ఎక్స్ ఈ వేరియంట్  భారత్ లో ప్రభావం ఎంత ?..నిపుణుల విశ్లేషణ...

  కరోనా కొత్త వేరియంట్ ప్రజలను భయ బ్రాంతులకు గురి చేస్తోంది.గతంలో దీని తీవ్రతను అంచనా వేయడం లో ఇబ్బంది పడ్డ మనం ఎక్స్ ఇ వేరియంట్  తీవ్రత ప్రభావం ఏమేరకు ఉంటుంది? అన్నది పెద్ద సందేహం సామాన్యులను వేదిస్తోంది. అయితే భారతీయులు ఎక్స్ ఇ వేరియంట్ కు భయపడాల్సిన అవసరం లేదని నిపుణులు తీపి కబురు అందించారు. ఈ అంశం పై వెల్లూర్ కు చెందిన క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్ డాక్టర్ గగన్ దీప్ కాగ్ ఎక్స్ ఇ వేరియంట్ వల్ల పెద్దగా ప్రమాదం లేదన్న తీపి కబురు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ కోరోనా వైరస్ నూతన వేరియంట్ పై పెద్దగా భయపడాల్సింది లేదని ఎందుకంటే ఒమైక్రాన్ సబ్ వేరియంట్ తో పోల్చినప్పుడు ఎక్స్ ఇ ప్రమాదకారి కాదని తీవ్రత ఉండే అవకాశం లేదని తేల్చారు. ఎక్సి ఇ వేరియంట్ చింతించాల్సిన అవసరం లేదు... జాన్ హాప్కిన్స్  కు చెందినా గుప్తా-క్లిన్స్కో ద్వారా నిర్వహించిన చర్చలలో కాగ్ మాట్లాడుతూ వేరియంట్స్ వస్తాయాని ఎందుకంటే ఇప్పుడు ప్రజలు పర్యటిస్తున్నారు,సందర్శిస్తున్నారు, ఇప్పటి వరకూ మనవద్ద ఉన్న ఎక్స్ ఇ వేరియంట్ సమాచారం ప్రకారం బి ఏ2 ,వల్ల కాస్త భయపడినా బిఏ 1 అంత ప్రమాద కారి కాదు. ఎక్స్ ఇ వేరియంట్ బిఏ1,బి ఏ2 ఇది ఒమైక్రాన్ వేరియంట్ తీవ్ర రూపం దాల్చలేదు. భారాత్ లో వ్యాక్సినేషన్ తీసుకున్న వారు ఈ వేరియంట్ కు భయపడాల్సిన అవసరం లేదు.అయితే ఎక్స్ ఇ వేరియంట్ త్వరగా విస్తరిస్తుందని డబ్ల్యు హెచ్ ఓ ప్రపంచాన్ని హెచ్చరించిన విషయం తెలిసిందే.ఇతర వేరియంట్స్ తో పోలిస్తే త్వరగా విస్తరించే వేరియంట్ ఎక్స్ ఇ మాత్రమే ఎందుకంటే ఒమైక్రాన్ లోని బిఏ2 ,బిఏ1 కలిసిందని డబ్ల్యు హెచ్ ఓ తెలిపింది. భారాత్ లో ఎక్స్ఇ వేరియంట్ పై సస్పెన్స్... కొన్ని రోజుల ముందు బి ఎం సి భారత్ లో ఎక్స్ ఇ వేరియంట్ తొలి కేసు పూనా నమోదు అయ్యింది. ఇండియన్ సార్క్ కోవిడ్2 జీనోమిక్స్ కన్సోర్టియం జీనోమ్ నిపుణుల విశ్లేషణలు చేసారు. వారికి వచ్చిన సందేహాల ప్రకారం దీని జీనో మిక్స్ కాంస్టిట్యుట్యూషన్ ఎక్సి ఇ వేరియంట్ తో కలవడం లేదు. అరవై సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వారిపై ఎలాంటి ప్రభావం ఉంటుంది... 6౦ సంవత్సరాల కన్న తక్కువ వయస్సు ఉన్న ప్రజలకు బూస్టర్ డోస్ యొక్క ప్రభావం చూపేందుకు అవసరమైన డాటా ప్రస్తుతం తమవద్ద లేదని చివరి సమా వేషం లో ఐ సి ఎం ఆర్ డైరెక్టర్ బలరాం బార్ఘవ పాల్గొన్నారు. కాగా డాక్టర్ కాగ్ చేసిన వ్యాఖ్యను బలరాం బార్ఘవ బలపరచడం విశేషం. ఈ సందర్భంగా బార్ఘవ మాట్లాడుతూ ప్రాధమిక కేంద్రలాలో అత్యధికంగా నిధులు ఖర్చుచేయడం,మంచి శిక్షణ ఇవాల్సిన అవసరం ఉందని ప్రాధమిక ఆరోగ్య కేంద్రలాలో హీన పక్షం ఎం బి బీస్ డాక్టర్స్ అవసరం ఉందని. అనారోగ్యం చికిత్స విషయంలో ప్రజలకు చైతన్యం కల్పించాల్సిన అవసరం ఉందని బార్ఘవ అన్నారు. దానా దీనా ఎక్సి ఇ వేరియంట్ ప్రభావం పెద్దగా ఉండబోదని నిపుణులు-నిపుణులు విశ్లేషించారు.                                        

శ్రీరామనవమి నాడు పానకం ఎందుకు!

హైందవులు జరుపుకొనే ప్రతి పండుగకీ ఒక ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఎలాగూ ఉంటుంది. దాంతో పాటుగా ఆ సమయాలలో ఉండే వాతావరణం, లభించే వనరులు, ప్రబలే అనారోగ్యాలను కూడా దృష్టిలో ఉంచుకుని వివిధ సంప్రదాయాలను రూపొందించినట్లు కనిస్తుంది. వినాయకచవితి నాడు పత్రిపూజ, దీపావళి నాడు బాణాసంచా, ఉగాది నాడు వేపపచ్చడి... ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి పండుగకీ కాలానుగుణమైన ఓ సంప్రదాయం జతగా సాగుతోంది. శ్రీరామనవమినాటి పానంకం కూడా అంతే!   శ్రీరామనవమి మండువేసవిలో వస్తుంది. ఈ సమయానికి ఎండలే కాదు, గాడ్పులు కూడా మొదలవుతాయి. వేసవిలో బెల్లపు పానకాన్ని తీసుకోవడం వల్ల చాలా మేలే జరుగుతుంది. వేసవిలో ఎక్కువగా చెమట పట్టడం వల్ల... మన ఒంట్లో ఉండే ఖనిజాలైన సోడియం, పొటాషియం, మెగ్నీషియం, కేల్షియంలు ఆ చెమట ద్వారా బయటకు వెళ్లిపోయే ప్రమాదం ఉంది. పానకంలో ఈ నాలుగు ఖనిజాలూ ఉంటాయి. శరీరం నుంచి వెళ్లిపోయిన ఖనిజాలను అలా పానకం భర్తీ చేస్తుందన్నమాట! ఇక బెల్లంలో ఉండే ఇనుము వేసవి తాపాన్ని ఎదుర్కొనే శక్తినిస్తుంది. అంతేకాదు, వేసవిలో అటూఇటూ ఊగిసలాడే రక్తపోటుని కూడా బెల్లంలో ఉండే ఖనిజాలు అదుపులో ఉంచుతాయి. ఆయుర్వేదం ప్రకారం చూసినా పానకం వల్ల లాభాలెన్నో ఉన్నాయి. వేసవిలో తాపానికి పిత్తదోషాలు ప్రబలుతాయని ఆయుర్వేదం చెబుతోంది. దీనివల్ల అజీర్ణం, గుండెల్లో మంట, జుట్టు రాలడం, దద్దుర్లు, నిద్రలేమి లాంటి లక్షణాలు కనిపిస్తాయట. బెల్లానికి ఈ దోషాలను నివారించే గుణం ఉందంటారు ఆయుర్వేద వైద్యులు. ఇక బెల్లానికి ఉన్న మరో లక్షణం చలవ చేయడం. పైగా వేసవిలో వీలైనంత ఎక్కువగా నీరు తాగాలని పెద్దలు చెబుతుంటారు. అలాంటి నీటిలో బెల్లాన్ని కలుపుకుని పానకంగా తాగడం ఎవరికి మాత్రం ఇష్టముండదు! తెలుగునాట పెళ్లిళ్లలో విడిదికి చేరుకున్న వరుని కుటుంబానికి పానకపు బిందెలను అందించే సంప్రదాయం ఉంది. పెళ్లిళ్లు ఎక్కువగా వేసవిలో జరుగుతాయి కాబట్టి... ఒక పక్క పెళ్లి పనులు, ప్రయాణాలు సాగించి మరో పక్క వేసవి తాపానికి అలసిన మగపెళ్లివారికి తిరిగి ఉత్సాహాన్ని కలిగించేందుకు, ఈ సంప్రదాయాన్ని నెలకొల్పి ఉంటారు.   బెల్లపు పానకంలో మిరియాలు, యాలుకలు కూడా వేస్తుంటారు. ఆయుర్వేదం ప్రకారం మిరియాలు, యాలుకలు కూడా జీర్ణశక్తిని వృద్ధి చేస్తాయి. శరీరంలోని మలినాలన్నీ బయటకు పోయేలా తోడ్పడతాయి. వేసవిలో వచ్చే పొడిదగ్గుకి మిరియాలు గొప్ప ఔషధంలా పనిచేస్తే, యాలుకలు నోటి దుర్వాసనను దూరం చేస్తాయి. పానకం గురించి ఇంత చెప్పుకున్నాక వడపప్పు గురించి కూడా ప్రస్తావించి తీరాల్సిందే! పెసరప్పుకి చలవ చేసే గుణం ఉందంటారు. అంతేకాదు! అతి సులభంగా జీర్ణమయ్యే పదార్థాలలో పెసరపప్పు ఒకటి. శరీరంలోని మలినాలను తొలగించేందుకు, బరువు తగ్గించుకునేందుకు ఇప్పడు చాలామంది పాశ్చాత్యులు కూడా పెసరపప్పుతో చేసిన కట్టుని (సూప్‌) తాగడం మొదలుపెట్టారు. మనం ఆడుతూపాడుతూ తాగే వడపప్పు, పానకాల వెనుకాల ఇంత శాస్త్రం ఉందన్నమాట!   ..నిర్జర.

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం...

ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని ప్రతిఏటా ఏప్రిల్ 7 వ తేదీన నిర్వహిస్తారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం యొక్క లక్ష్యం తమ తమ  ఆరోగ్యం పట్ల ఆనుసరించాల్సిన పద్దతులపై అవగాహన చైతన్యం కల్పించడం చేయాల్సి ఉంటుంది. దీర్ఘ కాలం పాటు చురుకుగా ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి ఆహార అలవాట్లు అవసరమో తెలుసుకుందాం. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ----- మంచి అలవాట్లు అలవారచుకోవాలంటే ఒక్కరోజులో సాధ్యం కాదు. వీటిని మెల్లి మెల్లిగా ప్రారంభించాల్సి ఉంటుంది. ఊబకాయంతో పాటు డయాబెటిస్, థైరాయిడ్, గుండె సంబంధిత సమస్యలు,ఇప్పుడు వయస్సుతో సంబంధం లేకుండా వచ్చే గుండె పోటు,ఇతర అనారోగ్య సమస్యలు, ఇవన్ని అప్పటికప్పుడు అనుకోకుండా వచ్చిన సమస్యలు కావు. మీరు అనుసరిస్తున్న తప్పుడు విధానాలు సమయపాలన వల్ల సమయానికంటే ముందే మీకు కొన్ని హెచ్చరికలు చేస్తుంది. మనం మాత్రం ఒక సమస్య వచ్చినప్పుడు మాత్రమే ఆరోగ్యంపై శ్రద్ధ చూపిస్తారు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మీ ఆరోగ్యం పట్ల శ్రద పెట్టాలి. ఆ సమయంలో అలా చేయనందు వల్లే ప్రతి ఏటా ఏ ప్రిల్ 7 న మిమ్మల్ని మీఅరోగ్యం పట్ల మిమ్మల్ని అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉందని తెలియ చేయడానికే మా ఈ ప్రయాత్నం. ప్రతి ఏటా ఏప్రిల్ 7 న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా మీరు అనుసరించాల్సిన లక్షణాలను కొన్నింటిని వివరించే ప్రయత్నం చేస్తాం. అవి మీరు సుదీర్ఘ కాలం పాటు మీరు ఆరోగ్యంగా ఉండేందుకు దోహదం చేస్తుందని భావిస్తున్నాం. మీరు తీసుకునే ఆహారం ఆస్వాదిస్తూ తినండి... భోజనం చేయడం వల్ల ఆరోగ్యం తో పాటు శక్తి నిస్తుంది. ఈ సమయం లో ఖచ్చితంగా పాటించాల్సిన నియమం ఏమిటి అంటే భోజనాన్ని మెల్లిగా ఆస్వాదిస్తూ తినాలి.త్వర త్వరగా తినాలన్న ఆలోచనలో ఒకేసారి ఎక్కువగా భోజనం తీసుకుంటారు. దీనికారాణం గానే మీ శరీరం ఊబకాయం గా మారుతుంది. మెల్లి మెల్లిగా ఆహారాన్ని నమిలి తినడం ద్వారా ఆహారం తక్కువగా తిన్న కడుపు నిండి పోతుంది. దీనివల్ల చాలా సమస్యలు పరిష్కార మౌతాయి. ఆహారంలో ప్రోటీన్ ను ఎక్కువగా తీసుకోవాలి... శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రోటీన్ తో కూడిన సంపూర్ణ పోషకాల ఖజానా అవసరం. చాలా నెలలుగా మన శరీరం కోసం లాభాదాయక మైన ప్రోటీన్ లతో నిండిన ఆహారం తీసుకోవడం వల్ల మన పొట్ట నిండి ఉంటుంది. అందుకే మనకు త్వరగా ఆకలి వేయదు. దీనివల్ల బరువు ఊబాకాయం, రెండింటిని నియంత్రించ వచ్చు. శాఖాహారులకోసం సోయా, కాబూలి చన, పన్నీరు, స్ప్రవుట్స్ వంటివి ప్రోటీన్ చాలా అద్భుత మైన ప్రత్యామ్నాయం గా చెప్పవచ్చు. ఇంటి ఆహారంతోనే ఆరోగ్యం... ఇంట్లో తయారయ్యే ఆహారంలో మీకు కావాల్సిన విధంగా నూనె,ఉప్పు, మసాలా, వేసుకోవచ్చు. బయట వండిన ఆహారంలో అన్నీ ఎక్కువ స్థాయిలో కలిసి ఉంటాయి ఆహారం రుచికరంగా ఉండచ్చు. కాని ఆరోగ్య పరంగా అది సరైనది కాదు. అని అంటున్నారు నిపుణులు. నెలలో ఒకటి రెండు సార్లు లేదా ప్రత్యేకమైన సందర్భం లో తీసుకోవడం తప్పుకాదని అయితే ప్రతిరోజూ ఇలాంటి ఆహారాన్ని తీసుకోవడం నిరాకరించమని నిపుణులు సూచిస్తున్నారు. మీశారీరాన్ని మిమ్మల్ని మీరు ఫిట్ గా ఉంచుకోండి... ఆహారం బాగా తీసుకోవడం తో పాటు శరీరక  వ్యాయామం చేయించడం చేయడం కూడా అత్యవసరం వ్యాయామం వల్ల శరీరం మాత్రమే ఆరోగ్యంగా ఉండడం తో పాటు మూడ్ కూడా బాగుంటుంది. అలసట సమస్యలు ,ఒత్తిడివంటి వాటి నుండి దూరంగా ఉండవచ్చు.అయితే ఇందుకోసం వర్క్ అవుట్ అంటే  పెద్ద సైజు జిమ్ లు చేయాల్సిన అవసరం లేదు. మీరు ఇంట్లో కూడా రకరకాల వ్యాయామాలు చేయవచ్చు. రకరకాల కార్యక్రమాలు చేయవచ్చు. రక రకాల కార్యక్రమాలలో భాగంగా చీపురు తో శుభ్రంగా ఊడవడం, తడి బట్ట పెట్టి తుడవడం లేదా శుభ్రం చేయడం.ఇంటిలోపల బయట మొక్కలు పెంచడం పిల్లలతో ఆడుకోవడం ఇంట్లో అపార్ట్ మెంట్ లో లిఫ్ట్ కు బదులు మెట్ల ను వినియోగించడం వంటి వి చేయడం ద్వారా చురుకుగా ఉండవచ్చుప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భం గా మన  ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి. ఎవరో మన ఆరోగ్యాన్ని కాపాడతాడని అనుకోవడం వ్యర్ధం.కీలక మైన ఉపద్రవం వచ్చినప్పుడే రాణి అధికార యంత్రాంగం ఇప్పుడు మాత్రం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం రోజున వస్తుందని ప్రజలకు ఆరోగ్యాన్ని అందిస్తుందని ఎలా నమ్మగలం ఎలా విశ్వసించ గలం. 

కరోనా కొత్త వేరియంట్ ఎక్స్ ఇ అత్యంత ప్రమాదకరం డబ్ల్యు హెచ్ ఓ హెచ్చరిక...

  కరోనా వైరస్ ప్రారంభ మైన నాటి నుండి ఎన్నోరకాల వేరియంట్లు ముందుకు వస్తూనే ఉన్నాయి.అయితే ఎక్స్ ఇ నూతన వేరియంట్ ను గుర్తించారు.ఎక్స్ ఇ పై డబ్ల్యు హెచ్ ఓ అమందో చూద్దాం.ప్రపంచం లో కోవిడ్ ప్రభావం క్రమంగా తగ్గు ముఖం పడుతోందని అని అనుకుంటున్న సమయం లో అందరు తమ తమ విధులను నిర్భయం గా చేసుకుంటున్నారు. ఈ సమయంలో మరో కొత్త వేరియంట్ పుట్టుకు వచ్చిందని డబ్ల్యు హెచ్ ఓ వెల్లడించింది.డబ్ల్యు హెచ్ ఓ వివరాల ప్రకారం కోరోనా వేరియంట్ ఎక్స్ ఇ ని గుర్తించినట్లు తెలిపింది. మనం ఆందోళన చెందాల్సిన విషయం ఏమిటి అంటే సాధారణ ఒమైక్రాన్ తో పోలిస్తే ఎక్స్ ఇ వేరియంట్ త్వరగా వ్యాపిస్తుందని తెలిపారు. కాగా ఇప్పటివరకూ కోవిడ్ 19 ఒమైక్రాన్ లేదా అన్ని వేరియంట్లలో కన్నా ఇది అధికంగా మ్యుటేట్ చెందుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.ఒమైక్రాన్ వేరియంట్ ప్రపంచాన్ని మూడవ వేవ్ గా విస్తరించేందుకు పెద్ద్దసమయం పట్టలేదన్న విషయాన్ని గమనించాలని డబ్ల్యు హెచ్ ఓ హెచ్చరించింది. ఒమైక్రాన్ వేరియంట్ కారణం గా వచ్చిన ఉప్పెన మొదటి వేవ్ కన్నా మూడవ విడతలో ఆసుపత్రులలో చేరిన వారి సంఖ్య  తక్కువే అని పేర్కొన్నారు. ఒమైక్రాన్ డెల్టా వేరియంట్ ను సైతం వెనక్కు నెట్టి ఆశ్చర్యాన్ని కలిగించిందని నిపుణులు పేర్కొన్నారు. కోవిడ్ ఎక్స్ ఇ ఐ దు వాస్తవాలు... కొత్త వేరియంట్  ఎక్స్ ఇ ఐ దు గురించిన 5 అంశాలు తెలుసుకుందాం. ఎక్స్ ఇ ఒమైక్రాన్ బిఏ 1 బి ఏ 2 కలిసి ఉన్నట్లు తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ముందు నుంచే వైరస్ వేరియంట్స్ గురించిన సమాచారం అందించే ప్రపంచాన్ని అప్రమత్తం చేస్తుంది.డెల్టా క్రాన్ కన్నా ముందుగా వచ్చిందా అన్న సందేహం వ్యక్తం చేస్తున్నారు.గతకొంత కాలం గా వైరస్ లు  మరికొన్ని కలిసి పుట్టుకు వస్తున్నాయి.అందులో ఫ్లూరాన్  కూడా ఒకటి.ఎక్స్ ఇ కూడా బిఏ1 బిఏ 2 కలిసిన వేరియంట్ గా గుర్తించారు. ఈ రెండూ కాక ఇంకెన్ని ఉన్నాయి.అవి ఎక్కడ ఉన్నాయి అన్న అంశాల పై దృష్టి పెట్టాల్సి ఉంది. అని నిపుణులు అంటునారు.   ఎక్స్ ఇ వేరియంట్ ఆందోళన కరమా?.... ఎక్స్ ఇ వేరియంట్ స్వరూప స్వభావం ఎలా ఉంటుంది అన్న విష యం లో ప్రపంచ ఆరోగ్య సంస్థ అందించిన ప్రారంభ రిపోర్ట్ లో ఎక్స్ ఇ వేరియంట్ ఆందోళన కరమైన వైరస్ గా పేర్కొంది. మార్చ్ 25 న వచ్చిన రిపోర్ట్ లో యు కే లో ఇప్పటి వరకూ 6౩7 మంది పై ప్రభావం చూపించిందని ఒమైక్రాన్ బిఏ 1 బి ఏ2 కలిసిన వేరియంట్ గా పేర్కొన్నారు.యు క్ కు చెందిన ఆరోగ్య శాఖ ఎజే సి సలహాదారు సుసాన్ వా ప్కిన్స్ మాట్లాడుతూ వేరియంట్ యొక్క ప్రభావం గురించి మాట్లాడుతూ ప్రత్యేకంగా బి ఏ 1 బి ఏ 2 కలగలిసిన వేరియంట్ ఎక్స్ ఇ మార్పు ఉన్నట్లు  వివరించారు. ఈ వేరియంట్ ఎక్కడ పుట్టింది, ఎలా వృద్ధి చెందింది అన్న అంశాలు పూర్తిగా తెలియాల్సి ఉంది అని అన్నారు.ప్రపంచ ఆరోగ్య సంస్థ మాత్రం కోరోనా వేరియంట్స్ పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. సహజంగా అది వంశ పా రం పర్యంగా వేరియంట్ కు పరివర్తన చెందే గుణం ఉందని ఈ పరివర్తన లేదా రూపాంతరం చెందడం అత్యంత హానికరం గా పేర్కొన్నారు. ఎక్స్ ఇ త్వరగా వ్యాపిస్తుంది ... ఎక్స్ ఇ వేరియంట్ ఎక్కువ మందికి త్వరగా వ్యాపిస్తుందని త్వరగా సంక్రమిస్తుందని తెలుస్తోంది. ఒమైక్రాన్ తో పోల్చినప్పుడు దీని ప్రభావం 1౦ రెట్లు ఎక్కువగా ఉంటుందని సత్వరం వ్యాపిస్తుంది. ఇప్పటి వరకూ ఒమైక్రాన్ వేరియంట్ మాత్రమే త్వరగా విస్తరించి సంక్రమిస్తుందని భావించారు. ఒమైక్రాన్ ప్రపంచాన్ని చుట్టేయడానికి పెద్ద సమయం పట్ట లేదన్న విషయాన్ని గుర్తించాలని డబ్ల్యు హెచ్ ఓ హెచ్చరించింది. ఎక్స్ ఇ తీవ్రత ఎలాఉంటుంది?... డబ్ల్యు హెచ్ ఓ వివరాల ప్రకారం మరింత సమాచారం కోసం వేచి చూడాలని. గతం లో ఉన్న ఒమైక్రాన్ బి1 బి2 ప్రభావం లో పెద్దగా మార్పు లేదని ఒమైక్రాన్ కారణం గానే మూడవ విడత వేవ్ వచ్చిందని ఇప్పుడు చైనాలో వీర విహారం చేస్తోందని మార్చ్ నెలలో చైనాలో కోవిడ్ బారిన పడిన పడిన వారి సంఖ్య ఒక లక్ష కు ఎక్కువే ఉన్నాయని, ఇందులో అత్యధిక కేసులు షాంఘై లోనే ఉండడం గమనార్హమని డబ్ల్యు హెచ్ ఓ విశ్లేషించింది. ఇప్పటి వరకూ దీని ప్రభావం ఎక్కడ ఉంది?... ఒమైక్రాన్ ఎక్స్ ఇ వేరియంట్ ప్రభావం పడింది. యు కే కు చెందినా రక్షణ సంస్థ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఎక్స్ ఇ వచ్చిన నాటి నుంచి 6౩7 మంది పై ప్రభావం చూపించిందని తెలుస్తోంది.ఎక్స్ ఇ ప్రభావం దీనిలక్షణా లు సోకినా వారికి చేస్తున్న చికిత్స ఎలాంటి వాతావరణం లో మరింత ప్రభావ వంతం గా ఉంటుంది అన్న అంశం పై మరింత లోతైన అధయనం చేయాల్సి ఉందని ఆ వివరాలు అందిన వెంటనే వెల్లడిస్తామని డబ్ల్యు హెచ్ ఓ పేర్కొంది.                                          

