rangam moovie scene in guntur

రంగం చిత్రం సీన్ గుంటూరు సభలో ఆవిష్కృతం

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గుంటూరులో నిర్వహించిన సభలో రంగం సినిమాలోని సీన్ ఆవిష్కృతమైందని రఘురామకృష్ణం రాజు తెలిపారు . రాజకీయంగా కుట్రలు ఎలా జరుగుతాయో, రంగం చిత్రంలో చాలా స్పష్టంగా చూపించడం జరిగింది. సభ నుంచి చంద్రబాబు నాయుడు నిష్క్రమించగానే, ఉయ్యూరు ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేదలకు తమ వంతు సేవ చేయాలని ఉద్దేశంతో చీరల పంపిణీ ప్రారంభించారు. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే చీరల పంపిణీ ప్రారంభించి ఉంటే, అప్పుడే ఈ సీన్ ను సృష్టించి ఉండేవారేమో. కానీ ఆయన వెళ్లిపోయిన తర్వాత పేదలకు చీరలు పంపిణీ చేపట్టారు. కొందరు సభికుల్లో కలసిపోయి ఇతర పార్టీల కార్యకర్తలతో చేరిపోయి తోపులాట జరిపితే, తొక్కిసలాట జరిగే అవకాశం ఉంది. గుంటూరు సభలో సరిగ్గా ఇదే జరిగి ఉంటుందని వైసీపీ రెబల్ ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కందుకూరు లో జరిగిన సభలో జరిగిన తొక్కిసలాట ఘటన మర్చిపోకముందే, మరొక ఘటన చోటు చేసుకోవడం పరిశీలిస్తే పోలీసు వైఫల్యం, ప్రభుత్వ కుట్ర స్పష్టంగా కనిపిస్తోంది. వరుస సంఘటనలను పరిశీలిస్తే, ఈ ఘటన వెనుక కుట్ర కోణం తేట తెల్లం అవుతుంది. ఈ సంఘటన జరిగిన వెంటనే 15 మంది మంత్రులు మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం అనుమానాలకు తావునిస్తోంది. మృతుల బంధువులను పట్టుకొని చంద్రబాబు నాయుడు సభలకు తమ వారిని బలవంతంగా తరలించారని చెప్పించడం విస్మయాన్ని కలిగిస్తోంది. ఎందుకంటే మృతులను చంద్రబాబు నాయుడు సభకు బలవంతంగా తరలించారని బంధువులకు, మృతి చెందిన వారు చెప్పే అవకాశమే లేదు. అటువంటప్పుడు బలవంతంగా తరలించారని చెబుతున్నారంటే అనుమానించక తప్పదు. మృతుల బంధువులతో ఫిర్యాదు చేయించగానే, పోలీసులు ఆఘమేఘాల మీద నిర్వాహకులపై లేదంటే చంద్రబాబు నాయుడు పై ఐపిసి 304 సెక్షన్ కింద కేసులు నమోదు చేస్తున్నారు. చంద్రబాబునాయుడి సభలు, రోడ్ షోలకు అశేషంగా జనం వస్తున్న నేపథ్యంలో ఆయన సభలు, ర్యాలీలు నిర్వహించుకునే అవకాశం లేకుండా చేసే కుట్రతో వైసీపీయే కుట్రలు పన్నుతోందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సాక్షాత్తూ వైసీపీ రెబల్ ఎంపీ రఘు రామకృష్ణం రాజే ఈ అనుమానాలు వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో రోడ్లపై రోడ్ షోలు, ర్యాలీలను నిషేధిస్తూ ఉత్తర్వులు రాకముందే రఘురామకృష్ణం రాజు ప్రభుత్వం వీటిని నిషేధించే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. సోమవారం రచ్చ బండ కార్యక్రమంలో ఆయనీ మాట చెప్పారు.  అలాగే మాజీ మంత్రి పేర్ని నాని అయితే చంద్రబాబు సభలు, సమావేశాలను నిషేధించాలని సోమవారం (జనవరి 2) డిమాండ్ చేశారు. అసలు సెక్యూరిటీ లేని సభలకు అనుమతి ఇవ్వొద్దని వైసీపీ మంత్రులు, మాజీ  మంత్రులు డిమాండ్ చేయడమే ఆశ్చర్యకరం. అసలు సెక్యూరిటీ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని వారికి తెలియదా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి సభలకు వేలాది మంది పోలీసులు సెక్యూరిటీ కల్పిస్తుండగా, చంద్రబాబు సభలకు  పదుల సంఖ్యలో కూడా పోలీసులు కూడా ఉండడం లేదు.  గుంటూరు సభలో  తొక్కిసలాట ఘటన జరిగిన వెంటనే వైసీపీ నాయకులు, మంత్రుల ప్రకటనలను పరిశీలిస్తే,  ఈ సంఘటన వెనుక రాజకీయ కుట్ర ఉందని అనిపించక మానదు.  

fake notes disbursed for old age penssions

పింఛన్ సొమ్ముకు దొంగనోట్లా.. ఎన్ఐఏ చేత విచారణకు ఆర్ఆర్ఆర్ డిమాండ్

పింఛన్ లబ్ధిదారులకు దొంగనోట్ల పంపిణీపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఐ) చేత విచారణ జరిపించాలని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు డిమాండ్ చేశారు. వృద్ధాప్య పింఛనుదారులు పంపిణీ చేసిన దొంగ నోట్ల వ్యవహారంతో ప్రభుత్వ పెద్దలకు నిజంగానే సంబంధం లేకపోతే ముఖ్యమంత్రి రవ్వంత చొరవ తీసుకొని ఎన్ఐఏ విచారణ కోసం లేఖ రాయాలన్నారు. సోమవారం(జనవరి 2)  రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. దొంగ నోట్ల పంపిణీతో పింఛన్ ప్రపంచం నిర్గాంత పోయింది. తమకిచ్చిన డబ్బులలో ఏమైనా దొంగ నోట్లు ఉన్నాయా? అని వృద్ధులు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవలసిన అనివార్య పరిస్థితి నెలకొందన్నారు. పింఛన్ సొమ్ముగా దొంగనోట్ల పంపిణీపై ఎన్ఐఏ దర్యాప్తు కోరుతూ తన వంతుగా లేఖ రాయనున్నట్లు చెప్పారు. వాలంటీర్లు దొంగ నోట్లు ఇస్తున్నారా?, లేకపోతే వారితో ఎవరైనా ఇప్పిస్తున్నారా? అన్న అనుమానం వ్యక్తం చేశారు. వృద్ధాప్య పింఛన్ లబ్ధిదారులకు ఇచ్చే నగదులో దొంగ నోట్లు ఎవరు కలిపారన్నది నిగ్గు తేలాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయిన తర్వాత మసిపూసి మారేడు కాయ చేసే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. అసలు దొంగ నోట్లు పంపిణీ చేసింది ఎవరు?, దీని వెనక ఏదైనా ముఠా ప్రమేయం ఉందా??, నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డుల ప్రకారం… దొంగ నోట్ల పంపిణీలో మన రాష్ట్రం మూడవ స్థానంలో ఉన్నట్టు తేలిందన్నారు. అసలు పింఛన్ లబ్ధిదారులకు బ్యాంకు అకౌంట్ ద్వారా డబ్బులను పంపిణీ చేయకుండా, నేరుగా నగదు పంపిణీ చేయడం వెనుక జగన్మోహన్ రెడ్డికి రాజకీయ దురుద్దేశం ఉందని రఘు రామకృష్ణంరాజు అన్నారు. ప్రతి నెల 1800 కోట్ల రూపాయల నగదును బ్యాంకు నుంచి డ్రా చేసి వాలంటీర్ల ద్వారా రాష్ట్రంలోని పింఛన్ లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నారు. ఇందులో ఐదు శాతం దొంగ నోట్లు కలిపి పంపిణీ చేసిన 80 కోట్ల రూపాయల దొంగ నోట్లు మార్కెట్ చలామణిలోకి వెళ్తాయన్నారు. తెలంగాణలో పింఛన్ లబ్ధిదారులకు పోస్ట్ ఆఫీస్ ల ద్వారా నగదు పంపిణీ చేస్తున్నారు. బాధ్యతాయుతమైన ప్రభుత్వ అధికారి, లబ్ధిదారుల వద్ద వేలి ముద్రలు తీసుకొని, నగదును అందజేస్తున్నారు. దీనితో దొంగ నోట్ల పంపిణీకి అసలు ఆస్కారమే లేదు. కానీ రాష్ట్రంలో ఇంటింటికి ఉదయాన్నే వెళ్లి, వాలంటీర్లు పింఛన్ డబ్బులను పంపిణీ చేస్తున్నారు. ఉదయాన్నే పంపిణీ చేయడం వల్ల , వాలంటీర్లు ఇచ్చే నోట్లను లబ్ధిదారులు సరిగ్గా పరిశీలించే అవకాశం లేదు. పింఛన్ లబ్ధిదారులకు నగదు పంపిణీ వెనుక రాజకీయ స్వలాభంతోపాటు, దొంగ నోట్ల చలామణి కోసం వాలంటీర్లు ఈ విధానాన్ని అణువుగా మలుచుకునే అవకాశం ఉంది. దొంగ నోట్లు చలామణి కావద్దని ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, పెద్ద నోట్లను రద్దు చేశారు. ప్రధానమంత్రి సదుద్దేశంతో తీసుకున్న ఈ నిర్ణయానికి తూట్లు పొడిచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని రఘురామకృష్ణం రాజు అన్నారు. అసలు మొదటి నుంచీ ఆంధ్రప్రదేశ్ లో వలంటీర్ల వ్యవహారం ఎప్పుడూ వివాదా స్పదంగానే ఉంది. ఎ తాజాగా ఓ వాలంటీర్.. తన పరిధిలో ఉన్న వారికి పించన్లను పంపిణీ చేశాడు. కానీ అవి దొంగ నోట్లుగా తేలవడం సంచలనం సృష్టిస్తోంది.    ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం నర్సయపాలెం ఎస్సి పాలెంలో వాలంటీర్ ఉదయమే వచ్చి పెన్షన్లు ఇచ్చాడు. ఆ నగదును కొంత మంది తమ బంధువులకు పంపేందుకు కమిషన్ తీసుకుని డబ్బులు ట్రాన్స్ ఫర్ చేసే దుకాణం వద్దకు వెళ్లి.. ఆ నోట్లు ఇచ్చారు. అయితే వాటిని నకిలీ నోట్లుగా దుకాణం యజమాని గుర్తించారు. దీంతో పింఛన్‌ దారులు అవాక్కయ్యారు. వెంటనే వాలంటీర్‌ని నిలదీయడంతో అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు అక్కడికి చేరుకొని ఆ నగదును వెనిక్కి తీసుకొని విచారిస్తున్నారు. మొత్తం రూ.19 వేలు దొంగ నోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.   వాలంటీర్ల చేతికి  ప్రభుత్వ ధనం పంపిణీకి ఇవ్వడమే చట్ట విరుద్ధం. అయినప్పటికీ ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం చట్ట విరుద్ధ విధానాలను యథేచ్ఛగా కొనసాగిస్తోంది.  మొత్తానికి పింఛన్లలో దొంగనోట్ల వ్యవహారం  సంచలనం రేపుతోంది.అసలు దోషులను పట్టుకోవాలంటే ఎన్ఐఏ విచారణ ఒక్కటే మార్గమని రఘురామ కృష్ణంరాజు వంటి వారు డిమాండ్ చేస్తున్నారు. 

metro rail employees strike

మెట్రో రైల్ ఉద్యోగుల మెరుపు సమ్మె

హైదరాబాద్ మెట్రో ఉద్యోగులు మెరుపు సమ్మెకు దిగారు. దీంతో మెట్రో ప్రయాణీకులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. వేతనాలు పెంచాలంటూ ఉద్యోగులు సమ్మెకు దిగడంతో టికెట్ ఇస్యూయింగ్ వ్యవస్థ దాదాపుగా స్తంభించిపోయింది.  మెట్రో స్టేషన్లలో పనిచేస్తున్న ఉద్యోగులకు కనీసం భోజనం చేయడానికి కూడా బ్రేక్ దొరకదని, రిలీవర్స్ రాక తామ తీవ్ర ఒత్తిడిలో ఉద్యోగం చేయాల్సిన దుస్థితిలో ఉన్నట్టు ఉద్యోగులు మండిపడుతున్నారు. తమకు కనీసం సెలవులు కూడా మంజూరు చేయటం లేదని ఆరోపిస్తున్నారు.  మియాపూర్ నుండి ఎల్బీ నగర్ వరకు మెట్రో స్టేషన్ లలో టికెటింగ్  వ్యవస్థ స్తంభించిపోయింది. మియాపూర్ నుండి ఎల్బీనగర్ వరకు రెడ్ లైన్ టికెటింగ్ ఉద్యోగుల విధుల బహిష్కరణతో ప్రయాణికులు అల్లాడిపోతున్నారు.  కాగా ఉద్యోగులు అయితే గత ఐదేళ్లుగా జీతాలు పెంచ,ఐదు సంవత్సరాలుగా 11 వేల రూపాయల వేతనంతో ఇబ్బందులు పడుతున్నామని అంటున్నారు. తక్షణమే తమ వేతనాలను .  18 వేలకు  పెంచాలని డిమాండ్ చేస్తూ సమ్మె బాట పట్టారు.   

