌ఆర్‌బీఎం  మేరకు  కేంద్రం  దేశ జీడీపీలో 40 శాతం వరకు అప్పులు చేసుకొనే వెసులుబాటు ఉంది.  అయితే  2022 ఆర్థిక సంవత్సరం  మోదీ సర్కారు ఏకంగా  ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని మించి 54 శాతం అప్పులు చేసింది.  2015-16లో జీడీపీలో కేంద్రం అప్పులు 5.5 శాతం ఉండగా, 2019-20 నాటికి 52.30 శాతానికి, 2022-23 నాటికి 54 శాతానికి పెరిగిపోయాయి. కేంద్రానికి ఏడాది కాలంలో సమకూరుతున్న మొత్తం ఆదాయంలో 2019-20లో వడ్డీలకు 34 శాతం చెల్లించింది. 2022-23 నాటికి అది 37 శాతానికి పెరిగిపోయింది.  అప్పులు, వాటికి చెల్లించే వడ్డీలు పెరిగినా.. అది జీడీపీ పెరుగుదలకంటే  ఎక్కువ ఉండకూడదన్నది నిబంధన.  అయితే, 2019-20 ఆర్థిక సంవత్సరం నాటికే జీడీపీ పెరుగుదల రేటును వడ్డీల పెరుగుదల రేటు దాటిపోయిందని కాగ్‌ వెల్లడించింది. 2019-20 సంవత్సరంలో జీడీపీ వృద్ధిరేటు కన్నా అప్పుల వృద్ధి రేటు రెట్టింపు ఉన్నది.  2019-20లో జీడీపీ వృద్ధిరేటు 6.22%. అప్పుల్లో మాత్రం ఏకంగా 12.62 శాతం వృద్ధి కనిపించింది.   2015-2020 మధ్య మోదీ ప్రభుత్వం ఏటా సగటున   7 లక్షల కోట్ల అప్పు చేసినట్టు కాగ్‌ నివేదిక తేల్చింది. 2015-16లో కేంద్ర ప్రభుత్వ అప్పులు రూ.69.55 లక్షల కోట్లు ఉండగా 2019-20 నాటికి ఇవి 105 లక్షల కోట్లకు చేరింది.  మోడీ ప్రభుత్వం ఐదేండ్లలోనే రూ.35 లక్షల కోట్ల అప్పులు చేసింది.  2018-19లో ద్రవ్యలోటు రూ.1.88 లక్షల కోట్లు ఉండగా ఏడాది వ్యవధిలోనే అది దాదాపు రెట్టింపయ్యి  రూ.3.75 లక్షల కోట్లకు పెరిగింది.  2014-15 నాటికి దేశ నికర అప్పు రూ.62 లక్షల కోట్లు ఉండగా, 2021-22 బడ్జెట్‌ నాటికి అది రూ.కోటి 35 లక్షల కోట్లకు చేరింది.  అంటే ఏడేళ్లలో 117శాతం పెరిగింది.    ప్రస్తుత భారత ప్రభుత్వం  అప్పు రూ. 155 లక్షల కోట్లు. ఇది జీడీపీలో  అరవై శాతం. అంటే రాష్ట్రాలు రుణ పరిమితిని మించి అప్పులు చేస్తున్నాయంటూ విమర్శలు గుప్పిస్తూ వాటిని ఆంక్షల చట్రాల్లో బిగించేసి అప్పు పుట్టకుండా చేస్తున్న కేంద్రం తాను మాత్రం నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘించి మరీ అప్పులు  చేసేస్తోంది.    గత నాలుగున్నరేళ్లలో దేశ రుణ భారం దాదాపు 50 శాతం పెరిగింది.   అపరిమితంగా అప్పులు చేసి  కొన్ని రాష్ట్రాలు దివాలా దిశగా వెళ్తున్నాయని కేంద్రం ఆందోళన వ్యక్తం చేస్తూ ఆగం ఆగం చేస్తోంది కానీ.. రాష్ట్రాలఅప్పులను నియంత్రించాల్సిందీ కేంద్రమే. ఆ కేంద్రమే రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కొన్ని రాష్ట్రాలు నిబంధనలకు తిలోదకాలిచ్చేసినా పట్టించుకోవడం లేదు.. కొన్ని రాష్ట్రాల విషయంలో మాత్రం కళ్లేలు బిగిస్తోంది.  ఎఫ్‌ఆర్‌బీఎం చట్ట పరిధిలోనే అప్పులు ఉండాలి. కొన్ని రాష్ట్రాలు కేంద్రం చెబుతున్నట్లుగా పరిమితికి మించి అప్పులు చేస్తున్నాయి. కానీ కేంద్రం కూడా అదే దారిలో వెళ్తున్నప్పుడు ఇక చెప్పేదేముంటుంది. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యెడా పెడా యథేచ్ఛగా అప్పులు చేస్తూ.. రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలను పాతాళానికి దిగజార్చేస్తున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వాల  విధానాల కారణంగా దేశంలో ప్రతి వ్యక్తి తలపైనా ఉన్న అప్పు అక్షరాలా కోటి రూపాయల పై మాటే.      రాష్ట్రాల స్థూల జాతీయోత్పత్తిలో మొత్తం అప్పుల శాతం కూడా కొన్ని రాష్ట్రాల్లో 50 శాతం దాటిందని, ఇది రాష్ట్రాల అభివృద్ధిని దెబ్బతీస్తుందని కేంద్రం ఆందోళన చెందుతోంది. ఇదే ఆందోళన కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటు సాక్షిగా వెల్లడించారు. అయితే కేంద్రం చెస్తున్న అప్పుల ప్రస్తావనను మాత్రం తీసుకురాలేదు. కాగ్ కేంద్ర ప్రభుత్వ అప్పులను కూడా వేలెత్తి చూపిన విషయాన్ని దాచేసే ప్రయత్నం చేసింది.  ప్రజలు అధికారం ఇచ్చారు కాబట్టి ఎక్కడో ఓ చోట నుంచి ఏదో విధంగా  అప్పులు తెచ్చి వారికి పందేరం చేసి మళ్లీ ఎన్నికలలో విజయం కోసం ఆర్థిక వ్యవస్థను కుదేలు చేసి, ప్రజల జీవన ప్రమాణాలనుకానీ దిగజార్చేసి పబ్బం గడుపుకుందామన్న ఉద్దేశమే కానీ, బాధ్యతగా వ్యవహరించి దేశ ప్రగతి, పురోగతిపై దృష్టి సారించాలన్న భావన కేంద్ర ప్రభుత్వంలో కనిపించడం లేదు.

 samajwadi Founding President mulayam sing yadev no more

రౌండప్ 2022.. సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం కన్నుమూత

అక్టోబర్  కొత్త సంవత్సరం వచ్చేస్తోంది. పాత సంవత్సరానికి వీడ్కోలు పలికే సమయం వచ్చేసింది. 2022 మోస్ట్ హ్యాపెనింగ్ ఇయర్ గా చెప్పుకోవచ్చు.  కొద్ది  రోజుల్లో 2022 వెళ్ళిపోతుంది. 2023 సంవత్సరం వచ్చేస్తుంది. క్యాలెండరు మారి పోతుంది. స్వాగత తోరణాలు, వీడ్కోలు వేడుకలు షరా మాములే ... కాలచక్రం కదులుతూనే ఉంటుంది... కానీ, వెళ్ళిపోతున్న 2022 సంవత్సరం, ఏమి సాధించింది, ఏమి మిగిల్చింది, ఏది పట్టుకు పోయింది, ఏమి బోధించింది, ఒక సారి వెనక్కి తిరిగి చూసుకుంటే .. సంవత్సర కాలంలో చెరగని ముద్ర వేసిన చేదు తీపి జ్ఞాపకాలను ఒక సారి సింహవలోకనం చేసుకుంటే.. అక్టోబర్ 3.. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్న సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్’ ఆరోగ్యం మరింతగా క్షీణించింది.ములాయం కుమారుడు  అఖిలేష్ యాదవ్, కోడలు డింపుల్ యాదవ్, సోదరుడు శివపాల్ యాదవ్ ఆసుపత్రిని సందర్శించారు. ప్రధాని నరేంద్ర మోడీ, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్’ అఖిలేష్ యాదవ్’ కు ఫోన్ చేసి, ములాయం ఆరోగ్య పరిస్థితిని తెలుసు కున్నారు.  అక్టోబర్ 10..సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ) వ్యవస్థాపకుడు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్(82) కన్నుమూశారు. చాలాకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన    మేదాంత ఆస్పత్రిలో ట్రీట్మెంట్ పొందుతూ   తుదిశ్వాస విడిచారు. ములాయం మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోడీ, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ సహా పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. ములాయం సేవలను కొనియాడారు.  అక్టోబర్ 10.. శివసేన ఇరువర్గాలకు కొత్త పేర్లు కేటాయించింది ఎన్నికల సంఘం. మరోవైపు, శివసేన పార్టీ పేరు, గుర్తును ఎలక్షన్ కమిషన్ స్తంభింపజేయడాన్ని ఛాలెంజ్ చేస్తూ ఉద్ధవ్ ఠాక్రే వర్గం దిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈసీ ఆదేశాలు రద్దు చేయాలని కోరింది. అక్టోబర్ 17.. ఈరోజు కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ప్రశాంతంగా ముగిసింది. దేశ రాజదాని ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌తో సహా వివిధ రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన 63 పోలింగ్ కేంద్రాల్లో సోనియా, రాహుల్,ప్రియాంక  సహా 9,000 మందికి పైగా పీసీసీ డెలిగేట్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.  25 ఏళ్ల తర్వాత గాంధీయేతర సభ్యులు అధ్యక్ష అన్నికాల బరిలో దిగడం ఇదే తొలిసారి. ఆగస్టు 19వ తేదీన కౌంటింగ్ జరుగుతుంది.  అక్టోబర్ 19.. ఊహించిందే జరిగింది. కాంగ్రెస్ అధ్యక్షఎన్నికల్లో మల్లికార్జున ఖర్గే విజయం సాధించారు. కౌంటింగ్ అనంతరం వెలువడిన ఫలితాల్లో మల్లికార్జున ఖర్గేకు 7897 ఓట్లు రాగా శశిథరూర్ కు 1072 ఓట్లు వచ్చాయి. దీనితో  మల్లికార్జున ఖర్గే  6800  ఓట్ల మెజారిటీ సాధించారు.  137 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి 24 ఏళ్ల తరువాత గాంధీయేతర కుటుంబ వ్యక్తి ఏఐసీసీ పీఠం అధిష్టించబోతున్నారు. అక్టోబర్ 22.. దేశవ్యాప్తంగా 10లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే రిక్రూట్ మెంట్ డ్రైవ్ రోజ్ గార్ మేళాని ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ,  భారతదేశం స్వావలంబన మార్గంలో ముందుకు సాగుతోందని అన్నారు. ఈ వేడుకలో కొత్తగా చేరిన 75,000 మందికి  నియామక పత్రాలను అందజేశారు.   భారతదేశం ఇప్పుడు ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉందనీ, ఎనిమిదేళ్లలో దేశం 10వ స్థానం నుంచి ఐదో అతిపెద్ద ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా ఎదిగింద‌ని మోడీ అన్నారు.  అక్టోబర్ 23.. రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కు విదేశాల నుంచి విరాళాలు వసూలు చేసందుకు  ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్  పరిధిలో ఇచ్చిన లైసెన్స్‌ని కేంద్ర ప్రభుత్వం  రద్దు చేసింది. ఈ ఫౌండేషన్ కు సోనియా గాంధీ అధ్యక్షురాలిగా ఉన్నారు.2020లో కేంద్ర హోం శాఖ నియమించిన అంతర్గత కమిటీ నివేదిక ఆధారంగా, రాజీవ్ గాంధీ ఫౌండేషన్ లైసెన్స్’ను రద్దు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.  "రాజీవ్ గాంధీ ఫౌండేషన్ ఎన్నోసార్లు నిబంధనలు ఉల్లంఘించింది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం" అని కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసిన కమిటీ వెల్లడించింది. హెల్త్, సైన్స్ అండ్ టెక్నాలజీ, మహిళలు, పిల్లలు, దివ్యాంగులకు అండగా నిలవడం లాంటి సేవలు అందించేందుకు 1991లో రాజీవ్ గాంధీ ఫౌండేషన్‌ను ఏర్పాటు చేశారు. అక్టోబర్ 26.. కాంగ్రెస్‌ పార్టీ నూతన అధ్యక్షుడిగా మల్లిఖార్జున్‌ ఖర్గే ఈ రోజు  అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమాన్ని ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో నిర్వహించారు. సోనియా గాంధీ, ఎంపీ రాహుల్‌ గాంధీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఖర్గేకు ఈ సందర్భంగా రాహుల్‌ పుష్పగుచ్ఛం అందించారు. 24 ఏళ్ల తర్వాత కాంగ్రెస్‌ పార్టీలో గాంధీయేతర వ్యక్తి ఆ పార్టీ పగ్గాలను చేపట్టారు.