వడదెబ్బ బారిన పడకుండా ఎలా నివారించాలి?..

వడదెబ్బ ఎవరికీ వస్తుంది. వడదెబ్బ ప్రమాదం నుండి ఎలారక్షించు కోవాలి? మార్చ్ నెల చివరి వారం లోనే ఎండలు ముదిరి పోయాయి,వడగాడ్పులు ఎండవేడిమి పెరిగి పోతోంది.దీనికి తోడు మరెన్నో అనారోగ్య సమస్యలు పెరుగు తాయి. ముఖ్యంగా ముఖ్యంగా గుండె సమస్యల తో బాధ పడు తున్న వారువేసవి ఎండల నుండి సంరక్షించు కోవాలి.అన్నదే పెద్ద సందేహం.బహుశా మీరు వినే ఉంటారు చలికాలం వచ్చిందంటే గుండె సంబంధిత సమస్యలు ఉన్నవాళ్లు చాలా ప్రమాదం పొంచి ఉందని ఈ వాతావరణం లో నూ గుండె సంబందిత సమస్యలు చూడ వచ్చని కేవలం మంచు గడ్డ కట్టే చలిలో మాత్రమే కాదు తీవ్రమైన ఎండా వేడిమి కూడా గుండె సంబంధిత సమస్యలను పెంచుతుంది.వాస్తవానికి ఒక పరిశోదన ప్రకారం వాతావరణం లో వచ్చే కొన్ని మార్పులు గుండె సంబంధిత సమస్యలు మనల్ని ఇబ్బందుల లోకి నెడతాయి అని నిపుణులు అంటున్నారు. వడ దెబ్బ ఎలా వస్తుంది...? ఈ సంవత్సరం ఎండాకాలం అదే వేసవి కాలం త్వరగా వచ్చేసినట్లు ఉంది కదా అంతే కాదు. వేడిమి ఉష్ణోగ్రతలు క్రమేపి త్వరగా పెరుగుదల కనిపిస్తుంది. గుండె సంబంధిత రోగులకు వడదెబ్బ ప్రమాదం పొంచి ఉంది ఇది అత్యంత ప్రమాదకరమైన సంకేతం వేడిగా ఉన్న వాతావరణం లో మనశరీరం లో వేడి పెరిగి పోతుంది. మనము ఎండవేడిమి ఉన్న ప్రాంతం లో నివసించక తప్పదు. మీ గుండెలో  స్పందనలు వేరు వేరుగా ఉంటాయి గుండెలో దడ హార్ట్ బీట్ లో మార్పులు వస్తాయి.రక్త ప్రసారం అందించాలంటే చాలా ఇబ్బంది పడాలి.అందుకే శరీరం తనకు తానుగా చల్లగా చేసుకోదో ఆ ఒత్తిడి గుండె ఇతర అవయవాల పైన పడుతుంది. దీనివల్ల వారికి తీవ్రనష్టం ఏర్పడుతుంది. ఈ కారణం గానే గుండె పై దాడి చేస్తుంది వడదెబ్బ రూపం లో భయట పడుతుంది. వడ దెబ్బ వల్ల ప్రమాదమే ఎక్కువట... వడదెబ్బ ఎవరికైనా  తగలవచ్చు. వాటిని ఎదుర్కోవచ్చు. ఎవరైతే గుండె సంబందిత సమస్యలతో బాధపడుతున్నారో. వడ దెబ్బ ప్రమాదం పొంచి ఉంది.గుండె జబ్బులు ఉన్న వారిలో చమట వస్తే ప్రమాదమే అని గుర్తించాలి.ఎప్పుడైతే ఎండవేడిమి పెరిగి పోతుందో. మనందరికీ చమట వస్తుంది. శరీరం లో చేరే వేడికి వ్యతిరేకంగా సహజం గానే అది పని చేస్తుంది. అయితే గుండె సంబంధిత రోగులకు ఈ విషయం అంత సులభం కాదు. అది ఒక్కోసారి ప్రాణాంతకం కావచ్చు.శరీరానికి అవసరమైన ఖనిజాలు చమటరూపం లో  బయటికి పోతాయి.ఈ కారణం గానే గుండెపై తీవ్రాత్తిది పెరుగుతుందని వైద్యులు గుర్తించారు.వేసవి కాలం లో మీ శరీరం  ఆరోగ్యంగా ఉంచాలంటేడీ టాక్సీ ఫికేషణ్ కోసం ఈ ఆహారాన్ని తీసుకోండి. వదదెబ్భ నుండి ఎలారక్షించు కోవాలి?... నీరు ఎక్కువగా తీసుకోవాలి.గుండె సంబంధిత రోగులు క్రమం తప్పకుండా డాక్టర్ సూచించిన మందులు వాడు కుంటూ ఎక్కువగా మంచినీరు తాగే ప్రయత్నం చెయ్యాలి.ఎండవేళ లో బయటకు రాకండి..అధికంగా వేడిమి ఉండే సమయం లో అదీ మధ్యాహ్నం 12 గం నుండి సాయంత్రం 4 గం వరకూ ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఆసమయంలో బయటికి రావద్దని ఒక వేళ తప్పని సరి పరిస్థితిలో బయటకు వస్తే మంచి నీటి బాటిల్ మీ వెంట తీసుకు వెళ్ళండి. ఎండనుండి రక్షించుకునేందుకు టోపీలు లేదా షేడ్స్ వాడండి. వ్యాయా మం తప్పక చేయండి... గుండె సంబంధిత వ్యాధి గ్రస్తులు చిన్న చిన్న వ్యాయామాలు చేయాలాని సూచించారు. ఉదయం వేళలో మాత్రమే వ్యాయామం చేయాలి.లేదా వాతావరణం కాస్త చల్ల బడ్డాక వ్యాయామం చేయాలి. ఒకవేళ ఎక్కువగా చమట వస్తుంటే మీగుందే వేగం పెరిగి పోతుంది.గుండె నొప్పి సమస్యలుమళ్ళీ ప్రారంభ మౌతాయి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా డాక్టర్ ను  సంప్రదించడం అవసరం. రెగ్యులర్ చకప్ చేయించండి... వాతావరణం ఎలా ఉన్నా గుండె వ్యాధులు తో బాధ పడు తున్నవాళ్ళు రెగ్యులర్ చకప్ చేయిస్తూ ఉండాలి. దీనిద్వారా మిమ్మల్ని మీరు మీ ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టాలని తద్వారా వేసవి కాలం లో వచ్చే వడ దెబ్బ నుంచి మీ గుండెను కా పా డుకోవాలని సూచిస్తున్నారు. వేసవి కాలం లో వడదెబ్బ నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు.                                            

ఎండాకాలం లో ఎదురయ్యే  సమస్యలు...

అసలే ఎండాకాలం ఆపైన ఉడక పోత ఇంకేముంది మీ శరీరంలో ఏమాత్రం నీరు,ఉప్పుశాతం తగ్గిన వెంటనే వ్యక్తి లో నీరసం,అలసట వస్తుంది.ఎండ తాపానికి ఎంతటి ఆరోగ్య వంతుడైనాసరే అతని ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది.ఎండలో ఎక్కువసేపు ఉండడం వల్ల అనారోగ్యానికి సంబంధించి న సమస్యలు వస్తాయి.అందుకే ఎండాకాలం లో ఎక్కువశాతం ఎంతవీలైతే అంత ఎక్కువ నీరు తాగడం మంచిది.వాతావరణం లో ఒక్క సారిగా అదిక చలినుండి , వాతావరణం లో అధిక ఎండ తీవ్రత వేడిమి పెరిగి పోతుంది.ఈ కారణం గానే కొంతమేర అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి దీనికి కారణం వేడిమి,వేడి గాలుల వల్ల ఎవరి ఆరోగ్యమైన అనారోగ్యానికి గురి కావాల్సిందే. ఎండాకాలం లో మనల్ని వేదించే కటిన మైన సమస్యలు ఎప్పుడూ ఉంటాయి.మీరు ఎండ బారిన పడ్డప్పుడు మీరు ఎండను తట్టుకోవడం కష్టం. అది మీఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపుతుంది. కొన్ని సందర్భాలాలో మరణించడం కూడా సంభవించ వచ్చు. ఎండ వేడిమి ఎవరికీ ప్రమాదం ?... గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు. * ఊబకాయం ఉన్న వాళ్ళు * హై బిపి సమస్య ఉన్న వాళ్ళు. * వృద్ధులు,సామాన్యులు యుక్త వయస్కులు,యువతీ యువకులు. * ముఖ్యంగా ఎండలో పని చేసే కార్మికులు.   ఎండ వల్ల వచ్చే సాధారణ సమస్యలు... వేడి వల్ల శరీరంలో చమట పొక్కులు వస్తూ ఉంటాయి. ఇవి చర్మం పై దీర్ఘకాలం పాటు ఎండలో ఉండడం వల్ల చమట పొక్కులు మంట కారణం అవుతుంది. వేడిమి వల్ల చమట పట్టడం వల్ల శరీరంలో మార్పులు రావడం సహజం.శరీరం పై ఎర్రటి పొక్కులు ,మంట దురద వంటి సాధారణ సమస్యలు ఉంటాయి. ఎండాకాలం వడదెబ్బ... శరీరం లో చల్ల బడే తత్వం తక్కువగా ఉండడం వల్ల. కొన్ని నిమిషాల లోనే శరీరపు ఉష్ణోగ్రతలు పెరిగి పోతాయి.అది ఒక్కోసారి తీవ్ర అస్వస్తత కు గురి అవుతారు. శరీరంలో బిపి,షుగర్ లో హెచ్చు తగ్గులు ఉండడం వల్ల. ఒక్కోసారి కోమా లేదా భ్రమ, గుండె సమస్యలు డీ హై డ్రెషన్ వచ్చి మరణించే అవకాశం ఉంది. ఎండవేడిమి వల్ల అలసట... ఈ పరిస్థితిలో అధికంగా చమట పట్టడం వల్ల శరీరం లో ఉప్పు నీటి శాతం తాగ్గిపోతుంది. ఈ కారణంగా త్వరగా అలిసి పోతారు. అలిసి పోయి నప్పుడు కళ్ళు తిరగడం,దాహం శరీరంలో వేడి పెరగడం తల నొప్పి వంటివి ఉంటాయి. ఎండ వేడిమి కి కండరాలు పట్టుకు పోతాయి ... ఎండ వేడిమి కారణం గా శరీరంలో ఉప్పు నీటి శాత్హం తగ్గిపోతుంది.దీనికారణంగా భరించలేని ఒళ్ళు నొప్పులు క్రామ్ప్స్ అని అంటారు. ఒక్కసారిగా పిక్క పాటయి వేయడం తీవ్రమైన నొప్పి తో గిల గిల లాదిపోతారు.ముఖ్యంగా పొట్ట,చెయ్యి, వీపు వెనుక ప్రాంతం లో తీవ్రమైన నొప్పి తో బాధ పడతారు.ఒక్కోసారి ఎడమ చేయి లేదా కుడి చేయి భుజాలు, మెడనరాలు సైతం తీవ్ర మైన నొప్పి ఉంటుంది. ఎండవేడిమికి కళ్ళు తిరగడం... దీర్ఘ కాలం పాటు ఎండలో ఉండడం వల్ల చాలా సార్లు వ్యక్తి కళ్ళు తిరిగి పడిపోతాడు. దీనికి కారణం శరీరం లో నీటి శాతం తగ్గడం.వల్ల కూడా కావచ్చు.ఎండ వేడిమి వల్ల కళ్ళు తిరగడానికి కారణం ,తలనొప్పి, లేదా తల తిరగదానికి కారణం  లో బిపి,లేదా లో షుగర్ కూడా కావచ్చు అన్న విషయం గమనించాలి.                                                        

కరోనా ఫోర్త్ వేవ్ కు సంకేతమా...

  కరోనా పుట్టిల్లు షాంఘై లో లాక్ డౌన్ ఆక్షలు కటి నంగా అమలు చేస్తున్నట్లు సమాచారం.ఇంటి నుండి బయటకు రావద్దని పౌరులకు నిబందనలు అమలు చేస్తున్నారు.మార్చి 28 నుండి చైనా లోని బీజింగ్ లో కోరోనా వైరస్ లాక్ డౌన్ అమలు చేస్తోంది .అయితే మొదటి వేవ్, రెండవ వేవ్ లోఅంటే   రెండేళ్ళ వరకు చైనాలో కోరోనా పరీక్షలు నియంత్రించారు. అయితే కోరోనా ఉప్పెనలా ముంచుకు వస్తూ ఉండడం తో అది ఆర్ధిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోందన్న సందేహం వ్యక్తం అవుతోంది. ప్రపంచం లో జీరో కోవిడ్ స్టేటర్జీ పై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.చైనా లోని అతి పెద్ద నగరం షాంఘై మంగళ వరం నుంచి తొలి విడత కోవిడ్ లాక్ డౌన్ బ్యాన్ ను ఖచ్చితంగా అమలు చేస్తున్నారా? అసలు చాలామంది ప్రజలు సాయంత్రం వేళల్లో వారి వారి పెంపుడు జంతువులు సైతం తీసుకు రావద్దని ఇంటి నుంచి బయటకు రావద్దని ఆంక్షలు విదిస్తున్నారు.గత రెండు రోజులుగా షాంఘై సమీపం లోని వ్యురాంగ్ జిల్లలో నివసిస్తున్న వారిలో కోవిడ్ లక్షణాలు ఉన్నట్లు గుర్తించిన అధికారులు. కోవిడ్ పరీక్షలకు మాత్రమే అనుమతించారు.షాంఘై లో4,477 కేసులు బయట పడడం తో కోవిడ్ ఆంక్షలు మరింత కటిన తరం చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. జాతీయ స్థాయిలో కొత్త కోవిడ్ కేసులు మరణాలు తగ్గు ముఖం పట్టాయని అధికారులు వెల్లడించారు. మార్చ్ 2౦ నుంచి 4,6౩8 కేసులు ఉన్నట్లు గుర్తించారు.ప్రపంచ దేశాలలో ఒమైక్రాన్ వేరియంట్ కేసులు పెద్ద సంఖ్యలో పెరుగుతూ ఉండడం తో 4వ విడత కోరోనా వచ్చే అవకాశాలు ఉన్నాయాని నిపుణులు విశ్వసిస్తున్నారు.ఒమైక్రాన్  ఇన్ఫెక్షన్ ఒక ఉప్పెనలా ముంచుకొస్తుందని దీనివల్ల ఇన్ఫెక్షన్ సోకి ఇప్పటికే న్యూజీలాండ్,సౌత్ కొరియా, జర్మనీ, ఆస్ట్రేలియా దేశాలలో ఒక్కనెలలోనే అధిక సఖ్యలో ఇన్ఫెక్షన్ బారిన పడ్డట్లు సమాచారం. భారత్ లో మరో వేవ్ తప్పదా?... ఇప్పటికే ఆశియాలో ఒమైక్రాన్ ప్రభావం చూపడం తోభారత్ లోనూ మరో గండం పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఇప్పటికే రెండు విడతల కోరోనా వేవ్ ను చవి చూసిన మనం గతం లో కోవిడ్ భారిన పడ్డ ప్రాంతలాలో ఇప్పుడిప్పుడే కంటైన్మేంట్ జోన్లను ఎత్తివేసింది. గతవారం లో మాస్క్లు లు,సాని టైజర్లు కూడా వాడడం భారత్ లో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇతర దేశాలాలో  స్టేల్ వేరియంట్ ఒమైక్రాన్ కెసులు పెరుగుతూ ఉండడం తో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అప్రమత్తమయ్యింది. ఈమేరకు వివిధరాష్ట్ర్రాల,కేంద్ర పాలిత ప్రాంతాలలోని  చీఫ్ సేక్రట రీలకు కేంద్ర హోంమంత్రిత్వ కార్యదర్శి అజయ్ భల్ల లేఖలు రాసారు అయితే 24 నెలలుగా వృద్ది సాధించామని భారత్ కు ప్యాం డమిక్ ను  ఎలా ఎదుర్కోవాలోనిర్ధారణ, అలాగే,నిఘా, కాంటాక్ట్,ట్రేస్,ట్రీట్, వ్యాక్సినేషన్ ఆసుపత్రులలో మౌలిక సదుపాయాల కల్పన, పెంచినట్లు తెలిపారు.సాధారణ ప్రజానీకం సైతం కోవిడ్ పై అవగాహన వచ్చిందని కోవిడ్ ఎలాప్రవర్తిస్తుందో రాష్ట్ర్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాలు, స్వయం ప్రతి పత్తి ని సాధించాయి అని అజయ్ భల్ల పేర్కొన్నారు కాగా పరిస్థితి ఎలాఉన్నా ఎదుర్కోడానికి సిద్ధంగా ఉండాలని కోరోనా నియంత్రణ చర్యలు పాటించడం అవసరమని ఈమేరకు ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని భల్ల అధికారులను అప్రమత్తం చేసినట్లు సమాచారం. భారత్ కు నాల్గవ వేవ్ వస్తే సామాన్యుడి గతి ఏమిటి? ఈ ప్రశ్నకు ప్రభుత్వాలు చెప్పే సమాధానం ఏమిటి?     కోవిడ్ వల్ల ఎన్నో కుటుంబాలు అయిన వాళ్ళను కోల్పోయారు. నేటికి ఆ వ్యక్తి లేని కొరతను అధిగమించేందుకు సతదా ప్రయ్యత్నిస్తున్నారు.అయినప్పటికీ పూర్తిగ్గా అవగాహన లేక,ఎలాంటి జాగ్రతలు తీసుకోవాలో తెలియక, కోవిడ్ చికిత్సలు ఎక్కడ చేస్తారో తెలియక ఆసమాచారం  లేక చూస్తూ చూస్తూ తమ వాళ్ళను కళ్ళముందే పోగొట్టుకుని కుమిలిపోయిన బాధిత కుటుంబాలు ఎన్నో ఎన్నెన్నో,కొనబోతే కొరివి,అమ్మబోతే అడివి అన్న చందాన అకాసాన్ని తాకిన ధరలు ఒకవైపు,ముంచుకొస్తున్న కోరోనా తూఫాన్ ను ఎలా ఎదుర్కోవాలో తెలియక ఇబ్బంది పడుతూ సూన్యం లోకి చూస్త్హూ ఏమిచేయాలో తెలియక దారి తెన్ను లేని జీవితాన్ని బతికేస్తున్న సగటు సామాన్యుడి గోడు పట్టదు.ఒకవైపు చికిత్సల ఖర్చు మరోపక్క మందుల ధరలూ పెరిగి పోవడం తో సగటు మధ్య తరగతి కి వైద్యం అంతంత మాత్రం గానే అందుతుంది.ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో ఎవరికీ పట్టని రోగి. జిల్లా ఆసుపత్రిలో కోవిడ్ రోగి వస్తే చేసే చికిత్స ఏమిటో చెప్పరు అసలు రోగి స్థితిని చెప్పే నాధుడే ఉండదు. అసలు ప్రభుత్వ ఆసుపత్రికి వెళితే తిరిగి వస్తామో లేదో అన్నదే సామాన్యుడి సందేహం ప్రభుత్వాలు సైతం భరోసా ఇవ్వని చికిత్సలు ఇక ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళడం కన్నా కాటికి పోవడం సులభం అని అనుకుంటున్న సామాన్యుడి గోడు ప్రభుత్వాలకి వినపడదు కన పడదు.రెండేళ్ళ ప్యాం డమిక్ ను చూసి అయినా సామాన్యుడికి ఉచిత వైద్యం ఇచ్చే ప్రణాళిక లేకపోవడం. మౌలిక సదుపాయాలు సైతం లేక పోవడం గమనించ వచ్చు కేంద్ర రాష్ట్ర ప్రణాళికలో సామాన్యుడి ఆరోగ్యానికి ఒక్క పైసా కేటాయింపులు లేకపోగా అసలు ఎ ఎ చికిత్సలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలాకి ఖర్చు చేస్తున్నాయి ఎంత ఖర్చు చేస్తున్నాయి అన్నకేటాయింపులు లేకపోవడం చూస్తే సామాన్యుడి ఆరోగ్యం పై ఎంత శ్రద్దో తెలుస్తుంది. వ్యాక్సిన్లుఅమ్ముకున్నారు రెమిడీ సివిర్ ఇంజక్షన్ బ్లాక్ లో అమ్ముకున్నారు సాధారణ పెరాసిట్ మాల్, ఇతర మందుల దరలు పెంచేసి ప్రభుత్వం ప్రజా ఆరోగ్యాన్ని  ప్రైవేటు పరం చేసిందని కేంద్రం చెప్పకనే చెప్పింది ఇక 4వ విడత కోరోనా వస్తే మాన్యులసంగతి దేముడికి ఎరుక, సామాన్యుడి సంగతి తలుచుకుంటేనే భయం వేస్తుందని సగటు సామాన్యుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు.                               