ap government ban road shows

రోడ్ షోలు, ర్యాలీలపై ఏపీ సర్కార్ నిషేధం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుకున్నది చేసేసింది. రాష్ట్రంలో రోడ్లపై విపక్షాల సభలూ, ర్యాలీలు జరగడానికి వీల్లేదంటూ నిషేధం విధించింది. సభలూ సమావేశాలూ జరుపుకోవడానికి ప్రత్యామ్నాయ ప్రదేశాలను అన్వేషించాల్సిందిగా అధికారులను ఆదేశించింది. ఇక పై రాష్ట్రంలో ఎవరైనా సరే సభలూ సమావేశాలు జరుపుకోవాలన్నా, ర్యాలీలు నిర్వహించాలన్నా షరతులతో కూడిన అనుమతులు మాత్రమే ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. ప్రజలకు దూరంగా మాత్రమే రాజకీయ పార్టీలు సభలూ, సమావేశాలు జరుపుకోవాలన్నదే ప్రభుత్వ ఉత్వర్వుల అసలు ఉద్దేశంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.   ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్న రెండు సభలలో తొక్కిసలాట జరిగిన సంగతి విదితమే.  కందుకూరులో జరిగిన సంఘటనలో ఎనిమిది మంది మృతి చెందగా..  గుంటూరులో ముగ్గురు మృత్యువాత పడిన విషయం విదితమే.   ఈ సంఘటనలను సాకుగా తీసుకుని ఏపీలో సభలు, ర్యాలీ లు, రోడ్ షోలను ప్రభుత్వం నిషేధించింది. అయితే విపక్ష నేత పాల్గొన్న రోడ్ షో, సభలో తొక్కిసలాట జరగడానికి ప్రభుత్వ వైపల్యమే కారణమన్న విమర్శలను పట్టించుకోకుండా జగన్ సర్కార్ సభలు, ర్యాలీలను నిషేదించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు చంద్రబాబు సభలలో తొక్కిసలాటల వెనుక కుట్ర ఉందా అన్న అనుమానాలు వ్యక్తమౌతోన్నాయి.  ఒక రాజకీయ పార్టీ రోడ్ షోలలో, కానుకల పంపిణీ కార్యక్రమంలో స్వల్ప వ్యవధిలో తొక్కిస లాటలు జరిగిన సంఘటనలు   సందేహాలకు తావిస్తున్నాయి. ఇటీవల జరిగిన రెండు సంఘటనపైనా అధికార పార్టీ తప్ప.. మిగిలిన పార్టీలన్నీ రాజకీయాలకు అతీతంగా మృతుల కుటుంబాలకు అండగా నిలవాలని పిలుపు నిచ్చాయి. జరిగిన సంఘటన అత్యంత విషాదకరమని పేర్కొన్నాయి. కందుకూరు దుర్ఘటనపై ప్రధాని మోడీ సైతం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసి ఎక్స్ గ్రేషియా కూడా ప్రకటించారు. కానీ ఎవరూ రోడ్ షో ఎందుకు నిర్వహించారంటూ తెలుగుదేశం పార్టీపై విమర్శలు గుప్పించలేదు. రాజకీయ పార్టీగా సభలు, సమావేశాలు నిర్వహించిన విపక్షంపై విమర్శలు గుప్పించింది. ప్రచార యావతో విపక్ష నేత, తెలుగుదేశం అధినేత ఇరుకు సందుల్లో సభలు పెట్టడం వల్లనే తొక్కిసలాట జరిగిందని నిందలు వేసింది.  అంటే అధికార పార్టీ, ప్రభుత్వం విపక్షం ప్రజలలోకి రాకూడదని భావిస్తోందా?  అన్న ప్రశ్న తలెత్తింది.  భారీగా జనం హాజరయ్యే సభలకు, సమావేశాలకు,  కార్యక్రమాలకూ అది ప్రైవేటు కార్యక్రమమే అయినా బందోబస్తు ఏర్పాట్లు చేయడం ప్రభుత్వ బాధ్యత. ఆ బాధ్యతను విస్మరించి.. ఇరుకు సందుల్లో సభ పెట్టుకున్నారు. ప్రచార యావతో ప్రాణాలు తీసేస్తున్నారు అంటూ విమర్శలు గుప్పించడం ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పి పుచ్చుకోవడానికేనని పరిశీలకులు అంటున్నారు. అయినా చంద్రబాబు సభలలోనే ఈ అపశ్రుతులు జరగడం, చంద్రబాబు సభలలోనే పోలీసుల వైఫల్యం ప్రస్ఫుటంగా కనిపించడం, అలాగే గతంలో చంద్రబాబు రోడ్ షో సందర్భంగా ఆయనపై రాయితో దాడికి జరిగిన ప్రయత్నం, సొంత నియోజకవర్గం కుప్పంలో సైతం వైసీపీ శ్రేణులు కర్రలతో బాబు కాన్వాయ్ కు అతి సమీపంలోకి రావడం వంటి సంఘటనలన్నీ ఉద్దేశ పూర్వకంగా బాబు సభల సందర్భంగా భద్రతా ఏర్పాట్లను పోలీసులు గాలికి వదిలేశారా అన్న అనుమానాలు వ్యక్తం అయ్యేందుకు దోహదం చేస్తున్నాయి. సీఎం పర్యటనలు పరదాల మాటున జరుగుతున్నా.. బ్యారికేడ్ల ఏర్పాటు చేసి, వందల సంఖ్యలో మోహరించే పోలీసులు చంద్రబాబు సభలకు ఎందుకు వేళ్లతో లెక్కపెట్టగలిగేంత మంది కూడా ఉండటం లేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.చంద్రబాబు ఆషామాషీ నాయకుడేం కాదు. ఒక ప్రాంతీయ పార్టీ అధినేత, ఉమ్మడి ఏపీ, విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి. జడ్ ప్లస్ కేటగరి భద్రత ఉన్న నేత. అటువంటి నాయకుడి సభ విషయంలో ప్రభుత్వం కనీస భద్రతా ఏర్పాట్లు కూడా చేపట్టకపోవడం వెనుక ఉన్న కారణమేమిటి? నాలుగు దశాబ్దాలకు పైగా రాజకీయాలలో కొనసాగుతున్న చంద్రబాబుకు రోడ్ షోలు కొత్త కాదు. ఆయన సభలకు జనం పోటెత్తడమూ కొత్త కాదు. అయితే ఇలా వరుసగా ఆయన సభలలో తొక్కిసలాటలు జరగడం మాత్రం కొత్తే. తెలుగుదేశం పార్టీ  కార్యకర్తల సైన్యం బలంగా ఉన్న పార్టీ. క్రమశిక్షణ ఉన్న కార్యకర్తలు ఆ పార్టీకి ఉన్నారు. ఏటా మహానాడులు నిర్వహించుకుంటుంది. ఇటీవల ఒంగోలులో జరిగిన మహానాడుకు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. రాష్ట్రం నలుమూలల నుంచీ పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చినా చిన్న అవాంఛనీయ సంఘటన కూడా జరగలేదు. అటువంటిది చంద్రబాబు జిల్లా పర్యటనల్లో అదీ ఇటీవలి కాలంలో ఆ పార్టీ కార్యక్రమాలూ, సభలకూ జనం పోటెతుతున్న సమయంలో వరుస అవాంఛనీయ సంఘటనలు జరగడం, అదీ కేవలం ప్రభుత్వం సరైన భద్రతా చర్యలు చేపట్టకపోవడం వల్లనే కావడం అనుమానాలకు తావిస్తోంది.   ఇక గుంటూరు సభలో తొక్కిసలాట విషయానికి వస్తే.. కార్యక్రమాన్ని ప్రారంభించి, ప్రసంగించి చంద్రబాబు సభా స్థలిని వీడి వెళ్లిన తరువాత తొక్కిసలాట జరిగింది. జనం పెద్ద ఎత్తున హాజరౌతారని ముందే ఊహించిన నిర్వాహకులు దుస్తుల పంపిణీ లబ్ధిదారులందరికీ టోకేన్లు అందజేశారు. టోకెన్లు ఉన్న వారందరికీ పంపిణీ చేస్తామని విస్పష్టంగా చెప్పారు. అయితే.. దుస్తులు అయిపోవచ్చాయి, అందరికీ అందే అవకాశం లేదన్న వదంతులు వ్యాపించడం వల్లే తొక్కిసలాట జరిగిందని నిర్వాహకులు చెబుతున్నారు. ఇంతకీ ఆ వదంతులను వ్యాపింప చేసినది ఎవరు? అలాగే ఇలా తొక్కిసలాట జరిగిందో లేదో.. అలా వైసీపీ సామాజిక మాధ్యమం చంద్రబాబుపై దాడి ప్రారంభించేసింది. నిముషాల వ్యవధిలో తొక్కిస లాట వీడియోలు, తొక్కిస లాటకు చంద్రబాబే బాధ్యుడంటూ కొందరి స్పందనను వైసీపీ సోషల్ మీడియా పోస్టులతో హోరెత్తించేసిందిఅన్ని యూట్యూబ్ చానళ్లు.. మీడియాతో మాట్లాడిన మహిళలే మళ్లీ మళ్లీ మాట్లాడటం కూడా అనుమానాలకు తావిచ్చింది. తొక్కిసలాట జరుగుతుందని ముందే తెలిసి సర్వం సిద్ధంగా ఉన్నారా అనిపించేలా వైసీపీ హడావుడి ఉంది. కందుకూరు తొక్కిస లాట దుర్ఘటనలో మృతుల కుటుంబాలకు ప్రధాని ఎక్స్ గ్రేషియా ప్రకటించిన తరువాత కానీ స్పందించని ముఖ్యమంత్రి జగన్ గుంటూరు సంఘటన విషయంలో మాత్రం మంత్రి విడదల రజనిని ఆసుపత్రికి పంపి అక్కడి నుంచే తెలుగుదేశంపైనా, చంద్రబాబుపైనా విమర్శల దాడి చేయించారు.   గత మూడున్నరేళ్లుగా వైసీపీ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ తోనే పబ్బం గడుపుకుంటూ వస్తోంది. కోనసీమ జిల్లా పేరు మార్పుపై అమలాపురంలో ఆందోళనకారులు రెచ్చిపోయారు. ప్రశాంతంగా ఉండే పట్టణం ఒక్కసారిగా రగిలిపోయింది. ఆందోళనలు హింసాత్మకం రూపం దాల్చాయి. మంత్రి పినిపే విశ్వరూప్ ఇంటికి, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ క్యాంపు ఆఫీసుకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. ఐదు బస్సులను దగ్ధం చేశారు. పోలీసు వాహనాలపై రాళ్ల దాడి చేశారు. పలువురు పోలీసులు ఈ దాడిలో గాయపడ్డారు. ఎస్పీ తలకు గాయమైంది. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ ఆందోళన జరిగింది. అయితే  ఆ ఆందోళనలో పాల్గొన్న వారు, దాడులకు తెగబడిన వారు, విధ్వంసం సృష్టించిన వారు అందరూ వైసీపీకి చెందిన వారేనని తరువాత తేలింది. దీంతో సర్వత్రా ఆగ్రహం పెల్లుబికింది. దీని నుంచి దృష్టి మరల్చడానికి అప్పటి వరకూ ప్రశాంతంగా జరుగుతున్న రైతుల మహా పాదయాత్రకు అడ్డంకులు సృష్టించి, విశాఖ గర్జన అంటూ ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేసిందీ వైపీపీయే. ఇలా గత మూడున్నరేళ్లుగా ప్రభుత్వ తీరును గమనించిన ఎవరైనా తాజాగా చంద్రబాబు సభలలో జరిగిన తొక్కిసలాట సంఘటనల వెనుక కూడా అధికార పార్టీయే ఉందా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీకీ, చంద్రబాబుకూ పెరుగుతున్న ఆదరణ నేపథ్యంలో తొక్కిసలాటల వెనుక కూడా కుట్ర ఉందా అన్న అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి.  తొక్కిసలాటలు సాకు చూపి చంద్రబాబు సభలు, రోడ్ షోలకు అనుమతి నిరాకరించాలన్నది వైసీపీ సర్కార్ వ్యూహంగా పరిశీలకులు విశ్లేషణలు చేశారు. సరిగ్గా అదే జరిగింది. కాగా అన్ని వర్గాలు ప్రభుత్వ ఉత్తర్వులను తప్పుపడుతున్నాయి. రోడ్డు ప్రమాదం జరిగిందని రోడ్లపై ప్రయాణాలను నిషేధిస్తారా? అని నిలదీస్తున్నాయి.  

kamalnath statement a hurdle to unity of opposition

2024 సార్వత్రిక ఎన్నికలు రాహుల్ వర్సెస్ మోడీ

విపక్షాల ఐక్యత, రానున్న సార్వత్రిక ఎన్నికలలో మోడీని దీటుగా ఎదుర్కొనడమే లక్ష్యం అంటూ ముందుకు సాగుతున్న విపక్షాలకు కాంగ్రెస్ స్పీడ్ బ్రేకర్ గా మారింది. ఆ పార్టీ ఏకపక్షంగా విపక్షాల ఐక్యత విషయంలో చేస్తున్న ప్రకటనలు విపక్ష పార్టీల ఐక్యతకు ఆదిలోనే గండి కొట్టేలా ఉన్నాయి. రాహుల్ గాంధీ  భారత్ జోడో యాత్ర కారణంగా కాంగ్రెస్ కు ఒకింత సానుకూల వాతావరణం ఏర్పడుతున్న తరుణంలో ఆ పార్టీ సీనియర్ నేతలు అత్యుత్సాహంతో చేస్తున్న వ్యాఖ్యలు మొదటికే మోసం వచ్చేలా చేస్తున్నాయి. 2024 సార్విత్రిక ఎన్నికలలో విపక్షాల ప్రధాని అభ్యర్థి రాహుల్ గాంధీయే అంటే కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాథ్ చేసిన ప్రకటన బీజేపీయేతర పక్షాల ఐక్యతా యత్నాలకు గండి పడేలా మారింది. కమల్ నాథ్ ప్రకటన ఐక్యతా ప్రయత్నాలకు ఆదిలోనే హంసపాదులా మారింది. కామన్ అజెండాపై చర్చించుకుని, పొత్తులు, పోటీ చేసే స్థానాలు, పార్టీల బలాబలాలపై ఒక అంచనాకు వచ్చిన తరువాత ఒక నిర్ణయం తీసుకోవలసి ఉండగా, కమల్ నాథ్ ఏకపక్షంగా రాహులే ప్రతిపక్షాల ప్రధాని అభ్యర్థి అని ప్రకటించడం పట్ల బీజేపీ యేతర పార్టీలలో అసంతృప్తి వ్యక్తమౌతోంది. భారత్ జోడో యాత్రలో మెరుపులూ ఉన్నాయి. మరకలూ ఉన్నాయి. ఉత్తర ప్రదేశ్ లో అఖిలేష్ యాదవ్ రాహుల్ జోడో యాత్రపై వ్యక్తం చేసిన అభిప్రాయం, ఆ యాత్రకు ఆహ్వానం అందినా హాజరు కాబోనంటూ ఆయన చేసిన ప్రకటన.. కాంగ్రెస్ కు విపక్షాలలో సర్వామోదం లేదనడానికి నిదర్శనం అనడంలో సందేహం లేదు. అలాగే రైతు సమస్యలపై గళమెత్తుతున్నా తికాయత్ వంటి రైతు నేతలు ఇంకా కాంగ్రెస్ తో అడుగు కలిపేందుకు సుముఖత వ్యక్తం చేయడం లేదు. ఈ స్థితిలో  అన్ని పార్టీలనూ కలుపుకుపోయేందుకు సంయమనంతో వ్యవహరించాల్సిన కాంగ్రెస్ సీనియర్లు.. ఏకపక్ష నిర్ణయాలు, ప్రకటనలతో ఐక్యతారాగంలో ఆదిలోనే అపశ్రుతులు పలికిస్తున్నారని పరిశీలకులు అంటున్నారు. భారత చరిత్రలో రాహుల్ గాంధీలా ఇంత సుదీర్ఘమైన పాదయాత్ర చేసిన నేత మరొకరు లేరన్న కమల్ నాథ్, అధికారం కోసం వెపర్లాడుతూ రాజకీయాలు చేసే తత్వం ఆయనది కాదంటూనే.. దేశం కోసం గాంధీ కుటుంబం ఎన్నో త్యాగాలు ప్రస్తావిస్తూ వచ్చే సార్వత్రిక ఎన్నికలలో ప్రధాని అభ్యర్థి రాహులే అని ముక్తాయించడం ఒక విధంగా విపక్షాల ఐక్యతకు ముందరి కాళ్లకు బంధం వేయడం లాంటిదేనని అంటున్నారు. 

brs government self goal

బీఆర్ఎస్ సర్కార్ సెల్ఫ్ గోల్?