what is the reason behind jagan delhi tour

జగన్ ఢిల్లీ టూర్ అందుకేనా ?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఢిల్లీ వెళ్ళారు.  బుధవారం( డిసెంబర్ 23) ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశ మవుతారు. ముఖ్యమంత్రి ఢిల్లీలో ఎన్ని రోజులుంటారు, ఎవరిని కలుస్తారు? అనే విషయంలో స్పష్టం లేకపోయినా, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి భారీ  అజెండాతోనే ఢిల్లీ వెళ్ళారని, ప్రధాని మోడీతో పాటుగా కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలుస్తారనే ప్రచారం అయితే జరుగుతోంది. రాష్ట్రానికి రావలసిన నిధులు, ప్రత్యేక హామీ సహా విభజన హామీల అమలు,  పోలవరం ప్రాజెక్ట్ వేగంగా పూర్తి చేయాలనే అభ్యర్ధన, పోలవరం బకాయిల చెల్లింపు, అంచనా వ్యయం పెంపుతో పాటుగా ఇంకా అనేక పెండింగ్ సమస్యల పరిష్కారం కోసమే  ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళారనే ప్రచారం జరుగుతోంది. అయితే, అదే నిజం కాదు.   ముఖ్యమంత్రి ప్రధానికి సమర్పించే వినతి పత్రంలో, ఈ అన్ని అంశాలతో పాటుగా  తెలంగాణ డిస్కంల నుంచి రావాల్సిన రూ. 6,756 కోట్ల బకాయిల అంశం, మెడికల్ కాలేజీలకు అనుమతి, కడప ఇంటిగ్రేటెడ్‌ స్టీల్‌ ప్లాంట్‌ కోసం ఏపీ ఎండీసీకి ఇనుప గనులు కేటాయింపు వంటి అంశాలు అనేకం ఉండవచ్చు   కానీ  అసలు అజెండా మాత్రం అది కాదని అంటున్నారు. నిజానికి, ఈ సమస్యలు ఇప్పటికిప్పుడు వచ్చినవి కాదు. ఇప్పట్లో పరిష్కారం అయ్యేవీ కాదు. ఈ  నిజం, జగన్ రెడ్డికి తెలుసు. ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి  ఇదే ‘ఆవు’  కథ వినిపిస్తున్నారు.  కాగా, ఈ నెల మొదటి వారంలో కూడా సీఎం జగన్‌ ఢిల్లీలో పర్యటించారు. ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన జీ 20 సదస్సుకు సంబంధించిన సమావేశంలో పాల్గొన్నారు. ఇటీవల ప్రధానితో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు కూడా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి  హాజరయ్యారు. నిజానికి, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహా  ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్ళనన్ని సార్లు ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళారు. (ఇంతవరకు ఆయన మొత్తంగా 22సార్లు ఢిల్లీ వెళ్ళినట్లు అస్మదీయుల సమాచారం) అయినా రాష్ట్రానికి జరిగిన మేలు ఏదైనా ఉందా అంటే, ఎఫ్ఆర్బీఎం గీత దాటి అదనపు అప్పులకు అనుమతి తెచ్చుకోవడం, అక్రమాస్తుల,  కేసులు, ఇతరత్రా పాత కొత్త అవివీతి కేసుల్లో కొంత ఊరట పొందడం మినహా రాష్ట్రానికి జరిగిన మేళ్ళను వేళ్ళ మీద లెక్కించ వచ్చునని అంటున్నారు. నిజానికి వేళ్ళ మీద లెక్కించే ప్రయోజనాలు అయినా రాష్ట్రానికి  జరిగాయా అంటే అదీ అనుమానమే... అనే వాళ్ళు కూడా లేక పోలేదు.   అందుకే ముఖ్యమంత్రి  జగన్ రెడ్డి ఢిల్లీ పర్యటన అసలు లక్ష్యం కాగితాల్లో కనిపించేంది కాదని మళ్ళీ పాత అజెండాతోనే ఆయన ఢిల్లీ వెళ్ళారని అంటున్నారు. కొత్త సంవత్సరంలో అయినా  సకాలంలో ఉద్యోగులకు జీతాలు, విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్లు ఇచ్చేందుకు ఖజానాలో కాసులు లేవు. ఒక్క జీతాలు, పెన్షన్లు మాత్రమే కాదు, రానున్నమూడు నెలల వరకు సర్కార్ ఏ పని చేయాలన్నా  చేతిలో చిల్లి గవ్వ ఆడే పరిస్థితి లేదు.  మార్చిలో బడ్జెట్ ఆమోదం పొంది కొత్త అప్పులకు తలుపులు తెరుచుకునే వరకు  సర్కార్ ఖజానా శివాలయమే అంటున్నారు అధికారులు.  కేంద్రం కరుణించి అదనపు అప్పుకు అనుమతి ఇస్తేనే గానీ, పూట గడిచే పరిస్థితి లేదు. అందుకే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి  ఢిల్లీ పర్యటన మెయిన్ అజెండాలో ఎఫ్ఆర్బీఎం నిబంధనల తాత్కాలిక  సడలింపు ప్రధానమైనదని అధికార వర్గాల సమాచారం.  అదలా ఉంచితే.. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు రాజకీయ ప్రాధాన్యత కూడా ఉందని అంటున్నారు. ముఖ్యంగా రాష్ట్ర రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. నిన్నటివరకు ఒక లెక్క ఈ రోజు నుంచి ఇంకో  లెక్క అన్న విధంగా రాజకీయ పరిస్థితులు మారి పోతున్నాయి. తెలుగుదేశం, జనసేన పార్టీలు దగ్గరవుతున్నాయి...  మరో వంక బీజేపీ కూడా పునరాలోచనలో పడిన సంకేతాలు స్పష్టమవుతున్నాయి. ఇంతకాలం జగన్ రెడ్డి కేంద్రానికి అనుకూలంగానే ఉంటున్నారు. సఖ్యతతోనే మెలుగుతున్నారు. అయినా, దక్షిణాది రాష్ట్రాలలో పట్టు పెంచుకునే ప్రయత్నాలు ముమ్మరం చేసిన బీజేపీ, తెలంగాణ తర్వాత ఆంధ్ర ప్రదేశ్, తమిళ నాడు రాష్ట్రాలపై కూడా దృష్టిని కేంద్రీకరించి, వ్యూహాలను మార్చు కుంటున్న వైనం  స్పష్ఠమవుతున్నాయి.  ఈ నేపధ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ఎదుట మరో మారు రాజకీయ విధేయత చూపడం కూడా ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన ప్రధాన లక్ష్యం అంటున్నారు. అలాగే, పార్టీ ముఖ్య నేతలు, ఎంపీల మెడకు  బిగిస్తున్న బాబాయ్ వివేకానంద హత్య కేసు, ఢిల్లీ లిక్కార్ స్కాంలో ఎంపీ మాగుంట శ్రీనివాస రెడ్డితో పాటు,  ఏ2 విజయసాయి రెడ్డి కుటుంబ సభ్యుల మెడలకు బిగుస్తున్న మరో ఉచ్చు నుంచి తమ వారిని కాపాడుకునేందుకు కేంద్రం శరణు కోరేందుకే ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళారని అంటున్నారు. నిజానిజాలు ఏమైనప్పటికీ, ముఖ్యమంత్రి ఢిల్లీ యాత్ర రాజకీయ వర్గాల్లో అనేక అనుమానాలకు తావిస్తోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

Indelible stains in 2022 political Prasthanam

2022 రాజకీయ ప్రస్థానంలో చెరగని మరకలు !

వీడ్కోలుకు సిద్దమవుతున్న 2022 సంవత్సరంలో దేశం చాలా చాలా రాజకీయ పరిణామాలు చూసింది.  అరడజనుకు పైగా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. రాష్ట్రపతి, ఉప రాష్ట్ర పతి ఎన్నికలు జరిగాయి. ఇంచుమించుగా పాతికేళ్ళ తర్వాత కాంగ్రెస్ పార్టీలో అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. పాతికేళ్ళలో ప్రప్రథమంగా గాంధీ కుటుంబం బయటి వ్యక్తి (ఖర్గే) కాంగ్రెస్ అధ్యక్ష పదవిని చేపట్టారు. నాలుగేళ్ళ తర్వాత కాంగ్రెస్ పార్టీ సొంతంగా ఒక రాష్ట్రం ( హిమాచల్ ప్రదేశ్)లో  అధికార పగ్గాలు చేపట్టింది. కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షడు రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర సాగిస్తున్నారు. వీటితో పాటు ఇంకా చాలా చాలా రాజకీయ పరిణామాలు 2022 సంవత్సరంలో చోటు చేసుకున్నాయి. ఇవన్నీ ఒకెత్తు అయితే,అసలు సంఘటనలు మహారాష్ట్రలో మూడు పార్టీల ( కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన) కూటమి మహా వికాస్ అఘాడీ (ఏమ్వీఎస్) ప్రభుత్వం, బీహార్ లో బీజేపీ, జేడీయు సంకీర్ణ ప్రభుత్వ పతనం 2022 రాజకీయ చరిత్రలో... మెరుపులను మరిపించే మరకలుగా మిగిలిపోయాయి.  అవును, కొన్నిసార్లు రాజకీయాల్లో ఉహాకు అందని పరిణామాలు చోటుచేసుకుంటాయి. ఓడలు బండ్లు బండ్లు ఓడలవుతాయి. శతృ,మిత్ర సంబంధాలు తిరగ బడుతుంటాయి. ప్రజలతో, ప్రజలు ఇచ్చిన తీర్పుతో సంబంధం లేకుండానే ప్రభుత్వాలు   మారుతుంటాయి. 2022లోనూ రాజకీయాల్లోనూ  కొన్ని అలాంటి మెరుపుల మరకల మలుపులు ఉన్నాయి. మహరాష్ట్ర విషయాన్నేతీసుకుంటే  2019 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శివసేన కూటమికి ప్రజలు అధికారం కట్ట బెట్టారు. అయితే, ఎన్నికల ఫలితాల వెలువడిన తర్వాత శివసేన మిత్ర పక్షం బీజేపీని కాదని, కాంగ్రెస్ ఎన్సీపీలతో జట్టు కట్టింది. శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే.. ముఖ్యమంత్రిగా మూడు పార్టీల మహా వికాస్ అఘాడి (ఏమ్వీఎస్) కూటమి ప్రభుత్వం ఏర్పడింది.. కానీ  ఉద్ధవ్ ఠాక్రే.. ప్రభుత్వానికి నిండా రెండేళ్ళు అయినా నిండీ నిండక ముందే, సంకీర్ణంలో ముసలం పుట్టింది. శివసేన నిట్ట నిలువునా చీలిపోయింది. ఏక్ నాథ్ షిండే నాయకత్వంలో మెజారిటీ ఎమ్మెల్యేలు బీజేపీతో జట్టు కట్టారు. షిండే ముఖ్యమంత్రిగా శివసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడింది. అయితే, ఈ  మార్పు   ఏదో అలా జరిగిపోలేదు. మార్పుకు ముందు ‘మహా’ రాజకీయమే నడిచింది. హై డ్రామా చోటు చేసుకుంది. ముందుగా తమ పార్టీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలతో కలిసి శివసేన నుంచి ఏక్ నాథ్ షిండే తిరుగు బావుటా ఎగురవేశారు. ఆ తర్వాత ఏకంగా 37 మందిని కూడగట్టారు. పార్టీని చేతుల్లోకి తీసుకున్నారు. ముంబై, గోవా, గుజరాత్, అసోంతో పాటు పలు చోట్ల క్యాంపులు కట్టారు. అనర్హత వేటు, సుప్రీం కోర్టు తీర్పు, అసెంబ్లీలో విశ్వాస పరీక్ష ఇలా చాలా పరిణామాలు జరిగాయి. వారాల పాటు ఉత్కంఠ కొనసాగింది. చివరికి బీజేపీ మద్దతుతో ఈ ఏడాది జూన్ 30న శివసేన రెబల్ నేత ఏక్ నాథ్ షిండే ముఖ్యమంత్రి అయ్యారు. మాజీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫఢ్నవీస్ ఉప ముఖ్యమంత్రి స్థానాన్ని దక్కించుకున్నారు. కుట్రతో తమ పార్టీని చీల్చారని శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే.. బీజేపీని విమర్శించారు.  మహారాష్ట్రలో బీజేపీ మాజీ మిత్ర పక్షం శివసేన నేత ఉద్ధవ్ ఠాక్రేను గద్దె దించడంతో పాటుగా, శివసేన వ్యవస్థాపక అధ్యక్షుడు బాల్  ఠాక్రే నిర్మాణం చేసిన హిందుత్వ భావజాలాన్ని, ఓటు బ్యాంకును చక్కగా  తన వైపునకు తిప్పుకుంది. రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతానికి అణిగి వొదిగి అడుగులు వేస్తున్నా, చివరాఖరుకు హిందుత్వ వాదానికి, హిందూ ఓటు బ్యాకుకు ఒకే ఒక్క హక్కుదారుగా తనను తాను మలచుకునేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. అయితే మహారాష్ట్రలో అనూహ్య రీతిలో సర్కార్ రిమోట్ ను చేతిలోకి తీసుకోవడంలో సక్సెస్ అయిన బీజేపీకి బీహార్‌లో ఎదురు దెబ్బ తగిలింది. జనతా దళ్ యునైటెడ్(జేడీయూ) అధినేత, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కాషాయ పార్టీకి షాక్ ఇచ్చారు. మహారాష్ట్ర పరిణామల నేపథ్యంలో ముందుగా జాగ్రత్త పడిన నితీష్ కుమార్  ముందుగానే బీజేపీతో తెగదెంపులు చేసుకొని.. రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ సంవత్సరం ఆగస్టులో మళ్లీ ప్రమాణ స్వీకారం చేశారు. గత ( 2020) బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ 75 స్థానాలు, బీజేపీ 74 సీట్లు, జేడీయూ 43 స్థానాల్లో గెలిచింది.  బీజేపీ, జేడీయూ కూటమిగా ఎన్నికలకు వెళ్లాయి. ముఖ్యమంత్రిగా మరోసారి నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. అయితే సరిగ్గా రెండు సంవత్సరాల తర్వాత ఈ ఏడాది ఆగస్టులో బీజేపీకి గుడ్ బై చెప్పారు నితీశ్.  ఆర్జేడీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే..కుర్చీ కోల్పోతే ..బీహార్ లో నితీష్ కుర్చీ నిలుపు కున్నారు. అయినా,,ఈ  రెండు రాష్ట్రాలలో చోటు చేసుకున్న పరిణామాలు, 2022 భారత దేశ రాజకీయ ప్రస్థానంలో చెరగని మరకలు గానే మిగిలి పోయాయి.

revanth reddy what next

రేవంత్ రెడ్డి వాట్ నెక్స్ట్ ?