స్టెల్త్ వేరియంట్ ప్రమాదకరమా?...

ఈ అంశం పై పూర్తిగా చర్చించే ముందు స్టేల్ ఒమైక్రాన్ అంటే ఏమిటో మీకు తెలుసా ?స్టేల్ వేరియంట్ లక్షణాలు ఏమిటి ? స్టేల్ వేరియంట్ ప్రభావం తీవ్రత వల్లే చైనాలో లాక్ డౌన్ పెట్టారా?కోరోనా ఒమైక్రాన్ సంక్రమించి ఇంకా పెరుగు తూనే ఉన్నాయి. చైనా లోని అతి పెద్ద నగరం లో లాక్ డౌన్ విధించారన్న వార్త ప్రపంచదేశాలలో చక్కర్లు కొడుతోంది.పెద్ద సంఖ్యలో కోవిడ్ పరీక్షలు చేస్తున్నట్లు సమాచారం. షాంగై లోని పుదీంగ్ జిల్లాలోని సరిహద్దులు ప్రాంతాలలో సుక్ర వారం వరకు మూసివేస్తునట్లు ప్రకటించా రని వార్త సంస్థల భోగట్ట.కోవిడ్19 పట్ల చైనా అనుసరిస్తున్న ఖటిన నిబందనల లో భాగం గా చైనా సోమవారం నుండి చైనా లోని అతి పెద్ద నగరం షాంగాయ్ ని మూసి వేయడం ప్రారంభించింది. అలా వ్యవహరించడానికి కారణం ఏమిటి అన్న ప్రశ్నలు ప్రపంచాన్ని వేదిస్తున్నాయి. చైనా దేశమంతటా 56,౦౦౦ మంది కి సంక్రమించిందని అది క్రమేణా శరవేగం గా విస్థరిస్తోందన్న వార్తలు గుప్పు మంటూ ఉండడం తో చైనా అధికారికంగా చర్యలు చేపట్టిందని ఆక్కడి వార్తా సంస్థలు వెలువరించాయి. అయితే షాంగాయ్ లో కేవలం 47 మందికి మాత్రమే సోకడం కొంతమేర ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని ఇది హర్షించా దగ్గ పరిణామం గా నిపుణులు పేర్కొన్నారు.కోవిడ్19 వచ్చిన రెండు స్సంవత్సరాల మధ్య కాలం లో అతి పెద్ద ఉపద్రవం గా పెరేకొన్నారు.ఈ సందర్భంగా స్థానిక ప్రభుత్వ అధికారులు మాట్లాడుతూ ఇతర జిల్లాల లోని సమీప ప్రాంతాలు శుక్ర వారం మూసివేసారు.పట్టణ ప్రాంతాలలో పెద్ద సంఖ్యలో పరీక్షలు నిర్వహిస్తున్నారు.చైనా లో జరుగుతున్న పరిణామాల వెనుక స్టేల్ వేరియంట్ ఒమైక్రాన్ ప్రభావం ఉందని అంగీకరించక తప్పదు.కోరోనా వైరస్ కు ఓమైక్రాన్ వేరియంట్ ఒక సబ్ వేరియంట్ గా నిపుణులు పేర్కొన్నారు. స్టెల్త్ ఒమైక్రాన్ అంటే ?... చైనా నుండి వస్తున్న సమాచారం ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ కేసులు స్టేల్ వేరియంట్ ఓమిక్రాన్ ఉందా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.స్టేల్ వేరియంట్ ఒమైక్రాన్ అంటే ఓమైక్రాన్ బి ఏ 2 క్రమం గా పెరగడం గమనించవచ్చు.ఒమైక్రాన్ బి ఏ 2 ఓమిక్రాన్ యొక్క సబ్ వేరియంట్ గా నిపుణులు గుర్తించారు. అయితే బి ఎ2  ఒమైక్రాన్ సబ్ వేరియంట్ ను తీసుకుని పూర్తిగా పరిశోదనలు చేయాల్సి ఉందని నిపుణులు భావిస్తున్నారు.బి ఎ2 ఒమైక్రాన్ సబ్ వేరియంట్ మూల వేరియంట్ ఒమైక్రాన్ ను ప్రాధాన వేరియంట్ తో పోల్చి నప్పుడు. ఎక్కువగా సంక్రమిస్తోందని డేనిష్ పరిశోధకుల వివరాల ప్రకారం ఓమై క్రాన్ తో పోలిస్తే 1.5% రెట్లు పరివర్తన మ్యుటేట్ అవుతుందని శాస్త్రజ్ఞులు వెల్లడించారు. డెల్టా కన్నా స్టెల్త్ వేరియంట్ ప్రమాద కరమా?... డెల్టా వేరియంట్ కన్నా స్టెల్త్ వేరియంట్ ఓమైక్రాన్ ప్రమాదకరమా ?  అత్యంత ప్రభావ వంత మైనదా ?అన్న సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు.డెల్టా వేరియంట్ వైరస్ మాత్రమే ఇప్పటి వరకూ అత్యంత ప్రమాదకరమైనదిగా నిరూపిత మైనదని నిపుణులు పేర్కొన్నారు.డెల్టా వేరియంట్ శరీరం లోని ఊపిరి తిత్తుల పై ప్రభావం వల్ల తీవ్ర అనారోగ్యం ఇన్ఫెక్షన్ సోకి శ్వాస అందక మరణాలు చోటు చేసుకున్నారు.ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యు హెచ్ ఓ వివరాల ప్రకారం డెల్టా వేరియంట్ కు భిన్నం గా ఓమై క్రాన్ దీని సబ్ వేరియంట్ ఊపిరి తిత్తులపై భాగం పై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ కారణం గానే ఊపిరి తిత్తుల పై అత్యంత ప్రమాదకరమైన నిమోనియా ముక్కుకు వాసన తెలియక పోవడం శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉండడం గుండెల్లో నొప్పి వంటి లక్షణాలు చూడవచ్చు. స్టేల్ వేరియంట్ లక్షణాలు ఏమిటి? పైన పేర్కొన్న విధంగా ఒమైక్రాన్ లోని వేరియంట్లు ఊపిరి తిత్తుల పై భాగం పై ప్రభావం చూపుతుంది. దీనికి తోడు పొట్టలో సమస్యలు ఇలాంటి లక్షణాలు చూడవచ్చు .పొట్టలో నొప్పి, వాంతులు, తెమిలి నట్లుగా ఉండడం,గుండెల్లో మంట పొట్ట ఉబ్బరం,  అతిసారం,నలత గా ఉండడం.  నీరసంవంటి లక్షణాలు గమనించ వచ్చు. స్టెల్త్ ఒమైక్రాన్ యొక్క ఇతర లక్షణాలు... జ్వరం, త్వరగా అలిసిపోవడం, దగ్గు, గొంతులో గరగర, తల నొప్పి, కండరాల నొప్పులు, బలహీన పడడం, గుండె స్పందన, కొట్టుకోవడం,పెరగడం గమనించవచ్చు.ఇలాంటి లక్షణాలు గమనించిన వెంటనే తప్పనిసరిగా మీరు అప్రమత్తం కావాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.ప్రాధాన ఒమైక్రాన్ వేరియంట్ కన్నా ఇది అత్యంత ప్రమాదకరమైనదా ?మొట్ట మొదట చేసిన పరిశోదన లో తేలిన విషయం ఏమిటి అంటే స్టెల్త్ ఒమైక్రాన్ కోరోనా వైరస్ కన్నా ఇతర వేరియంట్ల కన్నా అత్యంత ప్రమాదకరం.అని తేల్చారు. మూల వేరియంట్ లేదా ప్రాధాన వేరియంట్ కన్నా అత్యంత ప్రమాదకరమైన లక్షణాలు ఆస్పత్రులలో చేరడం మరణించడం వంటివి జరగవని.అయితే ప్రాధాన వేరియంట్ లో లాగా ఆర్ టి పి సి ఆర్ పరీక్షలలో స్టేల్ వేరియంట్ ను గుర్తించడం గుర్తించడం,నిర్దారించడం పసిగట్టడం కూడా కష్టం అయితే నిపుణుల అంచనా ప్రకారం స్టేల్  ఒమైక్రాన్ వేరియంట్ మ్యుటేషన్ ఎక్కువగా ఉంటుంది. స్టేల్ వేరియంట్ ను మరింతగా పరిశీలించాల్సి ఉందని.నిపుణులు అభిప్రాయ పడ్డారు.అయితే వేరియంట్ ఏదైనా దాని తీవ్రత ఎలా ఉన్నా ఉప్పెనలా ముంచె కోవిడ్ ఉపద్రవం ముప్పు పూర్తిగా తొలగి పోలేదని అనూక్షణం అప్రమత్తం గా ఉండడం నియమ నిబందనలు పాటించాల్సిన అవసరం ఉందని అప్పుడే మనం కోరోనాను ఎదుర్కుంటూనే వాటిపై పోరాడగలం అన్నది మాత్రం నిజం.                                       

ఈ కాలంలో పిల్లల్ని వేధించే అనారోగ్య సమస్యలు..

ఎండా కాలం లో పిల్లల్ని వేదించే అనారోగ్య సమస్యలు...ఎండాకాలంలో పిల్లలు రక రకాల అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు.అసలు ఎలాంటి అనారోగ్య సమస్యలు వేదిస్తూ ఉంటాయి. వాటి ఉపశమనానికి తీసుకో వాల్సిన ఉపసమనం జహ్రతలు గురించి తెలుసుకుందాం. మీ ఇంట్లో పిల్లలు ఉంటె కొంచం వారి ఆరోగ్యం పైదృష్టి పెట్టండి ఎండాకాలం ప్రారంభ మయ్యింది. పిల్లల్ని వివిదరకాల అనారోగ్య సమస్యలు వేదిస్తూ ఉంటాయి. వాటికీ ఉపసమన చర్యలు ఏమిటో తెలుసుకుందాం.ఏప్రిల్,మే,జూన్ నెలలో వచ్చే మార్చి నెలలోనే కనిపిస్తోంది. దీనిని బట్టి రానున్న నెలలలో పరిస్థితి ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. రానున్న ఎండాకాలం లో ఎండలు మరింత తీవ్రంగా ఉందవచ్చని  నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా వయస్సు మళ్ళిన వాళ్ళలో వృద్దుల పరిస్థితి మరింత ఇబ్బందిగా ఉంటుంది.ఇక పిల్లల విషయంలో మరింత తీవ్రంగా ఉంటుంది. ఇక పిల్లలకు ఎండాకాలం లో వచ్చే సమస్యలు వాటికి ఉపసమన మర్ఘాలు చూద్దాం. దురద సమస్య... ఎండాకాలం లో వచ్చే చమట కారణంగా శరీరం లోని ఇతర ప్రాంతా లలో దురద సమస్య ఎక్కువగా వేదిస్తుంది.ఎండ వల్ల చర్మం పై వచ్చే రక రకాల దద్దుర్లు. కీలక పాత్ర పోషిస్తాయి. దీనికి తోడు గ్రామీణ ప్రాంతాలాలో ఎక్కువగా దోమకాటు ఈ సమయం లోనే ఎక్కువగా ఉంటుంది. దోమ కాటు వల్ల చర్మం పై వాపు దద్దుర్లు దురద తీవ్ర ఇబ్బందులు పెడుతూ ఉంటుంది. పరిష్కారం సూచన... దురదల నుండి పిల్లల ను రక్షించు కునేందుకు ముందుగా స్నానం చేసిన తరువాత అవసరమైన పక్షం లో మాయిస్చర్ రాయండి.ఉపసమనం కలిగించే కాటన్ దుస్తులను పిల్లలకు తొలగండి. ఎండలోకి వెళ్ళినప్పుడు శరీరానికి పూర్తిగా కప్పాలి పిల్లలు సహజంగా బయటికి వెళ్లి ఆడుకోవాలని ఉంటుంది. అదే సమయంలో పిల్లలు ఎండలోకి వెళ్ళినప్పుడు దోమల నుండి కాపాడే క్రీమును రాయండి. ర్యాషేస్... పిల్లలను సహజంగా ఎండాకాలం లో వేదించే మరో సమస్య ర్యాష్ దద్దుర్లు. ఎండాకాలంలో వచ్చే చమట పూర్తిగా ఎండక పోవడం.వల్లే శరీరంలో ర్యాషేస్ వస్తాయని నిపుణులు పేర్కొన్నారు చర్మం పై వచ్చే ర్యాషేస్ పిల్లలను పెద్దలను వేదిస్తూ ఉంటాయి.దీనివల్ల చర్మం పై ఎర్రటి దద్దుర్లు ఒక్కోసారి దుర్వాసన వస్తూ ఉంటుంది. ర్యాషేస్ నుండి ఉపసమనం పొందాలంటే... ఈ సమస్యకు ఒక్కటే ఉపచారం. పిల్లలకు అణువుగా ఉండే వస్త్రాలను వేసుకునే అలవాటు చేయండి. దీనికారణం గా వారి శరీరంలో వచ్చిన చమట సులభంగా ఆరిపోతుంది.  ముఖ్యంగా ఎండా కాలం లో పిల్లలకు కాటన్ దుస్తులు ఉత్తమమని సూచ్స్తున్నారు నిపుణులు. జ్వరం- దగ్గు-జలుబు...  ఎండాకాలం లో ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలలో జలుబు,జ్వరం, దగ్గు వంటి సమస్యలు  సహజంగా వస్తూ ఉంటాయిఈ కారణం గానే పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటారు. అందుకే ఎండవేడికి ఏడవడం లేదా చికాకు పడడం చూడవచ్చు. పరిష్కారం/సూచన.... సహజంగా వచ్చే ఇలాంటి సమస్య నుండి పిల్లలను రక్షించుకోవాలంటే ముందుగా తప్పని సరిగా చేయాల్సిన పని వారి ఇమ్యూన్ సిస్టం రోగ నిరోధక శక్తిని మరింత బలోపేతం చేయాల్సి ఉంది. ముఖ్యంగా పిల్లలు ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైన ఆహారాన్ని ఇవ్వాలి.సహజంగా పిల్లలలు ఆహారం తీసుకునేందుకు ఎండాకాలం అయిష్టత చూపిస్తారు. మారాం చేయడం, మొనితనం చేయడం వంటి పనులతో సరిగా ఆహారం తీసుకోక పోవడం వల్ల పూర్తిగా నీరసించి పోతారు.అయితే పిల్లలకు వివిధ పద్దతుల ద్వారా ఆహారాన్ని తినిపించాల్సిన బాధ్యత తల్లి తండ్రులదే. దీనితో పాటు పిల్లలతో ఉంటూనే వివిదరకాల శారీరక వ్యాయామం వారికి అలవాటు చేయమని నిపుణులు సూచిస్తున్నారు. గ్యాస్ సమస్యలు... వయస్సుతో నిమిత్తం లేకుండా వేదించే మరో సమస్య గ్యాస్. ముఖ్యంగా ఎండాకాలం లో ఆహారం తీసుకోక పోవడం వల్ల పిల్లలలో నీరసం అలసట డీ హైడ్రే షన్ కు గురి అవుతూ ఉంటారు.ముఖ్యంగా ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్య విషయం మనం ఎండాకాలం లో మనం తీసుకునే ఆహారం పాడై పోతుంది. ఇదే సమయం లో ఫుడ్ పాయిజన్ అంటే ఆహారం విష పూరితంగా మారి పోవచ్చు. ఇది పిల్లల విషయం లో ఏమాత్రం అశ్రద్ధ చేసినా సమస్య మరింత తీవ్రతర మౌతుంది. ముఖ్యంగా స్చూల్కు వెళ్ళే పిల్లల లో పొట్ట నొప్పి, వాంతులు,నీరసం కారణం అవుతుంది. పరిష్కారం/సూచన... స్చూలుకు వెళ్ళే పిల్లల టిఫిన్ బాక్స్ లలో త్వరగా పాడవ్వని ఆహారాన్ని అంటే పండ్లు, లేదా కోసిన పండ్లు వారికి తినే అలవాటు చేయాలి దాని కారణంగా ఎండాకాలం లో వచ్చే వడ దెబ్బ లేదా ఇతర అనారోగ్య సమస్యల నుండి బయట పడే అవకాశం ఉంది.                      .                                         

ఎండాకాలం వడదెబ్బ తప్పించుకోవడం ఎలా..          