కేంద్ర  ప్రభుత్వం రాష్ట్రానికి నిధులు ఇవ్వడం లేదనేది కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మొదలు భారత రాష్ట్ర సమితి ( బీఆర్ఎస్) చోటా మోటా నాయకుల వరకు ప్రతి ఒక్కరూ ప్రతి నిత్యం చేసే ఆరోపణ. డీఫ్యాక్టో ముఖ్యమంత్రిగా వ్యవహరించే మంత్రి కేటీఆర్ అయితే కేంద్ర నిధుల విషయంలో బీజేపీకి ఎన్నోమార్లు మీడియా ద్వారా బహిరంగ సవాల్ విసిరారు. బీజేపీ నాయకులు కూడా మీడియా ద్వారానే సమాధానం ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో  జరిగే ప్రతి పని కేంద్ర నిధులతోనే జరుగుతోందని బీజేపీ నాయకులు పదే పదే పేర్కొంటున్నారు. దుబ్బాక ఎమ్మెల్యే, బీజేపీ ముఖ్య నాయకుడు రఘునందన రావు అయితే అసెంబ్లీ వేదికగా కేంద్ర నిధులపై ప్రత్యేక చర్చ జరగాలని పలు మార్లు డిమాండ్ చేశారు. అయితే అదేమీ జరగలేదనుకోండి అది వేరే విషయం. అలాగే కేంద్రం ప్రభుత్వం  బండారం బయట పెట్టేందుకు  కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేస్తున్న అన్యాయాన్ని ఎండగట్టేందుకు డిసెంబర్ లో అసెంబ్లీ సమావేశాలు ఉంటాయని ప్రచారం అయితే జరిగింది కానీ  అదీ జరగలేదు. ఇంతలోనే కేంద్ర ప్రభుత్వం నేరుగా సర్పంచుల ఖాతాలకు పంపిన రూ.35 వేల కోట్లను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్ళించిందనే ఆరోపణలు రావడంతో  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సాగుతున్న  నిధుల పంచాయతీ కొత్త మలుపు తిరిగింది. రోడ్డెక్కింది.   సమస్య సర్పంచుల రాజీనామాల వరకు వెళ్ళిన నేపథ్యంలో  కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దిగింది.  కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు 15వ ఫైనాన్స్ కమిషన్ ద్వారా ఇచ్చిన రూ.35 వేల కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం దొంగ చాటుగా వేరే అకౌంట్లకు బదిలీ చేసిందని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ  సోమవారం(జనవరి 2) ధర్నాకు పిలుపు నిచ్చింది.  దీంతో రాష్ట్రంలో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది.  టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సహా పలువురు నేతలను పోలీసులు  ఎక్కడి  కక్కడ, హౌస్ అరెస్ట్ చేశారు. రేవంత్ రెడ్డిని ముందు హౌజ్ అరెస్టు చేసిన పోలీసులు,ఆ తర్వాత ఆయనను ఇంటి వద్దనే అడ్డుకున్నారు. బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్టుకు ముందు రేవంత్ రెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కొంతసేపు హై డ్రామా నడిచింది. కేంద్ర ప్రభుత్వం గ్రామ సర్పంచుల ఖాతాల్లో జమ చేసిన రూ. 35వేల కోట్లు   వారికి  తెలియకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం దారి మళ్లించిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ సర్కార్ దొంగతనం చేసిందని ఘాటు విమర్శలు చేశారు.   మరో వంక రాష్ట్రంలో స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీలపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, పీసీసీ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు 15వ ఫైనాన్స్ కమిషన్ ద్వారా ఇచ్చిన రూ.35 వేల కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం దొంగ చాటుగా వేరే అకౌంట్లకు బదిలీ చేసిందని ఉత్తమ్ కుమార్ ఆరోపించారు. గ్రామ పంచాయతీలకు ప్రతి నెల స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి.. మౌలిక సదుపాయాల కల్పనకు, జీత భత్యాలకు, అత్యవసరాల కోసం విడుదల చేయాల్సిన రూ.250 కోట్ల నిధులను 7 నెలలుగా నిలిపివేయడంతో గ్రామ పంచాయతీల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని చెప్పారు. గ్రామాలలో అభివృద్ధి పనులు చేయాలని అధికారులు ఒత్తిడి చేయడంతో సర్పంచులు, ఉపసర్పంచులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. బిల్లులు పెండింగ్‭లో ఉండటం వల్ల సర్పంచ్‭లు, ఉపసర్పంచ్‭లు అప్పుల పాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఉత్తమ్ ఆవేదన వ్యక్తం చేశారు.  నిజానికి కాంగ్రెస్ తలపెట్టిన ధర్నా కార్యక్రమాన్ని విఫలం చేయడం ద్వారా, బీఆర్ఎస్ ప్రభుత్వం మరోమారు సెల్ఫ్ గోల్ చేసుకుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులే ఇవ్వడం లేదని ఆరోపిస్తున్న గులాబీ  నేతలు  అబద్ధాలను కప్పిపుచ్చుకోలేక అవస్థలు పడుతున్నారు. ఇదొకటే కాదు, ఇటీవల రూ.150 కోట్ల గ్రామీణ ఉపాధి హామీ నిధులను దారి మళ్ళించి, గ్రామాల్లో ధాన్యం కల్లాలు నిర్మించడం వివాదంగా మారిన  విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించిన నిధులను వాపసు చేయాలని   కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నోటీసులకు వ్యతిరేకంగా బీఆర్ఎస్  రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేసింది. కేంద్ర ప్రభుత్వంపై ముఖ్యమంత్రి మొదలు నాయకులు అందరూ విరుచుకు పడ్డారు. మోడీ ప్రభుత్వం రైతు  వ్యతిరేక ప్రభుత్వమని ఆరోపించారు. అయితే, తీగ లాగితే దొంకంతా కదిలింది అన్నట్లు, కల్లాల వివాదం తీగలాగితే,  హరితాహారం పథకం కోసం మరో రూ.550 కోట్ల గ్రామీణ ఉపాధి హామీ నిధులను దారి మళ్లించిన వ్యవహారం బయటకు వచ్చింది.   దీంతో గ్రామీణ ప్రాంతలలో రెక్కాడితే కానీ, డొక్కాడని పేదలకు సంవత్సరానికి కనీసం 100 రోజులు పనికల్పించేందుకు ఉద్దేశించిన నిధులను దారి మళ్ళించి  కల్లాల నిర్మాణం పేరున అస్మదీయ కాంట్రాక్టర్లకు ఖర్చు చేయడం, ఏమిటనే ప్రశ్నకు బీఆర్ఎస్ నాయకులు సమాధానం చెప్పలేక తికమక పడుతున్నారు. ఇలా ఒకదాని వెంట ఒకటిగా బీఆర్ఎస్ ప్రభుత్వం సెల్ఫ్ గోల్స్ కు పాల్పడుతోందని, పరిశీలకులు అంటున్నారు.

kunda baddalu subbarao no more

కుండబద్దలు సుబ్బారావు ఇక లేరు

రాజకీయ విశ్లేషకుడు కాటా సుబ్బారావు అలియాస్ కుండబద్దలు సుబ్బారావు మరణించారు. గుంటూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన సోమవారం (జనవరి 2 ) కన్నుమూశారు.   తన యూట్యూబ్ వీడియోలతో కుండబద్దలు సుబ్బారావుగా ప్రసిద్ధి కెక్కిన ఆయన దీర్ఘకాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు.   డయాలసిస్ చేయించుకుంటున్నారు. తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రి పాలైన కుండబద్దలు సుబ్బారావును తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఆదివారం( జనవరి 1)న పరామర్శించారు  కుండబద్దలు సుబ్బారావు మృతి పట్ల ప్రముఖులు, పాత్రికేయ సంఘాల నేతలు సంతాపం తెలియజేశారు. ఏపీ సీఎం జగన్ కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారంటూ ఇటీవల ఆయనకు పోలీసులు నోటీసులు జారీ చేసిన సంగతి విదితమే. ఏపీ హైకోర్టు  ఆ కేసుపై స్టే ఇచ్చింది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎం జనగ్ పై అనుచిత విమర్శలు చేశారంటూ వైసీపీ కార్యకర్తపై పోలీసులు కేసు నమోదు చేయగా ఆ కేసుపై హైకోర్టు స్టే విధించిన సంగతి విదితమే. అధికార పార్టీ విధానాలపై, ప్రజా వ్యతిరేక చర్యలపై సునిశిత విమర్శలు గుప్పించే సుబ్బారావు కుండబద్దలు సుబ్బారావుగా గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే.

supreme backs centers demonitisation

ఆలస్యంగా అయినా అనుకున్నదే జరిగింది..