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్దమయ్యారా? కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో ఈ చర్చ జోరుగా సాగుతోంది. సోషల్ మీడియాలో అయితే, రేవంత్ ఇప్పటికే,  తెలంగాణ సామాజిక కాంగ్రెస్  పేరున ఈసీ వద్ద పార్టీని రిజిస్టర్ చేయించారనే వార్త విపరీతంగా వైరల్ అవుతోంది. మరో వంక రేవంత్ రెడ్డి అనుచరులు అలాంటిది ఏమీ లేదని ఎంతగా మొత్తుకున్నా, ఫలితం కనిపిచడం లేదు. అంతే కాదు  నిజానిజాలు ఎలా ఉన్నప్పటికీ, ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీలోని ఆయన ప్రత్యర్ధులు  రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిందే, హస్తం పార్టీ అడ్రస్ గల్లంతు చేసేందుకనే, ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. నిజానికి ఈ ప్రచారం ఇప్పడు కాదు ఎప్పటి నుంచో సోషల్ మీడియాలో, రాజకీయ చర్చల్లో ప్రముఖంగా వినిపిస్తూనే వుంది. ఇప్పడు మరింత అదే ప్రచారం మరింత జోరు అందుకుంది. ఈ అన్నిటినీ మించి సోషల్ మీడియాలో రేవంత్ సొంత పార్టీపై ఇంత చర్చ  రచ్చ జరుగుతున్నా ఆయన నేరుగా  స్పందించక పోవడంతో అనుమానాలు మరింత బలపడుతున్నాయి.   అదలా ఉంటే రేవంత్ రెడ్డిని డే వన్ నుంచి వ్యతిరేకిస్తున్న  కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు రేవంత్ రెడ్డి కొత్త పార్టీకి సంబందించి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని అంత తేలికగ్గా తీసుకోరాదని అంటున్నారు. అలాగే, సోషల్ మీడియాలో వస్తున్న వదంతులపై రేవంత్ స్పందించాలని అన్నారు. అయోమయంలో కొట్టు మిత్తడుతున్న పార్టీ క్యాడర్ కు రేవంత్ రెడ్డి క్లారిటీ ఇవ్వాలని వీహెచ్ డిమాండ్ చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్‌ను మార్చి వేరే వారిని ఇంచార్జిగా నియమిస్తారనే ప్రచారం సాగుతోంది. పార్టీలో అంతర్గత సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో దిగ్విజయ్ సింగ్ వచ్చి సీనియర్ నేతల అభిప్రాయాలు తీసుకున్నారు. దిగ్విజయ్ సింగ్ ఢిల్లీ అధిష్టానానికి ఎలాంటి నివేదిక సమర్పిస్తారనేది చూడాలి. ఆయన నివేదికతో అధిష్టానం మంచి నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నానని వీహెచ్ పేర్కొన్నారు. మరో వంక రేవంత్ కొత్త పార్టీ ఏర్పాటు అంశాన్ని కాంగ్రెస్ ఖండించింది. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ హైదరాబాద్‌ స్రైబర్ క్రైమ్ ఏసీపీకి ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో అవాస్తవాలను ప్రచారం చేస్తున్న వ్యక్తుల వివరాలను ఏసీపీకి అందించారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు. మరోవంక  నిప్పు లేనిదే పొగరాదని కొందరు కాంగ్రెస్ నాయకులే  వ్యాఖ్యానిస్తున్నారు.  అదలా ఉంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రేవంత్ రెడ్డి తనంతట తాను  వెళ్ళిపోతే తప్పించి ఆయన్ను అధ్యక్ష పదవి నుంచి తప్పించేంది లేదని సీనియర్ నాయకులకు స్పష్టం చేసిందని ఢిల్లీ రాజకీయ వర్గాల్లో వినవస్తోందని అంటున్నారు. ముఖ్యంగా రాహుల్ గాంధీ, జాతీయ స్థాయిలో, అసమ్మతి గళం వినిపించిన ‘జీ 23’ నేతల విషయంలో వ్యవహరించిన రీతిలోనే కఠినంగా ఉండాలని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు సూచించినట్లు సమాచారం. నిజానికి, రాహుల్ గాంధీ మొదటి నుంచి కూడా,  ఉన్నవాళ్ళు ఉంటారు .. పోయిన వాళ్ళు పోతారు  అనే స్టాండ్ మీదనే నిలిచారు. ముఖ్యంగా సీనియర్ నాయకుల బెదిరింపులకు లొంగేది లేదని ఇప్పటికే రాహుల్ గాంధీ పలు సందర్భాలలో స్పష్టం చేశారు. తెలంగాణ సీనియర్ల విషయంలోనూ  రాహుల్ గాంధీ అదే మాట మీదన్నారని అంటున్నారు.  నిజానికి రేవంత్ రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిని చేసినప్పటి నుంచి సీనియర్ల నుంచి ఎన్ని ఫిర్యాదులు వచ్చినా రాహుల్ గాంధీ పట్టించుకోలేదు. రేవంత్ రెడ్డిని మార్చేది లేదని అనేక మార్లు సీనియర్  నాయకులకు స్పష్టం చేశారని రేవంత్ వర్గం నాయకులు అంటున్నారు. రేవంత్ రెడ్డితో సీనియర్లకు విభేదాలు వచ్చిన ప్రతి సందర్భంలోనూ రాహుల్ గాంధీ పార్టీ నాయకులను ఢిల్లీ పిలిపించుకుని  కాంగ్రస్ లో ఉండాలంటే రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేయక తప్పదని స్పష్తం చేశారని అంటారు.  ఆ ధీమాతోనే రేవంత్ రెడ్డి బండకేసి కొడతా,  నేను ఐపీఎస్ .. మీరు హోం గార్డులు వంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని గుర్తు చేస్తున్నారు. అయితే మారిన రాజకీయ పరిస్థితులలో రేవంత్ రెడ్డి  పీసీసీ అధ్యక్ష పదవి కంటే  తమ రాజాకీయ భవిష్యత్ గురించి ఎక్కువ అలోచిస్తున్నారని అంటున్నారు. అందుకే ఆయన తాను కాంగ్రెస్ పార్టీలో కొనసాగితే ఏమిటి? బయటకు వచ్చి వేరే పార్టీలో చేరడమో, సొంత పార్టీ  పెట్టడమో చేస్తే ఏమిటి? అనే మీమాంసలో ఉన్నారని అంటున్నారు. అందుకే, సోషల్ మీడియాలో జరుగుతున్న, ‘రేవంత్  సొంత పార్టీ’ ప్రచారంపై ఆయన నేరుగా స్పందించడం లేదని అంటున్నారు.  ఏమో రేవంత్ మనసులో ఏముందో .. అది ఆయనే చెప్పాలి ..అంతవరకు ‘రేవంత్  సొంత పార్టీ’  డైలీ సీరియల్’ లెక్క నడుస్తూనే ఉంటుదని అంటున్నారు.

political equatioms chaqnge in new year

కొత్త సంవత్సరంలో ఏపీ ముఖచిత్రం మారిపోతుందా?

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఆయనో విలక్షణ నాయకుడు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ఎంపీ. అయినా, ఆయన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించడంలో ప్రతిపక్ష పార్టీలతో పోటీ పడతారు. నిజానికి, ప్రతిపక్ష పార్టీ నాయకులు అయినా, కొన్ని కొన్ని సందర్భాల్లో, కొన్ని కొన్ని విషయాల్లో ప్రభుత్వాన్ని విమర్శించేందుకు కొంచెం అటూ ఇటు అవుతారేమో కానీ, ఆయన మాత్రం తగ్గేదేలే అంటారు. పొద్దున్న లేచింది మొదలు సొంత పార్టీని, సొంత పార్టీ ప్రభుత్వాన్ని ప్రభుత్వ విధానాలను, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని, మంత్రులు, వైసీపీ నాయకులను విమర్శించడంలో విపక్షాలతో పోటీ పడుతుంటారు.  ఇక ఇంత చెప్పిన తర్వాత ఆయన ఎవరో? ఏమిటో? చెప్పవలసిన అవసరం లేదు. అవును, మీ  గెస్  కరెక్ట్. ఆయన నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు. ట్రిపుల్ ఆర్ .. ఆయన రాజకీయ నాయకుడు, మాత్రమే కాదు. రాజకీయ విశ్లేషణలు కూడా చేస్తారు. రాజకీయ జోస్యం అదీ చెపుతుంటారు.ఎప్పుడూ వార్తల్లో వుండే రాజు గారు, తాజాగా మరో సంచలన వ్యాఖ్య చేశారు. కొత్త సంవత్సరంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ చిత్రం ఎలా ఉంటందో, ఏమి జరిగుతుందో... క్లియర్ కట్ గా చెప్పారు.  అంతేకాదు, రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణలు, ఎత్తులు, పొత్తులపై సర్క్యులేషన్ లో ఉన్న సందేహాలు అన్నిటికీ రఘురామ కృష్ణం రాజు తెర దించారు. రానున్న ఎన్నికల్లో తాను మళ్ళీ నరసాపురం నియోజక వర్గం నుంచే పోటీ చేస్తానని తేల్చి చెప్పారు. సరే  అది అయన వ్యక్తిగత విషయం. వ్యక్తిగత నిర్ణయం. అయితే, రఘురామ కృష్ణం రాజు అంత మాత్రమే చెప్పలేదు. అంతటితో ఆగలేదు. టీడీపీ, జనసేన పార్టీలతో కలిసే తాను పోటీ చేస్తానని.. అందులో ఎటువంటి సందేహం లేదని తేల్చి చెప్పారు. ఒక విధంగా సంచలం ప్రకటన చేశారు. అంటే, తెలుగు దేశం, జన సేన పార్టీల మధ్య పొత్తుఉంటుందని  ఆయన జోస్యం చెప్పారు. నిజానికి, టీడీపీ, జనసేన పార్టీల మధ్య పొత్తు ఉంటుందని చాలా కాలంగా మీడియాలో చర్చ జరుగుతోంది.అయితే, ఇప్పటికే జనసేన, బీజేపీ మధ్య పొత్తు ఒకవైపు, బీజేపీ, టీడీపీల మధ్య వైరం మరోవైపు కొనసాగుతున్న నేపధ్యంలో కొత్త పొత్తులు ఎలా సాధ్యం? అనే విషయంలో కొన్ని సందేహాలు వ్యక్తమవుతున్నాయి.  అయితే, ఇప్పడు రఘురామ కృష్ణం రాజు, అలాంటి సందేహాలు, అనుమానాలు అన్నింటికీ సమాధానం ఇచ్చారు. నిజమే అయన చెప్పింది ఆయన పోటీకి సమబందించిన విషయమే అయినా, ఆయన తాను టీడీపీ, జనసేనతో కలిసి పోటీ చేస్తానని చెప్పడం ద్వారా, భవిష్యత్ లో టీడీపీ, జనసేన పొత్తు ఖాయమని చెప్పకనే చెప్పారని పరిశీలకులు అంటున్నారు. నిజానికి, రఘురామ కృష్ణం రాజుకు, బీజేపీ నాయకులతో చాల దగ్గరి సంబంధాలే ఉన్నాయని అంటారు. అంతే కాదు  బీజేపీ నాయకులతోనే కాకుండా, బీజేపీ బాస్  ఆర్ఎస్ఎస్ నాయకులతోనూ ఆయనకు సన్నిహత సంబంధాలున్నాయి. ఇది అందరికీ తెలిసిన విషయం. అందుకే,  ఒక దశలో ఆయన బీజేపీలో చేరతారని చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. వ్యవహారం ముహుర్తాల వరకు వెళ్ళింది. అయితే, ఎదుకనో ఆయన వెనకడుగు వేశారు.పీటల మీద పెళ్లి ఆగిపోయింది అనుకోండి అది వేరే విషయం. సరే అదంతా గతం. ప్రస్తుతంలోకి వస్తే  రఘురామ కృష్ణం రాజు  తాను టీడీపీ, జనసేనతో కుమ్ముక్కయ్యానని వైసీపీ నాయకులు వంతుల వారీగా  చేస్తున్న విమర్శలకు సమాధానంగా అవును, టీడీపీ, జనసేనతో కలిసే తాను మళ్ళీ అదే నరసాపురం నియోజక వర్గం నుంచి పోటీ చేస్తాని స్పష్టం చేశారు. అదే విషయాన్ని ఆయన దాపరికం లేకుండా ఓపెన్ గా  కుండబద్దలు కొట్టారు. అయితే, రఘురామ కృష్ణం రాజు, ఎందుకోసం, ఎవరి కోసం ఈ వ్యాఖ్యలు చేసినా  అంతర్లీనంగా ఆయన చెప్పలనుకున్నది  చెప్పింది కూడా ఒక్కటే  బీజేపీ కలిసొచ్చినా రాకున్నా టీడీపీ, జనసేన పొత్తు ఖాయం. ప్రభుత్వ వ్యతిరేక ఓటు..కన్సాలిడేట్ కావడం ఖాయం.  వైసీపీ ఓటమి ఖాయం. ఇదే రఘురామ కృష్ణం రాజు చెప్పిన భవిష్యవాణి సారాంశం .. అంటున్నారు.  నిజానికి రాష్ట్రంలో జరుగతున్న పరిణామాలను గమనించినా  రాష్ట్రంలో అధికార వైసీపీ గ్రాఫ్  రోజు రోజుకు పడిపోతున్నది. అది  నిజం. ముఖ్యమంత్రి జగన్మోహన్  రెడ్డి మాటల్లో చేతల్లోనూ అదే బేలతనం కనిపిస్తోంది. ఎవరో ... ఓ దారిన పోయే దానయ్య, 175కు 175 స్థానాల్లో గెలిపించే ఫార్ముల తన వద్ద ఉందని ట్వీట్ చేయాగానే, ముఖ్యమంత్రి, అ దానయ్య అర్హతలు ఏమిటి? అతని ఏ ఉద్దేశంతో ఆ ట్వీట్  చేశారు అనేది చూసుకోకుండా స్వయంగా వేగులను పంపి ఆ పిల్ల మేథావి రప్పించుకుని ఆశగా చర్చలు జరపడం, ముఖ్యమంత్రి అమాయకత్వాన్నే కాదు..ఆయనను వెంటాడుతున్న ఓటమి భయానికి అద్దంపడుతోందని అంటున్నారు. అలాగే, గత ప్రభుత్వాని కంటే తమ ప్రభుత్వం తక్కువే అప్పులు చేశామని.. ఎక్కువ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని చెప్పడం కూడా ఆయనలోని అభద్రతా భావానికి అద్దం పడుతోందని అంటున్నారు. మొత్తానికి కొత్త సంవత్సరంలో ఏపీ రాజకీయాలు కొత్తగా ఉంటాయి, అనేది రఘురామ కృష్ణం రాజు  మాట, అంటున్నారు.

round up  center officially organized telangana vimochana dinotsavam

రౌండప్ 2022.. అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవం

సెప్టెంబర్   కొత్త సంవత్సరం వచ్చేస్తోంది. పాత సంవత్సరానికి వీడ్కోలు పలికే సమయం వచ్చేసింది. 2022 మోస్ట్ హ్యాపెనింగ్ ఇయర్ గా చెప్పుకోవచ్చు.  కొద్ది  రోజుల్లో 2022 వెళ్ళిపోతుంది. 2023 సంవత్సరం వచ్చేస్తుంది. క్యాలెండరు మారి పోతుంది. స్వాగత తోరణాలు, వీడ్కోలు వేడుకలు షరా మాములే ... కాలచక్రం కదులుతూనే ఉంటుంది... కానీ, వెళ్ళిపోతున్న 2022 సంవత్సరం, ఏమి సాధించింది, ఏమి మిగిల్చింది, ఏది పట్టుకు పోయింది, ఏమి బోధించింది, ఒక సారి వెనక్కి తిరిగి చూసుకుంటే .. సంవత్సర కాలంలో చెరగని ముద్ర వేసిన చేదు తీపి జ్ఞాపకాలను ఒక సారి సింహవలోకనం చేసుకుంటే.. సెప్టెంబర్1..  కాంగ్రెస్ అధ్యక్ష పదవికి సంబంధించిన ఎన్నికల షెడ్యూల్‌ను ఆ పార్టీ నేతలు వెల్లడించారు. సెప్టెంబర్ 22న పార్టీ అధ్యక్ష పదవికి నోటిఫికేషన్‌ రానుంది. 24 నుంచి సెప్టెంబర్ 30 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. అక్టోబర్ 17న ఎన్నికలు జరగనున్నాయి. 19న కౌంటింగ్ జరగనుంది. రెండు రోజుల క్రితం జరిగిన  కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.  సెప్టెంబర్ 9...  భారత్ జోడి యాత్రలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, 41 వేల రూపాయల విపువచేసే, బ్రాండెడ్ టీషర్టు’ వేసుకున్నారని బీజేపీ ఆరోపించింది.  దీంతో ఇరు పార్టీల మది ట్వీట్ల యుద్ధం మొదలైంది.  సెప్టెంబర్ 11.. తూర్పు లడఖ్‌లోని ఎల్‌ఎసి వెంబడి చివరి ఘర్షణ పాయింట్ నుండి భారత్, చైనా దళాలు వైదొలగుతున్నాయని ఉభయ దేశాలు ప్రకటించిన నేపధ్యంలో మాజీ ఆర్మీ చీఫ్ వేద్ మాలిక్,  చైనాతో మరింత అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉందని, అన్నారు. గతంలో చైనా సరిహాద్దు ఒప్పందాలను అనేకమార్లు ఉల్లంగించిన విషయన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.     సెప్టెంబర్ 15...  ఉజ్బెకిస్తాన్ లోని సమార్ఖండ్ లో జరుగుతున్న షాంఘై కోఆపరేషన్’ ఆర్గనైజేషన్ ( ఎస్సీఓ) సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ రష్యా అధ్యక్షుడు వ్లాద్మిర్ పుతిన్’ , చైనా అధ్యక్షుడు  జిన్’పింగ్` తో భేటీ అవుతారు. ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత పుతిన్’తో మోడీ సమావేశం కావడం ఇదే తొలిసారి కావడంతో ఈ భేటి ప్రధాన్యతను సంతరించుకుంది. కాగా, ఎస్సీఓ సదసుల్లో ప్రసంగించిన మోడీ, భారత దేశం స్టార్టప్’ కంపెనీల ప్రగతితో ఉత్పాదక కేంద్రంగా రూపాంతరం చెందుతోందని వివరించారు.  సెప్టెంబర్ 17.. ప్రధాని నరేంద్ర మోడీ 72 వ పుట్టిన రోజు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ సహా పలువురు కేంద్రమంత్రులు ప్రధాని మోదీకి శుభాకాంక్షలు చెప్పారు.అలాగే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ప్రధాని మోదీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.ఇక ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా బీజేపీ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు దేశవ్యాప్తంగా అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహించారు.  సెప్టెంబర్ 17... తెలంగాణ విమోచన దినోత్సవం. ఈ వేడుకలను తొలిసారిగా కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌ వేదికగా కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు.  హైదరాబాద్‌ సంస్థానం భారత్‌ యూనియన్‌లో కలిసిన 1948 సెప్టెంబర్‌ 17న అప్పటి హోంశాఖమంత్రి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జాతీయ పతాకం ఆవిష్కరించగా.... ప్రస్తుత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. కాగా, గడచిన ఎనిమిది సంవత్సరాలలో తెలంగాన విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈసారి జాతీయ సమైక్యతా దినంగా రాష్ట్ర వ్యాప్తంగా అధికారిక కార్యక్రమాలను నిర్వహించింది. భారతదేశంలో అంతరించిపోయిన అడవి చిరుతలను తన పుట్టిన రోజు సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు కునో జాతీయ పార్కులో విడుదల చేశారు.   ప్రపంచంలోనే మొదటి ఖండాంతర అతిపెద్ద మాంసాహార జంతువుల మార్పిడి ప్రాజెక్టు "ప్రాజెక్ట్ చీతా" కింద నమీబియా నుండి ఈ  చిరుతలను భారతదేశానికి తీసుకురావడం జరిగింది.  మొత్తం ఎనిమిది చిరుతల్లో ఐదు ఆడ, మూడు మగ చిరుతలు ఉన్నాయి. సెప్టెంబర్ 19... పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్’ బీజేపీలో చేరారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన స్థాపించిన పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీని బీజేపీలో విలీనం చేశారు .సెప్టెంబర్ 19.. .కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శశి థరూర్ పార్టీ అధ్యక్ష పదవికి పోటీ చేస్తానని ప్రకటించారు. సెప్టెంబర్ 25...రాజస్థాన్ ప్రభుత్వంలో సంక్షోభం తలెత్తింది. ముఖ్యమంత్రి అశోక్ గేహ్లోట్’ స్థానంలో పీసీసీ మాజీ అధ్యక్షడు సచిన్ పైలట్’ను ముఖ్యమంత్రిగా నియమించేందుకు పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గేహ్లోట్ వర్గానికి చెందిన 80 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు.