ఎండాకాలం లో తొమ్మిది రకాల పళ్ళు కూరగాయాలు తీసుకుంటే చాలు అలసట నీరసం నుండి బయట పడచ్చు. మనం ప్రకృతి తో కలిసి ఉంటున్నాం. ప్రకృతిలో వస్తున్న మార్పుల కు అనుగుణంగానే మన ఆహారపు అలవాట్లుఉంటె మనకు ఇబ్బంది లేదు. అయినా ఇప్పటికీ మానవుడు ఈ ప్రకృతిని ధ్వసం చేస్తున్నా మనల్ని కాపాడేందుకు  మనకు ఎన్నోవరాలు ఇచ్చింది.ఈ ప్రకృతి మనం ఆరోగ్యంగా ఉండడానికి దోహదం చేస్తుంది ప్రకృతి. అసలే ఎండాకాలం ఆపైన ఉస్సో ఉస్సో అంటూ శరీరానికి చమట పట్టించే కాలం రానే వచ్చింది. సహజంగానే మన శరీరం నుండి చమట రూపం లో బయటికి వస్తుంది. దీనికారణం గానే శరీరం లో నీటి శాతం తగ్గి పోతూ ఉంటుంది. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే కావాల్సినంత నీటిని తాగడం తో పాటు మన ఆహారం లో కూరగాయాలు, ఆకుకూరలు, పండ్లు తీసుకోవాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.మనశరీరం సరిగా పనిచేయాలంటే మహత్తర మైన అద్భుత మైన పోషక తత్వాల లో నీరు ఒకటి. శరీరంలో ఉండే వివిదరకాల అవయవాల పని తీరు ను మెరుగు పరిచి అవయవాలను నియంత్రిస్తుంది. సహజంగా మన శరీరం ఎండాకాలం లో త్వరగా అలిసిపోయి డీ హైడ్రేట్ అవుతుంది.కాబట్టి మనం నీటిని ఎక్కువగా తీసుకోవాలని సూచించారు. ప్రకృతిలో మార్పు వచ్చినట్లుగా ప్రకృతిలో వేడి పెరగ గానే మన శరీరంలో చాలా రకాల మార్పులు వస్తూ ఉంటాయి. అందులో ఒకటి శరీరంలో నీరు తగ్గిపోవడం.ఎండాకాలం లో మనకు చమట అధికంగా  వెలువడుతూ ఉంటుంది. అందుకే మనశరీరంలో నీటి శాతం తగ్గిపోతూ ఉంటుంది.అందుకే అందరూ రోజుకి రెండు గ్లాసులు నీళ్ళు తాగాలని సూచిస్తున్నారు వైద్యులు.కొన్ని విషయాలు అందరికీ తెలియదు అది ఏమిటి అంటే కేవలం నీళ్ళు మాత్రమే తాగితే సరిపోదు. శరీరంలో నీటి శాతం పెంచాలంటే తర్బూజా,టమాటా, ఖీరా,స్ట్రా బెర్రీలు ,కూరగాయలు, ఇతర ఫలాలు, మీ డైట్ లో చేర్చండి ఇలాంటి కూరగాయాలు, ,పండ్లలో నీటి శాతం అధికంగా ఉంటుంది.శరీరాన్ని చాలా బాగా హైడ్రేట్ చేసేందుకు ఎండాకాలం లో 9 రకాల పళ్ళు,కూరగాయాలు తప్పనిసరిగా తీసుకోండి  అని అంటున్నారు వైద్యులు. ఖీరా... ఎండాకాలం లో ఎక్కువగా ఖీరాను తీసుకునేందుకు ఇష్టపడతారు. దీనికి చాలా కారణాలే ఉన్నాయి. అందులో ఒకటి ఖీరాలో నీటి శాతం చాలా ఎక్కువగా ఉండడమే దాదాపు 95% ఎక్కువ నీటి శాతం ఉండడం విశేషం. ఖీరాలో పొటాషియం, శాతం అధ్జికంగా ఉంటుంది. ఎండా కాలం లో వచ్చే వడదెబ్బ నుండి తట్టుకునే శక్తి నిచ్చేది కీరా అని అంటున్నారు న్యూట్రిషి యనిస్ట్లులు. ఖీరా తీసుకోవడం వల్ల మెదడు చురుకుగా ఆరోగ్యంగా ఉండేందుకు శక్తిని పెంచుతుంది. ఎందుకంటే ఖీరాలో యాంటీ ఇంఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. దీనిలో  ఫెసేటిన్ అనే పదార్ధం మెదడు చురుకుగా పని చేసేందుకు దోహదం చేస్తుంది. యాపిల్... ప్రతి రోజూ మీరు ఒక యాపిల్ తీసుకుంటే మీరు డాక్టర్ కు దూరంగా ఉండవచ్చు.అని మీరు ఒకప్పుడు వినిఉండవచ్చు. ఇది కేవలం అనుకోవడం మాత్రమే కాదు నిరూపిత మయ్యింది కూడా ఎందుకంటే యాపిల్ లో 6% నీరు ఉంటుంది. ఇది అన్ని కాలాల లోనూ అందుబాటులో ఉంటుంది. యాపిల్ లో విటమిన్లు ఖనిజ లవణాలు ఉంటాయి. కాగా యాపిల్ గుండె సమస్యల కు కొంతమేర నివారించేందుకు బాగా ఉపయోగ పడుతుంది. టమాటా... టమాటా అంటే ఇష్టపడని వాళ్ళు ఉండరంటే అతిశయోక్తి లేదు. టమాటా లో 94%నీరు ఉంటుంది. టమాటా ను సలాడ్ లో కలిపి వాడతారు. లేదా కాస్త టమాటా జ్యూస్ చేసి తాగ వచ్చు. టమాటా లో విటమిన్ ఎ పుష్కలంగా లభిస్తుంది. అలాగే చర్మం మృదువుగా ఉండేందుకు రక్త ప్రసారం లోనూ అన్ని రకాల సమస్యల నుండి బయట పడేసే శక్తి నిస్తుంది. బ్రోకోలి... మీరు బ్రకోలి తినేందుకు ఇష్టపడుతున్నారు కదు. అయితే ఇది మీకు ఖచ్చితంగా ఆనందించ దగ్గ విషయ మే ఇందులో 9౦% నీరుఉంటుంది. దాంతో పాటు విటమిన్ ఎ కాల్షియం, ఫోలిక్ యాసిడ్, ఐరన్ తో సంపూర్ణ మైన పోషకాలు లభిస్తాయి.స్ట్రా బెర్రీ లు...ఈ పండు బరువు ఇందులో ఉండే నీటిని బట్టి ఉంటుంది. స్ట్రాబెర్రీ లలో 91% నీరు ఉంటుంది. ఈ పండు చాలా రుచికరంగా ఉంటుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్,ఫైబర్,పీచు పదార్ధం విటమిన్ సి, ఫోలేట్, మాంగనీస్, వంటి ఖనిజాలు,నిండి ఉంటాయి. అన్నిరకాల పోషక తత్వాలు డయాబెటీస్, క్యాన్సర్ మరెన్నో రోగాలతో సంబంధం ఉన్న వాటితో పోరాడే పని చేస్తుంది. పాల కూర... ఇది పచ్చటి ఆకు కూర పలకూరలో కూడా 9౩%నీరు ఉంటుంది. ఇందులో సంపూర్ణంగా ఐరన్ ఉంటుంది. హై డ్రెషన్ కోసం మంచిదని భావిస్తారు. ఇమ్యునిటీ ని పెంచే గుణం పలకూరకి ఉందని నిపుణులు అంటున్నారు సమ్మర్ హాట్ బీట్ లో పాలకూర కూడా ఒక భాగమే. జుకీనీ... దీనిని సూపర్ ఫుడ్ స్థానం కల్పించారు. కాని ఇది హైడ్రేట్ అవుతుంది. విటమిన్ బి 2 విటమిన్ డి వంటి పోషక తత్వాలు పూర్త్ర్హిగా ఉండడం తో పాటు 92% నీరు ఉంటుంది.ఇది ప్రతి రోజూ అలవాటు చేసుకుంటే మీ కు అలసట తగ్గి ఎండా కాలం వచ్చే వడ దేబ్బనుండి దీహైద్రేడ్ కాకుండా మిమ్మల్ని కాపాడుతుంది. మష్రూమ్స్ పుట్టగొడుగులు... మష్రూమ్స్ పుట్టగొడుగులు ఈ పేరు వినగానే మీరు ఆశ్చర్య పోయారు కదా హైద్రేడ్ అవుతుంది. ఇందులో విటమిన్ బి,డి వంటి పోషక తత్వాలు పూర్తిగా ఉంటాయి.ఇందులో 92% నీరు ఉంటుంది. ఇది ప్రతిరోజూ తీసుకుంటే అలసటను తగ్గించడం లో సహాయ పడుతుంది.తొమ్మిది రకాలు మీరు మీ డైట్ లో తీసుకోండి వడ దెబ్బను తప్పించు కొండి.    

లివర్ సమస్య  నాడీ పతి చికిత్స ...

లివర్ మనశరీరంలో అత్యంత కీలక మైన అవయవాలాలో ఒకటి. అది చేసే పని మామూలు సహాయం కాదు.శరీరంలో ఉన్న ప్రోటీన్ ను నియంత్రించడం, ఆహారం అరుగుదలకు సంబంధించి రసాయనిక చర్యలు చేరుస్తుంది. దీనివల్ల శరీరంలో పేరుకు పోయిన టో క్సిన్స్ ను డి టోక్సిఫి కేషన్ చేస్తుంది.  మనం మనుగడ సాగాలంటే శరీరానికి లివర్ తప్పనిసరిప్రస్తుతం దీనికి ప్రత్యామ్నాయం అంటూ లేదు. ఒకవేళ లివర్ దీర్ఘ కాలం లో పనిచేయనట్లయితే  లివర్ డయాలసిస్ కు వెళ్ళే అవకాశం ఉంది.లివర్ మనశరీరంలో మెటబాలిజం ను నియంత్రించడం లో లివర్ కీలక పాత్ర పోషిస్తుంది. మరెన్నో పనులు చేస్తుంది.గ్లైకొజిన్ ను నిల్వచేస్తుంది. ఎర్రరక్త కణాలను డి కంపోజ్ కాకుండా లివర్ సహకరిస్తుంది. ప్లాస్మా ప్రోటీన్,హార్మోన్ ఉత్పత్తి చేయడం లో పొట్ట కింది భాగం లో ఉన్న పెల్విక్స్ ప్రాంతం నుండి బైల్ ను ఉత్పతి చేస్తుంది.  అరుగుదలకు అవసరమయ్యే అల్కలైన్ ను లిపిడ్స్ ను విడుదల చేయడం లో లివర్ ప్రత్యేకంగా పనిచేస్తుంది. శరీరంలో ఏర్పడే బయో రాసాయనాలను చర్యలను మోలిక్యుల్స్ నుసైతం సహజంగా పనిచేసేందుకు   లివర్ సహకరిస్తుంది. లివర్ వ్యాధులు అంటే ఏమిటి?.... లివర్ వ్యాధి అంటే లివర్ పని తీరులో మార్పులు రావడం దీనికారణం గానే లివర్ అనారోగ్యానికి గురి అవుతుంది.అత్యంత కీలక మైన భాగం అయినందున అత్యవసరంగా పనిచేయాల్సి వచ్చినప్పుడు లివర్ పనిలో తీవ్ర ప్రభావం చూపిస్తుంది.అసందర్భం లోనే వ్యాదుల బారిన పడుతుంది. తీవ్రంగా గాయాలు అయ్యి లివర్ పని చేయకుండానే పోతుంది. ఈ కారణంగా లివర్ కు తీవ్ర పూర్తిగా డ్యామేజ్ జరగ వచ్చు.లివర్ వ్యాధిని హేప్టిక్ డిసీజ్ గా పేర్కొన్నారు. లివర్ వ్యాధీ అన్నది పెద్ద పదం అంటే చాలా పెద్ద అర్ధం ధ్వనిస్తుంది. మన శరీరంలో లివర్ లో సమస్య వచ్చినప్పుడు పూర్తిగా మన ఆరోగ్య వ్యవస్థ లోని పెద్ద పెద్ద సమస్యల కు దారి తీస్తాయి.ఓ క్కోసారి  ఇతర భాగా లు సైతం పనిచేయకుండా పోతాయి. సహజం గానే 75% లేదా ఒకవంతు   లివర్ కణాలు పని తీరు లో మార్పు వస్తుంది.లివర్ మనశరీర,లో ఒక పెద్ద అంగం అందుకే  చాలా రకాలుగా పనిచేస్తుంది కాబట్టి దీనిని గ్లాండ్ గా పరిగణి స్తారు.లివర్ ద్వారా బైల్ విడుదల చేస్తుంది. లివర్ మన శరీరం లో కుడి వైపు పొట్ట పై భాగం లో ఉంది ఊపిరి తిత్తుల పక్కటే ముకల లో రక్షింపబడి కాపాడుతూ ఉంటుంది.లివర్ కణాల ద్వారా రెండు మర్గాలాలో రక్త ప్రసరణ జరుగుతూ ఉంటుంది. హేప్టిక్ ఆర్టరీ ద్వారా శరీరానికి అందాల్సిన ఆక్సిజన్ లో చాలా చిక్కని రక్తం మన గుండె దమనుల ద్వారా రక్తం పంప్ చేయ బడుతుంది.ఇక్కడే ఉన్న పోర్టల్ వెయిన్ రక్తనాళం  ద్వారా పెద్దపేగుల ద్వారా న్యుట్రీస్ ను ప్లీహానికి సరఫరా చేస్తుంది.సహజంగా సాధారణం గా నాళం ద్వారా రక్తం తిరి  గుండెకు వస్తూ ఉంటుంది. మరో నాళం నుండి విడుదలయ్యే రసాయనాలు పెద్దపెగులలోనికి ప్రవేశించి లివర్ ద్వారా డి టో క్సిఫీ కేషన్ తదనంతరం ఫిల్టర్ చేయబడి ఇతర ప్రాంతాలలోకి పోర్టల్ వెయిన్ కూడా ప్రభావ వంతంగా కొన్ని రకాల రసాయనాలు ప్రోటీన్ లు కొలస్ట్రాల్ ను లివర్ కణాలు ప్రోటీన్ లను గ్లై కోజన్ శరీరంలో సహజంగా పనిచేసేందుకు అవసరం. లివర్ వ్యాధి లక్షణాలు...... అలసట,వాంతి వచ్చినట్టుగా ఉండడం,వికారం గా ఉండడం,కుడి వైపు పై భాగం పొట్టలో నొప్పి, పచ్చకామెర్లు, అలసట,మల బద్ధకం, కంటి చూపు తగ్గడం.బరువు తగ్గడం. నిద్రలేమి వంటి లక్షణాలు గుర్తించండి సరైన సమయం లో సరైన చికిత్స అవసరం. నాడీ పతి పాత్ర..... నాడీ పతి ద్వారా లివర్ సమస్యలకు మందులు వాడకుండానే,శస్త్ర చికిత్సలేకుండా    చికిత్స చేయవచ్చు. అంటున్నారు నాడీ పతి వైద్యులు కృష్ణం రాజుగారు.చికిత్స చాలా సహజ సిద్ధంగా ఎకో ఫ్రెండ్లీ గా ఉంటుంది అలాగే లివర్ కు శక్తి నివ్వడం ద్వారా లివర్ పనిచేస్తుంది.నాడీ తెరఫీలో 1౦౦ కు పైగా పురాతన తెరఫీల ద్వారా లివర్ సహజంగా పనిచేస్తుంది.మన శరీరం ఎప్పుడై తే బలహీన పడుతుందో అనుకోకుండా జరిగే ఘటనకు,లేదా ఆహారపు అలవాట్ల లో వచ్చే మార్పులు ప్రకృతిలో వచ్చే మార్పులు ఒకవేళ ఏదైనా నాడి పనిచేయనట్లైతే ఆ సమస్య మరిన్ని నాడులకు విస్తరిస్తుంది.ఈ నాడుల్లో శక్తి తగ్గి అది సూక్ష్మ్స శరీరం లోకి చేరి వ్యాధిగా మారుతుందని డాక్టర్ కృష్ణం రాజు పేర్కొన్నారు.శరీరం లో వచ్చిన మార్పును  వ్యాధిని గుర్తించిన దాని తీవ్రత అది ఏ స్థాయి స్టేజి లో ఉందొ కూడా గుర్తించ వచ్చు.అంటున్నారు నిపుణులు. మన శరీరం లో 72,౦౦౦ నాడులు ఇతర అవయవాలకు అనుసంధానం చేయబడి ఉంటుంది.ఏ నాడిలో అయినా బ్లాక్స్ ఉంటె ఆ నాడి పని చేయదు.ఆ నాడి సరిగా పనిచేయదు. అందుకు ఈ నాడుల్లో శక్తి ఉండదు. ఆనాడులకు శక్తి నిస్తే చికిత్సకు ముందు సరిగా పని చేస్థాయి.నాడీ పతీ మూలాల ను కనుగొన్న తరువాతే చికిత్స చేస్తారు.ఏ నాడిలో అయితే బ్లాకేజ్ ఉందొ పల్స్ ను బట్టి నిర్ధారణ చేస్తారు.చికిత్స తరువాత 5 -6 నిమిషాల్లో వచ్చే మార్పు మీరు గమనించవచ్చు.మా చికిత్స ద్వారా ఒకసారి సమస్య కు ఉపసమనం కలిగాక ఇక లివర్ సమస్య మళ్ళీ  జీవితం లో రాదు. లివర్ సమస్యకు  నాడీ చికిత్స చాలా సురక్షితం.ఆధునిక శాస్త్రచికిత్సల కు బదులు శాస్త్త్రీయ చికిత్స మేలు చేస్తుందని అంటున్నారు ప్రముఖ నాడీ వైద్యులు డాక్టర్ కృష్ణం రాజు.   

టీబీ శాశ్వతంగా నిర్మూలించాలి!

టీబీ నిర్మూలనకు ప్రతి ఒక్కరు కీలక పాత్ర పోషించాలి. డబ్ల్యు హెచ్ ఓ పిలుపు. ప్రపంచ టి బి దినోత్సవాన్ని ప్రతి ఏటా మార్చ్ 2 4 న జరుపుకుంటారు. ప్రపంచంలో టిబిని శాశ్వతంగా నిర్మూలించాలనే సంకల్పం పై కృషి చేయాల్సిన అవసరం గుర్తు చేస్తోంది. అని యు ఎన్ ఓ కార్యదర్శి అంటోనియో గుఫదేర్స్అన్నారు. టిబినిర్మూలనకు డబ్ల్యు హెచ్ ఓ సహకారాన్నిఅందించాలని అంటోనీ కోరారు.     . ఈ నేపధ్యంలో యు ఎన్ఓ విజ్ఞప్తి మేరకు స్పందించిన డబ్ల్యు హెచ్ ఓ  మార్చ్ 2 4 టిబి దినోత్సవం సందర్భంగా టిబి నిర్మూలనే లక్ష్యంగా పని చేయాలని ప్రపంచదే శాలకు  డబ్ల్యు హెచ్ ఓ పిలుపు నిచ్చింది.  ఇందు కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేయాలనీ అందుకు తగిన చర్యలు అవసరమని   పేర్కొన్నారు.కోవిడ్ 1 9 ప్యాండమిక్ నేపధ్యంలో ప్రత్యేక శ్రద్ధ అవసరమని  ప్రపంచ దేశాలు భావించాయి.2౦ 22 నాటికీ టిబి నిర్మూలనకు అన్ని చర్యలు చేపట్టాలని ప్రపంచదేశాలకు డబ్ల్యు హెచ్ ఓ ఆదేశించింది. కోవిడ్ 19తరువాత టిబి సేవలు మరింత విస్తృతం చేయాలనీ టిబి కి వ్యతిరేకంగా పోరాడాలని  ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. టిబి నిర్మూలన అందుకు అవసరమైన చికిత్స అందించాల్సిన అవసరాన్ని అత్యవసర సమయంలో సైతంటిబి నివారణ, టిబి పరీక్షలు గుర్తింపు చికిత్స, సేవలు అందరికీ ఆరోగ్యం అందించడం లక్ష్యం అని ప్రపంచ ఆరోగ్యసంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. కోవిడ్ 1 9 ప్యాండమిక్ అందరి దృష్టి పెట్టాల్సిన అవసరం మరింత పెరిగిందని  ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. దేశాల మధ్య దూరాలు పెరిగాయి. టిబి వల్ల అంతరాలు సృష్టించింది. టిబి  చొరబడకుండా తీవ్ర చర్యలు చేపట్టాల్సిన అవసరాన్ని గుర్తించింది. ఏప్రిల్ 7న నిర్వహించే ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ప్రజలు ఆరోగ్యం సమాచారం కోసం టిబి లేదా ఇతరఅనారోగ్య సమస్యలపై ప్రజలు ప్రయత్నాలు మొదలు పెడతారు. పద్ధతి ప్రకారం స్క్రీనింగ్ చేయడం ప్రజలను చేరడం టిబి నివారణ,సంరక్షణకు  చర్యలు చెపట్టాలిఅని డబ్ల్యు హెచ్ ఓ ప్రకటించింది.కాగా ఇప్పటికే 4 ౦ ౦ ౦ మంది మరణించారని. 2 8 ,౦ ౦ ౦ మంది అనారోగ్యం పాలయ్యారని మరో 3 మిలియన్ల ప్రజలకు టి బి  ఉందనిఅంచనా వేస్తున్నట్లు  గణాంకాలు చెపుతున్నాయి.టిబిని గుర్తించేందుకు కొత్త ఆధునిక విధానాల అమలు కు   ప్రయత్నం చేయాలనీ డబ్ల్యు హెచ్ ఓ ఏర్కోంది. ఈ విధానం ద్వారా టిబి నివారణ, చికిత్సకు లభదాయకం కాగలదని అందుకోసం డబ్ల్యు హెచ్ ఓ నూతన విధానాలను 2 2 మార్చ్ నాటికీ విడుదల చేయనుంది. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోడం ద్వారా  సరైన సేవలు సరైన వాతావరణం కల్పించాలన్న టిబి నివారణ, నిర్మూలనకు ప్రతి ఒక్కరు కీలక పాత్ర పోషించాలని వ్యక్తులు, వర్గాలు, సమూహాలువ్యాపార వేత్తలు ప్రభుత్వాలు కృషి చేయాల్సిన అవసరం ఉందని డబ్ల్యు హెచ్ ఓ పిలుపు నిచ్చింది. ప్రపంచ టిబి దినోత్సవం సందర్భంగా ది  క్లోకింగ్ ఇస్ టి క్కింగ్ అంటే కాల చక్రం గిర్రున తిరుగుతోంది.అన్న అంశం ఆధారంగా టిబి నిర్మూలనకు ప్రతిఒక్కరు సహకరించాలని టి బి పూర్తిగా శాశ్వతంగా నివారించేందుకు ముందుకు రావాలని ప్రపంచ ఆరోగ్యం లక్ష్యంగా పనిచేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపునిచ్చింది.  

భారతీయ సాంప్రదాయ వైద్యం...