అనుకున్నదే జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఆరేళ్ళ క్రితం, 2016 నవంబర్ 8న కేంద్ర ప్రభుత్వం ప్రటించిన పెద్ద నోట్ల రద్దు నిర్ణయం పై  సోమవారం (జనవరి2)  సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం సంచలన తీర్పు ఇచ్చింది.  అయిదుగురు సభ్యులు ఉన్న ధర్మాసనం సుదీర్ఘ విచారణ తరువాత పెద్ద నోట్ల రద్దు పైన తీర్పును వెలువరించింది. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని జస్టిస్ గవాయి సమర్ధించారు. నోట్లను రద్దు చేస్తూ 2016 నవంబర్ 8న కేంద్రం ఇచ్చిన నోటిఫికేషన్ సరైనదేనని జస్టిస్ గవాయి   తీర్పులో పేర్కొనారు. జస్టిస్ గవాయితో సహా నలుగురు న్యాయమూర్తులు ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధించారు. కానీ, మరో న్యాయమూర్తి నాగరత్న జస్టిస్ గవాయ్ తీర్పుతో విభేదించారు. 2016 నవంబర్ 8న దేశ వ్యాప్తంగా పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాని ప్రకటన చేశారు.ఇందుకు సంబంధించి ఆర్బీఐ నోటిఫికేషన్ జారీ చేసింది. పెద్ద సంఖ్యలో సాధారణ ప్రజలు ఈ  నిర్ణయంతో బ్యాంకుల ముందు బారులు తీరారు. దీని పైన రాజకీయంగానూ పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో 58 పిటిషన్లు దాఖలయ్యాయి. కాంగ్రెస్ పార్టీ ప్రముఖ నేత మాజీ ఆర్దిక మంత్రి చిదంబరం పిటిషనర్ల తరపు వాదనలు వినిపించారు. కేంద్రం తీసుకున్న నిర్ణయంలోని విధాన పరమైన లోపాలను ప్రస్తావించారు. ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దులో సరైన విధానం అనుసరించలేదంటూ సుప్రీం ధర్మాసనం ముందు తన వాదనలు వినిపించారు. ఇక, కేంద్రం సుప్రీం ధర్మానసం ముందు తన నిర్ణయాన్ని సమర్దించుకుంది. అపోహలతో కూడిన వాదనలను పిటిషనర్లు చేస్తున్నారంటూ అటార్నీ జనరల్ కోర్టుకు నివేదించారు. దీంతో అటు పిటిషనర్లు..ఇటు ప్రభుత్వ వాదనలు విన్న సుప్రీం కోర్టు రాజ్యంగ ధర్మాసనం 2016లో కేంద్ర పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి సంబంధించిన రికార్డులను తమకు సమర్పించాలంటూ గత డిసెంబర్ 8న కేంద్రం, ఆర్బీఐని  ఆదేశించింది. నోట్ల రద్దు సమయంలో ఆర్బీఐకి కేంద్రం రాసిన లేఖలు.. ఆర్బీఐ నిర్ణయాలతో పాటుగా నోట్ల రద్దు ప్రకటనలకు సంబంధించి పైళ్లను సమర్పించాలని ఆదేశించింది. అనంతరం తీర్పును  2023 జనవరి 2 (సోమవారం)కు రిజర్వ్ చేసింది. దీనికి సంబంధించి అయిదుగురు సభ్యుల ధర్మాసనం ఒకే రకమైన తీర్పు ఇస్తుందా.. భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతాయా అనే ఉత్కంఠ కొనసాగింది. అయితే, ఉత్కంఠకు తెరదించుతూ  సుప్రీం కోర్టు రాజ్యంగ ధర్మాసనం పెద్ద నోట్ల రద్దుకు వ్యతిరేకంగా దాఖలైన 58 పిటిషన్లను కొట్టి వేసింది. డీమానిటైజేషన్పై నిర్ణయం తీసుకునే అధికారం కేంద్రానికి ఉందని స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ మధ్య సంప్రదింపుల తర్వాతే నోట్ల రద్దు నిర్ణయం వెలువడిందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాజ్యాంగ ధర్మాసనంలోని నలుగురు సభ్యులు పెద్ద నోట్ల రద్దును సమర్థించారు. జస్టిస్ నాగరత్న కేంద్రం నిర్ణయంతో విభేదించారు. పెద్ద నోట్ల రద్దు చేస్తూ నరేంద్ర మోడీ ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌ చట్టబద్ధమైనదేనని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. ఈ నోటిఫికేషన్‌ విడుదల చేసే ముందు తగిన చర్యలు తీసుకున్నారని చెప్పింది. అలాగే రద్దు చేసిన నోట్ల బదిలీ కోసం ఇచ్చిన గడువు హేతుబద్ధం కాదని చెప్పలేమని పేర్కొంది. అయితే  పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ఆశించిన లక్ష్యాలను సాధించిందా? అంటే, కేంద్ర మాజీ ఆర్థిక  మంత్రి చిదంబరం, ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ రాజన్ సహా కొందరు ప్రముఖ ఆర్థిక వేత్తలు ఇప్పటికీ, పెద్ద నోట్ల రద్దు ప్రకటిత లక్ష్యాలు నెరవేర లేదు సరికదా, అప్రకటిత అనర్ధాలు ఆర్థిక వ్యవస్థను కోలుకోలేని దెబ్బతీశాయని అంటున్నారు. రాజకీయంగానూ పెద్దనోట్ల రద్దు ఇప్పటికీ దుమారం రేపుతోంది. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఇప్పటికీ  మోడీ ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ నిర్ణయాల మూలంగా దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలయి పోయిందని ఆరోపిస్తున్నారు. అయితే, పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తర్వాత 2019లో  జరిగిన లోక్ సభ ఎన్నికల్లో అయితే నేమి, అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలలో అయితేనేమీ ప్రజలు పెద్ద నోట్ల రద్దుకు ఆమోదం తెలిపారు. విపక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మరీ ముఖ్యంగా రాహుల్ గాంధీ, చేసిన వ్యతిరేక ప్రచారాన్ని ప్రజలు పట్టించుకోలేదు.  నిజానికి 2019 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పెద్ద నోట్ల రద్దును ప్రధాన ఎన్నికల అస్త్రంగా చేసుకుంది, అయినా ఆ ఎన్నికల్లో బీజేపీ బలం మరింతగా పెరిగిందే కానీ, తరగలేదు. అంటే ఒక విదంగా పెద్ద నోట్ల రద్దుకు ప్రజాకోర్టులో అప్పుడే ప్రజామోదం లభించింది. ఇప్పడు న్యాయస్థానం ఆమోదం కూడా లభించింది. అయితే, అంత మాత్రం చేత పెద్ద నోట్ల రద్దు లక్ష్యం నేరవేరినట్లేనా, పెద్దనోట్ల రద్దు వలన తలెత్తిన సమస్యలు సమస్యల కాకుండా పోయాయా ? రాజకీయ దుమారం ఇంతటితో అయినా సర్దు మనుగుతుందా అంటే, లేదనే అంటున్నారు.

stampedes in babu meetings suspicious

చంద్రబాబు సభలలో వరుస తొక్కిసలాటలు యాథృచ్ఛికమేనా?

అనూహ్య సంఘటన అనేది అరుదుగా జరుగుతుంది. కానీ తరచుగా జరుగుతుంటే.. అది అనూహ్యం కాదు.. దాని వెనుక ఏదో కుట్రో, కుతంత్రమో ఉందని అనుమానించాల్సి వస్తుంది. భారీ బహిరంగ సభలలో, పూరి జగన్నాథ రథోత్సవాలలో, రంజాన్ సందర్భంగా జరిగే హజ్ యాత్రలలో తొక్కిసలాటలు జరిగిన సందర్భాలున్నాయి. పెద్ద సంఖ్యలో ప్రాణ నష్టం సంభవించిన సందర్భాలూ ఉన్నాయి. అయితే ఒక రాజకీయ పార్టీ రోడ్ షోలలో, కానుకల పంపిణీ కార్యక్రమంలో స్వల్ప వ్యవధిలో తొక్కిస లాటలు జరిగిన సంఘటనలు మాత్రం కొత్త సందేహాలకు తావిస్తున్నాయి. ఇటీవల వారం వ్యవధిలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు పాల్గొన్న రెండు కార్యక్రమాలలో తొక్కిసలాట సంఘటనలు జరిగాయి. మొదటిగా  ఇదేం ఖర్మరా బాబు మనరాష్ట్రానికి  కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నెల్లూరు జిల్లా కందుకూరులో నిర్వహించిన రోడ్ షో కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక ఆదివారం గుంటూరులో ఉయ్యూరు ఫౌండేషన్ సంస్థ నిర్వహించిన సంక్రాంతి కానుక పంపిణీ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఆ సభలోనూ తొక్కిస లాట జరిగి ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. రెండు సంఘటనల విషయంలోనూ అధికార పార్టీ వినా.. అందరూ మృతుల కుటుంబాలకు అండగా నిలవాలని పిలుపు నిచ్చాయి. జరిగిన సంఘటన అత్యంత విషాదకరమని పేర్కొన్నాయి. కందుకూరు దుర్ఘటనపై ప్రధాని మోడీ సైతం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసి ఎక్స్ గ్రేషియా కూడా ప్రకటించారు. కానీ ఎవరూ రోడ్ షో ఎందుకు నిర్వహించారంటూ తెలుగుదేశం పార్టీపై విమర్శలు గుప్పించలేదు. రాజకీయ పార్టీగా సభలు, సమావేశాలు నిర్వహించిన విపక్షంపై విమర్శలు గుప్పించింది. ప్రచార యావతో విపక్ష నేత, తెలుగుదేశం అధినేత ఇరుకు సందుల్లో సభలు పెట్టడం వల్లనే తొక్కిసలాట జరిగిందని నిందలు వేసింది. అంటే అధికార పార్టీ, ప్రభుత్వం విపక్షం ప్రజలలోకి రాకూడదని భావిస్తోందా? అన్న ప్రశ్న తలెత్తింది. భారీగా జనం హాజరయ్యే సభలకు, సమావేశాలకు, కార్యక్రమాలకూ అది ప్రైవేటు కార్యక్రమమే అయినా బందోబస్తు ఏర్పాట్లు చేయడం ప్రభుత్వ బాధ్యత. ఆ బాధ్యతను విస్మరించి.. ఇరుకు సందుల్లో సభ పెట్టుకున్నారు. ప్రచార యావతో ప్రాణాలు తీసేస్తున్నారు అంటూ విమర్శలు గుప్పించడం ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పి పుచ్చుకోవడానికేనని పరిశీలకులు అంటున్నారు. అయినా చంద్రబాబు సభలలోనే ఈ అపశ్రుతులు జరగడం, చంద్రబాబు సభలలోనే పోలీసుల వైఫల్యం ప్రస్ఫుటంగా కనిపించడం, అలాగే గతంలో చంద్రబాబు రోడ్ షో సందర్భంగా ఆయనపై రాయితో దాడికి జరిగిన ప్రయత్నం, సొంత నియోజకవర్గం కుప్పంలో సైతం వైసీపీ శ్రేణులు కర్రలతో బాబు కాన్వాయ్ కు అతి సమీపంలోకి రావడం వంటి సంఘటనలన్నీ ఉద్దేశ పూర్వకంగా బాబు సభల సందర్భంగా భద్రతా ఏర్పాట్లను పోలీసులు గాలికి వదిలేశారా అన్న అనుమానాలు వ్యక్తం అయ్యేందుకు దోహదం చేస్తున్నాయి. సీఎం పర్యటనలు పరదాల మాటున జరుగుతున్నా.. బ్యారికేడ్ల ఏర్పాటు చేసి, వందల సంఖ్యలో మోహరించే పోలీసులు చంద్రబాబు సభలకు ఎందుకు వేళ్లతో లెక్కపెట్టగలిగేంత మంది కూడా ఉండటం లేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.చంద్రబాబు ఆషామాషీ నాయకుడేం కాదు. ఒక ప్రాంతీయ పార్టీ అధినేత, ఉమ్మడి ఏపీ, విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి. జడ్ ప్లస్ కేటగరి భద్రత ఉన్న నేత. అటువంటి నాయకుడి సభ విషయంలో ప్రభుత్వం కనీస భద్రతా ఏర్పాట్లు కూడా చేపట్టకపోవడం వెనుక ఉన్న కారణమేమిటి? నాలుగు దశాబ్దాలకు పైగా రాజకీయాలలో కొనసాగుతున్న చంద్రబాబుకు రోడ్ షోలు కొత్త కాదు. ఆయన సభలకు జనం పోటెత్తడమూ కొత్త కాదు. అయితే ఇలా వరుసగా ఆయన సభలలో తొక్కిసలాటలు జరగడం మాత్రం కొత్తే. తెలుగుదేశం పార్టీ  కార్యకర్తల సైన్యం బలంగా ఉన్న పార్టీ. క్రమశిక్షణ ఉన్న కార్యకర్తలు ఆ పార్టీకి ఉన్నారు. ఏటా మహానాడులు నిర్వహించుకుంటుంది. ఇటీవల ఒంగోలులో జరిగిన మహానాడుకు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. రాష్ట్రం నలుమూలల నుంచీ పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చినా చిన్న అవాంఛనీయ సంఘటన కూడా జరగలేదు. అటువంటిది చంద్రబాబు జిల్లా పర్యటనల్లో అదీ ఇటీవలి కాలంలో ఆ పార్టీ కార్యక్రమాలూ, సభలకూ జనం పోటెతుతున్న సమయంలో వరుస అవాంఛనీయ సంఘటనలు జరగడం, అదీ కేవలం ప్రభుత్వం సరైన భద్రతా చర్యలు చేపట్టకపోవడం వల్లనే కావడం అనుమానాలకు తావిస్తోంది.   ఇక గుంటూరు సభలో తొక్కిసలాట విషయానికి వస్తే.. కార్యక్రమాన్ని ప్రారంభించి, ప్రసంగించి చంద్రబాబు సభా స్థలిని వీడి వెళ్లిన తరువాత తొక్కిసలాట జరిగింది. జనం పెద్ద ఎత్తున హాజరౌతారని ముందే ఊహించిన నిర్వాహకులు దుస్తుల పంపిణీ లబ్ధిదారులందరికీ టోకేన్లు అందజేశారు. టోకెన్లు ఉన్న వారందరికీ పంపిణీ చేస్తామని విస్పష్టంగా చెప్పారు. అయితే.. దుస్తులు అయిపోవచ్చాయి, అందరికీ అందే అవకాశం లేదన్న వదంతులు వ్యాపించడం వల్లే తొక్కిసలాట జరిగిందని నిర్వాహకులు చెబుతున్నారు. ఇంతకీ ఆ వదంతులను వ్యాపింప చేసినది ఎవరు? అలాగే ఇలా తొక్కిసలాట జరిగిందో లేదో.. అలా వైసీపీ సామాజిక మాధ్యమం చంద్రబాబుపై దాడి ప్రారంభించేసింది. నిముషాల వ్యవధిలో తొక్కిస లాట వీడియోలు, తొక్కిస లాటకు చంద్రబాబే బాధ్యుడంటూ కొందరి స్పందనను వైసీపీ సోషల్ మీడియా పోస్టులతో హోరెత్తించేసిందిఅన్ని యూట్యూబ్ చానళ్లు.. మీడియాతో మాట్లాడిన మహిళలే మళ్లీ మళ్లీ మాట్లాడటం కూడా అనుమానాలకు తావిచ్చింది. దాడి జరుగుతుందని ముందే తెలిసి సర్వం సిద్ధంగా ఉన్నారా అనిపించేలా వైసీపీ హడావుడి ఉంది. కందుకూరు తొక్కిస లాట దుర్ఘటనలో మృతుల కుటుంబాలకు ప్రధాని ఎక్స్ గ్రేషియా ప్రకటించిన తరువాత కానీ స్పందించని ముఖ్యమంత్రి జగన్ గుంటూరు సంఘటన విషయంలో మాత్రం మంత్రి విడదల రజనిని ఆసుపత్రికి పంపి అక్కడి నుంచే తెలుగుదేశంపైనా, చంద్రబాబుపైనా విమర్శల దాడి చేయించారు.   గత మూడున్నరేళ్లుగా వైసీపీ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ తోనే పబ్బం గడుపుకుంటూ వస్తోంది. కోనసీమ జిల్లా పేరు మార్పుపై అమలాపురంలో ఆందోళనకారులు రెచ్చిపోయారు. ప్రశాంతంగా ఉండే పట్టణం ఒక్కసారిగా రగిలిపోయింది. ఆందోళనలు హింసాత్మకం రూపం దాల్చాయి. మంత్రి పినిపే విశ్వరూప్ ఇంటికి, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ క్యాంపు ఆఫీసుకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. ఐదు బస్సులను దగ్ధం చేశారు. పోలీసు వాహనాలపై రాళ్ల దాడి చేశారు. పలువురు పోలీసులు ఈ దాడిలో గాయపడ్డారు. ఎస్పీ తలకు గాయమైంది. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ ఆందోళన జరిగింది. అయితే  ఆ ఆందోళనలో పాల్గొన్న వారు, దాడులకు తెగబడిన వారు, విధ్వంసం సృష్టించిన వారు అందరూ వైసీపీకి చెందిన వారేనని తరువాత తేలింది. దీంతో సర్వత్రా ఆగ్రహం పెల్లుబికింది. దీని నుంచి దృష్టి మరల్చడానికి అప్పటి వరకూ ప్రశాంతంగా జరుగుతున్న రైతుల మహా పాదయాత్రకు అడ్డంకులు సృష్టించి, విశాఖ గర్జన అంటూ ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేసిందీ వైపీపీయే. ఇలా గత మూడున్నరేళ్లుగా ప్రభుత్వ తీరును గమనించిన ఎవరైనా తాజాగా చంద్రబాబు సభలలో జరిగిన తొక్కిసలాట సంఘటనల వెనుక కూడా అధికార పార్టీయే ఉందా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీకీ, చంద్రబాబుకూ పెరుగుతున్న ఆదరణ నేపథ్యంలో తొక్కిసలాటల వెనుక కూడా కుట్ర ఉందా అన్న అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి.  