farm house case brs in trouble

ఫామ్ హౌస్ కేసు.. బీఆర్ఎస్ అనుకున్నదొకటి.. అయినది మరొకటి

ఫామ్ హౌస్ కేసు విషయంలో అనుకున్నదొకటి.. అయినది ఒకటి అన్నట్లుగా తయారైంది ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి. కేసీఆర్ అత్యుత్సాహం.. పార్టీ చేతిలోని ఆయుధాన్ని ప్రత్యర్థికి అప్పగించిందని పార్టీవర్గాలే గుసగుస లాడుకుంటున్నాయి. ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల కేసు విషయంలో కేసీఆర్ బీజేపీ ఆయువుపట్టు మీద దెబ్బకొట్టానని సంబరపడినంత సేపు పట్ట లేదు.. ఆ కేసు తిరిగి తిరిగి తమ పార్టీ ఎమ్మెల్యేల మెడకే చుట్టుకుంటోందని తెలియడానికి. ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల కేసును సీబీఐకి ఇవ్వాలని హైకోర్టు నిర్ణయించడంతో బీఆర్ఎస్ గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లైంది.  కేంద్రానికేనా దర్యాప్తు సంస్థలు.. రాష్ట్రాలకు లేవా అంటూ ఈ కేసు దర్యాప్తునకు సీట్ ను ఏర్పాటు చేసినప్పుడు పార్టీ క్యాడర్ లో,  పార్టీ మారాలంటూ  తమను ప్రలోభ పెట్టారంటూ ఫిర్యాదు చేసిన అప్పటి టీఆర్ఎస్, ఇప్పటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలలో కనిపించిన ధీమా ఇప్పుడు కాగడా పెట్టి వెతికినా కనిపించడం లేదు. ఇందుకు  ఈ కేసులో అత్యంత కీలకంగా ఉన్న ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గాభరా, కంగారూ చూస్తే ఇట్టే అర్ధమైపోతుంది. ట్రాప్ జరిగిన సమయంలో పోలీసులు కోట్ల రూపాయలు పట్టుకున్నట్లు జరిగిన ప్రచారమే కానీ, అందుకు తగ్గ ఆధారాలు ఇప్పటికీ బయటకు రాలేదు.  నిజంగా అప్పట్లో సొమ్ము బయటపడి ఉంటే.. ఈడీ ఈ పాటికే రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించేసి ఉండేది. అయితే ఈ కేసు కేంద్ర దర్యాప్తు సంస్థల చేతికి వెళ్లకూడదన్న ఉద్దేశంతోనే అప్పట్లో సొమ్ము రికవరీ చూపలేదన్న వాదన కూడా ఉంది. అయితే ఫామ్ హౌస్ కేసులో సొమ్ములు కనిపించకపోయినా  వ్యూహాత్మకంగా ఈడీ రంగప్రవేశం చేసింది. ఆ వెను వెంటనే హైకోర్టు తీర్పుతో సీబీఐ రంగంలోకి దిగుతోంది. దీంతో ఈ కేసు విషయంలో ఒక తార్కిక ముగింపునకు ఎంతో సమయం పట్టదన్న అభిప్రాయం న్యాయనిపుణుల్లోనూ, రాజకీయ వర్గాలలోనూ కూడా వ్యక్తమౌతోంది. సీబీఐ, ఈడీల రంగ ప్రవేశంలో ఇక ఫామ్ హౌస్ కేసులో నిందితులుగా ఉన్న రామచంద్ర భారతి అలియాస్‌ సతీశ్‌ శర్మ,   సింహ యాజులు, హైదరాబాద్‌కు చెందిన నందకుమార్‌లే కాక, ఫిర్యాదు చేసి నలుగురు ఎమ్మెల్యేలూ కూడా దర్యాప్తు సంస్థల స్కాన్ లోనే ఉంటారు. ఎవరు ఎమ్మెల్యేల కొనుగోలు కోసం ప్రయత్నించారన్న దగ్గర నుంచి, ఎలా ట్రాప్ చేశారు, సొమ్ముల సమీకరణ ఎలా వరకూ అన్ని అంశాలనూ కేంద్ర దర్యాప్తు సంస్థలు వెలుగులోనికి తీసుకు వస్తాయి. ఇప్పటి వరకూ ఈ కేసులో సిట్ వైపు నుంచి మాత్రమే వివరాలు బయటకు వచ్చాయి. ఇక ఇప్పుడు సిట్ ఇంత వరకూ చేసిన దర్యాప్తు, వెల్లడించిన విషయాలూ అన్నీ పక్కకు వెళ్లిపోతాయి. ఎందుకంటే ఈ కేసు దర్యాప్తు చేసే అధికారం ఇక సిట్ కు లేదు.  సో.. ఆ దర్యాప్తును అంతా పక్కన పెట్టేసి కేంద్ర దర్యాప్తు సంస్థలు మళ్లీ మొదటి నుంచీ దర్యాప్తు ప్రారంభిస్తాయి. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఫామ్ హౌస్ ట్రాప్ కేసులో కీలకంగా వ్యవహరించిన వ్యక్తి రోహిత్ రెడ్డి కంగారు పడుతున్నారు. ఈడీ, సీబీఐలకు ఈ కేసు దర్యాప్తు చేసే అధికారమే లేదంటున్నారు. హైకోర్టు ఫామ్ హౌస్ ట్రాప్ కేసును సీబీఐకి అప్పగిస్తూ తీర్పు వెలువరించిన తరువాత మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ రోహిత్ రెడ్డి తన స్పందన తెలిపారు. కేసును సీబీఐకి ఎలా అప్పగిస్తారన్నారు. ఇదంతా బీజేపీ కుట్ర అని నిందలేశారు. కోర్టు తీర్పు మేరకే కేసును సీబీఐ దర్యాప్తు చేయనుందన్న సంగతి విస్మరించి మరీ బీజేపీపై నిందలేశారు. అంతకు ముందు ఇదే కేసుకు సంబంధించి తనను ఈడీ విచారించిన తరువాత కూడా ఆయన ఇవే ఆరోపణలు చేశారు. రెండు సందర్భాలలోనూ ఆయనలో ఆందోళన, గాభరా స్పష్టంగా కనిపించింది. మీడియా ముందుకు రాలేదు కనుక మిగిలిన ముగ్గురూ ఎలా ఫీల్ అవుతున్నారన్న సంగతి తెలియడం లేదు.. కానీ ఈ ఫామ్ హౌస్ ట్రాప్ కేసులో మొదటి నుంచీ క్రియాశీలంగా ఉన్నదీ, కీలకంగా వ్యవహరించినదీ పైలట్ రోహిత్ రెడ్డే. ఈడీ విచారణ అనంతరం తనపై కేసులు నమోదౌతాయనీ, అరెస్టు చేస్తారనీ అనుమానం వ్యక్తం చేసిన ఆయన నందకుమార్ ఫిర్యాదు మేరకే తనపై కేసులు పెడతారన్నారు. అయినా ఫామ్ హౌస్ లో డబ్బుల చెలామణియే జరగలేదనీ, అలాంటప్పుడు కేసులు ఎలా పెడతారనీ కూడా ప్రశ్నించారు.   అసలు వాస్తవానికి రోహిత్ రెడ్డి నందకుమార్ ద్వారా బీజేపీ పెద్దలు తనను ప్రలోభపెట్టారనీ, పార్టీ మారితే వందకోట్లు ఇస్తామని ప్రతిపాదించారనీ ఆరోపించారు. ఇంతకీ ఈ నందకుమార్ స్వయంగా రోహిత్ రెడ్డికి పార్టనర్. ఈ నేపథ్యంలోనే ఫామ్ హౌస్ కేసులో ఇంత వరకూ బయటపడని మరింత లోతైన వ్యవహారం ఉందన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఆ అనుమానాలన్నీ కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణలో వెల్లడౌతాయని పరిశీలకులు అంటున్నారు. అలా వెల్లడౌతాయన్నకంగారు రోహిత్ రెడ్డి మాటల్లో బయటపడుతోందనీ అంటున్నారు.  మొత్తం మీద సిట్ దర్యాప్తు తో బీఆర్ఎస్ నేతల్లో కనిపించివన ధీమా ఇప్పుడు హైకోర్టు తీర్పుతో సీబీఐ రంగంలోనికి దిగనుండటంతో ఆవిరైపోయినట్లే ఉంది. 

covid The threat is looming

కొవిడ్ ప్రమాదం పొంచే వుంది తస్మాత్ జాగ్రత్త

చైనా, జపాన్‌ సహా పలు ప్రపంచ దేశాల్లో కల్లోలం సృష్టిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ప్రభావం మన దేశంలో అంతగా ఉండదు,  మనం భయపడవలసిన అవసరం లేదు. జాగ్రత్తగా ఉంటే సరిపోతుందని అటు వైద్య రంగ నిపుణులు, అధికారులు భావిచారు. కానీ, తాజా పరిణామాలను గమనిస్తే, కేవలం అప్రమత్తత సరిపోదని, తగిన  ముందు జాగ్రత్త చర్యలు, ఆంక్షలు అనివార్యమయ్యే పరిస్థితి  తప్పదని అంటున్నారు. ముఖ్యంగా విదేశాల నుంచి వస్తున్న ప్రయాణీకులతో  కొత్త వేరియంట్ వ్యాప్తి వేగంగా జరిగే ప్రమాదం ఉందని తెలుస్తోంది. అలాగే నూతన వేడుకల్లో తగిన జాగ్రత్తలు అవసరమని అంటునారు.   ఈ నేపధ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది.అలాగే, కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు దేశ వ్యాప్తంగా  వైద్య రంగం సన్నద్ధతపై  మంగళవారం(డిసెంబర్ 27) మాక్‌డ్రిల్‌ నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.  మరోవంక విదేశాల నుంచి వస్తోన్న ప్రయాణికులకు ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు తప్పని సరి చేసింది. అలాగే  విమానాశ్రయాల్లో వెలుగు చూస్తున్న  పాజిటివ్‌ కేసులు విషయంలో తక్షణ చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా వారి కాంటాక్టులను ట్రేస్‌ చేయడం ద్వారా కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు అధికారులు ప్రాధాన్యతన ఇస్తున్నారు.అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, ఎక్కడిక్కడ, ఎప్పటికప్పడు అవసరమైన తక్షణ చర్యలు తీసుకుంటున్నాయి.  ముఖ్యంగా విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికులకు విమానాశ్రయాల్లో కొవిడ్‌ పరీక్షలు చేస్తుండటంతో పలువురికి పాజిటివ్‌గా తేలుతోంది. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో 12 మందికి పాజిటివ్‌గా తేలినట్టు అధికారులు తెలిపారు. డిసెంబర్‌ 24న 2867మందికి పరీక్షలు చేయగా.. వారిలో 12మందికి పాజిటివ్‌గా తేలింది. వీరి నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపినట్టు కర్ణాటక ఆరోగ్యమంత్రి సుధాకర్‌   వెల్లడించారు.  బిహార్‌లోని గయ విమానాశ్రయంలో నలుగురు విదేశీయులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. వీరిలో ముగ్గురు మయన్మార్‌ నుంచి రాగా.. ఒకరు బ్యాంకాక్‌ నుంచి వచ్చినట్టు గుర్తించారు. వారందరిలోనూ లక్షణాల్లేవని.. ఐసోలేషన్‌లో ఉన్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.  మూడు రోజుల క్రితం చైనా నుంచి దిల్లీ మీదుగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రాకు వచ్చిన 40 ఏళ్ల వ్యక్తికి కొవిడ్‌-19 సోకిన విషయం తెలిసిందే. అయితే, అతడిని దిల్లీ నుంచి ఆగ్రాకు తీసుకొచ్చిన ట్యాక్సీ డ్రైవర్‌ను అధికారులు గుర్తించారు. కరోనా సోకిన వ్యక్తి ఆరోగ్యం నిలకడగానే ఉందన్నారు. అతడితో కాంటాక్టు అయిన 27మందిని గుర్తించి వారి నమూనాలను సేకరించారు. అలాగే, కోల్‌కతా విమానాశ్రయంలో రెండు కొవిడ్‌ కేసుల్ని గుర్తించారు. వీరిలో ఒకరు దుబాయి నుంచి డిసెంబర్‌ 24న రాగా.. మరొకరు మలేషియాలోని కౌలాలాంపూర్‌ నుంచి వచ్చారని అధికారులు తెలిపారు. ఇద్దరి  శాంపిల్స్‌ను సేకరించి జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ ల్యాబ్‌కు పంపినట్టు కోల్‌కతా విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. విదేశాల నుంచి వస్తున్న వారితో  ముప్పు పొంచి ఉందని గుర్తించిన అధికారులు విమానాశ్రయాల్లో ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు తప్పని సరి చేశారు.  మరోవంక నూతన సంవత్సరం వేడుకలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వాలు ముందు జాగ్రత్త చర్యలకు ఉపక్రమించాయి. అందులో భాగంగా కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మాస్కును తప్పనిసరి చేస్తున్నట్టు వెల్లడించింది. సినిమా థియేటర్లు, పాఠశాలలు, కళాశాలల్లో మాస్కులు తప్పనిసరి చేసింది. న్యూఇయర్‌ వేడుకల్లో పబ్‌లు, రెస్టారంట్లు, బార్లలో మాస్కు తప్పనిసరిగా ధరించాల్సిందేనని కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి వెల్లడించారు. నూతన సంవత్సర వేడుకలకు అర్ధరాత్రి 1గంట వరకే అనుమతి ఉంటుందన్నారు. కరోనా వల్ల ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని.. ముందు జాగ్రత్తలు పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అలాగే, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితిపై ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజినీ, సీఎస్‌ జవహార్‌ రెడ్డి ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు.  ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం ఇప్పటికే అప్రమత్తమైంది. ఆస్పత్రి పరిసరాల్లో మాస్కులను తప్పనిసరి చేసినట్టు డిప్యూటీ సీఎం బ్రజేశ్ పాఠక్‌ వెల్లడించారు.. అన్ని రద్దీ ప్రాంతాల్లో మాస్కు ధరించాలని ఆయన ప్రజలను కోరారు.  ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్‌ న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీచేసింది. సిబ్బంది, అధికారులు, న్యాయవాదులు తప్పనిసరిగా మాస్కు ధరించాలని ఆదేశాలు జారీచేసింది. మాస్కు ధరించిన వారికే లోపలికి అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది.కాగా దేశంలో   సోమవారం(డిసెంబర్ 26) దేశ వ్యాప్తంగా 35,173 టెస్టులు చేశారు.198 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో యాక్టివ్‌ కేసుల సంఖ్య 3428కి చేరింది. నిన్న 190మంది కోలుకోవడంతో ప్రస్తుతం రికవరీ రేటు 98.8శాతంగా ఉందని అధికారులు తెలిపారు.