  కొన్నిరకాల తెరఫీలు కీలక పాత్ర పోషించాయని చరిత్ర చెపుతోంది.ఈమేరకు నీటితో తెరఫీ ముద్ర తెరఫీ బీచ్ లో దొరికే ఇసుకతో తెరఫీ చేస్తారని నిపుణులు వెల్లడించారు. గతంలో దాదాపు మన పూర్వీకులు అందించిన తెరఫీలు ప్రాచుర్యం లో ఉండడం గమనార్హం.వాటిలో కొన్ని తెరఫీల గురించి వాటివివరాలు వాటి లాభాలు తెలుసు కుందాం. వాటర్ తెరఫీ... నీటి తో తెరఫీ కోసం వేడి నీరు /లేదా చల్లటి నీళ్ళు వాడవచ్చు.మీరు ఉదయం నిద్ర లేచిన వెంటనే ముఖం పళ్ళు తోమ కుండానే 1.5౦ లీటర్ల నీటిని అంటే 5 నుండి 6 గ్లాసుల నీటిని తాగండి.దీనిని సాధన చేస్తూ  మొదట గా 4 గ్లాసుల నీటిని  తాగండి.మళ్ళీ మిగిలిన రెండు గ్లాసుల నీటిని రెండు నిమిషాల్ తరువాత నీటిని తాగండి. సహజంగానే ఘంట వ్యవధిలో మూత్ర విసర్జన కు రెండు-లేదా మూడు సార్లు  వెళ్ళాల్సి రావచ్చు. కొద్ది సేపటి తరువాత తగ్గిపోతుంది.వాటర్ తెరఫీ వల్ల తల నొప్పి.శరీరం లో నొప్పులు.హ్రుదయం లో వచ్చే సమస్యలు.అర్తరైటిస్ .ఫాస్ట్ హార్ట్ బీట్,అతివేగంగా గుండె కొట్టుకోవడం.మూర్చ, కొవ్వు పేరుకుపోవడం.బ్రాన్ కైటిస్, ఆస్తమా, టిబి .కిడ్నీ, మూత్ర నాళాలలో సమస్యలు.గ్యాస్ వల్ల వాంతులు.విరేచనాలు, పైల్స్,డయాబెటిస్, మల బద్ధకం.అన్నిరకాల కంటి వ్యాధులు. స్త్రీలలో వచ్చే నెలసరి సమస్యలు.ముక్కు, చెవుల సమస్యలు. గొంతు సమస్యలు.నాడీ పతి చికిత్సలో వేడి నీటితో చన్నీటితో తెరఫీ.చేస్తారు. ముఖ్యంగా మీ అరికాళ్ళ ను కొంచం గోరు వెచ్చటి నీటిలో పెట్టటం వల్ల ఆకాలికి అంటుకున్న వివిదరకాల మలినాలు పోయి పదాలు అరికాళ్ళు శుభ్రంగా ఉంటాయి.మీరు వేడి నీటిని తీసుకోవడం వల్ల మీశరీరం లో పేరుకు పోయిన మలినాలు పోయి శుభ్రంగా ఉంటాయి.కొద్ది గా గోరు వెచ్చటి నీటిలో కొంచం క ళ్ళు ప్పు వేయడం వల్ల శరీరం పై ఉన్న మలినాలు మురికి పోయి శరీరాన్ని సమాన స్థితిలో ఉంచుతుంది.అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటి అంటే చన్నీళ్ళు వాపులు ఉన్న ప్రదేశాలాలో భాగాలలో నొప్పిని తగ్గించి ఉపశమనం ఇస్తుంది. ముద్ర తెరఫీ.... సంస్కృతంలో ముద్ర అంటే భంగిమ ఇది భారత దేశం లో అత్యంత పురాతన మైన చికిత్స విధానం.చేతి వెళ్ళను అంటే బోటని వేళ్ళు, ఇతర వేళ్ళ తో ముద్రలు ప్రదర్సిస్తారు. దీనిని ఒక సూక్ష్మ శక్తి పై దృష్టి పెడతారు. ఈ శక్తి ద్వారా మాత్రమే శరీరం రక్షింప బడుతుంది.మరో రకంగా  నిర్వ చించారంటే ముద్ర అన్నది దేవదూతలు ఆవిష్కరించారని అంటారు. దేవదూతలువారి స్పుసిస్తారని అందుకే అవి నయం కా బడ తాయని ముద్ర శరీరానికి శక్తి నిస్తుందని అంటారు.ఒక్కో ముద్ర యే యే శక్తులు కలిగి ఉంటాయో తెలుసుకుందాం. బోటన వేలు......అగ్నికి చిహ్నం. నాల్గవ వేలు....గాలికి చిహ్నం మధ్య వేలు ....ఈథర్ రింగ్ తొడిగే వేలు....భూమి. చిటికెన వేలు....నీటికి చిహ్నం. ముద్ర ల వల్ల లాభాలు.... ఉదాహరణకు వాయు ముద్ర వల్ల శరీరంలో పొట్టలో  పేరుకు పోయిన గాలులను తొలగిస్తుంది దాదాపు 8౦ % శరీరంలో వచ్చే నొప్పులు ముఖ్యంగా గలివల్లె అని తెలుస్తోంది.ఇటువంటి సమస్యలకు ముద్ర సాధనాలు చాలా ఉపయోగ పడతాయి.ఇతర చికిత్సలు తీసుకున్నవారు పర్కిన్ సన్స్ వాటికి ముద్ర ఉపయోగ పడుతుంది.ముద్ర చికిత్స ను నాడీ పతి కేంద్రాలలో సాధన చేస్తూ ఉంటారు.ముద్రలలో 24 రకాల ముద్రలు దీర్గ కాలిక వ్యాధులకు చికిత్స చేయవచ్చు. బీచ్ సాండ్ తెరఫీ.... నాడీ పతి చికిత్సలో బీచ్ సాండ్ తెరఫీ మరెన్నో వ్యాధులకు వాడవచ్చు.ఈ చికిత్స లో ప్రముఖ నాడీ పతి వైద్యులు డాక్టర్ కృష్ణం రాజు గారు దీని పై పూర్తి అనుభవాన్ని కలిగి ఉండడమే కాక దీర్ఘ కాలిక వ్యాధులకు చికిత్సలు చేసి విజయం సాధించారు. దీర్ఘకాలిక వ్యాదులలో వచ్చే డీ టోక్షి కేషన్ పద్దతిలో చికిత్స చేస్తారు.డీ టో క్సి  కేషన్ ఉప్పు భూమిలో అత్యంత  సహజమైన రసాయనం.శరీరానికి డీ టోక్షి కేషన్ చాలా ముఖ్యమైన ప్రక్రియ. శరీరానికి అత్యంత అవసరం అని చెప్పాలి.టోక్సిన్స్ ను తొలగించడం లో ఈ తెరఫీ కీలక పాత్ర పోషిస్తుంది.శరీరంలో టో క్సిన్స్ పెరగడానికి కారణం వాతావరణ కాలుష్యం.,అందులో మందుల వల్ల కాలుష్యం సాంకేతికత,మందులు మింగడం.వ్యక్తి జీవితం లో మందుల వాడకం వల్లే శరీరం పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది.దీనివల్ల భవిష్యత్తులో శరీరంలోని ఇతర అవయవాలుపాడయ్యే ప్రమాదం ఉంది.   శరీరం లో ఒక్కో సారి గ్యాస్ విపరీతంగా పెరగడం వల్ల వెన్నునొప్పి, మోకాళ్ళు జాయింట్స్ గట్టిగా ఉండడం.అర్తరైటిస్, తలనొప్పి, మైగ్రైన్, ఒత్తిడి, అరుగు దల సమస్యలు.ఇన్సోమ్నియా  వాటిని నివారిస్తారని ఉపసమనం కలిగిస్తారని ప్రతి తెరఫీ లో వినూత్న పద్దతులు ఉన్నాయని వాటిని భావితరాలాకు అందించే బృహత్తర కార్యకరామాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నాం.                      

అలసటను ఎదుర్కోవడం ఎలా ?

  అసలే ఇప్పుడు ఎండాకాలం ఇప్పుడు ఎండలో తిరిగామో అలసట నీరసం వస్తుంది?అలా కాకుండా ఎవయసులో ఉన్న వాళ్ళను అయినా వేదించే సమస్య అలసట నీరసం అలా ప్రతిరోజూ త్వరగా అలిసిపోతున్నారు అంటే కారణాలు ఏమై ఉంటాయి దీని గురించిన అవగాహన కలిగి ఉండడం మనకు అవసరం.ప్రధాన సమస్యకు అసలు మూలం ఎదో తెలుసుకుంటే నిపుణులు చెప్పే కొన్ని సూచనలు మీకోసం. ఇటీవల కాలం లో ప్రత్యేకంగా సగానికి సగం మంది స్త్రీలు ముఖ్యంగా 18 నుండి 49 సంవత్సరాల మధ్య ఉన్న స్త్రీలు త్వరగా అలిసిపోతున్నారు. కారణం వారిలో శక్తి లేకపోవడం ఇటీవల హెల్త్ ఫోకస్  ఇంటర్నేషనల్ చేసిన పరిశోదనలో ఆహారం ఆరోగ్యం పై తీవ్రంగా దృష్టి సారించారు. అలసట లక్షణం ఉంటె కొట్టి పారేస్తున్నారు.కారణం  ప్రతి ఒక్కరు అలసట బారిన పడడమే హార్వార్డ్ మెడికల్ స్కూల్ కు  చెందిన మెడిసినల్ ప్రొఫెసర్ అంటోనీ కొమరోఫ్ మాట్లాడుతూ అలసట ఒక దీర్ఘకాలిక సమస్యగా మారుతుందని తెలిపారు.అయితే మనది విశ్రాంతి తీసుకునే వయసు కాదు. ముఖ్యంగా మహిళలు ప్రతి రోజూ నిత్య జీవితం లో ఉరుకులు పరుగులతో సాగుతుంది.అయితే వారిలో అంతర్గతంగా కొన్ని రకాల అనారోగ్య సమస్యలు ఉండి ఉండవచ్చని అవి చిన్నవా పెద్దవా అన్న విషయం లేదా ప్రమదకరమైనదా అన్న విషయం నిర్ధారణ  చేయడం సాధ్యం కాదని. కొన్ని  పరీక్షలు చేసిన వాటిలో ఎక్కువగా అలిసిపోతున్న వారిపై శ్రద చూపాలని  మాత్రమే చెప్పగలమని అంటున్నారు కొమరూఫ్.అయితే సత్వరం అలిసిపోయే వారికి సులభమైన చికిత్స చేయవచ్చని మీలో శక్తి తగ్గిపోవడానికి గల కారణా లను గుర్తించి మీరు ఉపయోగించే పద్దతులు మీశక్తి కోల్పోవడం లో ఎక్కడ తప్పుజరిగింది తిరిగి శక్తిని ఎలా పొందాలో అందుకు మీరు సిద్ధమతే చేపట్టాల్సిన చర్యలను సూచిస్తారు. మొదట మీ మెనూ ను  ఒకసారిపరిశీలించండి... సహజంగా న్యుట్రీ షనిస్ట్లులు సమతుల పోషక ఆహారం అంటే మీకు తెలుసు. అంటే దాని అర్ధం మీరు తీసుకునే ఆహారం లో ఐస్ క్రీములు, బెన్,జేర్రీలు మాత్రమే  కాదు కాయగూరలు, పళ్ళు పప్పులు,యాంటి ఆక్సిడెంట్ లు,మినరల్స్,విటమిన్స్, వంటివి మనకు శక్తి నిస్తాయి. పామ్ పీక్ పెవ్ ఫౌండేషన్ఎం డి ,మేరీ ల్యాండ్ విశ్వ విద్యాలయానికి చెందిన  న్యుట్రీ షియన్ మెడిసిన్ లో  సహాయప్రోఫెసర్ గా ఉన్నారు. పైన పేర్కొన్న విటమిన్లు శరీరంలో అలిసి పోయినప్పుడుఅంటే బ్రేక్ డౌన్ అయిన వెంటనే  న్యూట్రి షి యన్లు ఇంధనం లాగా  సహాయ పడతాయి.అని వివరించారు.ఒక ప్లేట్ తో తినడం మొదలు పెడితే అది యంత్రం లా తింటూనే ఉంటాము.దీనిని మొదట గా ఎదుర్కోవాలి.  సహజంగా మనం చేసే మరో తప్పిదం ఏమిటి అంటే డీహైడ్రేషన్ మాత్రమే నిజమైన శక్తి.ఎందుకంటే అది మీశరీరం లో ఉన్న వాటిని డ్రైన్ చేసేస్తుంది. అని అమెరికన్ ప్రెసిదేన్శియల్ కాలేజ్ ఫిజీషియన్ వర్జీనియా మెడికల్ కాలేజ్ లో ఇంటర్నల్ మెడిసిన్ మున్సీ వ్హేబి దృవీకరించారు కాగా మీరు బహిరంగ ప్రదేశాలలో వ్యాయామం లేదా వేడిగా ఉన్న ప్రదేశాలాలో మిమ్మల్ని మీరు రీఫ్రెష్ గా ఉంచుకోవడం కోసం కొన్ని రకాల రసాలు లేదా ఫ్లూయిడ్స్ తీసుకోవడం లో విస్మరిస్తారు.అందులో తగినంత ఉప్పు లేకపోవడం లేదా ఎక్కువ వాడినమీలో రక్త శాతం తగ్గిపోతుంది. అంటే దాని ఆర్ధం మీ కణాలకు సారిన ఆక్సిజన్ అందడం లేదు. ఈకారణం గానే మీ కండరాలు మెదడు లో ఇబ్బందులు వస్తున్నాయి.దీనిని చాలా సులభంగా బయట పడవచ్చు దీనికోసం మీరు చేయాల్సింది అల్లా ఎక్కువశాతం నీరు తాగాలి అని సూచిస్తున్నారు నిపుణులు.ఈ మధ్య కాలం లో కొద్ది మొత్తం లో కొంత మధ్యం తీసుకుంటారు అదీ రాత్రి భోజనం చేసిన తరువాత. అది మీ నిద్రను పాడు చేస్తుంది.అని నిపుణులు అభిప్రాయ పడ్డారు.ఒకటి లేదా అంతకు మించి రెండు తీసుకుంటే ఆనందం గా ఉంటారు అంతకు మించి తీసుకుంటే అది మీ మెదడు పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. మరుసటి ఉదయం మీరు హ్యంగ్ ఓవర్ తో తీవ్రమైన తలనొప్పి భారం గా ఉంటుంది. పురుషులకంటే స్త్రీలు ఎక్కువ మోతాదులో తీసుకుంటే చాలా ప్రమాదమే అని అంటున్నారు నిపుణులు.మీరు తీసుకునే మధ్యం మిమ్మల్ని మీ నిద్రను భంగం కలిగిస్తుంది. మీ నిద్ర గుండెల్లో మంట,చాతిలో తీవ్రమైన నొప్పి, దీనినే గ్యాస్ట్రో ఎసోఫేగల్ రేఫ్లేక్స్ వ్యాధి వచ్చే అవకాసం ఉంది.అది రాతి పూట తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. దీనికారణంగా అతిగా తాగడం,తినడం, పొగ తాగడం, ఊబకాయం, గర్భ సమస్యలు, వివిదరకాల సమస్యలు వస్తాయి.ఎసోఫేగాస్ సమస్య పూర్తిగా తగ్గదు. శరీరంలో ఉన్న ఉదరం నుండి రసాయనాలు విడుదల చేస్తూ ఉంటుంది. దీనికరనంగానే గుండెల్లో మంట ఈసమస్య వారానికి రెండు సార్లు ఈ సమస్యతో బాధ పడుతూ ఉంటారు.దీనిని పూర్తిగా పరీక్షించాల్సి ఉంటుంది.యాసిడ్ రిఫ్లెక్స్ ను నిర్లక్ష్యం చేస్తే యాసిడ్ రిఫ్లెక్స్ అల్సర్స్ కు దారి తీస్తుంది. లేదా గ్యస్తిక్ ఉల్సేర్స్ పగిలి రక్త స్రావం లేదా క్యాన్సర్ గా అనుమనించవచ్చు.ఈ సమస్య పూర్తిగా ఆర్ధం కాక యాంట సీడ్స్ ఒమేపెరజోల్ ను ఎదుర్కోడానికి వాడతారు. లేదా ఇంటివద్దే కొన్ని హోం రేమిడీస్ వాడుతూ వ్యాధిని ముదర పెట్టుకుంటూ ఉంటారు. మీ మందులను గుర్తుంచుకోండి... మీ మందుల పెట్టిని తెరిచే ముందు జాగ్రతగా ఉండండి.చలారకాల సహజమైన మందులు నొప్పికి వాడుతూ ఉంటారు. ఇందులో చాలా మట్టుకూ నిద్ర మాత్రలు ఉంటాయి.దీనివల్ల మరింత మత్తుగా ఉంటుంది దీనిని వాడడం వల్ల హ్యంగ్ ఓవర్ వస్తూ ఉంటుంది.అయితో ఆస్చార్యాన్ని కలిగించే అంశం ఏమిటి అంటే ఇందులో ఉండే మందులు అన్నీ ప్రిస్కిప్షన్ లేకుండా వాడుతూ ఉంటారు.నొప్పి ని తగ్గించడానికి,ఉపశమనానికి వాడే మందులే, మత్తుకలిగించని మందులూ ఉంటాయి. బి పి ని నియంత్రించే మందులూ ఉంటాయి.కొలస్ట్రాల్, బీటా బ్లోకేర్స్, మీగుండెను లో ఉన్న హార్ట్ బీట్ ను సరి దిద్దే నియంత్రించే మందులు ముఖ్యంగా మూర్చా లేదా ఫైట్స్ కు వాడే మందు.ఒత్తిడిని నియంత్రించే యాంక్ జైటీ మందులు, కూడా అలసటను కలిగిస్తాయి. సెలక్స,ప్రోజాక్, మిమ్మల్ని  పూర్తిగా అలసటకు గురిచేస్తాయి.  కార్నెల్ విశ్వవిద్యాలయానికి చెందినవిద్య శిక్షణ సంస్థ డైరెక్టర్ లురెన్ బ్రోచ్ స్లీప్  వాల్క్ డిజార్డర్స్  వీరు చేసిన పరిశోదనలో కేవలం వాటిని స్టార్ట్ అప్ సైడ్ ఎఫెక్ట్స్ గా పేర్కొన్నారు.కొన్ని రోజుల్లోవరాలాలో  మటుమాయం  అయిపోతాయని మీరు దీర్ఘ కాలంగా అలసటను ఎదుర్కున్ టున్నారా. బ్రోచ్ వివిదరకాల మందులు ఎక్కువ తక్కువ  డోస్ లు ఒక్కోసారి ఒక్కో  సమయం లో వేసుకోవడం లేదా పడుకునే ముందు వేసుకోవడం చేస్తారు మీ పార్టనర్ తో మాట్లాడండి... మీ జీవిత భాగ స్వామితో మాట్లాడండి. మీరు నిద్రలో  ప్రతి రోజూ  ఘాడంగా పెద్దగా  గురక పెడుతున్నారా?   అలా ఒకవేళ మీరు అలా చేస్తే మీరు స్లీప్ అప్నియా తో బాధ పడుతున్నట్లు తెలుస్తోంది.  ఇది అత్యంత ప్రమాదకరమైన జబ్బు గా పేర్కొంటున్నారు డాక్టర్స్ .దీనివల్ల మీరు నిద్ర లో ఊపిరి ఆగిపోతూ ఉంటుంది.నిద్రలేమి వల్ల సహజంగా తరచుగా అసహజంగా 78 డి సిపల్స్  శబ్దం తో దీనికి కారణం ముక్కులో లేదా మెడ నరాలు గొంతుకలో కండరాలు అవి నిద్రపోతాయి ఈకారణం గా పై భాగం లో బ్లాక్ కావడం వల్ల గురక తో బాధపడుతూ ఉంటారు. మరోకారణం బాగా ఊబకాయం తో బాధ పడే వారు సైతం తీవ్ర ఇబ్బందులు పడడం గమనించవచ్చు. నేషనల్ స్లీప్ ఫౌండేషన్ అందించిన వివరాల ప్రకారం నిద్రలేమి సమస్య నేడు అమెరికాలో 18 మిలియన్ల ప్రజలు ఎదుర్కుంటున్నారు.అయితే ఈ సమస్య స్త్రీలలో ఉన్నట్లు గుర్తించారు.కొంతమంది వైద్యులు స్లీప్ అప్నియా లేదా నిద్ర లేమి సమస్య పై గురక సమస్య నివారణకు శిక్షణ నిస్తున్నారు.  నిద్రలేమి లేదా గురక సమస్య వ్యక్తి పై ఎంత తీవ్రంగా చూపిస్తుందో ఎన్ని జీవితాలు విడాకులు తీసుకున్న సంఘటనలు ఉన్నాయో చెప్పలేము.ముఖ్యంగా స్త్రీలలో మెనోపాజ్ తరువాత ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుందని వైద్యులు నిర్ధారించారు.అయితే అప్పర్ ఎయిర్ వే లో పెరిగిన కణాలాను తొలగించడం ద్వారా ప్రభావ వంతమైన చికిత్స చేయవచ్చని నిపుణులు పేర్కొన్నారు.అసహజంగా పెరిగిన కణాల వల్ల ముక్కుద్వారా గాలి లేదా శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారిందని పేర్కొన్నారు. మీలో ఈ లక్షణాలు ఉన్నాయేమో గుర్తించండి... అలసటకు చాలా రకాల లక్షణా లు   ఉంటాయి. మీకాళ్ళలో ఏరకమైన స్పర్స లేకపోవడం. కాళ్ళు గట్టిగా ఉన్నట్లు తెలుస్తుంది.మీలో న్యురోలా జికల్ స మస్యలు కాళ్ళకు అలసట,దీనిని రెస్ట్ లెస్ సిండ్రోం నేషనల్ స్లీప్ ఫౌండేషన్ నిర్వహించిన సర్వ్ లో కళ్ళలో ఏరకమైన స్పందన లేదని చలనం లేదని కొన్ని రాత్రులు వారాలు అయితే కొంత మందిలో కొన్ని రకాల దిజోర్దేర్స్ ఉన్నట్లు తెలిపారు. అయితే వారిలో ఇలాంటి సమస్య ఉంది ఉండవచ్చు కాని వారికి దాని పేరు వారికి తేలి ఉండక పోవచ్చు.వారికి డాక్టర్స్ కూడా చెప్పు ఉండక పోవచ్చు. అయితే ఈ సిండ్రోం కు కారణం ఏమిటి అన్నది ఎవరికీ తెలియని శేషప్రశ్న. అయితే ఇది కొంత మేరా జన్యు పరమైన సమస్యగా ఉండవచ్చని కొంత మంది బాదితులు అంటున్నారు.ఇంకొంత మంది శరీర,లో ఐరన్ తక్కువగా ఉన్నందు వల్లె  సమస్య వస్తోందని గుర్తించారు. అయితే ఐరన్ ను ఎక్కువ మోతాఫులో తీసుకుంటే రక్త పరీక్ష చేయించండి అని వైద్యులు సూచిస్తున్నారు. జాతీయ నిద్రలేమి సమస్యల విభాగం పరిశోదనలో కొన్నిరకాల్ మందులను వాడడం ద్వారా సులభంగా నిద్ర పోవచ్చని ఇందులో కొన్ని మందులు పా ర్కిన్సస్ వ్యాధికి వడ వచ్చని సూచించారు. నోన్కోటిక్ పెయిన్ కిల్లర్స్ ను సూచించారు.లేదా తక్కువ ప్రభావ వంతమైన తెరఫీలు చేసుకో వచ్చని ఫౌండేషన్ సూచించింది. యాంటి డిప్రేసేంట్ మందులు మధ్యం విరివిగా వాడారో మీ సమస్య మరింత తీవ్రతర మౌతుందని మీకాళ్ళ లో నొప్పులు మీకు నిద్ర లేకుండా చేయవచ్చు. ఇన్ఫెక్షన్ వల్ల కూడా అలసట రావచ్చు మీరు పంటి సమస్యలతో బాధ పడుతునారా లేదా మిల్ వైరస్ తో బాధ పడుతూ సరిగా ఎదుర్కోనట్లయి తే లేదా మీ శరీరంలో రోగ నిరోధక శక్తి సరిగా లేకుంటే ఎదుర్కోలేనప్పుడు అలసట వస్తుందని నిర్ధారించారు.థాయ్ రాయిడ్, గ్యాస్ సమస్యలు మెనోపాజ్ హార్మోన్ రీప్లసే మెంట్ , ఈస్ట్రోజన్ సప్లిమెంట్స్ ,తడి తార అంశాలు అలసటకు దారి తీస్తాయని నిపుణులు పరిశోదనలో పేర్కొన్నారు.  