chiranjeevi suppourt pawan

తమ్ముడికి అన్న చిరు అండ

ఇంత కాలం తటస్థంగా ఉన్న మెగా స్టార్ చిరంజీవి కొత్త సంవత్సరంలో తన తమ్ముడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు బహిరంగ మద్దతు ప్రకటించేశారు. ఇంత కాలం కారణాలేమైతేనేం.. ఏ పార్టీకి అనుకూలం కాదు, వ్యతిరేకం కాదు అంటూ వచ్చిన చిరంజీవి.. పరోక్షంగానైనా విస్పష్టంగా తేల్చేశారు. తన తమ్ముడిని ఇష్టారీతిగా తిడుతూ తన వద్దకు వచ్చేవారిని ఉద్దేశించి చిరంజీవి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన తమ్ముడు, జనసేనాని పవన్ కల్యాణ్ ను విమర్శించే వారు తన వద్దకు రావద్దని కుండ బద్దలు కొట్టేసారు. ఒక వైపు పవన్ ను బండ బూతులు తిడుతూ తన వద్దకు వచ్చి వారి ఇళ్లల్లో శుభకార్యాలకు ఆహ్వానించే వారిని ఇక దూరం పెట్టనున్నట్లు చెప్పిన చిరంజీవి.. అలాంటి వారు ఆహ్వానించినా వారి ఇళ్లల్లో కార్యక్రమాలకు తాను వెళ్లననీ, అలాగే అటువంటి వారిని తాను పిలవననీ చెప్పారు. అయితే చిరు మాటల, వ్యాఖ్యలు వైసీపీని ఉద్దేశించి చేసినవేనని రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది. ఎందుకంటే.. జనసేనాని పై అనుచి వ్యాఖ్యలు, విమర్శలు చేసేది కేవలం వైసీపీ వాళ్లే. రాజకీయ విమర్శలు కాకుండా వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చూస్తూ వ్యక్తిత్వ హననానికి పాల్పడే వైసీపీ నేతలను ఉద్దేశించే చిరంజీవి ఈ కామెంట్స్ చేశారని అంటున్నారు. ఎందుకంటే పవన్ కల్యాణ్ వివాహాల విషయంలో వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్  సహా పలువురు వైసీపీ మంత్రులు, నాయకులు తరచూ విమర్శలు గుప్పిస్తుంటారు. జనసేనాని వైసీపీ ప్రభుత్వ విధానాలపై విమర్శ చేయడం తరువాయి.. వైసీపీ నాయకులు తమ గొంతులు సవరించుకుని మరీ పవన్ కల్యాణ్ పై వ్యక్తిగత దూషణలకు దిగుతారు. పేర్ని నానితో సహా అనేక మంది వైసీపీ లో ఉన్న కాపు నేతలు పవన్ కల్యాణ్ వ్యక్తిగత దూషణే తమ బాధ్యత అనుకున్నట్లుగా వ్యవహరిస్తున్నారు. వీరంతా కూడా అదే సమయంలో చిరంజీవిని తమ వాడుగా చెప్పుకుంటుంటారు. చిరు నోట ఏ మాటా రాకపోయినా.. చిరంజీవికి జగన్ అంటే అభిమానమని చెప్పుకుంటుంటారు. సినిమా టికెట్ల వ్యవహారంలో చిరంజీవి జగన్ వద్దకు రాయబారానికి వెళ్లడం.. ఆ సందర్భంగా దణ్ణాలు పెడుతూ బతిమలాడుతున్నట్లు మాట్లాడటాన్ని పదే పదే ప్రస్తావిస్తూ మెగా స్టార్ కు జగన్ అంటే అంతులేని గౌరవమనీ చెప్పుకుంటారు. ఇప్పుడు చిరంజీవి తన వ్యాఖ్యల ద్వారా అటువంటి నేతలందరికీ చెక్ పెట్టారనే చెప్పాలి. పవన్ పై విమర్శలు గుప్పించి, వ్యక్తిగత దూషణలకు దిగే వారిని చూడటానికే తనకు ఇష్టం ఉండదని చిరు కుండబద్దలు కొట్టేశారు. వైసీపీ నేతలను ఉద్దేశించే చిరంజీవి ఈ వ్యాఖ్యలు చేశారన్నది కేవలం రాజకీయ విశ్లేషకులే కాదు సామాన్య జనం కూడా చెబుతున్నారు. రాష్ట్ర జనాభాలో 15 శాతం పైగా ఉన్న  కాపు సామాజిక వర్గం ఏ పార్టీ వైపు మొగ్గు చూపితే, ఆ పార్టీ విజయావకాశాలు మెరుగవుతాయి. అందుకే, ‘కాపు’ఓటు ఏ పార్టీని కాపు కాస్తే, ఆపార్టీ అధికారంలోకి వస్తుందనే రాజకీయ విశ్వాసం బలంగా స్థిరపదిండి. ఆ కారణంగానే  కాపు  జనాభా అధికంగా ఉన్న ఉమ్మడి ఉభయ గోదావరి జల్లాలలో ఏ పార్టీ మెజారిటీ స్థానాలు గెలుచుకుంటే, అదే పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని, ఒక నమ్మకమూ ఏర్పడింది. ఆ కారణంగానే వైసీపీ కాపు ఓటు కోసం చిరంజీవిని ఆకాశానికి ఎత్తేస్తూ.. అదే సమయంలో ఆయన సోదరుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. అలా విమర్శించడానికి ప్రధానంగా పార్టీలోని కాపు నేతలనే నియోగిస్తోంది. ఒక వైపు మెగాస్టార్ ను ప్రశంసలతో ముంచెత్తేస్తూ, మరో వైపు పవన్ కల్యాణ్ వ్యక్తిత్వంపై విమర్శలు గుప్పిస్తూ కాపులలో చీలికను తెచ్చి లబ్ధి పొందాలన్న ఆరాటం ప్రదర్శిస్తోంది. ఈ నేపథ్యంలోనే స్వాంత్య్ర స్వర్ణోత్సవాలలో భాగంగా భీమవరంలో జరిగిన అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు చిరంజీవిని ప్రత్యేకంగా ఆహ్వానించింది. అయితే.. జగన్ సర్కార్ పై  కాపు సామాజిక వర్గంలో ఆగ్రహం వ్యక్తం అవుతోంది. గత ఎన్నికలలో నమ్మి జగన్ కుమద్దతుగా నిలబడిన తమను జగన్ నిలువునా ముంచేశారన్న భావన ఆ సామాజిక వర్గంలో వ్యక్తం అవుతోంది.  కాపు రిజర్వేషన్ మాట దేవుడెరుగు కాపుల సంక్షేమం ఊసే లేకుండా జగన్ ఈ మూడున్నరేళ్లూ గడిపేశారని గుర్రుగా ఉంది. దీనిని గమనించే జగన్ కాపు సామాజిక వర్గంలో బలమైన గుర్తింపు, అభిమానం ఉన్న మెగాస్టార్ ను తనకు అనుకూలుడని చిత్రీస్తూ వస్తున్నారు. ఇప్పటి వరకూ ప్రజలలో అటువంటి అభిప్రాయం  కలిగించడంలో సక్సెస్ అవుతూ వచ్చింది. ఓ వైపు పవన్ కల్యాణ్ పై విమర్శలు, మరో వైపు చిరంజీవిపై ప్రశంసలలో కాపు సామాజిక వర్గంలో అయోమయాన్ని సృష్టించడమే కాకుండా.. చిరు పవన్ అభిమానులలో వైరుధ్యాన్ని వైషమ్యం ఏర్పడేందుకు వైసీపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ వచ్చింది. ఇప్పుడు చిరు మాటలతో వైసీపీ పరిస్థితి  గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డ చందంగా మారింది. వైసీపీ పేరు ప్రస్తావించకపోయినా.. పవన్ కల్యాణ్ ను దూషించే వ్యక్తులతో మాట్లాడటానికే ఇష్టపడనని చిరంజీవి చెప్పిన మాటలు ఆ పార్టీని ఉద్దేశించినవేనని ఎవరికైనా ఇట్టే అవగతమైపోయింది. ఈ మాటల ద్వారా చిరంజీవి అటు వైపీసీ వ్యూహాలకు చెక్ పెట్టడమే కాకుండా.. ఇటు జనసేనకే తన మద్దతు అని చెప్పకనే చెప్పేశారు. ఈ మాటలు జనసేనకు ఎంత మేరకు బలంగా మారుతాయన్నది చూడాల్సిందే. 

thousand crores liquor sold

న్యూ ఇయర్ జోష్.. వెయ్యి కోట్ల మద్యం తాగేశారు!

తెలంగాణలో కొత్త సంవత్సరం జోష్ అవధులు దాటేసింది. మందు బాబులు ఏకంగా వెయ్యి కోట్ల కు పైగా విలువ చేసు మద్యం తాగేశారు. ఔను.. కొత్త సంవత్సరం సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో పదకొండు వేల కోట్ల కు పైగా మద్యం అమ్మకాలు జరిగాయి. డిసెంబర్ చివరి వారంలోనే ఈ మేరకు మద్యం విక్రయాలు జరిగాయంటే న్యూఇయర్ కు మద్యం ఏరులై పారిందనే చెప్పాలి. ఒక్క డిసెంబర్ 30, 31 తేదీలలోనే 470 కోట్ల రూపాయల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. గత ఏడాదితో పోలిస్తే ఇది చాలా చాలా ఎక్కువ అని గణాంకాలు చెబుతున్నాయి. ఇలా ఉండగా డిసెంబర్ చివరి వారంలో రాష్ట్రంలో సగటున రోజుకు 180 కోట్ల రూపాయల విలువైన మద్యం అమ్ముడైంది. సాధారణ రోజులలో ఇది కేవలం 70 కోట్లు మాత్రమే ఉంటుంది. కొత్త సంవత్సరం సందర్భంగా సర్కార్ మద్యం విక్రయ వేళలను పెంచడంతో అమ్మకాలు విపరీతంగా పెరిగాయని చెప్పాలి.  

stampede in guntur three dead

గుంటూరులో తొక్కిసలాట ముగ్గురు మృతి

గుంటూరులో ఉయ్యూరు ఫౌండేషన్ ఆధ్విర్యంలో జనతా వస్త్రాల పంపిణీ కార్యక్రమంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. పలువురు గాయపడ్డారు.  అంతకు ముందు ఈ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొని పేదలకు జనతా వస్త్రాల పంపిణీ ప్రారంభించి వెళ్లారు. అనంతరం తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో మరణించిన వారి కుటుంబాలకు ఉయ్యూరు ఫౌండేషన్ 20లక్షల రూపాయల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. తొక్కిసలాట ఘటనపై ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.  ముఖ్యమంత్రి జగన్ కూడా తొక్కిసలాట ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు కూడా తొక్కిసలాటలో ముగ్గురు మహిళలు మరణించడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పేదలకు కానుకలు ఇచ్చేందుకు ఉయ్యూరు ఫౌండేషన్ నిర్వహించిన కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి ముగ్గురు చనిపోవడం బాధాకరం అని చంద్రబాబు అన్నారు. పేదలకు ఆ స్వచ్ఛంద సంస్థ చేసే కార్యక్రమాన్ని ప్రోత్సహించాలన్న ఆలోచనతోనే    కార్యక్రమానికి వెళ్లినట్లు చెప్పారు. పేదల ఇళ్లలో జరిగిన ఈ ఘటన తనను ఎంతో కలిచివేసిందని...ఘటన దురదృష్టకరమని అన్నారు. మృతుల కుటుంబాలకు టీడీపీ అధినేత ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని చంద్రబాబు ఈ సందర్భంగా ప్రకటించారు.

new guru for rahul

రాహుల్ కొత్త గురువు ఎవరంటే ?