tdp strengthen in telangana

తెలంగాణలో మరో చంద్రోదయం

తెలంగాణలో తెలుగుదేశం పార్టీని  మళ్లీ బలోపేతం చేసేందుకు, పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రయత్నాలకు ప్రజల నుంఛి, ఎలాంటి స్పందన వచ్చిందో ఖమ్మం సభ రుజువు చేసింది. అనూహ్యంగా సభ సక్సెస్ అయింది. అదొక ఎత్తయితే, కేవలం ప్రజల నుంచే కాదు, రాజకీయ పార్టీలు, నాయకుల నుంచి కూడా తెలుగు దేశం పార్టీకి ప్రత్యక్ష, పరోక్ష మద్దతు లభిస్తోందని నాయకుల ప్రకటనలు సూచిస్తున్నాయి. ఒక విధంగా సెంటిమెంట్ తెర తొలిగి పోయిన నేపథ్యంలో, తెలంగాణలో మరో చంద్రోదయం ఖాయంగా కనిపిస్తోందని పరిశీలకులు భావిస్తున్నారు.  నిజానికి  ఇతర పార్టీలలో ఉన్న మాజీ టీడీపీ నేతలు ఇప్పటికే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ టచ్ లోకి వెళ్లి నట్లు సమాచారం. అందులో ప్రస్తుతం అధికార బీఆర్ఎస్  కీలక నేతలుగా చెలామణి అవుతున్న నాయకులు కూడా  ఉన్నారని అంటున్నారు. అంతేకాదు ఇప్పటికే కారు దిగి సైకిల్  ఎక్కే కొందరి పేర్లు  రాజకీయ వర్గాల్లో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అలాగే  పీసీసీ అధ్యక్షడు రేవంత్ రెడ్డి ఆయన వర్గానికి చెందిన నేతలు సహా  గతంలో తెలుగు దేశం పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహించి, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కీలక పదవుల్లో ఉన్న ముఖ్యనేతలు కొదంరు తెలుగు దేశం అడుగులను గమనిస్తున్నారని, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. అలాగే  బీజేపీలోని  టీడీపీ మాజీ నాయకులు పసుపు చొక్కాలు పైకి తీస్తున్నారని అంటున్నారు.  అయితే ఇదంతా ఒకెత్తు అయితే  టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే  మాజీ తెరాస మంత్రి ఈటల రాజేందర్  టీడీపీ రీఎంట్రీ పై కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి టీడీపీ అధినేత చంద్రబాబుకు తెలంగాణ రాజకీయాల్లో రీఎంట్రీకి అవకాశం కల్పించారని అన్నారు. అంతే కాదు. కేసీఆర్ ఇచ్చిన అవకాశాన్ని చంద్రబాబు గొప్పగా ఉపయోగించుకుంటారని అన్నారు. తెలంగాణ సక్సెస్ అవుతారని జగ్గా రెడ్డి చెప్పు కొచ్చారు. మరోవంక బీజేపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి ఈటల రాజేందర్  తెలుగుదేశం పార్టీకి తెలంగాణ వాసన, పునాది రెండు ఉన్నాయని అన్నారు. అలాగే టిడిపి ఏమీ నిషేధించిన పార్టీ కాదని, తెలుగు దేశం పార్టీని దేశ వ్యాప్తంగా విస్తరిస్తామని గతంలో చంద్రబాబు కూడా చెప్పారని ఈటల రాజేందర్ గుర్తుచేశారు. తెలుగుదేశం పార్టీ ఎప్పటినుంచో ఉన్న పార్టీ అని పేర్కొన్న ఈటల దేశంలో ప్రతి పార్టీకి ఎక్కడైనా సభ పెట్టుకునే హక్కు ఉంటుందని స్పష్టం చేశారు.తెలంగాణ రాష్ట్రంతో టిడిపికి సంబంధం ఉంది కాబట్టే చంద్రబాబు తెలంగాణలో సభలు పెడుతున్నారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు .ప్రజలు టీడీపీని ఆదరిస్తున్నారని కూడా అన్నారు. అంతే కాకుండా తెలంగాణలో టీడీపీ, బీజేపీ పొత్తుకు సంబంధించి ఈటల ఆచి తూచి స్పందించారు.అవునని కాదని అనకుండా, బీజేపీ తెలంగాణలో ఒంటరిగానే విజయం సాధిస్తుందనే విశ్వాసం వ్యక్తం చేశారు.  అయితే పొత్తుల విషయం ఎలా ఉన్నప్పటికీ  తెలుగు దేశం పార్టీ  తెలంగాణలో మళ్ళీ ఒక బలమైన రాజకీయ శక్తిగా ఎదుగుతుందని ఇటు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి  అటు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్  ప్రకటించడం రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు ఆస్కారం కలిపిస్తోందని పరిశీలకులు భావిస్తున్నారు. ముఖ్యంగా బీజేపీ ఎమ్మెల్యే ఈటల మాటలు దేనికి సంకేతం  అనే చర్చ ఇప్పటికే జోరందుకుంది. ఈటల మాట తీరు, బాడీ లాంగ్వేజ్ గమనిస్తే, బీజేపీ టీడీపీల మధ్య పొత్తు పొడిచే సంకేతాలు స్పష్టమవుతున్నాయని పరిశీలకులు పేర్కొంటున్నారు. అదెలా ఉన్నప్పటికీ, ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబు చుట్టూ తిరుగుతున్నాయి. నిజానికి, మొదటి నుంచి కూడా తెలంగాణలో తెలుగు దేశం పార్టీకి ప్రజా బలం, క్యాడర్ నాయకత్వ బలం పుష్కలంగా ఉన్నాయి. అయితే, ఇంతవరకు తెలంగాణ సెంటిమెంట్ తో తెలంగాణ చంద్రుడు (కేసీఆర్) ఓ వెలుగు వెలిగారు. జగ్గారెడ్డి అన్నట్లుగా ఇప్పడు కేసీఆర్ స్వయంగా సెంటిమెంట్ కు టాటా చెప్పేశారు. కేసేఆర్ తెలంగాణ సెంటిమెంట్ ను వదిలేయడంతో తెలంగాణ రాజకీయ ఆకాశంలో మరో స్వయం ప్రకాశిత చద్రోదయం (చంద్రబాబు) అయ్యే సమయం ఆసన్నమైందని  పరిశీలకులు అంటున్నారు. అలాగే  మరో రెండు మూడు నెలల్లోనే రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం పూర్తిగా  మారి పోతుందని పరిశీలకులు జోస్యం చెపుతున్నారు.

double shock to sarkar

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు సర్కార్ కు డబుల్ షాక్

ఇటు భారతీయ జనతా పార్టీ, (బీజేపీ) అటు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) రెండు పార్టీల మధ్య, ఇంచుమించుగా సంవత్సరానికి పైగా సాగుతున్న రాజకీయ పోరాటం మరో మలుపు తిరిగింది. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా బీజీపీని టీఆర్ఎస్ /బీఆర్ఎస్ ఇరకాటంలోకి నెట్టిన సంగతి తెలిసిందే. ఇఫ్పుడు ఎమ్మెల్యేల బేరసారాల కేసులో రాష్ట్ర హై కోర్టు, కేసీఆర్ ప్రభుత్వానికి షాకిచ్చింది. కేసు విచారణను సిబిఐకి అప్పగించింది.రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ రాష్ట్రంలో కాలు పెట్టకుండా అడ్డుకునేందుకు  జనరల్  కన్సెంట్ రద్దు చేసినా, హై కోర్టు తీర్పుతో ఇప్పుడు సిబిఐ రాష్ట్రంలో ఎంటర్ అవుతుంది. ఇలా రెండు విధాలా రాష్ట్ర ప్రభుత్వానికి  హై కోర్టు డబల్ షాక్ ఇచ్చింది.   కేసు విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విచారణ బృందం ( సిట్) విచారణ పై విశ్వాసం లేదని, విచారణ పారదర్శకంగా జరగట్లేదని, కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ కేసులో నిందితులుగా ఉన్న నంద కుమార్, అనుమానితుడిగా ఉన్న అడ్వకేట్ శ్రీనివాస్‌తో పాటు మరో వ్యక్తి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన రాష్ట్ర హై కోర్టు,. కేసును సీబీఐకి అప్పగిస్తూ సంచలన తీర్పు నిచ్చింది.  నిజానికి  సిట్ దర్యాప్తును బీజేపీ మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తోంది. ఈ నేపధ్యంలోనే సిట్ విచారణపై అనుమానాలున్నాయని ఈ కేసును సీబీఐకి అప్పగించాలని పిటిషనర్ తరపు న్యాయవాదులు, హైకోర్టును కోరారు. న్యాయవాదుల వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం సీబీఐకి ఆర్డర్ చేస్తూ స్పష్టమైన ఆదేశాలిచ్చింది. ప్రస్తుతం ఎమ్మెల్యేల కొనుగోలు కేసును హైదరాబాద్ సీపీ ఆనంద్ నేతృత్వంలోని సిట్ విచారణ చేస్తోంది. ఇప్పుడు ఈ కేసును హైకోర్టుకు అప్పగించడంతో విచారణను తిరిగి మొదటి నుంచి ఆరంభించే అవకాశం ఉంది.  అధికార టీఆర్‌ఎస్‌/బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను రూ.400 కోట్లతో కొనుగోలు చేసేందుకు కొందరు చేసిన యత్నాన్ని సైబరాబాద్‌ పోలీసులు భగ్నం చేసిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యేల కొనుగోలుకు యత్నించిన మధ్యవర్తులను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.  టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు పైలెట్‌ రోహిత్‌రెడ్డి (తాండూరు), గువ్వల బాలరాజు (అచ్చంపేట), బీరం హర్షవర్ధన్‌రెడ్డి (కొల్లాపూర్‌), రేగా కాంతారావు (పినపాక)ను ఢిల్లీకి చెందిన కొందరు వ్యక్తులు సంప్రదించారు. పార్టీ ఫిరాయిస్తే వారికి ఒక్కొక్కరికీ రూ.100 కోట్ల చొప్పున ఇస్తామని.. దాంతోపాటు కాంట్రాక్టులు కూడా ఇప్పిస్తామని ప్రలోభానికి గురిచేసేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన ఎమ్మెల్యేలు దీనిపై తమకు ఫిర్యాదు చేశారని.. తమకు డబ్బులు, కాంట్రాక్టులు, పదవులు ఎర చూపించి పార్టీ మారాలని బలవంతం చేస్తున్నారని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఇచ్చిన సమాచారం మేరకు పక్కా ప్రణాళిక ప్రకారం వల పన్ని ఈ ఆపరేషన్‌ నిర్వహించాం అని స్టీఫెన్‌ రవీంద్ర వెల్లడించారు. ఫరీదాబాద్‌ ఆలయానికి చెందిన రామచంద్ర భారతి అలియాస్‌ సతీశ్‌ శర్మ, మరొకరు తిరుపతికి చెందిన సింహ యాజులు, హైదరాబాద్‌కు చెందిన నందకుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈకేసు విచారణకు ఏర్పాటు చేసిన ‘సిట్’ ఏర్పాటు విషయంలో  మొదటి నంచి అనుమనాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ నేతృత్వంలో ఆరుగురు అధికారులతో ఏర్పాటు సెహ్సిన  సిట్  కూర్పు, విషయంలో అనుమనాలు వ్యక్తమయ్యాయి. అలాగే, సిట్ అధికార పరిధిని దాటి తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పద  మయ్యాయి. న్యాయ స్థానాలు సైతం సిట్  గీత దాటిందని పేర్కొన్నాయి. కీలక కేసుల్లో సిట్‌ ఏర్పాటు సాధారణమే అయినా.. డీజీ స్థాయి అధికారి నేతృత్వంలో దర్యాప్తు బృందాన్ని నియమించడం రాష్ట్రంలో.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇదే తొలిసారి కావడంతో అనుమానాలు మరింతగా బలపడ్డాయి.  ఈ నేపధ్యంలోనే  విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు సిట్ దర్యాప్తు పారదర్శకంగా జరగట్లేదన్న పిటిషర్ల వాదనతో ఏకీభవించింది. ఈ కేసులో సిట్‌ను విచారణను తక్షణమే నిలిపివేయాలని ఆదేశిస్తూ.. సీబీఐకి అప్పగించాలని ఆదేశించింది. ఎలాంటి ఆలస్యం లేకుండా కేసుకు సంబంధించిన వివరాలను సీబీఐకి అప్పగించాలని తీర్పు వెలువరించింది. కాగా.. హైకోర్టు తీర్పుపై సిట్ అప్పీలుకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

భేటీకి సిద్ధం..!