ఒక నాడి వంద తెరఫీలు...

  నాడి చూడగానే రోగం గుర్తు పట్టేస్తారా ? ఊర్కోండి ఎటి ఉదయాన్నే జోకులు అనుకుంటున్నారా ? నాడీ వైద్యం చేయాలంటే అసలు ఎలా నిర్ధారణ చేస్తారు. రోగికి చేసే పరీక్షలు టేస్ట్లు ఏమిటి? అన్నదే సందేహం కదా . నాడీ పతి ప్రత్యేకత ఏమిటి ?... నేటి ఆధునిక తెరఫీలలో శరీరం  ఉన్న వివిదరకాల వ్యాధులను గుర్తించిన తరువాతే చికిత్స చేస్తారు.అయితే నాడీ పతి లో భవిష్యత్తు లో వ్యాధులకు కూడా గుర్తించి వాటిని నయం చేస్తాము అంటున్నారు ప్రముఖ నాడీ పతి వైద్యులు డాక్టర్ కృష్ణం రాజు. ఇక్కడ ఆశ్చర్యాన్ని కలిగించే మరో అంశం ఏమిటి అంటే గర్భంలో ఉండే పిండం లో వస్తున్న మార్పుల ను గుర్తించడం గర్భంలో ఉన్న పిండం ఏ స్థాయిలో ఉన్నా వాటిని నివారించ వచ్చని అంటున్నారు నాడీ వైద్యులు.వారి ముఖకవళికలు, వారి చేతి వేళ్ళ కదలికలను బట్టి,వారి గోళ్ళను బట్టి వారి ఆరోగ్య స్థితి ని అంచనా వేయవచ్చని  ఒక నిర్ధారణకు రావచ్చని.వారి యొక్క ఏడు తరాల గతం వర్తమానం భావిష్యత్హు ను గుర్తించవచ్చని వాటిని శాస్త్రీయంగా రూపించామని  అంటునారు నాడీ వైద్యులు.  నాడీ పతి ప్రాముఖ్యత... మనశరీరం లో గుండె, ఊపిరి తిత్తులు ,మానసిక స్థితి ని పెంచుతుంది. వారిలో శారీరక శక్తిని పెంచే శక్తి నాడీ పతికి ఉందని. చాలా మంది ఎవరైతే పక్ష వాతం రోగులు నాడీ పద్ధతి ద్వారా  పూర్తిగా కోలుకున్నారని. వారు వారి జీవితాన్ని ఆనందంగా గడుపు తున్నారని ఏరకమైన మందులు వాడకం లేకుండా. థైరా యిద్ ను గణనీయంగా తగ్గించగలిగామని అంటున్నారు నాడీ వైద్యులు  కృష్ణం రాజు. నాడీ పతి ద్వారా ప్రత్యేకంగా  ప్యాం క్రియాస్ స్టి  మ్యులేటింగ్ చేయడం ద్వారా డయాబెటిస్ ను శాశ్వతంగా నియంత్రించ వచ్చు అని అంటునారు డాక్టర్ కృష్ణం రాజు.ఈ పద్ధతి చాలా మందికి అమలు చేసామని గణనీయంగా డయాబెటిస్ ను నియంత్రించ గలిగామని అంటునారు వైద్యులు.సరిగా పనిచేయని మరో అంగం కిడ్నీ దీర్ఘ కాలిక కంగా సరిగా పనిచేయని కిడ్నీ పనితీరును మెరుగు పరి చేందుకు నాడీ పతి వైద్యం ఉపయోగ పడుతుందని అన్నారు.కొన్ని నిమిషాలు గంటల  లోనే అద్భుత చికిత్స చేయవచ్చని ముఖ్యంగా టీనేజి లో లో ఉండే పిల్లలో ఎత్తు పెరగడానికి దీనిని కేవలం 2౩ సంవత్సరాల వరకు చేయవచ్చని తెలుస్తోంది.అలాగే వెన్నుపూస ,వెన్నునొప్పి వంటి సమస్యలు దీర్ఘ కాలిక నరాల సమస్యలు.ఇండో గ్లాండ్స్ సమస్యలు కిడ్నీ లో రాళ్ళ ను తొలగించ వచ్చు.కొన్ని గంటలు లేదా కొన్ని వారాలాలో కిడ్నీలో రాళ్ళూ తొలగించవచ్చు.ఇవి కేవలం మన పూర్వీకులు మనకు అందించిన  సాంప్రదాయ అతి పురాతన మైన తెరఫీ పద్దతులు వీటిని వాడిన వారు చాలా ఆరోగ్యంగా ఉన్నారు. నాడీ  పతిని ఎలా నిర్ధారిస్తారు... నాడీ ద్వారా రోగాన్ని గుర్తించే పద్ధతి కొన్ని ఏళ్లుగా మనపూర్వీకులు మన భారతీయులు రూపొందించిన చికిత్స పద్దతులు.నాడి ఆధారంగా ప్రాధాన భాగం, లేదా మధ్య భాగం, కింది  భాగం ద్వారా  శక్తి సమగ్ర సమాచారం మనం  తెలుసుకోవచ్చు.మనం వ్యాధి నిర్ధారణకు శరీర తత్వం లో ఉన్న దోషాల ఆధారంగా అంటే వాత,పిత్త, కఫనాడీ ని పరీక్షించి 12 రకాల శరీర అవయవాల స్థితిని గమనించ వచ్చు.వీటి ఆధారంగా పంచ భూత్హాలు వంటి పరిగణలోకి తీసుకుంటారు.ఎప్పుదైతే ఒక ఘటన జరిగిన తరువాత  శరీరం బలహీన పడుతుందో మన ఆహారపు అలవాట్లు సహజంగా మారి పోయాయి .ఏదైనా ఒక నాడి పని చేయనట్లితే అవి మరిన్ని నరాలలో నాడులలో సమస్యల కు విస్తరించ వచ్చు.ఈ సమస్య మల్టిపుల్ లేదా డబుల్, త్రిబుల్  గా మారచ్చు.దీనికారణం గా నాడులలో శక్తి తగ్గి.సూక్ష్మ శరీరానికి చేరి  అది శరీరం పై తీవ్ర ప్రభావం చూపుతుంది.అప్పుడే ఆధునిక డాక్టర్స్ వ్యాధిని నిర్ధారిస్తారు.మన శరీరం 2,72, ౦౦౦ నాడులతో నిర్మితమై ఉంటుంది. ప్రతి అవయవానికి ఒకదానికి ఒకటి కలప బడి ఉంటాయి. ఇందులో ఎక్కడైనా నాడులలో బ్లాక్స్ వచ్చినప్పుడు ఆ నాడి సరిగా పనిచేయదు.అప్పుడు ఆ అవయవాల లలో శక్తిని కోల్పోతాయి.సరిగా పని చేయవు.దీనికి ముందుగా నాడీ పతి చికిత్స రూట్ కాజ్ ను కనుగోని తగిన చికిత్స చేయవచ్చని అంటున్నారు నాడీ వైద్యులు కృష్ణం రాజు.నాడి ని ఎప్పుడైనా గుర్తించ వచ్చు. అయితే మీ నాడిని గుర్తించాలంటే మాత్రం ఉదయం వేళ పరగడుపున ఖాళీ కడుపు తో ఉన్నప్పుడు  మాత్రమే.ఆతరువాత వారాంతం లో  ఆ అంగాన్ని గుర్తించి చ్జికిత్స దానికి అనువైన  తెరఫీ చికిత్స అలాగే మీ కు సరి పడా ఆహారం సూచిస్తారు.నాడీ పతిలో కొన్ని తరాలుగా వ్యాధిని గుర్తించడం గతం, వర్తమానం భవిష్యత్తు లో వ్యాధులను సైతం గుర్తించడం లో కీలక పాత్ర   పోషిస్తుంది. ముఖం చూసి గుర్తించవచ్చు .... ఇందులో నాలుగు రకాల పద్దతులలో ప్రాధమిక నిర్ధారణ చేస్తారు అందులో అడగడం, వినడం, వాసన ద్వారా గుర్తించ వచ్చు చాలా సందర్భాలలో ముఖ కవళికలు చూసిన వెంటనే అవ్యక్తిలో ఏ ఎలిమెంట్ గ్రహించి ఆ నాడిని తెలుసుకుని వ్యాధిని నిర్దారిస్తాము.కిడ్నీ పని తీరు. లివర్ పని తీరు, గుండె పని తీరు,ఆహారం అన్న వాహిక పని తీరు, ఊపిరి తిత్తుల పనితీరు.ఉదాహరణకు పెదవుల కింది భాగం చూసినప్పుడు మీ పెద్ద పేగులు ఎలా ఉనాయో తెలుసుకోవచ్చు.అలాగే మీ కుడి  బుగ్గ కుడి ఊపిరి తిత్తులు.ఎడమ బుగ్గ ఎడమ ఊపిరి తిత్తులు  పని తీరును తెలుసుకోవచ్చు. నాలుక ద్వారా నిర్ధారణ .... మీ నాలుక మీ వ్యక్తిలోని బలమైన సంతోషం అశాంతి శరీరం రంగు మీ నాలుక రంగును బట్టి మీలో ఉన్న అనారోగ్యం ఆరోగ్యం సమస్యలు తెలుసుకోవచ్చు.మీనాలుక ఆకారం,రంగు, సైజ్,టిప్స్, నోటి చివరలు,మీ నాలుక మందంగా ఉందా? పలుచగా ఉందా?వారి ఆరోగ్యం ఎలా ఉందొ తెలుసుకోవచ్చు నాడీ పతిలో నాడి కాకుండా మీ పల్స్ ను పరీక్షిస్తారు. నాలికను పరీక్షించడం ద్వారా రోగి యొక్క వ్యాధి ని మదింపు చేస్తారు. ఇరిడా లజీ... ఇరిడో లజీ అన్నది ఒక స్వ్క్రీనింగ్ టూల్ ఇరిడో లజీ అనేది పాత కాలం నాటి పద్ధతి.రోగి యొక్క ఆరోగ్య ఖచితమైన  ఆరోగ్య సమాచారం కోసం ఇరి డో లజీ ని వినియోగిస్తారు.శరీర భాగం లో ఉన్న వివిదరకాల జోన్స్ ఐరిస్ ద్వారా ఆయా భాగాలను మార్క్ చేసి వాటిని సరి పోలుస్తారు.ఈ చార్ట్స్ ను ఐరిస్ ను డివైస్ దగ్గర దగ్గర 8౦ -9౦ జోన్స్ ఉదాహరణకు మీ కిడ్నీ ఐరిస్ కింది భాగం లో ఉంటుంది. 6 గంటలకు ముందు ఆ ప్రాంతం  లో ఉంటుంది మీ పంటి వరుస పంటి ని చూసి నిర్ధారిస్తారు... మీ పళ్ళను చూసినప్పుడు వాటిలో ఒక్కో సారి కొన్ని రకాల ఇన్ఫెక్షన్ లు ఉండవచ్చు. రోగి యొక్క అనారోగ్యాన్ని మీ నోటిని పంటిని చూసి నిర్దారించడం .అన్నది పాత పద్దతిగా పేర్కొన్నారు. మీనోటిలో ఉన్న ఇన్ఫెక్షన్ కారణంగా మీ శరీరం లో ఉన్న ఇతర అవయవాలు తీవ్రంగా దెబ్బ తింటాయి ఇన్ఫెక్షన్ కు గురి అవుతాయి ఇది నాడీ పతి ద్వారా తెలుస్తుంది దీనిద్వారా పాడైన ఆ అవయవానికి నాడీ వైద్యం చేయవచ్చు అంటున్నారు వైద్యులు.మీ పళ్ళు,చిగుళ్ళు, వ్యాధి తగ్గిన తరువాత మళ్ళీ ప్రేరేపిత మౌతాయి                  

సంగీతం మిమ్మల్ని కదిలిస్తుంది....

  నిజం మీరు చేసే వ్యాయామానికి కాస్త మ్యూజిక్ ఆడ్ చెయ్యండి.మీరు ఫిట్ మీ ఆరోగ్యము ఫిట్ ఇది నిజం నమ్మాల్సిందే. శిశుర్వేక్తి పశుర్వేక్తి గానరసం ఫణీహి ..... అవును శిశువు నైనా పశువుల నైనా పాట మై మరిపిస్తుంది. కదిలిస్తుంది. అగనామ్రుతానికి మై మరిచి పోనీ వారు అంటూ ఉండరు .చివరికి అప్పుడే పుట్టిన పసిపాప మొదలు,పశువులు సైతం సంగీతానికి తలలు ఆడిం చాల్సిందే. ఇక అత్యంత ప్రమాద కారి అయిన పాము సైతం ఆ గానానికి మై  మరిచిపోవాల్సిందే. ఇది నిజం కూడా ఆ క్రమం లో ఒక చిత్రకారుడు, లేదా ఒక గాయకుడు,రిథం ప్లేయర్ వాద్యకారులు సైతం తమ పనిలో ఏకాగ్రత తో మై మరిచి పోతారు.శరీరం లోని అణువు అణువూ స్పందిస్తుంది. నవనాడులూ స్పందిస్తాయి. మానసికంగా నిర్జీవంగా పడి ఉన్న శరీరమే అయినా  చ్సైతన్యాన్ని కలిగిస్తుంది శిలనైనా కరిగించే శక్తి పాటకే ఉంది అంటే అతిశయోక్తి కాదు.అచేతనం గా పది ఉన్న సమాజాని చైతన్యం నిపేది పాటే.అయితే సృతిలేని పాట, మతిలేని మాట ఆకట్టుకోదు. శృతి కి తగిన తాళం ఉంటె లయబద్ధంగా అడుగుల సవ్వడి ఉంటె ఆపాటే వేరు అటేస్టే వేరు ఆపాట లో నాటు తనమున్న నీటు తన మున్న భక్తి తత్వం ఉన్న పాటకు స్టెప్పులు వేస్తే అదుర్స్ కదు.  ఎప్పుడైనా మీరు ఏరోబిక్ శిక్షణ ఇచ్చే వారిని ఎదుర్కున్నారా.అతని పేరు మైకల్ బోల్టన్ అయితే మీకు తెలిసి ఉండాలే.తప్పుగా ఉన్న సంగీతం కూడా మంచి వర్క్ అవుట్ కు దారి తీసింది. చెడు పోయింది. అయితే ఇందుకు భిన్నంగా జరిగింది అంది కూడా అంతే నిజం. అయితే సరైన సంగీతం రసాస్వాదన చేసినట్లు ఉంటుంది. ఒకరకంగా చెప్పాలంటే మంచి సంగీతం వల్ల ఎగస్ట్రా  జ్యూస్ లాంటిది అనే చెప్పాలి.అది మీకు అదనపు శక్తి నిస్తుంది. అలాగే మీరు ఫిట్ గా ఉండేందుకు దోహదం చేస్తుందని అంటునారు. అయితే ఎలాంటి ఫిట్నెస్ పద్దతిని ఎంచుకోవలన్నది వారి వారి వ్యక్తిగత ఎంపిక పై ఆధార పడి ఉంటుంది.అయితే అది శాస్త్ర్రీయమా థ్రెడ్ మిల్ లేదా సెషణా  ఎపిలేప్టికాల్ అన్నది ట్రైనర్ నిర్ణయం పై ఆధార పది ఉంటారు.అయితే దీనికి శాస్త్రీయ ఆధారం కోడా ఉంది ఒక పరిశోదనలో వ్యాయామం పై కన్నా విశ్వవిద్యాలయానికి చెందిన ఫిజియాలజిస్తులు 18 విద్యార్ధుల వర్గాలు  నాలుగు రకాల సెట్స్ ను స్టాటి నరి బైక్స్  అనీ ఒకే రకంగా ఇంటెన్సిటీ తో నిర్వహించారు. మొట్ట మొదటి మూడు సెట్స్ లో పాల్గొన్న వారు విన్న మ్యూజిక్ మొదట అప్ టెంపో-తరువాత క్లాసికల్ ఆతరువాత వచ్చునా ట్యూన్స్ వారే ఎంచుకున్నారు. నాల్గ సెట్ లో వారు సైలెన్స్ ను  నిశ్శబ్దాన్ని ఇష్టపడ్డారు. ఆతరువాత ఆగ్రూప్ మ్యూసిక్  తో వర్క్ అవుట్ చేసింది. అంటే మ్యూసిక్ తో వర్త్ అవుట్ చాలా సులభమైన పద్దతిగా భావిం చారు.చాలా పరిశోధనలలో అంగీకరించిన విషయం ఏమిటి  అంటే మ్యూసిక్ వల్ల చాలా పోజిటివ్ ఎఫెక్ట్స్ఎండ్యు రెన్స్ వ్యాయామం చేయడం ,అందుకే వారు ఎక్కువగా వర్క్ అవుట్ లు  దీర్గ కాలంగా చేసేందుకు ఇష్ట పడడానికి ఎక్కువ స్థాయిలో ఇంటెన్ న్సిటి  మ్యూసిక్ లేనప్పుడు అలాగే ఉండడం గమనించ వచ్చు. ఈ విషయాన్నిగోస్టారికా  విశ్వ విద్యాలయానికి చెందిన లుయిస్ ఎఫ్ అరగోన్ -వర్గాస్ ఎక్సర్ సైజ్ ప్రొఫెసర్ ఈ అంశం పై పరిశోదనలు చేసారు. నమ్మండి మ్యూజిక్ మనలో పోజిటివ్ ఎఫెక్ట్ ఉంటుందని. ఒకరకమైన ప్రభావం లో ఉన్న వారిని బయటికి తీసుకు వస్తుంది. మ్యూజిక్ సంగీతం వల్ల మీ మెడకు అలసటతో పాటు వ్యాయామం చేయడం వల్ల కొంత శారీరకంగా నొప్పి ఉంటుంది అయితే మ్యూజిక్ సంగీతం ఆదరణ  ఉన్నంతవరకూ దానిని ఇష్టపడుతూనే ఉంటారు. దానిని కావాల్సిన స్థాయిలో వాయిస్తూ ఉంటారు అననందిస్తూ ఉంటారు. మ్యూజిక్ ఆనందం కోసమేనా ..... మీరు చేసే పనికి సంగీతాన్ని జోడించడం సులభభం. మీ రుచికి అభిరుచి సంగీత అభిరుచి తోడైతే దానంతట అదే సహజంగా వాటికి కావాల్సిన విధంగా మీరే రూపకల్పన చేస్తారు.మీ ఫిట్ నెస్ కు ఏవిధంగా కావాలో మీకు తర్ఫీదు నిచ్చే శిక్షకులు రూపొందిస్తారు ఇందుకోసం కొన్ని రకాల వెబ్ సైట్స్ పని చేస్తున్నాయి. మీ కంప్యు టర్  లో డౌన్ లోడ్ చేసుకుని మీరు సంగీతం తో వ్యాయామం చస్తూ మీ ఫిట్నెస్ పెంచుకోవచ్చు అంటున్నారు నిపుణులు. సంగీతం అదే మ్యూజిక్ లో కొన్ని రకాల మ్యుజిక్లు ఉన్నాయట అవి ఏవో మీకు తెలుసా.ప్రీ మిక్స్ డ్  మ్యూజిక్.పవర్ మ్యూజిక్, మోషన్ మ్యూజిక్, డైనమి క్  మ్యూజిక్, మీరు స్వయంగా రూపొందించిన మిక్స్ మ్యూజిక్ ద్వారా మీరు స్వయంగా ఆరోబిక్స్ చేయడం ద్వారా మీరు హేల్తీ మీ శరీరం ఫిట్ అండ్ హేల్తీ.         

ఆగిన గుండెను తట్టి లేపుతరా -నిజమా !