రాహుల్ గాంధీలో మార్పువచ్చింది. భారథ్ జోడో యాత్ర అయనలో మార్పు తెచ్చింది.  గతంలో రాహుల్ గాంధీకి ఉన్న ఇమేజ్ ఏమిటో వేరే చెప్పనక్కర లేదు. రాజకీయ నాయకులే కాదు, సామాన్య ప్రజలు కూడా చాలా వరకు ఆయన్ని సీరియస్ రాజకీయ నాయకుడిగా గుర్తించలేదు. ప్రతిపక్ష పార్టీలు, కాంగ్రెస్ మిత్ర పక్షాల నాయకులు కూడా ఆయన నాయకత్వాన్ని అంగీకరించలేదు. పార్లమెంట్ లో కన్ను కొట్టడం, హటాత్తుగా లేచి వెళ్లి ప్రధాని మోడీ మీద పడి కౌగిలించుకోవడం వంటి పిల్ల చేష్టలు ఆయన ఇమేజ్ ని మరింతగా పలుచన చేశాయి, ఆలాగే ఎవరికీ చెప్పా పెట్టకుండా విదేశాలకు చెక్కేయడం, యూపీఎ హాయాంలో కేంద్ర మంత్రి వర్గం ఆమోదించి, రాష్ట్రపతి ఆమోదం పొందిన ఆర్డినెన్సును  విలేకరుల సమావేశంలో  చించి  పడేయడం, వంటి చర్యలు కూడా ఆయన రాజకీయ అపరిపక్వతను దేశం ముందుంచింది. అందుకే ఆయనకు రాజకీయాలు తెలియవని, ఆయన ఎప్పటికీ రాజకీయ నాయకుడు కాలేరని, దేశ, విదేశీ జర్నలిస్టులు, విశ్లేషకులు తీర్పు నిచ్చారు. రాహుల్ గాంధీలో నాయకత్వ లక్షణాలు లేవని నిర్దారించారు.  అలాగే, గడచిన ఏడెనిమిది సంవత్సరాలో కాంగ్రెస్ పార్టీని వదిలి వెళ్ళిన డజన్ల కొద్ది సీనియర్  నాయకులు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పతనావస్థకు  రాహుల్ గాంధీనే కారణమని, ఆరోపించారు. వెళుతూ వెళుతూ అక్షింతలు వేసి మరీ వెళ్ళారు.  అయితే భారత జోడు యాత్ర తర్వాత రాహుల్ గంధిలో గుణాత్మక మార్పు వచ్చిందని కొందరైనా ఆయన్ని రాజకీయ నాయకుడిగా గుర్తిస్తున్నారు. గతంలో  రాహుల్ గాంధీని, పప్పూ అని అవహేళన చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు  తమ మాటను వెనక్కి తీసుకుంటున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అంతటి వాడు  భారత్ జోడో యాత్రతో కాంగ్రెస్ పార్టీలో కొత్త ఉత్సాహం వచ్చిందని, రాహుల్ గాంధీలో  పెద్దమనిషి  లక్షణాలు కనిపిస్తున్నాయని అన్నారు. నిజానికి, రాజకీయ అనుబంధాలు, అవరోధాల కారణంగా కొందరు రాహుల గాంధీ పెద్దరికాన్ని, నాయకత్వాన్ని ఇంకా గుర్తించలేక పోతున్నారు కానీ  రాహుల్ గాంధీలో మార్పు వచ్చింది. ఆయన నేతగా ఎదిగారు  అనే వాళ్ళు లేక పోలేదు.   అదలా ఉంటే  భారత్‌ జోడో యాత్ర  నుంచి క్రిస్టమస్, న్యూ ఇయర్ వేడుకలు జరుపుకునేందుకు విరామం తీసుకున్న రాహుల్ గాంధీ  శనివారం (డిసెంబర్ 31) ఢిల్లీలో మీడియా సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, ఆరెస్సెస్ తనకు గురువు లాంటివని ఆయన చేసిన వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు చేయడం వెనక ఆయన ఉద్దేశం ఏదైనా, ఆయా ఏ బాటలో వెళుతున్నారో ఆ వ్యాఖ్యలు స్పష్టం చేసాయి. నిజానికి, రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు ముందు నుంచి కూడా బీజేపీ, ఆర్ఎస్ఎస్ హిందుత్వ భావజాలానికి వ్యతిరేకంగా మాట్లాడుతూనే ఉన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రజల మధ్య విద్వేషం రగిలిస్తోందని, భారత్ జోడో యాత్ర ద్వారా కాంగ్రెస్ పార్టీ ప్రేమను పంచుతూ ..అందరినీ ఏకం చేసే ప్రయత్నం సాగిస్తోందని చెప్పు కున్నారు. నిజానికి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు  అదే  ట్యాగ్ లైన్  గా చెప్పుకుంటున్నారు. ఇప్పడు యాత్ర విరామ సమయంలో ఆయన, ఈ విషయంలో మరింత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. భారతీయ జనతా పార్టీని తాను గురువులా భావిస్తానని అన్నారు. బీజేపీ తనకు రోడ్‌ మ్యాప్ ఇస్తోందని పేర్కొన్నారు. బీజేపీని చూసే తాను ఎలా ఉండకూడదో, ఎలాంటి పనులు చేయకూడదో నేర్చుకుంటున్నాను అంటూ సెటైర్లు వేశారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ తమపై ఎంత దూకుడుగా దాడి చేస్తే.. తమ పార్టీ సిద్ధాంతాలను అర్థం చేసుకునేందుకు అంతగా సాయపడుతుందని రాహుల్ వ్యాఖ్యానించారు. భారత్ జోడో యాత్రను తాను కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ఒక సాధారణ యాత్రగా ప్రారంభించానని.. అయితే  అది క్రమంగా ప్రజల గొంతుకగా మారి, వారి భావోద్వేగాలను ప్రతిబింబింస్తోందని రాహుల్ తెలిపారు.  అయితే, రాహుల్ గాంధీ బీజేపీ,ఆర్ఎస్ఎస్ భావజాలానికి వ్యతిరేకంగా పోరాటం చేయడం వలన  కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా ఏదైనా ప్రయోజనం చేకురుతుందా? అంటే  ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రవచించే హిందూ జాతీయ వాదం ముందెన్నడూ లేనంతగా ప్రజామోదం పొందుతున్న సమయంలో హిందుత్వ భాజాలానికి వ్యతిరేకంగా సాగడం, ఒక విధంగా ఏటికి ఎదురీదటమే అవుతుందని, కొందరు రాజకీయ నాయకులు, రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అంతే కాకుండా, రాహుల్ గాంధీ చెపుతున్న విషయాలు ప్రవచనంలా వినడానికి బాగుంటాయి కానీ, ఆచరణలో కష్టమని అంటున్నారు. నిజానికి, కాంగ్రెస్ పార్టీ దశాబ్దాలుగా ప్రవచిస్తున్న హిందుత్వ వ్యతిరేక లౌకికవాదానికి, రాహుల గాంధీ చెపుతున్న కొత్త సిద్ధాంతానికి భాషలోనే కానీ, భావనలో పెద్దగా తేడా కనిపించడం లేదు. ప్రజలు వ్యతిరేకించిన హిందూ వ్యతిరేక లౌకిక వాదాన్నే రాహుల గాంధీ,  లౌకిక వాదం,సెక్యులరిజం పదాలు వాడకుండా కొంత భిన్నంగా ప్రెజెంట్ చేస్తున్నారు. అందుకే, కాంగ్రెస్ పార్టీ కూడా  భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీ, వ్యక్తిగత ఇమేజ్ ని పెంచవచ్చు కానీ, కాంగ్రెస్ పార్టీకి జరిగేది, ఒరిగేది ఏదీ లేదని, ఏమీ ఉండదని అంటున్నారు.

modi cabinet expansion

హ్యాట్రిక్ లక్ష్యంగా మోడీ మంత్రివర్గంలో మార్పులు?

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మంత్రివర్గ విస్తరణకు సిద్దమవుతున్నారా? కొత్త సంవత్సరంలో జనవరి 14 తర్వాత  పెద్ద మంత్రివర్గ విస్తరణ చేపట్టేందుకు మోడీ, షా మంత్రాంగం సాగిస్తున్నారా? అంటే అవుననే అంటున్నారు కమలదళం కీలక నేతలు. అంతే కాదు  ఈసారి మంత్రివర్గ విస్తరణలో భారీ మార్పులు ఉండే అవకాశం ఉందని కూడా కాషాయ కూటమి పెద్దలు చెబుతున్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల కంటే ముందుగానే, మంత్రివర్గ విస్తరణ, పార్టీలో మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణతో పాటుగా, పార్టీ పదవుల్లోనూ సంస్థాగత మార్పులు జరిగే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.  ప్రస్తుత అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీకాలం జనవరి 20తో ముగియనుంది. అదే సమయంలో పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం కూడా జనవరిలో జరగనుంది. కాగా, వచ్చే ఏడాది 9 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో పాటు 2024లో లోక్‌సభ ఎన్నికలు కూడా ఉన్నాయి. నిజానికి నడ్డాను  2024 ఎన్నికలవరకు అధ్యక్ష పదవిలో  కొనసాగిస్తారని, ఆ మేరకు నిర్ణయం జరిగిందని పార్టీలో  ప్రచారం జరిగింది. అయితే, అధికారిక  ప్రకటన ఏదీ వెలువడలేదు. అయినా, పాతికేళ్ళ తర్వాత తొలిసారిగా, అధ్యక్ష ఎన్నికలు జరుపుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, నడ్డాకు ఎక్స్ టెన్షన్ ఇవ్వడాన్ని, తప్పు పట్టే అవకాశఇం లేదు. అలాగే, నడ్డా స్వరాష్ట్రం హిమాచల్’లో బీజేపీ ఓటమికి ఆయనే కారణమనే విమర్శలు వినవచ్చాయి. ఈ నేపధ్యంలో నడ్డాను కొనసాగించే విషయంలో  పార్టీ పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది.  అందుకే  2024లో జరగనున్న లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఎన్నికల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వంలో, పార్టీలో మార్పులు చేపట్టే విషయంలో పార్టీ పెద్దలు  విభిన్న స్థాయిల్లో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. త్వరలో  అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లకు చెందిన కొంతమంది కొత్త ఎంపీలకు మంత్రివర్గంలో అవకాశం లభించవచ్చని తెలుస్తోంది. అలాగే, మహా రాష్ట్రలో శివసేన చీలిక వర్గం ఎంపీలకు కేంద్ర మంత్రి వర్గంలో స్థానం లభించే ఆకాశం ఉందని అంటున్నారు. గతంలో శివసేన ఎన్డీఎలో  ఉన్నరోజుల్లో కేంద్ర మంత్రి వర్గంలో ముగ్గురు నలుగురికి  స్థానం దక్కింది. అలాగే, తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులు కడుపుతున్న బీజేపీ నాయకత్వం, రాష్ట్రం నుంచి మరొకరికి మంత్రి వర్గంలో స్థానం కలిపించే అవకాశం ఉంది. అదే విధంగా ఏపీ నుంచి కూడా ఒకరికి స్థానం దక్కుతుందని అంటున్నారు. అయితే, తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరికి అవకాశం దక్కుతుందనే విషయంలో స్పష్టత రాలేదు.  మరో వంక  పని తీరు ఆధారంగా కొందరు మంత్రులకు ఉద్వాసన తప్పదన్న చర్చ కూడా సాగుతోంది. మోడీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 2021 జులై 7న మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగింది.  12 మంది మంత్రులను మంత్రివర్గం నుంచి తప్పించారు. ఈసారి కూడా అంత పెద్ద ఎత్తున ఉద్వాసనలు ఉంటాయా, లేక కొద్ది మందితో సరిపెడతారా అనేది చూడవలసి ఉందని అంటున్నారు. అయితే, ఏది జరిగినా, ఎన్నికల లెక్కలు ఆధారంగానే జరుగుతుందని, మోడీ సర్కార్ హ్యాట్రిక్  లక్ష్యంగానే మార్పులు చేర్పులు ఉంటాయని అంటున్నారు. నిజానికి విపక్షాల బలహీనత, బీజేపీకి కలిసి వచ్చే అంశంగా అందరూ భావిస్తున్నా బీజేపీ నాయకత్వం మాత్రం మరోలా లోచిస్తోందని అంటున్నారు.  యూపీ, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్‌లలో బీజేపీ మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ నాలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వం పునరావృతమైంది. తాజాగా గుజరాత్‌లో కూడా భారీ మెజారిటీతో మళ్లీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయితే, హిమాచల్ ప్రదేశ్‌లో బీజేపీ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ ఆ పార్టీ పరాజయం పాలైంది. మరో వంక మిత్ర పక్షాలు చాలా వరకు ఇప్పటికే దూరమయ్యాయి.. ప్రతిపక్ష పార్టీలు ఎక్కడి కక్కడ బీజేపీని ఓడించడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. ఈ పరిస్థితులు, పరిణామాలు అన్నింటినీ బేరీజు వేసుకుని  మోడీ హ్యాట్రిక్ లక్ష్యంగా బీజేపీ మంత్రి వర్గంలో, పార్టీలో మార్పులకు భారీ కసరత్తు చేస్తోందని అంటున్నారు.

what will happen with brs entry in ap

ఏపీలో బీఆర్ఎస్ ప్రవేశం వల్ల ఏం జరుగుతుందంటే?