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. మళ్లీ తెలుగుదేశం పార్టీ గుటికి తిరిగి వెళ్లిపోతారా? ఆ పార్టీ పగ్గాలు చేపట్టి.. తెలంగాణలో సైకిల్‌ని సవారీ చేయిస్తారా? అందుకోసం ఆయిన వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారా? ఆ క్రమంలో ఆయిన తనదైన శైలిలో పావులు కదుపుతోన్నారా? అంటే రాజకీయ విశ్లేషకులు అవునని అంటున్నారు. ఇటీవల చోటు చేసుకొన్న పరిణామాలే అందుకు సాక్ష్యమని వారు వివరిస్తున్నారు.     తాజాగా తెలంగాణ రాష్ట్రంలో వరుసగా రెండు పరిణామాలు చోటు చేసుకున్నాయని.. వాటిలో ఒకటి ఖమ్మంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు శంఖారావం పేరిట సభ నిర్వహించడం... ఆ సభ కాస్తా సూపర్ సక్సెస్ కావడం.. ఈ సభకు తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి భారీగా ప్రజలు తరలి రావడం.. అలాగే ఈ సభా వేదికపై నుంచి పార్టీని వదిలి వెళ్లిన వారు ఎవరైనా సరే.. తిరిగి రావొచ్చునంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు.. ఆ పార్టీని వదిలి వెళ్లిన వారి గుండెల్లో కొత్త ఆశలు చిగురించాయని రాజకీయ విశ్లేషకులు తమదైన శైలిలో పేర్కొంటున్నారు.   ఇక రెండోవది కాంగ్రెస్ పార్టీలోని సీనియర్లు.. సూపర్ సీనియర్లంతా.. తమకు కాకుండా... నిన్న కాక మొన్న పార్టీలోకి వలస వచ్చిన రేవంత్ రెడ్డికి టీపీసీపీ చీఫ్ పగ్గాలు కట్టబెట్టారంటూ.. హస్తం పార్టీలోని కురు వృద్దులంతా తనదైన శైలిలో అసమ్మతి గళం విప్పడం.. ఆ క్రమంలో ధర్నాలు, నిరసనలు, దాడులు.. ప్రతి దాడులకు హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌ కేరాఫ్ అడ్రస్‌గా మారిపోవడం.. దీంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల మాజీ బాధ్యుడు, హస్తం పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్.. ఎదుటే పంచాయతీ పెట్టడం.. దీంతో వారందరినీ ఈ డిగ్గీరాజా కూల్‌గా.. సైలెంట్‌ చేశారని రాజకీయ విశ్లేషకులు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.    ఇంకోవైపు తమను వలసవాదులన్నారంటూ ములుగు ఎమ్మెల్యే సీతక్క, వేం నరేంద్రరెడ్డి తదితరులంతా.. తమ పదవులకు రాజీనామా చేసి.. హస్తం పార్టీ గెలుపు కోసం కృషి చేస్తామన్నారని.. అదీకాక పీసీసీ చీఫ్ పదవి ఇవ్వలేదంటూ ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హస్తం పార్టీ వీడి.. బీజేపీలోకి జంప్ కొట్టగా.. త్వరలో ఆయన సోదరుడు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సైతం కాషాయం కండువా కప్పుకోనేందుకు సమయత్తమయ్యారని.. వారు ఈ సందర్బంగా పేర్కొంటున్నారు.   మరోవైపు తొలుత రేవంత్ రెడ్డి టీడీపీలోనే ఉన్నారని.. ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఆయిన వరుస విజయాలను సైతం అందుకున్నారని.. కానీ రాష్ట్ర విభజన జరగడం.. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఆయన హస్తం పార్టీ గుటికి చేరాల్సి వచ్చిందని రాజకీయ విశ్లేషకులు ఈ సందర్బంగా సోదాహరణగా విపులీకరిస్తున్నారు.   అలా హస్తం పార్టీలోకి వెళ్లిన రేవంత్‌రెడ్డికి టీపీసీసీ చీఫ్‌గా ఢిల్లీ అధిష్టానం పగ్గాలు అప్పగించిందని.. అయితే తెలంగాణ తెచ్చింది కారు పార్టీ అధినేత కేసీఆరే అయినా.. ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చింది మాత్రం సోనియా గాంధీ అంటూ ప్రజల్లోకి వెళ్లి బలంగా చెప్పుకోలేని స్థితిలో ఉన్న హస్తం పార్టీ నేతలకు.. రేవంత్ రెడ్డి ఓ బలమైన గొంతుకగా మారారని.. ఆ క్రమంలో ఆయిన హస్తం పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకు వెళ్లడమే కాకుండా.. కాంగ్రెస్ పార్టీ పేరుతో సభలు, పాదయాత్రలు చేస్తూ.. తెలంగాణలో ఆ పార్టీని కాంగ్రెసుగుర్రంలా దౌడు తీయిస్తున్నారని ఈ సందర్బంగా రాజకీయ విశ్లేషకులు  అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే తన బహిరంగ సభలకు లక్షలాది మంది ప్రజలను రేవంత్ రెడ్డి స్వచ్చందంగా రప్పించుకోగలుగుతోన్నారు కానీ.... పార్టీలోని నేతలను మాత్రం ఒక తాటిపైకి తీసుకురావడంలో ఆయన పూర్తిగా విఫలమవుతున్నారని వారు విశ్లేషిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో హస్తం పార్టీలోనే ఉండి.. ఆ పార్టీ నేతలతో చెయ్యి.. చెయ్యి కలిపి.. కలిసి నడవడం కంటే.. సైకిల్ పార్టీలోకి వెళ్లిపోయి.. తన పాత మిత్రులతోపాటు వివిధ పార్టీల్లో ఉన్న అసంతృప్తి జీవులను సైతం మళ్లీ పసుపు పార్టీలోకి తీసుకు వచ్చి.. వారందరిని ఏకం చేసి.. అడుగులో అడుగు వేసుకొంటూ కలిసి నడిస్తే.. సైకిల్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావచ్చుననే ఓ ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.   అదీకాక టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌కి ఆయన ప్యామిలీకి ఇప్పటికే బీజేపీతో వ్యవహారం ఉప్పు నిప్పుగా ఉందని... అలాగే టీఆర్ఎస్ కాస్తా బీఆర్ఎస్‌గా మారడంతో.. ఆ పార్టీలోని తెలంగాణను వదిలేసి.. కేసీఆర్ ఢిల్లీకి వెళ్లిపోయారంటూ ఓ ప్రచారం అయితే ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో తెగ హల్‌చల్ చేస్తోందని వారు ఈ సందర్బంగా గుర్తు చేస్తున్నారు. అయితే ఈ ఇలాంటి సమయంలో బీజేపీకి ఏమో కానీ.. సైకిల్ పార్టీకి మాత్రం మంచి బలం పుంజుకోనే సమయమని వారు విశ్లేషిస్తున్నారు. ఓ వేళ రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీని వీడి..తన పాత పార్టీలోకి వెళ్లితే.. సైకిల్ పార్టీ దెబ్బకు కారు పార్టీ.. తెలంగాణలో షికారు చేయడం కష్టమని.. అలాగే కాషాయ పార్టీ నేతలకు సైతం అసలు సిసలు బొమ్మ.. ఈస్ట్‌మన్ కలర్‌లో పోలిటికల్ స్క్రీన్ మీద కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు తమదైన శైలిలో ఓ అంచనా వేసి మరీ  చెబుతున్నారు.

ఏపీలో ఎస్సీఎస్టీ నియోజకవర్గాలపై శ్రీ ఆత్మసాక్షి సర్వే.. ఏం తేల్చిందంటే..

జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. అది విభిన్న రూపాల్లో వ్యక్తమవుతోంది. దాంతో జగన్ పాలనకు చరమగీతం పాడేందుకు వచ్చే ఎన్నికలే అత్యంత కీలకం. అయితే ఆ క్రమంలో అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వీనియోగం చేసుకొంటూ..  జగన్ పార్టీలోని లోపాలను.. ప్రతిపక్ష టీడీపీ... బలంగా ప్రజల్లోకి తీసుకొని వెళ్లగలిగితే.. సైకిల్ సవారీ చేసినంత ఈజీగా..  తెలుగుదేశం పార్టీ అధికార పీఠాన్ని హస్తగతం చేసుకోగలుగుతుంది.  అయితే ప్రతి నియోజకవర్గంలోని టీడీపీ ఇన్‌చార్జులను నియమించడం.. అలాగే ఇన్‌చార్జులు లేని నియోజకవర్గంలో వారిని నియమించడం.. వారి ద్వారా నియోజకవర్గ స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు లీడర్ నుంచి కేడర్ వరకు అందరిని ఒకే తాటిపైకి తీసుకు వస్తేనే విజయం తెలుగుదేశం సొంతం అవుతుంది. ఈ విషయాన్ని శ్రీ ఆత్మసాక్షి సంస్థ (ఎస్ఎఎస్) నిర్వహించిన సర్వే  తేటతెల్లం చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో 29 ఎస్సీ , 7 ఎస్టీ నియోజకవర్గాలు ఉన్నాయి.   ఆయా నియోజకవర్గాల్లో అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి, ప్రతిపక్ష టీడీపీ పరిస్థితిపై శ్రీ ఆత్మసాక్షి ( ఎస్ ఏ ఎస్ ) గ్రూప్ సర్వే ప్రకారం   ఎస్సీ నియోజకవర్గాల విషయానికి వస్తే...    ఈ నెల 24 వరకూ నిర్వహించిన సర్వేలో పార్టీల పరిస్థితి, ఏ నియోజకవర్గంలో ఏ పార్టీ పై చేయి సాధిస్తుంది. జనసేన, తెలుగుదేశం పార్టీల మధ్య పొత్తు ఉంటే ఏ మౌతుంది. పొత్తే లేకుండా ఆ రెండు పార్టీలూ వేర్వేరుగా రంగంలోకి దిగితే ప్రయోజనం సిద్ధించేది ఏ పార్టీకి తదితర అంశాలపై   ఆసక్తి కర ఫలితాలు వెలువడ్డాయి.  కొన్ని ఎస్సీ నియోజకవర్గాలలో అధికార వైసీపీ తీవ్ర ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నప్పటికీ.. ఆ  పార్టీ ప్రజా విశ్వాసాన్ని కోల్పోయినప్పటికీ, ఆయా నియోజకవర్గాలలో  తెలుగుదేశం పార్టీ పరిస్థితి కూడా అంత ఆశాజనకంగా లేదు. గెలవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్పప్పటికీ ఆ అవకాశాలను అందిపుచ్చుకునే స్థాయిలో తెలుగుదేశం పని తీరు లేదు. ఇలాంటి 15 నియోజకవర్గాలపై తెలుగుదేశం  మరింత నిశిత దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. శ్రీ ఆత్మసాక్షి సర్వే ప్రకారం పార్వతీపురం, పి.గన్నవరం, అమలాపురం, గోపాలపురం, చింతలపూడి, పామర్రు, తిరువూరు, సత్యవేడు, అలాగే పూతలపట్టు, రైల్వే కోడూరు, ప్రత్తిపాడు, మడకశిర, నంది కొట్కూరు, గంగాధర నెల్లూరు నియోజకవర్గాలలో అధికార వైసీపీ ప్రజా విశ్వాసాన్ని  కోల్పోయింది.  ఆయా నియోజకవర్గాలలో తెలుగు దేశం పని తీరు కూడా అంతంత మాత్రంగానే ఉంది. 2024 ఎన్నికలలో మంచి ఫలితాలు సాధించాలంటే ఈ నియోజకవర్గాలపై తెలుగుదేశం మరింత ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఇక మొత్తంగా చూస్తే రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ నియోజకవర్గాలలో తెలుగుదేశం కంటే వైసీపీ అనుకూల వోటే ఎక్కువగా ఉంది. అయితే 2019 ఎన్నికలతో పోలిస్తే ఎస్సీఎస్టీ మైనారిటీలలో యువ వోటర్ల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఇక  కొన్ని అసెంబ్లీ స్థానాలలో ప్రభుత్వ వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకోవడంలో తెలుగుదేశం విఫలమైంది. అలాగే బలహీనమైన నియోజకవర్గ  ఇన్ చార్జల కారణంగా ఈ సీట్లలో తెలుగుదేశం వెనుకబడింది. ప్రస్తుత ఇన్ చార్జీల పని తీరు పట్ల పార్టీ క్యాడర్ లోనూ ప్రజలలోనూ అసంతృప్తి గూడుకట్టుకుంది.  శ్రీ ఆత్మసాక్షి సర్వే ప్రకారం రాష్ట్రంలోని ఎస్సీ నియోజకవర్గాల వారీగా ఫలితాలిలా ఉన్నాయి...   శ్రీకాకుళం జిల్లా రాజాంలో వైసీపీ కంటే తెలుగుదేశందే పై చేయిగా ఉంది. ఇక్కడ అధికార వైసీపీ కంటే తెలుగుదేశం వైపు 3.7శాతం మొగ్గు కనిపిస్తోంది. అయితే కొంత మంది తెలుగుదేశం నాయకుల పని తీరు సంతృప్తి కరంగా లేదు.  తెలుగుదేశం ఇన్ చార్జ్ కి సహకారం అందించడం లేదు. మొత్తంగా రాజాం నియోజకవర్గ  తెలుగుదేశంలో గ్రూపు రాజకీయాలు ఉన్నాయి.  అలాగే విశాఖపట్నం జిల్లా పాయకరావు పేట నియోజకవర్గం విషయానికి వస్తే ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే పని తీరు పట్ల తీవ్ర అసంతృప్తి ఉంది. తెలుగుదేశం కంటే ఇక్కడ వైసీపీకి 30 శాతం తక్కువగా  అనుకూలత కనిపిస్తోంది. మొత్తం మీదఈ నియోజకవర్గంలో  హోరాహోరీ పోరు ఉంటుంది. పాయకరావు పేట నియోజకవర్గంలో జనసేనకు 18 శాతం ఓటు బ్యాంకు ఉందన్న అంచనాల ప్రకారం ఈ నియేజకవర్గంలో జనసేనతో పొత్తు లేకుండా పోటీ చేస్తే  తెలుగుదేశం ఒటమి పాలయ్యే అవకాశాలే మెండుగా ఉన్నాయి. అదే వైసీపీ 2024 ఎన్నికలలో ఈ స్థానంలో కొత్త అభ్యర్థిని నిలబెడితే కనుక సమీకరణాలు మారిపోయే అవకాశాలు ఉన్నాయి.  ఇక విజయనగరం జిల్లా పార్వతీపురం అసెంబ్లీ స్థానం విషయానికి వస్తే.. ఇక్కడ తెలుగుదేశం, వైసీపీల మధ్య గట్టి పోటీ ఉంది. ఇరు పార్టీల మధ్య కేవలం 1.5శాతం ఓట్ల తేడా మాత్రమే ఉంది. ఇక్కడ వైసీపీకి 1.5 శాతం మొగ్గు కనిపిస్తోంది. అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జల్లా రాజోలు నియోజకవర్గం విషయానికి వస్తే.. ఇక్కడ జనసేన పార్టీకి 4 శాతం మెగ్గు కనిపిస్తోంది. ఈ స్థానంలో తెలుగుదేశం పార్టీ మూడో స్థానానికే పరిమితమౌతుంది.   ఇదే జిల్లా పీ. గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే పనితీరు 30 శాతం కంటే తక్కువగా ఉంది. ఈ నియోజకవర్గంలో వైసీపీ కంటే తెలుగుదేశం, జనసేనల పరిస్థితి మెరుగ్గా ఉంది. అయితే ఓట్ల చీలిక కారణంగా వైసీపీకి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. అలాగే అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీకి ఇన్ చార్జి లేడు. స్థానిక ఎమ్మెల్యే పనితీరు పట్ల వ్యతిరేకత ఉంది. ఇక్కడి ఎమ్మెల్యేకు 27 శాతం కంటే తక్కువ మద్దతు ఉంది. ఈ నియోజకవర్గంలో తెలుగుదేవం, జనసేన పార్టీలకు ప్రజామద్దతు ఉంది. ఇక్కడ వైసీపీ మూడో స్థానానికే పరిమితం కాక తప్పదు. అయితే ఇక్కడ గెలుపు అన్నది తెలుగుదేశం, జనసేన పొత్తుపై ఆధారపడి ఉంటుంది. ఈ నియోజకవర్గంలో జనసేనకు 16 శాతం ఓటు షేరు ఉంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గలో ప్రస్తుతానికి తెలుగుదేశం కంటే 4.5 శాతం మొగ్గు ఎక్కువ ఉంది. ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పని తీరు ఏ మాత్రం మెరుగ్గా లేదు. తెలుగుదేశం ఈ నియోజకవర్గ ప్రజల విశ్వాసాన్ని పొందడంలో విఫలమైంది. ఈ నియోజకవర్గంలో  మెరుగైన ఫలితం సాధించాలంటే.. ప్రజల విశ్వాసాన్ని పొందిన వ్యక్తిని ఇన్ చార్జిగా నియమించాల్సి ఉంది. ఇదే జిల్లాలోని గోపాల పురం నియోజకవర్గంలో తెలుగుదేశం పట్ల ప్రజా విశ్వాసం బొత్తిగా తక్కువగా ఉంది. ఇక్కడి తెలుగుదేశం ఇన్ చార్జిపై ప్రజా వ్యతిరేకత గరిష్టంగా ఉందని సర్వే తేల్చింది. వైసీపీపై కూడా ప్రజా వ్యతిరేకత ఉన్నప్పటికీ ఇక్కడ తెలుగుదేశం పార్టీకి అవకాశాలు లేవని సర్వే ఫలితం పేర్కొంంది. ఇక్కడ మెరుగైన ఫలితం సాధించాలంటే తెలుగుదేశం పార్టీ సమర్ధుడైన అభ్యర్థిని నిలబెట్టాల్సి ఉంది.  ఇక నెల్లూరు జిల్లా గూడూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే పని తీరు 20శాతం కంటే దిగువన ఉంది. ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పనీ తీరు ఏ మంత ఆశాజనకంగా లేదు.  ప్రస్తుత ఎమ్మెల్యే ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. ఇక్కడ కనుక వైసీపీ కొత్త అభ్యర్థిని నిలబెడితే 2024 ఎన్నికలో ఆ పార్టీ విజయం సాధిస్తుంది. తెలుగుదేశం ఇక్కడ మెరుగైన ఫలితం సాధించాలంటే మాత్రం ప్రస్తుత ఇన్ చార్జిని మార్చి 2024 ఎన్నికలలో కొత్త అభ్యర్థిని నిలబెట్టాలి. ఇదే జిల్లా సూళ్లూరు పేట నియోజకవర్గంలో కూడా వైసీపీకే స్వల్ప ఆధిక్యత కనిపిస్తోంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ కంటే వైసీపీకి 3.5శాతం ఓటు షేరు ఆధిక్యత ఉంది. ఇక్కడ తెలుగుదేశం ఇన్ చార్జి పని తీరు కారణంగా ఆ పార్టీ ప్రజా విశ్వాసాన్ని పొందడంలో విఫలమైంది. ఇక్కడ  తెలుగుదేశం పుంజుకోవాలంటే బాగా కష్టపడటంతో పాటు వ్యూహాత్మకంగా ముందుకు సాగాలి. లేదా కొత్త ఇన్ చార్జ్ ని నియమించాలి. ప్రకాశం జిల్లా కొండెపి విషయానికి వస్తే.. ఇక్కడ వైసీపీ కంటే తెలుగుదేశం పార్టీకే మొగ్గు కనిపిస్తోంది. వైపీసీ కంటే 4.5 శాతం అధిక ఓటు షేరుతో  తెలుగుదేశం ముందుంది. వైసీపీ పని తీరు పట్ల ప్రజలలో వ్యతిరేకత అధికంగా ఉంది. ఈ నియోజకవర్గంలో వైసీపీ కొత్త అభ్యర్థిని నిలబడితే సమీకరణాలు మారే అవకాశాలు ఉన్నాయి. ఇదే జిల్లా సంతనూతల పాడు అసెంబ్లీ నియోజకవర్గంలోసిట్టింగ్  ఎమ్మెల్యే పని తీరు పట్ల ప్రజలలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమౌతోంది. తెలుగుదేశం పని తీరు కూడా ఏమంత మెరుగ్గా లేదు. ఈ నియోజకవర్గంలో పరిస్థితిని మెరుగు పరుచుకోవడానికి తెలుగుదేశం మరింత దృష్టి పెట్టాలి. ప్రస్తుతానికి అయితే తెలుగుదేశం పని తీరు సంతృప్తికరంగా లేదు. వైసీపీ కనుక ఇక్కడ కొత్త అభ్యర్థిని ప్రవేశపెడితే సమీకరణాలు మారే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే సంతనూతల పాడు నియోజకవర్గంలో వైసీపీ కంటే తెలుగుదేశం పార్టీ  1 నుంచి 1.5 శాతం ఓటు షేరుతో ఆధిక్యత కనబరుస్తోంది.  ఇక ఎర్రగొండ పాలెం అసెంబ్లీ నియోజకవర్గంలో  ప్రస్తుతం వైసీపీ మెరుగైన స్థితిలో ఉంది. తెలుగుదేశం పార్టీ కంటే నాలుగు శాతం ఓటు షేరు ఆధిక్యతతో ఉంది. ఈ నియోజకవర్గంపై తెలుగుదేశం ఇన్ చార్జి మరింత దృష్టి పెట్టి  అలాగే అన్ని సమాజిక వర్గాలకూ పార్టీని చేరువ చేయడానికి వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సి ఉంది. లేకుంటే  ఎర్రగొండ పాలెం వైసీపీ ఖాతాలో పడుతుంది. అనంతపురం జిల్లా  సింగనమల అసెంబ్లీ నియోజకవర్గం విషయానికి వస్తే ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే పని తీరు పట్ల ప్రజా వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉంది. ఇక్కడ తెలుగుదేవం పార్టీ 2.5శాతం అధిక వోటు షేరుతో ఆధిక్యత కనబరుస్తోంది. అయితే తెలుగుదేశం ఇన్ చార్జికి కొంత మంది పార్టీ నాయకులు సహకరించడం లేదు. నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో గ్రూపు తగాదాలు ఉన్నాయి. ఇక్కడ పార్టీ హై కమాండ్ ప్రత్యేక దృష్టి సారించి గ్రూపు రాజకీయాలను కంట్రోల్ చేయాల్సన అవసరం ఉంది.  మడకశిర నియోజకవర్గంలో ప్రస్తుతానికి తెలుగుదేశం కంటే మొగ్గు వైసీపీ వైపే ఉంది. ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం ఇన్ చార్జి పని తీరు అసంతృప్తికరంగా ఉంది.  ఈ నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయడానికి అవసరమైన చర్యలు చేపట్టి క్యాడర్ లో ఉత్సాహాన్ని నింపాల్సి ఉంది. చిత్తూరు జిల్లా సత్యవేడు  నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం కంటే వైసీనీ 4శాతం ఓటు షేరుతో ముందంజలో ఉంది. ఈ నియోజకవర్గంలో సరైన ఇన్ చార్జిని నియమించడంలో తెలుగుదేశం విఫలమైంది. ప్రస్తుత ఇన్ చార్జితో ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం 2024 ఎన్నికలలో విజయం సాధించే అవకాశాలు లేవు. ఈ నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు ఒకింత భిన్నంగా ఉన్నాయి. ఇక్కడ వైసీపీ, తెలుగుదేశం పార్టీలకు వచ్చే ఎన్నికలో పోటీ చేసేందుకు సరైన ఎస్సీ అభ్యర్ది అవసరం ఉంది. ఇదే జిల్లా పూతల పట్టు నియోజకవర్గంలో కూడా 4.5 శాతం ఓట్ల షేరుతో తెలుగుదేశం కంటే వైసీపీ ఆధిక్యత కనపరుస్తోంది. ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బలమైన ఇన్ చార్జిని నియమించడమే కాకుండా, పార్టీ క్యాడర్ లో ఉత్సామాన్ని నింపక పోతే పూతల పట్టు వైపీసీ ఖాతాలో పడే అవకాశాలే మెండుగా ఉన్నాయి. ఇక గంగాదర నెల్లూరు విషయానికి వస్తే.. ఇక్కడ వైసీపీ కంటే  తెలుగుదేశం  వైపు మొగ్గు కనిపిస్తోంది. ప్రస్తుత ఎమ్మెల్యే తీవ్ర ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు.  అయితే ఇక్కడ ప్రజలలో విశ్వాసం కల్పించడంలో తెలుగుదేశం ఇన్ చార్జ్ విఫలమయ్యారు. ఇక్కడ 2024లో మెరుగైన ఫలితం సాధించాలంటే తెలుగుదేశం పార్టీ పటిష్టతపై దృష్టి సారించాలి. దే సమయంలో అవసరం అనుకుంటే ఇక్కడ కొత్త అభ్యర్థిని నిలబెట్టాలి.  గుంటూరు జిల్లా తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి వైసీపీ కంటే 3.25శాతం ఓటు షేరుతో ముందుంది. అయితే ఈ నియోజకవర్గంలో కొందరు తెలుగుదేశం నాయకులు ప్రస్తుత ఇన్ చార్జికి సహకరించడం లేదు. ఈ నియోజకవర్గంలో గ్రూపు తగాదాలపై తెలుగుదేశం అధిష్టానం దృష్టి సారించాల్సి ఉంది.  ఇదే జిల్లా వేమూరు నియోజకవర్గంలో వైసీపీ తీవ్ర ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. ప్రస్తుత ఎమ్మెల్యే పని తీరు పట్ల ప్రజలలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమౌతోంది. ప్రస్తుతం వైసీపీ కంటే 2.75శాతం ఓటు షేరుతో తెలుగుదేశం ఆధిక్యత కనబరుస్తోంది.  ఇక ప్రత్తిపాడు నియోజకవర్గంలో కూడా వైసీపీ ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. ప్రస్తుత ఎమ్మెల్యే పని తీరు పట్ల ప్రజలలో అసంతృప్తి వ్యక్తమౌతోంది. అదే సమయంలో తెలుగుదేశం ఇన్ చార్జి ఇక్కడ ప్రజా విశ్వాసం పొందడంలో విఫలమయ్యారు. ఇక్కడ మెరుగైన ఫలితం సాధించాలంటే టీడీపీ ఇన్ చార్జిని మార్చాల్సి ఉంటుంది. లేకుంటే ఈ నియోజకవర్గం వైసీపీ ఖాతాలో పడే అవకాశం ఉంది. కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే పని తీరు పట్ల ప్రజా వ్యతిరేకత వ్యక్తమౌతోంది. ఇక్కడ తెలుగుదేశంలో గ్రూపు తగాదాలు ఉన్నాయి. అలాగే నియోజకవర్గ ఇన్ చార్జి పని తీరు కూడా సంతృప్తికరంగా లేదు. ప్రస్తుతం ఇక్కడ తెలుగుదేశం పార్టీ కంటే 4.75 శాతం ఓటు షేరు ఆధిక్యతతో వైసీపీ ముందుంది.  కొడుమూరు నియోజకవర్గం విషయానికి వస్తే ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీ కంటే వైసీపీ 1.25 శాతం ఓటు షేరుతో ఆధిక్యత కనబరుస్తోందిజ ఇక కృష్ణా జిల్లా పామర్రు నియోజవకర్గంలో అయితే తెలుగుదేశం కంటే వైసీపీ మెరుగైన పరిస్థితిలో ఉంది.  ఇక్కడ  అధికార పార్టీ పట్ల 6.25శాతం అధిక ఓటు షేరుతో మొగ్గు కనిపిస్తోంది. ఈ నియోజకవర్గంలో పుంజుకోవాలంటే తెలుగుదేశం మరింత దృష్టి పెట్టి ప్రజలకు చేరువ కావడానికి కష్టపడాలి. అలాగే నందిగామ నియోజకవర్గంలో కూడా వైసీసీ 1.75శాతం ఓటు షేరుతో తెలుగుదేశం కంటే మెరుగైన స్థితిలో ఉంది. అధికార పార్టీపై తీవ్ర ప్రజా వ్యతిరేకత ఉన్నప్పటికీ దానికి అనుకూలంగా మార్చుకోవడంలో తెలుగుదేశం పార్టీ విఫలమైంది. ఈ నియోజకవర్గంపై తెలుగుదేశం మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ప్రజలలో విశ్వాసం కల్పించడమే కాకుండా పార్టీ బలో పేతానికి చర్యలు తీసుకోవలసిన అవసరం ఉంది.  తిరువూరులో ప్రస్తుతానికి   తెలుగుదేశం, వైసీపీల మధ్య తీవ్ర పోటీ ఉంది. ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం, వైసీపీల మధ్య ఓటు షేరు శాతం కేవలం1.25 శాతం మాత్రమే.  ఇక్కడ ఇరు పార్టీలూ ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. కడప జిల్లా బద్వేల్ విషయానికి వస్తే ఇక్కడ  వైసీపీ ఇన్ చార్జి, క్యాడర్ పని తీరు తెలుగుదేశంతో పొలిస్తే 9 శాతం మెరుగ్గా ఉంది. తెలుగుదేశం  ఇన్ చార్జి పని తీరు ఏ మాత్రం సంతృప్తి కరంగా లేదు. ప్రజా విశ్వాసం చూరగొనడంలో పార్టీ ఇన్ చార్జ్ క్యాడర్ విఫలమయ్యారు.  రైల్వే కోడూరు అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీయే అధిక్యత కనబరుస్తోంది. తెలుగుదేశం పార్టీ కంటే 2.5శాతం ఓటు షేరుతో ముందుంది. ఈ నియోజకవర్గ తెలుగుదేవం ఇన్ చార్జ్ ప్రజా విశ్వాసం చూరగొనడంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.  తొలుత ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండ నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో ప్రస్తుత అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ప్రతిపక్ష టీడీపీ కంటే 5 శాతం ఓట్ల షేర్‌తో ముందంజలో ఉంది. స్థానికంగా టీడీపీ పని తీరు ఆశించిన స్థాయిలో లేదు.... అలాగే స్థానిక నియోజకవర్గ ఇన్‌చార్జ్ సైతం.... పార్టీ కేడర్‌తోపాటు ప్రజల్లో ఆత్మ విశ్వాసం నింపడంలో ఘోరంగా విఫలమయ్యారు. ఈ నేపథ్యంలో సదరు నియోజకవర్గంపై టీడీపీ మరింత దృష్టి సారించాల్సి ఉంది.  ఇక ఉమ్మడి విజయనగరంలోని కురుపాం నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో ప్రస్తుత అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయింది. అలాగే ప్రస్తుత ఎమ్మెల్యే పనితీరుపై దాదాపు 30 శాతం మంది ప్రజలు పెదవి విరుస్తున్నారు. మరోవైపు ఈ నియోజకవర్గ ప్రజల్లో.. ఈ ప్రభుత్వంపై బాగానే అసంతృప్తి గూడు కొట్టుకొని ఉంది. ఇక స్థానిక తెలుగుదేశం పార్టీలో గ్రూప్ రాజకీయాలతో సతమతమవుతోంది. అంతేకాదు.. ఈ నియోజకవర్గానికి సరైన టీడీపీ ఇన్‌చార్జ్‌ కూడా లేకపోవడం ఇక్కడ గమనించాల్సిన విషయం.  అలాగే సాలూరు అసెంబ్లీ నియోజకవర్గం. ఇక్కడ టీడీపీ కంటే అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3.5 శాతం ఓట్ల షేరుతో అధిక్యంలో ఉంది. అయితే ప్రస్తుత పార్టీ ఇన్‌చార్జ్‌ మరింత కష్టపడడంతోపాటు.. పార్టీ కేడర్‌లోనే కాకుండా ప్రజల్లో సైతం విశ్వాసాన్ని కల్పిస్తే.. విజయం నల్లేరు మీద నడకలా సాగిపోనుందనేది సుస్పష్టం.  ఇక ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని అరకు నియోజకవర్గంలో అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య 2 శాతం ఓట్ల షేరింగ్ ఉంది. దీంతో ఈ నియోజకవర్గంలో ఇరు పార్టీల మధ్య హోరా హోరి పోరాటం జరగుతోంది.  అయితే ప్రస్తుతం.. టీడీపీ కంటే అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిక్యంలో ఉంది. ఇక స్థానిక ప్రస్తుత టీడీపీ ఇన్‌చార్జీ.. సరైన పనితీరు కనబరచడం లేదు. అంతేకాదు.. పార్టీ కేడర్‌లో సైతం సరైన రీతిలో ఆత్మవిశ్వాసం నింపలేకుండా సదరు ఇన్ చార్జ్ ఉన్నారు. మరోవైపు గ్రామ, మండల స్థాయిలోని కేడర్ సైతం..ఈ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌కు సరైన రీతిలో సహకరించడం లేదు. ఈ నేపథ్యంలో సదరు నియోజకవర్గంపై టీడీపీ మరింత ప్రత్యేక శ్రద్ద కనబరచాల్సి ఉంది.  అలాగే ఇదే జిల్లాలోని పాడేరు నియోజకవర్గంలో అటు అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇటు ప్రతిపక్ష టీడీపీ పరిస్థితి దొందు దొందుగానే ఉన్నాయి. ఇక్కడ ఈ రెండు పార్టీల నాయకులు పనితీరు ఏ మాత్రం బాగోలేదనే చెప్పాలి. అధికార వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పనితీరు 35 శాతం కంటే తక్కువగానే ఉన్నట్లు స్పష్టమవుతోంది. అలాగే గ్రూప్ రాజకీయాలతో.. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సతమతమవుతోంది. ఇక టీడీపీ ఇన్‌చార్జ్ పనితీరు సైతం ఆశించిన స్థాయిలో అయితే లేదు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఈ నియోజకవర్గ పలితం మాత్రం.. ఇరు పార్టీలు నిలబెట్టే అభ్యర్థులపై ఆధారపడి ఉంటాయన్నది సుస్పష్టంగా గోచరిస్తోంది. ఇక ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గంలో వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పనితీరు.. 25 శాతం కంటే తక్కువగానే ఉంది. అలాగే ఈ నియోజకవర్గంలో ప్రభుత్వ వ్యతిరేకత ఉందని సాక్షాత్తూ ఎమ్మెల్యేకు సైతం అర్థమైపోయింది. మరోవైపు టీడీపీ పనితీరు సైతం ఏ మాత్రం బాగోలేదు. అంతేకాదు.. బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపడంలో సైతం.. సైకిల్ పార్టీ ఘోరంగా విఫలమైంది. అయితే ఈ నియోజకవర్గంలో గెలుపు కోసం మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. అయితే వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలవాలంటే మాత్రం ప్రస్తుత ఇన్‌చార్జీని ముందుగా మార్చాలని.. అలాకాకుంటే.. సైకిల్ పార్టీ గెలుపు చాలా కష్టమని స్పష్టమవుతోంది.  ఇక పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏకైక ఎస్టీ నియోజకవర్గం...పోలవరం. ఈ నియోజకవర్గంలో టీడీపీ కంటే.. వైయస్ఆర్ సీపీ 5 శాతం ఓట్లతో ముందంజలో ఉంది. అయితే ప్రస్తుత టీడీపీ ఇన్‌చార్జీ అయితేనేమీ.. పార్టీ కేడర్ అయితేనేమీ ప్రజల్లోకి బలంగా వేళ్లింది అయితే లేదు. అంతేకాదు.. ఓటర్లు, ప్రజల విశ్వాసం చూరగొనడంలో.. ఆ పార్టీ ఘోరంగా విఫలమైంది. ఈ నేపథ్యంలో ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలవాలంటే మాత్రం బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపాల్సిందే.  అయితే వచ్చే ఎన్నికల్లో రంపచోడవరం, పాడేరు, కురుపాం, పార్వతీపురం నియోజకవర్గాల్లో తెలుగుదేశం జెండా రెపరెపలాడాలంటే మాత్రం.. ఆయా నియోజకవర్గాల్లో సరైన అభ్యర్థిని అనేకంటే బలమైన అభ్యర్థులను బరిలోకి దింపాలి. అలాగే నియోజకవర్గ ఇన్‌చార్జులు..  ఓవైపు తమ పనితీరును మెరుగుపరుచుకొంటూ.. మరోవైపు పార్టీలోని వారందరిని ఒకే తాటిపైకి తీసుకురావడం కోసం కృషి చేయాలి. తద్వారా సైకిల్ పార్టీ గెలుపు సునాయాసం అవుతోందని శ్రీ ఆత్మ సాక్షి నిర్వహించిన సర్వే ద్వారా తేటతెల్లమవుతోంది.