హార్ట్ బీట్ ను సరి చేసే పేస్ మేకర్లు ---- మీకు పూర్తిగా అర్ధం కావాలంటే ఇక్కడ ఒక కధ చెప్పాలి.ఐ సి యు లో ఒక్క సారిగా గుండె ఆగిపోయిన హీరో. ఆందోళన లో వారి కుటంబ సభ్యులు.ఉత్కంట తో ప్రేక్షకులు --హడావిడిగా డాక్టర్స్ చక చకా పరుగెడుతున్నారు. ఏమయ్యిందో అని కుటుంబీకుల ఆందోళన. దేవుళ్ళకు మొక్క్కుకుంటుంది స్వామీ నాభర్త కోలుకుంటే కాలినడకన తిరుపతి వస్తాను అని మొక్కులు మొక్కుతారు. రక్త సంబంధం తల్లి తల్లడిల్లి పోతూ ణా కొడుకుని కాపాడు అంటు తన బిడ్డ ప్రాణం కోసం తల్లడిల్లి పోతుంది. ఇక్కడ డాక్టర్స్ ఐ సి యు లో ఒక ప్రత్యేక పరికరం తో చాతి పై ఒత్త్జిడి కలిగిస్తున్నారు.కాసేపటికి హీరో గుండె తిరిగి కొట్టుకుంటుంది . హీరో బతికాడు ప్రాణాపాయం తప్పింది. మీరు వెళ్లి చూడచ్చు అంటు డాక్టర్స్ చెప్పడం. వెంటనే కుటుంబ సభ్యులు బాబూ అంటూ ఏడుపులు పెడబొబ్బలునువ్వు బతికావు మాకు అంతే చాలు అనుకుంటూ ఆనంద బాష్పాలు రాలుస్తారు. ఇది కధ మాత్రమే కాదు వాస్తవంగా మనము ఆసుపత్రులలో చూసే సన్నీ వేసాలే కాని కాని కల్పితం కాదు వాస్తవం.అసలు ఇక్కడ మనము గ్రహించాల్సిన విషయం ఏమిటి అంటే ఒక్కసారిగా గుండె ఆగి పోవడానికి కారణం ఏమిటి అని మాత్రమే?భయం తో ఉన్నప్పుడో ,వేగంగా పరుగేత్తినప్పుడో గుండె వేగంగా కొట్టుకోవడం కొంచం ఆయాస పడడం సహజమే కానీ ఇవి ఏ వి కాకుండా లేకుండానే ఒక్కోసారి గుండె వేగంగా నిమిషానికి 2౦౦ సార్ల కు పైగా కొట్టుకుంటుంది. ఎందుకు ఇలా...?  ఉదాహరణకు పోవడమో లేదా ఎక్కడైనా విద్యుత్ వైర్లు తెగిపోవడమో, లేదా  స్విచ్ వేయగానే విద్యుత్ పరికరం పనిచేయక పోవడమో లేదా విద్యుత్ సరఫరా అందక వస్తువులు పాడయ్యి పోవడం లేదా లేదా షాట్ సర్క్యూట్ అయ్యిందని అనుకుంటాము దీనిక్శ్రానం గా ఒక్కో సారి విద్యుత్ పరికరాలు కాలిపోవడ మూ జరుగుతుంది. సరిగ్గా అలాగే మన గుండే లో కూడా జరుగుతాయి. గుండెలో కూడా విద్యుత్ వ్యవస్థ పనిచేస్తూ ఉంటుంది. ఇది విద్యుత్ ప్రేరణ లను ఉత్పత్తి చేయడం వల్లనే గుండె లబ్ డబ్ అంటూ కొట్టు కుంటూ ఉంటుంది. అది అలా కొట్టు కుంటేనే రక్తం ఊపిరి తిత్తుల నుంచి గుండెకి అక్కడి నుంచి శరీర భాగాలకు రవాణా కాగలదు. గుండె ఇలా కొట్టుకోవడా న్నే హృదయ స్పందనలు అని అంటారని అపోలో ఆసుపత్రికి చెందిన ప్రముఖ హృద్రోగ నిపుణులు డాక్టర్ ఎ శ్రీనివాస్ తెలుగు వన్ కు వివరించారు.గుండె సర్జరీల పై సమగ్ర అవగాహన ఉన్న డాక్టర్ శ్రీనివాస్ ఈ అంశాల పై పూర్తి అద్యయనం చేసినట్లు తెలిపారు. ఇందులో భాగంగా సాధారణంగా మనిషి గుండె 7౦ నుండి 8౦ సార్లు కొట్టుకున్యుంది. హృదయ స్పందనల రేటు 6౦ నుండి 1౦౦ సార్లు కొట్టు కోవడం కూడా నార్మల్ రేంజ్ ఇంతకన్నా ఎక్కువో తక్కువో ఉన్నప్పుడు సమస్య ఉన్నట్లు మనం వ్యాయామం చేసినప్పుడు పరుగేత్తినప్పుడు ఒత్తిడిలో ఉన్నప్పుడు ,భావోద్వేగాలకు  లోనై నప్పుడు ఈ స్పందనల వేగం పెరుగుతుంది. అయితే గుండెలో ఉండే విద్యుత్ వలయా ల్లో తేడా లు ఏర్పడినప్పుడు షార్ట్ సర్క్యూట్ లు అయినప్పుడు గుండె కొట్టుకునే రేటులో కూడా మార్పు వస్తుంది. హార్ట్ బీట్ లో ఈ ఎక్కువ తక్కువలు ఉన్నప్పుడు మాత్రమే హార్ట్ బీట్ లో సమస్యలు వస్తాయి.పైన పేర్కొన్న సమస్యలకు మూలకారణాలు ఇవే. గుండె హార్ట్ బీట్ ను బట్టి అవి ఎవిభాగానికి చెందినవో ఎలా నిర్ధారిస్తారు?.... గుండె రేటు తగ్గితే బ్రాడ్ కార్దియా.... సాధారణ స్థాయి కన్నా చాలా తక్కువ స్థాయికి హృదయ స్పందన రేటు పడిపోయి నప్పుడు నిమిషానికి 6౦ కన్నా తక్కువగా గుండె కొట్టు కుంటుంది.ఈ సమస్యను బ్రాడ్ కార్దియా అంటారు. దీనివల్ల కళ్ళు తిరిగి పది పోతారు. ఈ సమస్య ఉన్నప్పుడు గుండెకు తగినంత విద్యుత్ ప్రవహించదు.దాని వల్ల విద్యుత్ ప్ర చొదనాలు తగినన్ని ఏర్పడక గుండె కొట్టుకునే వేగం తగ్గిపోతుంది. పొటాషియం, కాల్షియం, లాంటి లవణా లలో మార్పులు కిడ్నీ,ధై  రాయిడ్ , లాంటి సమస్యలు కొన్ని రకాల మందులు బిపి గుండె జబ్బులు, ఇందుకు కారణం కావచ్చు.కొన్ని సందర్భాలాలో ప్రత్యేకంగా ఏ కారణం లేకుండా కూడా రావొచ్చు. బీట్ ఎక్కువైతే టాకీ కార్దియా.... హృదయ స్పందనలు రేటు నిమిషానికి 7౦ నుండి 8౦ ఉండాల్సింది చాలా ఎక్కువ అవుతుంది. నిమిషానికి 1౦౦ కన్నా ఎక్కువ సార్లు అత్యంత వేగంగా కొట్టుకుంటుంది దీన్ని టాకీ కార్డియా అంటారు దీని వల్ల గుండె దాదా అలసట కళ్ళు తిరగడం, హృదయ స్పందనలు ఒక క్రమ పద్దతిలో ఉండకుండా అసాధారణంగా ఉంటాయి. అదనపు విద్యుత్ వలయాలు ఏర్పడడం వల్ల ఇలా జరుగుతుంది. దీనికి కారణం పుట్టుకతోనే ఉండొచ్చు. లేదా వయసు రీత్యా వచ్చే మార్పులు భాగంగా విద్యుత్ ప్రచోదనా లలో తేడా రావచ్చు. ఇలా అదనపు విద్యుత్ వలయాలు ఏర్పడి. గుండె కొట్టుకునే వేగం పెరగడం వల్ల గుండె లోపల శోఇర్ట్ సర్క్యూట్ అవుతుందని డాక్టర్ శ్రీనివాస్ విశ్లేషించారు. లీడ్ లెస్ పేస్ మేకర్లు --రకాలు.... మామూలుగా కొత్త ద్వారా పేస్ మేకర్ అమరిస్తే లీడ్ పేస్ మేకర్ పి పి ఐ -పేస్ మేకర్ ఇంప్లాన్ టేషన్ అంటారు. కోత  లేకుండా అమర్చే పేస్ మేకర్ ను లీడ్  లెస్ పేస్ మేకర్ అంటారు. వీటిలో అనేక ప్రక్రియలు ఉన్నాయి. కర్ణి కల సంకోచం 2౦% జటరికల సంకోచం శాతాని బట్టే గుండె పంపింగ్ సామర్ధ్యం ఆధార పది ఉన్యుంది. పేస్ మేకర్ అమర్చడం ద్వారా కర్ణికల 2౦% జట్ట రికల 8౦% సంకోచం కలిపి మొత్తం వంద శాతం శాతం జరిగే టట్లు గా చూస్తారు. లేదా కనీసం 8౦% జటరికల్ సంకోచం జరిగే తట్టుగా అయినా చూస్తారు.అంటే కనీసం 8౦% అయినా గుండె పంపింగ్ సామర్ధ్యం ఉండేలా చికిత్స చేస్తారని డాక్టర్ శ్రీనివాస్ వివరించారు. రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషణ్.... టాకీ కార్టియా సమస్యకు చేసే పరీక్షలో భాగం గా గుండె లోపలి విద్యుత్ వ్యవస్థను విశ్లేషిస్తారు. గుండె ఇ సి జి ని లోపలి భాగం నుంచి తీస్తారు.అంటే తోడ భాగం నుంచి కేధడర్ ద్వారా రక్త నాళం లోకి వైర్లను గుండె దగ్గరకి పంపి. గుండె లోపల దాని ఇ సి జి ని తీస్తారు. ఈ ఎలక్ట్రో ఫిజియా లజీ అధ్యనాలద్వారా అదనపు అసాధారణపు విద్యుత్ వలయం ఎక్కడుందో అధిక కనిపెట్ట వచ్చు. రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషణ్ ద్వారా అదనపు విద్యత్ వలయాన్ని తొలగిస్తారు.అసాధారణం గా అదనం గా ఏర్పడిన విద్యుత్ వలయానికి అధిక ఫ్రీక్వెన్సీ కలిగిన రేడియో ఫ్రీక్వెన్సీ పంపించడం ద్వారా ఎక్కువ ఉష్ణోగ్రత వెలువడి ఆవలయం దెబ్బతింటుంది. త్స్ద్వారా వలయం తెగిపోతుంది. అందువల్ల సమస్య తగ్గు తుంది. ఈ పద్దతిలో లోకల్ ఎనేస్తీషియా ఇస్తే సరిపోతుంది ఆపరేషన్ కి రెండు గంటలు పడుతుంది.ఒకరోజు ఆసుపత్రిలో ఉండాల్సి రావచ్చు. బీటింగ్ మారితే పేస్ మేకర్ తో సరి.... హృదయ స్పందనలో తేడాలు ఉన్నప్పుడు పేస్ మేకర్ అనే పరికరాన్ని అమర్చడం ద్వారా బీటింగ్ నార్మల్ స్థాయికి వచ్చేట్లు గా చేస్తారు. పేస్ మేకర్లలో చాలా రకాలు ఉన్నాయి అయితే రోగి వయస్సు ఆరోగ్య పరిస్థితులను బట్టి సరైన దాన్ని ఎంచుకుంటారు. ఇందుకోసం లోకల్ అనెస్తీషియా చాలు అనుఇ భుజం ఎముక క్లావికల్ కింద అనేస్తిషియా ఒక కొత్త పెట్టి చర్మం కింద పేస్ మేకర్ ని అమరుస్తారు. పేస్ మేకర్ గుండె కొట్టుకోడానికి కావాల్సిన కావాల్సిన విద్యుత్ ప్రచోదనలను అందిస్తుందని దీనిలోని వైర్లు గుండె స్పందనని ప్రేరేపిస్తాయి. ఇప్పుడు వైర్లు లేకుండా ఆ చిన్న కొత్త కూడా అవసరం లేకుండా కూడా పేస్ మకేర్ ను అమరుస్తున్నారు. సింగల్ చాంబర్ పేస్ మేకర్.... కుడి జటరిక కండరం లో ఆర్ ఎ అపెండేక్స్ ఒక్క చోటే లీడ్ వైరు అవసరం లేకుండా పేస్ మేకర్ ను అమరిస్తే సింగిల్ చాంబర్ పేస్ మేకర్ అంటారు. ఎన్ ఎ నోఇద్ అవసరం లేకుండా విద్యుత్ ప్రేరణలు అక్కడే పెట్టి జతరికలు సంకోచించేందుకు ప్రేరణ కలిగిస్తాయి. ఈ ప్రక్రియ ద్వారా గుండె 8౦% సంకోచం చెందుతుంది. అసాధారణం గా వయస్సు ఎక్కువగా ఉన్న వాళ్ళకు కనీసం 8౦ %అయినా గుండె సామర్ధ్యం ఉండాలి. కాబట్టి ఇలాంటి వాళ్ళకు ఎక్కువగా ఈ ప్రక్రియ ద్వారా పేస్ మేకర్ ను అమరుస్తారు. తాత్కాలిక పేస్ మేకర్.... శాశ్వత పేస్ మేకర్ ను అమర్చడానికి ముందు దీనిని అమరుస్తారు. అంటే శాశ్వత పేస్ మేకర్ అమర్చెంత వరకూ గుండె ఆగి ఆగిపో కుండాఉండడం కోసం తాత్కాలిక పేస్ మేకర్ ను అమరుస్తారు. మెడ లేదా కాలి రక్త నాళా ల గుండా లీడ్ ను పంపిస్తారు. దీనిని శరీరం బయటి నుంచి అమర్చి ఉన్న పేస్ మేకర్ కు అనుసంధానం చేస్తారు.అకస్మాతుగా గుండె స్పందన  వేగం తగ్గిపోవడం గుండె పోటు రావడం లాంటి సమస్యలు ఉన్నప్పుడు. కూడా పేస్మేకర్ వేస్తామని హృద్రోగ నిపుణులు డాక్టర్ ఎ శ్రీనివాస్ స్పష్టం చేసారు. ఇది అమార్చిన తరువాత సమస్య తగ్గితే ఇక శాశ్వత పేస్ మేకర్ అమర్చే అవసరం ఉండదు. అంటారు శ్రీనివాస్. ఇందు కోసం పొటాషియం,కాల్షియం,వంటి లవణాల లో మార్పులు కిడ్నీ ధై రాయిడ్ లాంటి సమస్యలు మందుల వంటి సెకండరీ కారణాలు ఉన్నప్పుడు తాత్కాలిక పేస్ మేకర్ తో సమస్య పోగొట్టవచ్చు. అప్పుడు శాశ్వత పేస్ మేకర్ తప్పనిసరిగా అవసరం అవుతుంది. డ్యుయల్ చాంబర్ పేస్ మేకర్ డి డి డి ఆర్.... దీనిలో రెండు లీడ్స్ ను ఉపయోగిస్తారు.ఒక లీడ్ ను ఎన్ ఎ నోడ్ దగ్గర అంటే కుడి కర్ణిక ఱేణ్డాళేఆడ్ కుడి జటరిక కండరం లోకి అమరుస్తారు. ఈ విధానం లో వంద శాతం పంపింగ్ పునరుద్దరింప బడుతుంది. అంటే నార్మల్ గా సహజం గా ఆరోగ్యంగా ఉన్న గుండె కొట్టు కున్నట్లే ఇప్పుడు కూడా కొట్టుకుంటున్ దన్న మాట.కర్ణికలు,జటరికలు కలిసి వంద శాతం సంకోచం బీటింగ్ ఉంటుంది. కాబట్టి పంపింగ్, ఫంక్షనింగ్ కూడా వంద శాతం ఉంటుంది. ఇది చాలా ఖర్చుతో కూడుకున్నది కాబట్టి చాలా సందర్భాలాలో సింగిల్ చాంబర్ పేస్ మేకర్ అమరుస్తారు.బై వెంత్రి క్యులర్ పెసింగ్ బి ఐ వి పి పై న వివరించిన రెండు లేఅడ్స్ తో పాటు గా మూడవ లీడ్ ను కూడా దీనిలో అమరుతారు. మూడవ లీడ్ ను కరోనరీ సైనస్ ద్వారా  ఎడమ జటరిక లోకి నేరుగా అమ్రుస్తారని తెలిపారు. అప్పుడు విద్యుత్ వ్యవస్థ దాన్ని ప్రేరేపించి అది సంకోచించేలా చేస్తుందని పేర్కొన్నారు. రెండు వెంట్రికల్స్ జటరికలు ఒకే సారి సంకోచించ దానికి ఇది ఉపయోగ పడుతుంది. కొన్ని సార్లు కర్ణికలు, జటరికలు  వేరు వేరు   సమయాలలోసంకోచిస్తాయి. ఇలాంటప్పుడు రెండింటి మధ్య సమన్వయం. ఉండదు. తద్వారా పంపింగ్ తగ్గిపోతుంది. అందుకే వీటిని సమన్వయ పరిచి రెండూ ఒకేసారి సంకోచిం చేలాచేయడానికి బి ఐ వి పి చేస్తారు. పవర్ జనరేట్ --ఎన్ ఎ నోడ్... గుండె ఇలా కొట్టుకోడానికి ఒక ప్రేరణ కావాలి ఈ ప్రేరణ విద్యుత్ అయస్కాంత తరంగాల ద్వారా వస్తుంది. గుండెలో ఉండే ఎన్ ఎ నోడ్ దీనికి కేంద్రబిందువు దీన్నే సైనో ఎంట్రి యల్  నోడ్ అంటారు. ఇది కుడి కర్ణిక రైట్ ఎంట్రి యం లోపల ఉంటుంది. ఇక్కడి నుంచి విద్యుత్ ప్రేరణలు ఉత్పత్తి అవుతాయి అందుకే దీనిని పవర్ జనరేటర్ అంటారు.ఇక్కడ ఉత్పత్తి అయిన విద్యుత్ ప్రేరణలు కుడి జతరిక అపెక్స్ లో ఉన్న ఎ వి నోడ్ ఏ ట్రీ వెంట్రీ క్యులర్ నోడ్ దగ్గరికి చేరుతాయి.ఇక్కడ నుండి బండిల్ ఆఫ్ హిస్,తరు వాత పర క్యునే ఫైజర్లకు వాటి నుంచి గుండె కండరానికి ఈ ప్రేరణలు చేరుతాయి అప్పుడే గుండె కండరం ప్రేరణ చెంది సంకోచిస్తుంది. ఈ వలయం లో ఎక్కడ సమస్య ఉన్నా హృదయ స్పందన ల్లో తేడాలు వస్తాయని శ్రీనివాస్ విశ్లేషించారు.ఎన్ ఎ నోడ్ దగ్గర ఫైబ్రో సిస్ ఉంటె సి క్ సైనస్ సిండ్రోం అంటారు. ఎ వి నోడ్ దగ్గర ఫై బ్రోసిస్ ఉంటె ఎ వి బ్లాక్ అనీ దీనిని హార్ట్ బ్లాక్ అని అంటారని పేర్కొన్నారు . ఆగిన గుండెకు డీ ఫైబ్రి  లే టర్.... గుండె పొట్ల వల్ల గుండె కండరం తో పాటు గా విద్యుత్ వలయాలు కూడా దెబ్బ తినచ్చు. తద్వారా షార్ట్ సర్క్యూట్ ఏర్పడు తుంది.దీన్ని వెంట్రీ క్యులార్ టాకీ కార్టీ యా అంటారు. ఇలాంటి సమయం లో అకస్మాతుగా పది పోతే వెంటనే హాస్పిటల్ కు తీసుకు వెళ్ళాలి . వీలై నంత త్వరగా చికిత్స ప్రారంభించాలి హాస్పిటల్ లోనే డీ ఫైబ్రి లెటర్ ద్వారా గుండెపై ఒత్తిడి కలిగిస్తూ ఆగిన గుండెను తట్టి లేపుతారు ఇప్పుడు ఇప్పుడు ఇంప్లాన్ టబుల్ డీ ఫైబ్రి లెటర్లు కూడా అందు బాటులో ఉన్నాయి.వీటిని చర్మం కింద అమరుస్తారు. గుండెలో షార్ట్ సర్క్యూట్ అయిన వెంటనే ఇది గుర్తిస్తుంది.అంతే కాక షాట్స్ ఇస్తూ సర్క్యూట్ ను పోగొడుతుంది.కూడా గుండె బలహీనం గా ఉన్న వాళ్ళకు ఇలా షార్ట్ సర్క్యూట్ అయ్యే వాళ్ళకు ఎలక్ట్రో ఫిజియాలజీ పరీక్షలు చేస్తే వాళ్ళకు ఇలా షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఎ మేరకు ఉందొ తెలిసిపోతుంది రిస్క్ ఉందని అంకున్నపౌడు ముందుగానే ఈ ఇంప్లాంటబుల్ డీ ఫైబ్రి లెటర్ ను అమర్చ వచ్చు. ఈ చికిత్స లన్నీ కూడా కొతలేకుండా తోడ రక్తనాళం ద్వారా పంపించి చేయగల ఆధునిక వైద్య పరిజ్ఞానం అన్బాతులో ఉంది. కాంబో డి వైస్ బి ఐ వి పి -ఎ ఐ సి డి.... గుండె కండరం చెడి పోయినా  కండరం లో స్కార్  ఏర్పడినా,ఫైబ్రోసిస్ ఉన్నా డీ ఫై బ్రి లెటర్ అమర్చవచ్చు. ఫై బ్రోసిస్ తో పాటు మాయో కార్దియం గుండె కండరం దెబ్బతిని ,బీటింగ్ అబ్నార్మల్ గా ఉన్నా హృదయ స్పందనలో తేడాలు ఉంది పంపింగ్ కూడా తక్కువగా ఉంటె కాంబో డివైస్ పెడతారు అంటే బై వెంట్రీ  క్యులర్ పెసింగ్ డీ ఫైబ్రి లెటర్ రెండూ కలిసి ఉన్న డివైస్ ని అమరుస్తారు.               

మనం నిజంగా మరణిస్తామా!!