ప్రత్యేక తెలంగాణ ఉద్యమంతో రాజకీయంగా ఎదిగిన కేసీఆర్.. అలా ఎదిగేందుకు  ఏపీపైనా, ఏపీ నేతలపైనా ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలపైనా తీవ్ర స్థాయిలోనే విమర్శలు గుప్పించారు. అవహేళన చేశారు. చులకనగా మాట్లాడారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్బవించి ఆ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి కొనసాగుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణలో ఎప్పుడు తన పరపతి కాస్త తగ్గిందని భావించినా కేసీఆర్.. ఏపీ వ్యతిరేకతనే  ఉత్ప్రేరకంగా చేసుకుని తెలంగాణ సెంటిమెంట్ ను పండించి పబ్బం గడుపుకున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికలలో కూడా తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆ రాష్ట్రంలో ప్రచారానికి వెళ్లడాన్ని తప్పుపడుతూ.. మళ్లీ ఆంధ్రపాలకులు తెలంగాణపై కన్నేశారంటూ విమర్శలు గుప్పించారు. అంతెందుకు కొవిడ్ సమయంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఏపీ కొవిడ్ రోగులను సరిహద్దుల వద్దే అడ్డుకున్న కేసీఆర్, ఇప్పుడు అదే సరిహద్దు దాటి ఏపీలో ఎంటర్ అవుతానంటున్నారు. ఇందుకు ఆ రాష్ట్ర ప్రజలు అంగీకరిస్తారా? తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ ఆంధ్రులను అవమానించిన తీరును మరిచి పోతారా? నిన్నగాక మొన్న తెలంగాణ శాసన సభలో ఏపీపై విషం చిమ్మిన కేసీఆర్ కు ఆ రాష్ట్ర ప్రజలు రెడ్ కార్పెట్  వేసి స్వాగతం పలుకుతారా?  కేసీఆర్, నేను మరిపోయాను అంటే, ఏపీ ప్రజలు నమ్ముతారా? కేసేఆర్ నమ్మించగలరా? తాను తెలంగాణలో అధికారంలోకి రావడానికి కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ ప్రజలను అవమానించారు. 2018 ఎన్నికలలో మరోసారి అధికారం చేపట్టేందుకు తెలంగాణ సెంటిమెంట్ నే ఆ శ్రయించారు. ఇప్పుడు జాతీయ రాజకీయాల పేరు చెప్పి.. తెలంగాణ రాష్ట్ర సమితిలోని తెలంగాణను తీసేసి.. భారత్ చేరిస్తే.. గత విమర్శలన్నీ మాయం అయిపోయినట్లేనా? పార్టీ పేరు మారినా.. నాయకుడు ఆయనేగా అని ఏపీ ప్రజలు నిలదీయరా? ఎవరో కొందరు నేతలో, పార్టీలో భారసకు ఏపీలో స్వాగతం పలికినంత మాత్రాన ప్రజలంతా సమ్మతం తెలిపినట్లేనా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వాస్తవానికి కేసీఆర్ కు రాజకీయ టక్కుటమార గజ కర్ణ గోకర్ణ విద్యలు బాగా కొట్టిన పిండే అయినా,  ఏపీ ప్రజలను నమ్మించడం, వారి విశ్వాసం పొందడం సులభం అనుకుంటే అది పొరపాటే అవుతుంది.  నిజానికి, కేసేఆర్ ఏపీలో ఎంటర్ అవ్వాలంటే, ఉభయ తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో ఒక సారి కాదు, వెయ్యిసార్లు ముక్కు నేలకు రాసి, క్షమాపణలు చెప్పవలసి ఉంటుందని ఏపీ జనం అంటున్నారు. మరి కేసీఆర్ ముక్కు నేలకు రాస్తారా? ఏపీ ప్రజలకు క్షమాపణలు చెపుతారా? అలా చేస్తే భరాసకు తెలంగాణలో నూకలు చెల్లినట్లే అవుతుంది. ఇప్పటికే ఆయన పార్టీ పేరులోని తెలంగాణ తీసేసిన తరువాత అక్కడ తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. కనుక ఏపీ ప్రజలకు సారీ చెప్పి తెలంగాణ ప్రజలలో మిగిలిన కొద్ది పాటి విశ్వాసాన్నీ పోగొట్టుకునే సాహసం చేయరు.  సో .. ఆయన  ఏపీలో ప్రవేశానికి దొడ్డి దారిని వెతుక్కుంటున్నారు. ఏపీలోని పార్టీలలో అసంతృప్తులను, అవకాశాలు లేని వారిని ఎంచుకుని వారిని హైదరాబాద్ కు పిలిపించుకుని బీఆర్ఎస్ కండువా కప్పడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. అందులో భాగంగానే కొందరు నేతలు సోమవారం (జనవరి 2) హైదరాబాద్ లో బీఆర్ఎస్ కండువాలు కప్పుకోనున్నారు. అయితే ఒకటి మాత్రం వాస్తవం.. ఇది ఎవరు అంగీకరించినా, అంగీకరించకున్నా.. ఆఖరికి కేసీఆర్ కూడా.. ఏపీ జనం విభజన వల్ల ఎదుర్కొంటున్న కష్టాలు, ఇబ్బందులు, నష్టాలకు కాంగ్రెస్, కేసీఆర్ లే కారణమన్న భావనలో ఉన్నారు. విభజన తరువాత జరిగిన ఏ ఎన్నికలోనూ కాంగ్రెస్ కు విజయం సంగతి అలా ఉంచితే.. కనీసం డిపాజిట్ కూడా రాలేదు. బీఆర్ఎస్ పేర కేసీఆర్ తెలంగాణలో అడుగుపెట్టినా పరిస్థితి అందుకు భిన్నంగా ఉండదన్నది పరిశీలకుల విశ్లేషణ. బీఆర్ఎస్ ను వైసీపీ స్వాగతించడం, ఆ పార్టీ రాజకీయ వ్యూహమే తప్ప మరొకటి కాదు. రాష్ట్రంలో పోటీ చేసే పార్టీలు పెరిగితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి లబ్ధి పొందాలన్న భావనతోనే వైసీపీ కేసీఆర్ కు స్వాగతం పలుకుతోంది. అయితే ఏపీలో బీఆర్ఎస్ కు పట్టు చిక్కడం అంత సులువు కాదని అంటున్నారు. కేసీఆర్ గతంలో ఆంధ్రులను చులకన చేస్తూ చేసిన, పేడ బిర్యానీ వంటి వ్యాఖ్యలను ప్రజలు మరిచిపోయే అవకాశం లేదంటున్నారు. అన్నిటికీ మించి ఏపీలో బీఆర్ఎస్ ప్రవేశం వల్ల తెలంగాణలో ఆ పార్టీకి ఉన్ప పట్టు సడిలడం తప్ప మరో ప్రయోజనం సిద్ధించే అవకాశం లేదన్నది పరిశీలకుల విశ్లేషణ. 

జనసేనకు షాక్.. బీఆర్ఎస్ గూటికి తోట చంద్రశేఖర్

బీఆర్ఎస్ విస్తరణను  తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏపీ నుంచే ఆరంభించారు. ఇప్పటికే ఏపీలోని పలువురు నేతలపై దృష్టి సారించి  వారితో సంప్రదింపులు జరిపిన. కేసీఆర్.. పలువురు నేతల చేరికకు రంగం సిద్ధం చేశారు. ఏపీలో బీఆర్ఎస్ పొలిటికల్ ఎంట్రీతో తొలి షాక్ జనసేన పార్టీకే తగిలింది. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చిన క్షణం నుంచీ ఆ పార్టీ ఆంధ్రాలో అడుగుపెట్టడం ఖాయమన్న వార్తలు వినవస్తూనే ఉన్నాయి. ఆ పార్టీ ఏపీ బాధ్యతలు తలసాని శ్రీనివాస యాదవ్ కు అప్పగించారనీ కూడా ఒక సందర్భంగా పెద్దగా ప్రచారం కూడా జరిగింది. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మారుస్తూ ప్రకటన చేసిన సందర్భంలోనే త్వరలో ఏపీలో భారీ బహిరంగ సభ నిర్వహించి ఘనంగా ఎంట్రీ ఇస్తామని కూడా కేసీఆర్ ప్రకటించారు. అయితే ఆ తరువాత బీఆర్ఎస్ విస్తరణ అడుగులు పడలేదు. లిక్కర్ స్కాం, ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల కేసుల వల్లనో లేక.. కేసీఆర్ అనుకున్న విధంగా ఎటువంటి మద్దతూ రాకపోవడం వల్లనో కానీ.. బీఆర్ఎస్ విస్తరణ అడుగులు ఆగిపోయాయి. తాజాగా కొత్త సంవత్సరం ఆరంభంలో అనూహ్యంగా బీఆర్ఎస్ లోకి  ఆంధ్రప్రదేశ్ నుంచి చేరికలు ఆరంభమయ్యాయి. అసలు   బీఆర్ఎస్ ప్రకటించిన క్షణం నుంచే ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో అడుగుపెడితే ఏ పార్టీకి ప్రయోజనం, ఏ పార్టీకి నష్టం అన్న చర్చలు మొదలయ్యాయి. బీఆర్ఎస్ వల్ల తెలుగుదేశం నష్టపోతుందని కొందరూ, కాదు కాదు అధికార వైసీపీకే ఇబ్బందులు ఎదురౌతాయని మరి కొందరూ అంచనాలు వేశారు. ఒక దశలో వైసీపీ బీఆర్ఎస్ కు రాష్ట్రంలోకి వెల్ కమ్ చెప్పింది కూడా. అయితే కొత్త సంవత్సరంలో బీఆర్ఎస్ ఆంధ్రలో అడుగుపెట్టేస్తోంది. అయితే ఆ ఏపీ నుంచి ఆ పార్టీలోకి చేరుతున్న వారిలో తెలుగుదేశం, వైసీపీల నుంచి ఎవరూ లేరు కానీ అనూహ్యంగా జనసేన నుంచి కీలక నేతలు ఆ పార్టీలోకి జంప్ చేసేశారు.  ముఖ్యంగా  పార్టీ ఆవిర్భావం నుంచీ జనసేనతో ట్రావెల్ చేసినా గత కొంత కాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న సీనియర్ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్ బీఆర్ఎస్ గూటికి చేరనున్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన తోట చంద్రశేఖర్ బీఆర్ఎస్ లో చేరడం ఆ పార్టీకి ఏపీలో ఒక బలమైన సామాజిక వర్గం చేరువ కావడానికి దోహదం చేసే అవకాశం ఉంది. గతంలో ప్రజా రాజ్యం, వైఎస్సార్ కాంగ్రెస్ లో పనిచేసిన మాజీ ఐఏఎస్ తోట చంద్రశేఖర్.. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు జనసేనలో చేరారు. 2019లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. జనసేనలో కాపు సామాజిక వర్గానికి చెందిన కీలక నేతగా ఉన్న ఆయన.. జనసేనలో పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యుడుగా కొనసాగుతున్నారు. తోట చంద్రశేఖర్ హైదరాబాద్ లో సోమవారం(జవవరి2) కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నారు.  గుంటూరు నుంచి భారీ ర్యాలీతో తోట చంద్రశేఖర్ హైదరాబాద్ చేరుకుంటారు. పార్టీలో చేరిన రోజునే తోట చంద్రశేఖర్ ను బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడిగా కేసీఆర్ ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.   ఆయనే కాకుండా మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు కూడా సోమవారం (జనవరి 2) కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ గూటికి చేరనున్నారు. రావెల కిషోర్ బాబు  2014లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి  టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పని చేసారు.  2017లో మంత్రివర్గ విస్తరణలో పదవి పోవటంతో పార్టీకి రాజీనామా చేసారు. 2019 ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఆ తరువాత బీజేపీలో చేరారు. కొద్ది కాలం కిందట బీజేపీకి కూడా రాజీనామా చేశారు. ఇప్పుడు ఆయన బీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నారు. అలాగే మాజీ ఐఆర్ఎస్ అధికారి పార్థ సారథి కూడా బీఆర్ఎస్ లో చేరనున్నారు. అనంతరం కేసీఆర్ ఏపీ పర్యటన ముహూర్తం ఖరారయ్యే అవకాశం ఉంది. మొత్తంగా ఏపీ రాజకీయాలు బీఆర్ఎస్ ప్రవేశంతో మరింత వేడెక్కే అవకాశం ఉంది.    

తిరుమలలో భక్తుల రద్దీ

ఆయన వడ్డీ కాసుల వాడు.. వడ్డీ సహా వాసులు చేస్తాడు. ఏ కారణంగా అయినా ఆయనకు ఇస్తానన్నది ఇవ్వక పోయినా, చెల్లించవలసినది చెల్లించక పోయినా వదిలి పెట్టడు. ధర్మ వడ్డీ లెక్కకట్టి మరీ వసూలు చేస్తాడు. ఇక మొక్కుకుని మరిచి పోయానంటే అసలే వదిలి పెట్టడు. ముక్కు పట్టుకుని ఈడ్చుకు వెళ్లి మొక్కులు రాబట్టు  కుంటాడు. తిరుమలలో కొలువైన వేంకటేశ్వర స్వామి వారి గురించి భక్తుల విశ్వాసం.  అయితే గడచిన రెండేళ్ళలో  కరోనా కారణంగా ప్రయాణ సదుపాయాలు లేక పోవడం వల్లనైతే నేమి, కరోనా ఉదృతి ఎక్కువగా ఉన్న కారణంగా 2020 మార్చి నుంచి ఆలయంలోకి భక్తులకు టీటీడీ అనుమతించక పోవడం వల్లనైతేనీమే, దాదాపు 83 రోజులపాటు శ్రీనివాసుడికి ఏకాంతంగానే సేవలు నిర్వహించడం వల్లనైతే నేమీ, ఏడు కొండలకు భక్తుల రద్దీ చాల వరకు తగ్గి పోయింది. అయితే, ఈ ఏడాది ( 2022)  కరోనా ప్రభావం తగ్గటంతో పూర్తి స్థాయిలో తిరుమల ఆలయంలోకి వెళ్లడానికి భక్తులకు అనుమతి ఇచ్చారు. 2022 ఉగాది నుంచి కరోనా నిబంధనలు పూర్తిగా తొలగించారు. దీంతో తిరుమలకు భక్తులు పోటెత్తారు. ఈ ఏడాది స్వామి వారిని రికార్డు స్థాయిలో భక్తులు దర్శించుకున్నారు. అలానే కానుకలు, ముడుపుల, హుండీ ఆదాయం కూడా రికార్డ్ స్థాయిలోనే సమకూరింది.  సాధారణంగా టీటీడీ వార్షిక బడ్జెట్ హుండీ ఆదాయంపై‌ ఆధారపడి ఉంటుంది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను  రూ.3,116.25 కోట్లతో టీటీడీ బడ్జెట్ ను అంచనా వేసింది. తర్వాత దాన్ని రూ. 3,243. 19 కోట్లకు సవరించారు. ఇందులో శ్రీవారి హుండీ ఆదాయాన్ని రూ.1,231 కోట్లుగా అంచనా వేశారు.. అంచనా కన్నా 50 కోట్ల రూపాయలు అధికంగా భక్తులు హుండీలో సమర్పించారు. తద్వారా రూ.1,285 కోట్లు సమకూరింది. ఇవి కరోనా రాక ముందు పద్దులు. కొవిడ్ వచ్చినప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. 2020-21వ వార్షిక సంవత్సరానికి హుండీ ఆదాయం 13 వందల కోట్లు అంచనా వేయగా.. టీటీడీ అంచనాలను తలక్రిందులు చేస్తూ 721 కోట్లు రూపాయల ఆదాయం మాత్రమే వచ్చింది. దీంతో వార్షిక బడ్జెట్ ను సవరించి రూ. 2,553 కోట్లకు కుదించారు. ఇక 2020-21 ఆర్థిక సంవత్సరానికి 2,837 కోట్ల రూపాయలు అంచనా వేశాయి పాలక వర్గాలు.  2021-22 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ పై సుదీర్ఘ చర్చ జరిపి ఆమోదం తెలిపింది. 21-22ఆర్థిక సంవత్సరానికి 2,937.85 కోట్ల రూపాయలకు పాలకమండలి సభ్యులు పచ్చజెండా ఊపారు.. కోవిడ్ ‌తరువాత భారీగా భక్తుల‌ సంఖ్య‌ పెరగడంతో‌ గతంలో‌ మాదిరే హుండీ ఆదాయంతో‌ పాటుగా, కళ్యాణ‌ మండపాలు, కళ్యాణకట్ట, లడ్డూ విక్రయాలు, టీటీడీ భూములు లీజు‌ వంటి రూపాల్లో‌‌ ఆదాయం‌ పెరిగింది. ఈ క్రమంలోనే ఈ ఏడాది శ్రీవారిని దర్శించుకునే వారి సంఖ్య గణనీయంగా పెరగటంతో పాటుగ హుండీ ద్వారా టీటీడీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భక్తులు కానుకలు సమర్పించారు. ఈ క్రమంలో 2022 సంవత్సరానికి గాను శ్రీవారిని దర్శించుకున్న భక్తులు, హుండీ ఆదాయ లెక్కలను టీటీడీ విడుదల చేసింది. ఈ ఏడాది రికార్డు స్థాయిలో 2,35, 58,325 కోట్ల మంది స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే రూ. 1446 కోట్లు హుండీ, విరాళాల రూపంలో వచ్చాయి. 1,08,51,706 మంది శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. 11,42,78,291 శ్రీవారి లడ్డులను భక్తులకు విక్రయించారు. అయితే వెంకన్న దేవును ఆదాయం పెరిగిన స్థాయిలో భక్తుల సౌకర్యాలు పెరగడం లేదు. మరో వంక వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, టీటీడీలో అన్యమతస్తుల ప్రమేయం,అన్యమతస్థులు అరాచకాలు పెరిగి పోయాయనే విమర్శలు ఎకువయ్యాయి. ఇక టీటీడీలో నిధుల  దుర్వినియోగం, ఆస్తుల విక్రయం వంటి ఆరోపణల గురించి అయితే చెప్పనే అక్కర లేదు. చివరకు వెంకన్న హుండీలో కానుకలు వేయవద్దని ప్రధాన అర్చకులే భక్తులకు విజ్ఞప్తి చేశారంటే .. పరిస్థితి ఏమిటో వేరే చెప్పనకరలేదని అంటున్నారు