రంగా చుట్టూ ఏపీ రాజకీయం

వంగవీటి మోహన్ రంగా.. పరిచయం అవసరం లేని పేరు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ రాజధానిగా పేరొందిన బెజవాడ ( విజయవాడ)కు ఎంత పేరుందో, బెజవాడ కేంద్రంగా రాజకీయ చక్రం తిప్పిన, దివంగత కాపు నేత వంగవీటి మోహన రంగాకూ అంతే పేరుంది.  అప్పుడే కాదు  ఆయన కన్నుమూసి మూడు దశాబ్దాలకు పైగా అయిన ఈ నాటికీ, రంగా పేరు ఏపీలో  పొలిటికల్  వైబ్రేషన్స్ సృష్టిస్తున్నది. నిజానికి,  రంగాను కాపులు మాత్రమే కాదు బడుగు బలహీన వర్గాలు పేదలందరూ తమ ఆరాధ్య దైవంగా భావిస్తారు. రాజకీయ పండితులు బడుగు బలహీన వర్గాలు పొలిటికల్ లెజెండ్ గా రంగాను అభివర్ణిస్తారు. ఆయన అకాల మరణం తరువాత ఆ స్థాయి  ఉన్న బలమైన నాయకుడు కాపులకు లభించలేదు. అయితే మోహన్ రంగా భౌతికంగా లేకున్నా..ఆయన ఇచ్చిన స్ఫూర్తి అంతా ఇంతా కాదు. ఎన్నికలు వచ్చిన ప్రతి సారీ రంగా పేరు మార్మోగుతుంది.ఇప్పడూ అదే జరుగుతోంది. అందరి వాడుగా పేదల గుండెల్లో నిలిచిన రంగా మావాడంటే మావాడు అని తమ సొంతం చేసుకునేందుకు రాజకీయ పార్టీలు పోటీ పడుతున్నాయి. రంగా బొమ్మ పెట్టుకుని కాపులు, బడుగు బలహీనవర్గాల వారి ఓట్లను కొల్ల గొట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. రంగా కన్నుమూసిన తర్వాత  జరిగిన ప్రతి ఎన్నికలోనూ రంగా పేరు గెలుపు ఓటములను నిర్ణయించే ఒక ఫాక్టర్ గా నిలిచింది అంటే అతిశయోక్తి కాదు. నిజానికి రాష్ట్రంలో ఇప్పడు ఎన్నికలు లేవు, కానీ, ఎన్నిక వాతావరణం వుంది. అందుకే రంగా వర్ధంతి సందర్భంగా రాజకీయ చలి మంటలు భగ్గుమంటున్నాయి. అందుకే  పార్టీలు, పార్టీలకు అతీతంగా నాయకులు  పోటీపడి మరీ రంగాకు జై కొడుతున్నారు. వంగవీటి మోహనరంగా వర్ధంతి సందర్భంగా, విజయవాడలో రంగా విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పిస్తున్నారు. అదలా ఉంటే, గతంలో రంగా పేరు చెప్పుకుని ఓట్లు దండుకున్న వైసీపీ, ఆ తర్వాత రంగా వారసుడు, ఆయన కుమారడు వంగవీటి రాధాకృష్ణకు అన్యాయం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు గుర్తు చేస్తున్నారు. రాధాకృష్ణకు టిక్కెట్ ఇవ్వకుండా జగన్ మోసం‌ చేశారని.. ఇప్పుడు ఆ పార్టీ నాయకులు రాజకీయ అనవసరాల కోసం డైలాగ్ లు చెబుతున్నారని రంగా, రాధా అభిమానులు ఆక్షేపిస్తున్నారు. రాధా సేవలను తొమ్మిదేళ్లు ఉపయోగించుకుని, జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో మొండి చేయి చూపించారని, అయిఆ ఆనాడు నోరు విప్పని వైసీపీ నాయకులు ఆయన్ని ఎందుకు ప్రశ్నించలేదు .. ఈ రోజు ఏముఖం పెట్టుకుని, రంగా వర్దంతికి వచ్చారని  వంగవీటి అభిమానులు వైసీపీ  నేతలను ప్రశ్నిస్తున్నారు.  అందుకే  రాధా, రంగా అభిమానులు వచ్చే ఎన్నికల్లో జగన్‌కు తగిన బుద్ది చూపుతారని పరిశీలకులు అంటున్నారు. కొత్త జిల్లాకు రంగా పేరు పెట్టాలని‌ కోరినా..  జగన్ స్పందించ లేదని,  వైఎస్సార్‌సీపీ నాయకులపై  ఫైర్’ అవుతున్నారు. మరోవంక  ఈ సంవత్సరం మొదట్లో  వంగవీటి రాధ హత్యకు ‘రెక్కి’ జరిగిన నేపధ్యంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రాబాబు నాయుడు స్వయంగా ఇంటికి వెళ్లి పలకరించడమే కాకుండా.. అండగా ఉంటామని హామీ ఇచ్చారు. నిజానికి రాధా తెలుగు దేశం పార్టీ సభ్యుడిగా కొనసాగుతున్నారు. అందుకే, రంగా అభిమానులు మరో మారు, తెలుగుదేశం విజయం కోసం కృషి చేస్తామని రాగా సాక్షిగా ప్రమాణం చేస్తున్నారు.

ఏపీ బీజేపీలో ముసలం.. జల్లా అధ్యక్షుల మార్పుపై రగడ

అధిష్ఠానం మాటే శిరోధార్యం.. క్రమశిక్షణ కు మారు పేరు.. ఇదీ నిన్న మొన్నటి దాకా బీజేపీపై జనాలలో సాధారణంగా ఉన్న అభిప్రాయం.  అయితే ఈ అభిప్రాయాన్ని మార్చుకోక తప్పని అనివార్య పరిస్థితులను స్వయంగా ఆ పార్టీ అగ్రస్థానమే కల్పిస్తోంది. గతానికి భిన్నంగా పార్టీ తలుపులు బార్లా తెరిచేసి సిద్ధాంత సారూప్యత ఇసుమంతైనా లేని పార్టీల నుంచి వచ్చి చేరుతున్న నాయకులకు రెడ్ కార్పెట్ పరుస్తోంది. దీంతో బీజేపీ గతంలోలా అధిష్ఠానం ఏం చెబితే దానికి తలూపేసి క్రమశిక్షణతో మెలిగే నాయకుల సంఖ్య రాను రాను మారిపోతోంది. గతంలో బీజేపీ ఏ పార్టీ సంస్కృతినైతే వేలెత్తి చూపి ప్రత్యామ్నాయంగా ఎదిగిందో..  ఇప్పుడు అదే కాంగ్రెస్ సంస్కృతిని అనుసరిస్తూ.. ఆ పార్టీని మించి పోయింది. ఇక తాజాగా ఏపీ బీజేపీలో లుకలుకలు బయటపడ్డాయి. ఏపీ బీజేపీ జిల్లా కమిటీల మార్పు విషయంలో పార్టీలో తిరుగుబావుటా ఎగిరింది. ప్రస్తుత అధ్యక్షుడు సోము వీర్రాజు పదవీ కాలం ఇంకా ముగియకుండానే, ఆయన పదవిలో ఉండగానే జిల్లా కమిటీల మార్పు ప్రక్రియ మొదలు కావడం బీజేపీలో అసమ్మతి, అసంతృప్తి జ్వాలలు ఎగసిపడేలా చేసింది. జిల్లా అధ్యక్షుల మార్పునకు రాష్ట్ర నాయకత్వం శ్రీకారం చుట్టగానే అసమ్మతి భగ్గు మంది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి మురళీధరన్ కు ఇష్టం లేకుండానే, ఆయన ప్రమేయం లేకుండానే  పెద్ద ఎత్తున జిల్లా అధ్యక్షులనుమార్చేందుకు రాష్ట్ర నాయకత్వం నడుం బిగించింది.   పార్టీ నిబంధనల ప్రరాకం  ఓటింగు ద్వారా  ఎన్నికల ప్రక్రియలో గెలిచిన తమను తొలగించి,   నామినేషన్ పద్ధతిలో మరొకరిని నియమించేందుకు సోము వీర్రాజు చేస్తున్న ప్రయత్నాలను పార్టీ లో  మెజారిటీ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.    బీజేపీ జాతీయ అధ్యక్షుడు నద్దా తో పాటే రాష్ట్రాల పార్టీ అధ్యక్షుల పదవీ కాలం కూడా వచ్చే ఏడాది ఫిబ్రవరితో ముగియనుంది.   నిన్న మొన్నటి వరకూ బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా మరోసారి నడ్డాకు అవకాశం ఖాయమన్న ప్రచారమే జరుగుతూ వచ్చింది. అయితే హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ పరాజయంతో సీన్ రివర్స్ అయ్యింది. సొంత రాష్ట్రంలో పార్టీని విజయపథంలో నడిపించలేని  నడ్డా ఇక జాతీయ స్థాయిలో బీజేపీని ఎలా గెలిపించగలరన్న విమర్శలు వెల్లువెత్తుతున్న నేపపథ్యంలో నడ్డాకు స్థాన  భ్రంశం తప్పదన్నప్రచారం జోరందుకుంది.   నడ్డా స్థానంలో అమిత్‌షాకు సన్నిహితుడైన కేంద్రమంత్రి భూపేందర్ యాదవ్‌ను పార్టీ అధ్యక్షునిగా ఎన్నుకునే అవకాశాలున్నయన్న ప్రచారం ఇప్పుడు జరుగుతోంది.  ఈ నేపథ్యంలోనే రాష్ట్రాల అధ్యక్షుల మార్పు చర్చ కూడా జరుగుతోంది. ఆ చర్చలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు ఉద్వాసన ఖాయమని వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే  జిల్లా అధ్యక్షుల మార్పు ప్రక్రియకు ఏపీ బీజేపీ రాష్ట్ర నాయకత్వం శ్రీకారం చుట్టడం కలకలానికి కారణమైంది. తమను తప్పించి నామినేషన్ ద్వారా కొత్త అధ్యక్షులనున నియమించేందుకు ససేమిరా అంగీకరించబోమంటూ వారు తిరుగు బావుటా ఎగుర వేస్తున్నారు. ఒకవైపు సోము వీర్రాజునే తొలగిస్తున్నారన్న ప్రచారం జరుగుతుంటే, ఆయన తమను ఏ విధంగా తొలగిస్తారని  జిల్లా అధ్యక్షులు  నిలదీస్తున్నారు.