  అది మనకు తెలుస్తుందా? మనం నిజంగా మరణించామా? ఎప్పుడు ఏసమయంలో మరణిం చామో మనకు తెలుస్తుందా?మరణించాక అంటే గుండె కొట్టు కోవడం ఆగిపోతే బ్రెయిన్ కు సంకేతాలు ఎంతసేపు అందుతాయి ?మరణిం చక ముందు మన స్మృతులు గుర్తుకు వస్తాయా? కొందరు దాదాపు మరణానికి దగ్గరాగా వెళ్లి వచ్చారా వారి కళ్ళ ముందే జరిగిందా ? ఇదే కేవలం భ్రమేనా,కల్పిత కదా. వాస్తవం ఎంత అయితే ఈ విషయానికి సంబంధించి అసలు నిజం తెలుసుకోవాల్సిందే.రోగులు మర నించడానికి ముందు వారిలో వచ్చే మార్పులు కొంతమంది వైద్య్యులు చనిపోతున్న వ్యక్తి యొక్క బ్రెయిన్ యాక్టివిటి రికార్డ్ చేసారని తెలుస్తోంది.బ్రెయిన్ స్కాన్ లో ఆ వ్యక్తికి బ్రెయిన్ స్కాన్ చేస్తున్న సమయంలో కార్దియోక్ అరెస్ట్ వచ్చింది.ఆవ్యక్తిలో వచ్చిన బ్రెయిన్ సిగ్నల్స్ ను చనిపోక ముందు గుండె ఆగిన తరువాత సిగ్నల్స్ ను రికార్డ్ చేసారు.చనిపోయే ముందు ఆ వ్య్సక్తి గత స్మృతుల ను వైద్యులు రికార్డ్ చెయడం గమనార్హం.కొంత మంది ప్రజలు మరణపు అంచుల వరకూ వెళ్లి వచ్చామని వారి కళ్ళ ముందే ఒక్కో సారి చూపించిందా అంటే అలా గని నిర్దారించలేము ఈ రకమైన అనుభవం వారు మరణించినప్పుడు జరగ వచ్చు ఇది సహజం.అయితే ఆరోగ్య నిపుణులు సహజంగానే అంగీకరిస్తారు గుండె ఆగిపోయి నప్పుడు గుండె కొట్టుకు పోవడం వినిపిస్తుంది అయితే ఇక్కడ తెలుసు కోవాల్సిన  విషయం  ఏమిటి అంటే ఎంతవరకు బ్రెయిన్ సజీవంగా ఉంటుంది ఎంతవరకూ బ్రెయిన్ నుండి సిగ్నల్స్ పంపిస్తుంది. అన్న అంశం పై చేసిన కీలక అధయనం లో కొన్ని ఆశక్తి కర అంశాలు వెలుగు చూసాయి. గుండె ఆగిన తరువాత కూడా బ్రెయిన్ సిగ్నల్స్ ౩౦ సెకండ్లు పని చేస్తూ  ఉంటాయని గుర్తించారు.ఏది ఏమైనప్పటికీ డాక్టర్ జెస్సికా ఆండ్రూ హన్నా అసిస్టెంట్ ప్రొఫెసర్ న్యురాల్ సిస్టమ్స్ అరిజోన్ యునివర్సిటి లో పని చేస్తున్నారు. అయితే ఆమె ఈ పరిశోదనలో పాల్గో నప్పటికీ పరిశోదన అందరి విషయం  లో కాదని ఇతర వ్యక్తులు కూడా ఉన్నారని 97 సంవత్సరాల రోగిపై పరిశోదన నిర్వహించారని తెలిపారు.నేతర్టిలేన్ అనే ఆమె మాట్లాడుతూ ఆ వ్యక్తిలో బ్రెయిన్ వేవ్స్ పెట్రన్స్ చనిపోయేముందు కు దారి తీసిందని దీనికి అనుబంధంగా వారిలో జ్ఞాపక శక్తి,కలలు ఇతర ఆలోచన విధానం ఈ మధ్య కాలం లో క్రాస్ టాక్స్ జరిగిందని ఈ రకమైన పరిశోదన చాలా అరుదైనదని కొన్ని రకాల గ్లిమ్స్ చివరి క్షణం లో చోటు చేసుకునే పరిణామాలు అనుకోకుండా కనుగొన్నారని నిపుణులు పేర్కొన్నారు.  పరి సోదకులు 87 సంవత్సరాల పురుష రోగి సంరక్షకుడు వెన్ కోరర్ ఆసుపత్రిలో కెనడాలో 2౦16 లో బ్రెయిన్ లో రక్త స్రావం సమస్యతో చేరారని వారికి శస్త్ర చికిత్స ద్వారా రక్త స్రావం నిలువరించేందుకు ప్రయత్నించారని అన్నారు. రెండురోజుల సమయం లో ఆవ్యక్తికి ఫైట్స్ వచ్చాయని వివరించారు.అయితే ఆరోగ్య సంరక్షకులు నిర్వాహకులు మూర్చ నివారణకు దానికి గల కారణాలు తెలుసుకునేందుకు  మందులు యాంటి ఎపిలేప్టిక్ ఫినై టో ఇన్ లేవేరేసెటెంఇచ్చి వాటి పనితీరు తెలుసుకునేందుకు ఇ ఇ జి చేసారు.  ఇ ఇ జి చేస్తున్న  సమయం లోనే 12 వేరు వేరు రకాల ఎలక్ట్రో గ్రాఫిక్స్ లో ఫైట్స్ ను పరిశీలించి నట్లు వైద్యులు పేర్కొన్నారు.ఇ ఇ జి దమయం లోనే రోగికి గుండెపోటు కార్డియాక్ అరెస్ట్ వారి కుటుంబం లో చర్చించిన తరువాత ఆ రోగిని బతికించ లేక పోయామని నంతరం మూర్చ కు సంబందించిన చికిత్స నిలిపివేసినట్లు తెలిపారు. ఆసమయంలో 9౦౦ సెకండ్లు ఇ ఇ జి రికార్డ్ చేసారు.పరిశోదనలో నిశితంగా గమనించిన అంశం ఏమిటి అంటే మెదడు పనితీరు సీజేర్స్ ఫిట్స్ వచ్చిన వెంటనే ౩౦ % పెరిగిందని వారిలో ఎక్కువ స్థాయిలో గామా సిగ్నల్స్ కార్డియాక్ అరెస్ట్ కు ముందే ౩౦ సెకండ్లు జీవిన్చాగాలిగినట్లు గమనించమన్నారు.మరో పరి శోదన భాగం గా న్యూరో సర్జన్ డాక్టర్ అజ్మల్ జేమ్మార్ లివిస్ విల్లె విశ్వ విద్యాలయం లో న్యూరో సర్జన్ మరో పరిశోదన ఇప్పటికీ ఎవరూ నిర్వహించలేదని అన్నారు . ఒస్కలేట్రీ వేవ్స్ చనిపోతున్న సమయం లో న్యూరో ఫిజియో లాజికల్ సబ్ స్టాన్స్ లో బ్రెయిన్ సిగ్నల్స్ వల్ల దాదాపు చనిపోయిన సంకేతం కలుగు తుందా?చనిపోయే అనుభవాన్ని బ్రెయిన్ ప్రాసెస్ చేస్తుందా?...ప్రశ్న ఏమిటి అంటే మనం నిజంగా చనిపోయమా? అన్నదే పరిశోదన గుండె ఆగిపోయిన తరువాత బ్రెయిన్ మెదడు  ఎంత సేపు పని చేస్తుంది. సజీవం గా ఉంటుంది.ఒక కేసు లో దీనిని సాధారణ అంశం గా పేర్కొన్నారు.రోగి యొక్క మెదడు పని తీరు వల్ల లేదని. కేవలం స్కాన్ ద్వారా మెదడులో ఫిట్స్ వచ్చినట్లు గుర్తించా మని.అప్పుడు గుర్తించాం. అప్పుడు మందులు తీసుకున్న తరువాత మెదడు పని తీరు ఎలా ఉందొ తెలుసుకున్నాం. అప్పటికే వారికి అనారోగ్యం తో బాధ పడుతున్నందునఆ వ్యక్తి పరిస్థితి బాగా లేనందున తెలుసుకునే ప్రయ్యత్నం చేసాం.౩ పరిశోదన ప్రకారం   నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్ ఇదో రక మైన అసలేటరీ గామా వేవ్స్ ఎలుకలలో వచ్చాయని. కార్డియాక్ అరెస్ట్ తరువాత ౩౦ సెకండ్లు ఉన్నట్లు గుర్తించారు.అదే విషయాన్ని రోగిలో గమనించామని అన్నారు.పరిశోధకులు అందించిన వ్యాసం లో పేర్కొన్న సమాచారం లో మెదడు ద్వారా వాచే సంకేతాలు జ్ఞాపక శక్తిని రప్పిస్తుంది. ఆరోగ్య నిపుణులు ఖచ్చితంగా వచ్చే వేవ్స్ దాదాపు మరణం అనుభూతి కలిగిస్తుంది.అది మెదడులో ఎక్కడ జరిగిందో వస్తుందో తెలుసుకునేందుకు మరిన్ని పరి శోదనలు అవసరం అని ప్రొఫెసర్ ఆండ్రూ బెర్గ్ పేర్కొన్నారు.ఈ పరి శోదనలో మరణానికి ముందు జరిగే పరిణామాల ను సూచిస్తుంది అలాగే మెదడు పని తీరు గుండె ఆగిన తరువాత మెదడు ఎంత సేపు ఉంటుంది వంటి సంకేతాలు అందిస్తుంది అని అంటున్నారు పరిశోధకులు.వాస్తవానికి చావుకు దగ్గరాగా వెళ్ళిన గదను ఒక స్త్రీ వివరించింది. దాదాపు చావుకు దగ్గరగా వెళ్ళడం అనే అను భూతి యదార్ధమా? అది మనకు అనుభవ పూర్వకమా అన్నది మరో సందేహం.?లేక ఒక కాల్పనిక కధగా పేర్కొన వచ్చా?అదీ కాక ఊహాజనిత ప్రపంచం లో విహరిస్తూ ఇలా జరిగింద ని  వివరించాడ దానిని జరిగిన ఘటన యదార్ధ గాధగా చిత్రీక రించే ప్రయ్య్త్నమా? అని అనుకుంటున్నారు నిపుణులు దీనిని మానసిక అంశం లో చూసినప్పుడు. మారో దృశ్యం చూస్తారని కేవలం ఒక భావనగా చెప్పవచ్చని అంటున్నారు.అనుకోకుండా నొప్పి అక్కడ ఒక లైట్ ను చూసారు. కొద్ది దూరం లో పడి పోయి ఉన్నారు. నేను దగ్గరగానే ఉన్నాను. నొప్పి నన్ను తీవ్రంగా వేదిస్తోంది నేను అక్కడే ఉన్నాను వేరొకరి లాగానే నేనూ పడిపోయాను. వారి చేత్తులు నన్ను చుట్టేస్తున్నాయి. అయితే పెద్దగా నేప్పిలేదు కేవలం అది ఒక సంరక్షణ ఈ ఘటన 48 సంవత్సరాల స్త్రీనుండి వచ్చింది. ఒకా నొక సందర్భంగా దాదాపు చని పోయి నట్టే ఆమెకు వెన్నుపూసలో వచ్చిన ట్యూమర్ తీవ్రంగా ఉండడం తో బాధ పడుతున్నారు.దీనివల్ల ఆమె మానసిక ఆందోళన ఉద్వేగాలు వచ్చిన ట్యూమర్ తీవ్రంగా ఉండడం తో బాధ పడుతున్నారు.దానివల్ల ఆమె మానసిక ఆందోళన ఉద్వేగాలకు గురి అయ్యారు. అప్పుడే ఆమె మరణపు అంచునకు చేరిన భావనకు గురి అయ్యిందన్నది కధ. వివిధ అం శాల పై పరిశోధనా బృందం గమనించిన విషయం దీనిని నియంత్రించ లేము పాశ్చాత్య ప్రపంచం ఎన్నో సంస్కృతులు దాదాపు ఇలాంటి అనుభవాలు పిల్లలు సైతం ఎన్ డి ఎఫ్ అంటే నియర్ డెత్ చావు అంచుకు వెళ్ళిన అనుభవాలు ఉన్నాయి.ఎన్ డి ఎఫ్ అంటే నియర్ టూ డెత్ ఒక కాంతి వస్తుంది. వెలుతురు వైపు నడవడం అదీ చివరి దశకు అది ఒక లోయా లేకా టన్నల్ కు చేరడం వారు వారి బంధువులతో మాట్లాడడం దీర్ఘ కాలం చనిపోయిన వారితో వారి శరీరం లేకుండా ఉండడం. ఆ కాంతిలో భగవంతుడు కనిపిస్తున్నడన్న భావన తనతో మాట్లాడాడని అందరూ అంగీకరిస్తారా నియర్ టో డెత్ లో మాట్లాడిన భావన జీవితం తర్వాత చర్చ కానిపోయిన తరువాత మానసిక స్థితి లేక అనుభూతి ఇది సూడో సైన్స్ లేదా పర్వర్షన్ నేచారా?ఇందులో ౩% అమెరికన్లు ఎన్ డి ఇ లో శాస్త్రీయ పరిశోదన జరగాల్సి ఉంది. అని అంటున్నారు. మరణం ముందే తెలిస్తే బాధ తెలియ కుండానే పోతారు కదా. మానసికంగా సిద్ధమైన వారు ఏ స్థితిలో ఉంటారు వారి మానసిక స్థితి ఏమిటి అన్నదే పెద్ద చర్చనీయ అంశం అసలు మరణానికి ముందు మనకు తెలుస్తాయా నిజమాఅన్నది రూడి చేసుకోవాల్సి ఉంటుంది.                           

అతి వ్యాయామం గుండెకు చేటు...

గుండె నొప్పిని వైద్య పరిభాషలో మాయో  కార్దియల్ ఇన్ ఫార్మన్ అంటారు. రక్త నాళాలలో ఉన్న అడ్డంకి కొన్ని సార్లు పగిలి పోయి కణాలన్నీ ఓక దానికి ఒకటి అతుక్కుని పోయి క్లాట్  అంటే రక్తం గడ్డ ఏర్పడుతుంది.దాంతో అడ్డంకి మరింత పెద్దదై రక్త నాళం పూర్తిగా మూసుకు పోతుంది. అలాంటి అప్పుడే గుండె పోటు వస్తుంది. అధిక ఒత్తిడి,ఎక్కువ వ్యాయామం చేయడం సాధారణంగా ఇందుకు కారణం గా అవుతున్నాయి. అని  అపోలో ఆసుపత్రికి చెందినప్రముఖ కార్దియలజీ డైరెక్టర్ డాక్టర్ ఎ శ్రీనివాస్ కుమార్ స్పష్టం చేసారు. ఈమేరకు తెలుగు వన్ హెల్త్ కు ఇచ్చిన ఇంటర్ వ్యూ లో పేర్కొన్నారు.వ్యాయామం అతిగా చేయారాదని వ్యాయామాన్ని నె మ్మ్సదిగా మొదలు పెట్టి వేగం పెంచాలి. అదే విధంగా ఆపివేసే టప్పుడు వార్మప్ వ్యాయామాలు తప్పనిసరిఅన్నారు . ఈ సమయంలో గుండె తనపై ఒత్తిడిని సర్దుబాటు చేసుకుంటుంది ఒక్కసారి ఒత్తిడి పెడితే బేజారు అవుతారు.రీక్షలో ట్రోపోనిన్ పాజిటివ్ వస్తే గుండెలో సమస్య ఉందని అర్ధం. దీని తరువాత ఎకో చేస్తారు. గుండె కొట్టుకునే టప్పుడు దానిలో డ్యామేజి అయిన ఆభాగం సరిగా కదలదు అలా డ్యామేజి ని గుర్తిస్తారు అని డాక్టర్ ఎ శ్రీనివాస్ అన్నారు.ఇ సి జి,ఎకో ట్రోపోనిన్ నార్మల్ గా ఉంటె  ఇంకా అనుమానం ఉంటె థ్రెడ్ మిల్ పరీక్ష చేస్తారు. ఈ పరీక్షలో ట్రేడ్ మిల్ పై నడిపిస్తూ ఇ సి జి రీడింగ్ చూస్తారు. 7౦ -8౦% బ్లాక్ ఉంటె దీనిలో తేడాలు కనిపిస్తాయి.దీనిలో పోజిటివ్ వస్తే బ్లాక్ ఎక్కడ ఏ మేరకు ఉన్నాయో తెలుసుకోడానికి ఆంజియోగ్రామ్ చేయించాలి. సరిగ్గా ఖచ్చితమైన ఫలితం తెలియాలంటే కరోనరీ ఆంజియో గ్రామ్ పరీక్షే మేలు అని డాక్టర్ శ్రీనివాస్ సూచించారు.టి ఎం టి పరీక్షలో నెగెటివ్ వస్తే రిస్క్ ఫ్యాక్టర్ ను పరిగణలోకి తీసుకోవాలని టి ఎం టి లో నెగెటివ్ వచ్చినప్పుడు 9౦% నార్మల్ గానే ఉంటుంది. కాని బీపి,డయాబెటిస్ లాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటె సిటి ఆంజియో గ్రామ్ చేయాల్సి వస్తుందని సిటీ అన్జియో గ్రామ్ నార్మల్ గా ఉంటె పరవాలేదని సిటీ ఆంజియో గ్రామ్ అబ్నార్మల్ గా ఉంటె సాధారణ అన్జియో గ్రామ్ చేయాల్సి వస్తుంది.అని డాక్టర్లు సూచించవచ్చని స్పష్టం చేసారు.ఆంజియో గ్రామ్ ను ఇప్పుడు డే కేర్  క్లినిక్ లోనే చేయవచ్చని అంటే పరీక్ష అయిన మూడు నాలుగు గంటలోనే ఇంటికి వెళ్లి పోవచని అన్నారు.ఇక్కడ కొన్ని అంశాలు రోగులు రోగితలూకు అటెండర్ లు కూడా తెలుసుకోవడం అవగాహన కలిగి ఉండాలని సూచించారు.ట్రేడ్ మిల్ వరకూ అన్ని పరీక్షలలోను నార్మల్ ఉండి గుండెలో సమస్య లేదేమో అనుకున్నప్పుడు అది నిర్ధారణ చేసుకోడం కొసం సిటి ఆంజియో గ్రామ్ ఇప్పుడు చేస్తారు.కేవలం గుండెపోటు మాత్రమే కాకుండా పల్మనరీ త్రాం బో ఎంబా లిజం పి టి ఇ అయో ర్టిక్ దిసేక్షన్ అంటే మహా ధమనిలో పగుళ్ళు సమస్యలు ఉన్నా సిటి ఆంజియో గ్రామ్ లో బయట పడే అవకాశం ఉంది. చికిత్స తో పాటుగా... పరీక్షలు చేయించిన తరువాత జబ్బు ఉన్నట్లు తేలితే దాని తీవ్రతను బట్టి చికిత్స చేయవచ్చని.అన్నారు. జబ్బు కొంచమే ఉంటె అంటే5౦% కన్నా తక్కువ బ్లాక్స్ మాత్రమే ఉంటె స్టాటిన్స్ మందుల ద్వారా సమస్య కాకుండా నివార్రించ వచ్చని 5౦ -7౦% బ్లాక్స్ ఉంటె బార్డర్ లైన్ లో ఉన్నారని అర్ధం అని శ్రీనివాస్ వివరించారు.అలాంటప్పుడు రిస్క్ ఫ్యాక్టర్ సమస్య తీవ్రత ను అంచనా వేసి తదను గుణంగా చికిత్స్ చేయాల్సి ఉంటుందని ఒక బ్లాక్ 7౦% దాటితే తప్పనిసరిగా స్టెంట్ వేయాల్సి ఉంటుందని చికిత్స ఏదైనా దానితో పాటుగా మంచి ఆహారం తీసుకుంటూ యోగా వాకింగ్ లను జీవన శైలిలో భాగం చేసుకోవాలని .పొగ తాగడం లాంటి దురలవాట్లు కు స్వస్తి చెప్పి బిపి,షుగర్, ని నియంత్రించడం అవసరాని సూచించారు డాక్టర్ శ్రీనివాస్. గుండె పోటు మళ్ళీ రాకుండా ఉండాలంటే... ఇందుకోసం సెకండరీ ప్రివెన్షన్ గా కొన్ని మందులను ఇస్తారు.అడ్డంకి పెరగ కుండా స్టాటిన్ నివారిస్తుంది. కొలస్ట్రాల్ ను తగ్గిస్తుంది.ఆస్ప్రిన్ బీటా బ్లాకర్ బ్లాకార్స్ కూడా ఇస్తారు. ఎ సి ఇ ఇంహిబిట ర్స్ కూడా ఇస్తారు. హార్ట్ బర్న్ గుండె నొప్పి ఒకటేనా ... కొంత మందిలో అన్నం తినగానే కొన్ని సార్లు పొట్టపై భాగం లో చాతీ లో నొప్పిగా అసౌకర్యం గా అన్పిస్తూ ఉంటుంది. అది గ్యాస్ నొప్పి గా భావిస్తారు.పూర్తిగా నిర్లక్ష్యం చేస్తారు.కొన్ని సందర్భాలాలో అది గ్యాస్ కు సంబందించినదే కావచ్చు కానీ దీని వెనుక గుండె సమాస్య కూడా ఉండచ్చు అని డాక్టర్ శ్రీనివాస్ హెచ్చరించారు. అన్నం తిన్న తరువాత జరిగే శోషణ ప్రక్రియ కోసం రక్తం పొట్ట వైపు ఎక్కువగా వస్తుంది.తద్వారా గుండెకు రక్త సరఫరా తగ్గి అసౌకర్యం ఏర్పడుతుందని డాక్టర్ శ్రీనివాస్ విశ్లేషించారు. ఈ రకమైన చాతీ నొప్పి ని పోస్ట్ ప్రాండియాల్ ఎంజైనా అని అంటారు.చాలా సందర్భాలలో దానిని గ్యాస్ నొప్పిగా ఏసీ డిటి పొరబడతారు.కాని కడుపు ఉబ్బరం గా కాకుండా ఛాతీలో అసౌకర్యం కలుగు తుంది అంటే అనుమానించాల్సిందే . ఏ మాత్రం అశ్రద్ధ చేయకుండా డాక్టర్ ను సంప్రదించాలని పోస్ట్ ప్రాండియాల్ ఎంజైనా ఉన్నప్పుడు సా ర్బిట్రేట్ మాత్ర నాలుక కింద పెడితే రిలీఫ్ వస్తుందని సూచించారు.ఇది ఒక రకంగా గుండె పోటుకు హెచ్చరిక లాంటిది గా భావించాలి రెండూ మూడు అయ్యిందంటే అది తీవ్రమై గుండె పోటుకు దారి తీస్తుందని .ఇలాంటి సమయం లో విశ్రాంతి గా కూర్చుని ఉన్న గుండేనొప్పి వస్తుంది. అందుకే నిర్లక్షం చేయవద్దని అపోలో ఆసుపత్రికి చెందిన హృద్రోగ నిపుణులు డాక్టర్ ఎ శ్రీనివాస్ తెలుగు వన్ హెల్త్ కు తెలిపారు. ఆతి వ్యాయామం గుండె కు చేటు హృద్రోగ నిపుణులు శ్రీనివాస్ హెచ్చరిక.