పంత్ ను కాపాడిన డ్రైవర్ కు మాజీ క్రికెటర్ లక్ష్మణ్ కృతజ్ణతలు

ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువ క్రికెటర్ రిషబ్ పంత్‌ ను సకాలంలో రక్షించి ఆసుపత్రికి తరలించిన హరియాణా బస్సు డ్రైవర్ సుశీల్ కుమార్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది.  అన్ని వర్గాలు సుశీల్ కుమార్ ను ప్రశంసించడమే కాదు.. కృతజ్ణతలు కూడా తెలుపుతున్నాయి.   కుటంబ సభ్యులతో కలిసి నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొనేందుకు ఢిల్లీ నుంచి తన స్వస్థలమైన రూర్కికి వెళ్తూ పంత్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. శుక్రవారం (డిసెంబర్ 30) తెల్లవారుజామున 5.30 గంటలకు పంత్ ప్రయాణిస్తున్న కారు ఢిల్లీ-డెహ్రాడూన్‌ జాతీయ రహదారిలో రూర్కీ నర్సన్ సరిహద్దు వద్ద  అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పంత్ ప్రయాణిస్తున్న కారు పూర్తిగా దగ్ధమైంది. తీవ్రంగా గాయాలు అయిన అతడు ప్రస్తుతం డెహ్రాడూన్‌లోని ఒక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడిని మరింత మెరుగైన చికిత్స కోసం ఢిల్లీకి తరలించనున్నారు. కాగా ప్రమాదం జరిగిన వెంటనే రిషబ్ పంత్‌ కారు మెర్సిడెస్ ఏఎమ్‌జి జిఎల్‌ఇ 43 4మ్యాటిక్ కూపేలో మంటలు చెలరేగాయి. దాంతో కారు అద్దం పగలగొట్టి బయటకు వచ్చేందుకు పంత్ ప్రయత్నించాడు. అదే సమయంలో అటుగా వెళ్తున్న హరియాణా బస్సు డ్రైవర్ సుశీల్ కుమార్ తన వాహనాన్ని రోడ్డు పక్కన ఆపేసి ఘటనా స్థలానికి పరిగెత్తుకొచ్చాడు. కారు కిటికీలో నుంచి సగం బయటకు వచ్చిన పంత్‌ను బయటకు లాగాడు. ఓ బెడ్‌షీట్‌తో పంత్ శరీరాన్ని కప్పాడు. వెంటనే అంబులెన్సుకు సమాచారం అందించి.. అందులో ఆసుపత్రికి పంపించాడు.ఇంతకీ ఈ డ్రైవర్ సుశీల్ కుమార్ కు క్రికెట్ తెలియదు. పంత్ ఎవరో కూడా తెలియదు. అయినా సమయానికి ఆపద్బాంధవుడిలా రిషబ్ పంత్ ను కాపాడాడు, మంచి మనసుతో, సేవా దృక్ఫథంతో యువ క్రికెటర్ ప్రాణాలు కాపాడిన సుశీల్ కుమార్ కు మాజీ క్రికెటర్ హైదరాబాదీ వీవీఎస్ లక్ష్మణ్ కృతజ్ణతలు తెలియజేస్తూ ట్వీట్ చేశాడు.మీ నిస్వార్థ సేవకు మేమంతా రుణపడి ఉంటామని లక్ష్మణ్ ఆ ట్వీట్ లో పేర్కొన్నాడు. అలాగే ఆ బస్సు కండక్టర్ పరంజిత్ కూడా లక్ష్మణ్ ఆ ట్వీట్ లో ధన్యవాదాలు తెలిపాడు. 

వైసీపీలో అసంతృప్తి.. నేతల్లో ఆందోళన

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వచ్చేందుకు, చేయని ప్రయత్నం లేదు. నిజానికి, ఓటమి అంచున నిలిచినా , దింపుడు కళ్ళెం ఆశతో ఏ చిన్న అవకాశాన్ని వదులు కోవడంలేదు. తీవ్ర కసరత్తు చేస్తున్నారు. పార్టీ కార్యకర్తలతో వరుస సమావేశాలు, సమీక్షలు నిర్వహిస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాలకు 175 సీట్లు గెలవాలని కోరుకుంటున్నారు. కోరుకోవడం కాదు, 175కి 175 సీట్లు ఎందుకు గెలవలేం అనే లక్ష్యంతో ముందుకు సాగండి అంటూ, అతి విశ్వాసాన్ని ఉద్భోదిస్తున్నారు. ఎమ్మెల్యేలను గడప గడపకు వెళ్లి, ప్రతి ఫ్యామిలీకి చేసిన మేళ్లను చెప్పుకోవాలని, తరుము తున్నారు. అయితే నిజంగా ప్రతి గాడపకు మేలు జరిగిందే నిజం అయితే, ఇంతలా హైరాన పాడడం ఎందుకు? అంటూ అటు ప్రజలు, ఇటు ప్రతి పక్ష నాయకులు, కార్యకర్తలు కూడా నవ్వు కుంటున్నారనుకోండి అది వేరే విషయం.   అలాగే చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చక్కని పాలన జరుగుతోందని    జగన్మోహన్ రెడ్డి  తనకు తాను తగిలించుకున్న భుజ కీర్తులను ఎత్తి చూపుకుంటున్నారు.  ఎన్నికల మేనిఫెస్టోలో 98 శాతానికి పైగా హామీలను నెరవేర్చామని  చేసిన పనులను గడపగడపకు ప్రజల వద్దకు తీసుకెళ్లడి చాలు అంటూ కార్యకర్తలలో విశ్వాసం కలిగించేందుకు చాలా చాలా శ్రమిస్తున్నారు. కుప్పం స్థానిక సంస్థల ఎన్నికల్లో సాధించిన విజయాన్ని(అతి ఎంత అక్రమ విజయమో వేరే చెప్పనక్కరలేదు) భూతద్దంలో చూపించి తెలుగు దేశం అధినేత్ చంద్రబాబు నాయుడు సొంత నియోజక వర్గం  కుప్పంలోనే గెలిచి నప్పుడు, మిగిలిన  నియోజక వర్గాల్లో గెలవడం ఎంత పని,  175కు 175 నియోజక వర్గాల్లోనూ గెలుస్తాం ..  గెలుస్తున్నాం .. అంటూ మైండ్ గేమ్ ఆడుతున్నారు. అయితే, జగన్ రెడ్డి కుప్పం గెలుపును ప్రజాస్వామ్య విజయంగా చెప్పుకోవడం  అది చూసి తనకు మరో అవకాశం ఇవ్వాలని కోరుకోవడం, తల్లి తండ్రులను హత్య చేసిన హంతకుడు,  తల్లి తండ్రులు లేని అనాధను కరుణించి కాపాడండని న్యాయస్థానాన్ని వేడుకున్నట్లు ఉందని అంటున్నారు.  నిజమే అద్దాల మేడలో కూర్చుని జగన్మోహన్ రెడ్డి పగటి కళలు కంటే కనవచ్చును, కానీ, వైసీపీ నాయకులు, కార్యకర్తల్లో మాత్రం  ఆ భరోసా కనిపించడం లేదు. గతంలో   అభ్యర్ధి ఎవరైనా,   అన్నకు ఓటేయండి.. అన్నను అధికారంలోకి తీసుకువద్దాం!`` అని, అన్ని నియోజక వర్గాల్లో జగన్ రెడ్డే, వైసీపీ అభ్యర్ధి అన్నట్ల్గు  ప్రచారం చేసిన కార్యకర్తలు, ఇప్పుడు మౌనంగా ఉండి పోతున్నారు. జగన్ రెడ్డి ఏమి చేశారంటే, చెప్పేందుకు సమాధానం లేక గడపగడప కర్యక్రమానికి దూరంగా ఉంటున్నారు. అంతేకాదు  2019 ఎన్నికల్లో వ్యక్తిగత ప్రయోజనాలను ఆశించి వైసీపే వెంట నడిచిన వైసీపీ కార్యకర్తలు చాలా వరకు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.  98 శాతం వరకు ఇచ్చిన హమీలను నేరవేర్చామని చెప్పుకోవడం, అమ్మకు అన్నం పెట్టనోడు, పిన్నమ్మకు వడ్డాణం చేయించానన్నట్లుగా ఉందని కార్యకర్తలే వాపోతున్నారు. ప్రజల సంగతి తర్వాత, కార్యకర్తలకు ఇచ్చిన హమీలకే దిక్కు లేదని నేతలను నడిరోడ్డు మీద నిలదీస్తున్నారు.  అలాగే కులం, మతం ఇతర ఇంటర్నల్ లింకుల కారణంగా ఇంకా వైసీపీని మోస్తున్న కార్యకర్తలు అయితే, ఇక ఇప్పడు చేయగలిగిందేమీ లేదనీ ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని వాపోతున్నారు.  మరో వంక నాయకుల్లోనూ ఇంతకాలం అణచి పెట్టుకున్న అసంతృప్తి  అగ్నిగోళంలా భగ్గుమంటోంది. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో తుపాకిలోంచి  తూటాలా ధిక్కారం దూసుకోస్తోంది. ప్రతి జిల్లా, ప్రతి నియోజక వర్గంలోనూ కనీసం ఇద్దరు ముగ్గురు నాయకులు అసంతృప్తితో రగిలిపోతున్నారు.  ఉమ్మడి కృష్ణాను తీసుకుంటే.. జగ్గయ్యపేట ఎమ్మెల్యే ఉదయభాను, గుంటూరులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, నెల్లూరులో కోటంరెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, మానుగుంట మహీధర్ రెడ్డి,   ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరిత, తాడికొండ లో ఉండవల్లి శ్రీదేవి,  కర్నూలులో  ఎస్వీ మోహన్ రెడ్డి    రాజంపేటలో మేడా మల్లికార్జున రెడ్డి, రాయచోటిలో  శ్రీకాంత్రెడ్డి,  గిద్దలూరులో అన్నా రాంబాబు బాపట్లలో కోన శశిధర్,  శ్రీకాకుళం కిల్లి కృపారాణి, పేరాడ తిలక్.. ఇలా.. కీలక నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఒకరిద్దరు మినహా వీరంతా కూడా   ముఖ్యమంత్రి జగన్ రెడ్డి వెంట నడిచిన వారే, అయన విజయం కోసం కష్టపడిన వారే. ఆయన కోసం.. ఆర్థిక సమస్యలు కొని తెచ్చుకున్నవారే. అప్పులు చేసి మరీ ఖర్చు చేసిన వారే. అయితే..ఇప్పుడు వీరికి ప్రాధాన్యం లేకుండా పోవడం.. జూనియర్లకు మంత్రి పదవులు ఇవ్వడం.. వారు ఆధిపత్య ధోరణితో ముందుకు సాగడం వంటివి ఇప్పుడు వీరిని మనోవేదనను కలిగిస్తున్నాయి. దీనికి తోడు.. నియోజకవర్గాల్లో అభివృద్ధిలేక పోవడం కూడా.. వారిని తీవ్ర సంకట స్థితికి చేర్చింది. దీంతో ఎక్కడికక్కడ నిరసనలు పెరుగుతున్నాయి. నిజానికి, వైసీపీలో ఏ ఇద్దరు కలిసినా ... జగన్ రెడ్డి మాటలకు, క్షేత్ర స్థాయి పరిస్థితులకు పొంతన లేదనే విషయాన్నే చర్చించుకుంటున్నారు. ఇటు కార్యకర్తల్లో, అటు నాయకుల్లోనూ భాగ్గుమనేదుకు సిద్డంగా ఉన్న అసంతృప్తి గురించే మాట్లాడు కుంటున్నారు. నిజానికి ఇప్పటికే చాల వరాకు జిల్లాల్లో అసంతృప్తి కర్యకలాపాలు జోరందుకున్నాయి... ఎన్నికలు దగరయ్యే కొద్దీ పార్టీలో కింది నుంచి పైవరకు ఉన్న అసంతృప్తి భగ్గుమంటోందని, వైసీపీ ముఖ్య నేతలు సైతం అంగీకరిస్తున్నారు. అయితే, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లేందుకు  వెనకాడుతున్నారు.. పిల్లి మేడలో గంట కట్టేది ఎవరని వేచి చూస్తున్నారు.